అన్వేషించండి

Telangana: జనతా గ్యారేజీలా తెలంగాణ భవన్‌- సమస్యలు చెప్పుకోవడానికి క్యూ కట్టిన హైడ్రా బాధితులు

Hyderabad News: హైడ్రా, ఆపరేషన్ మూసి పేరుతో నోటీసులు ఇవ్వకుండానే తమ ఇళ్లు కూల్చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. తమ గోడు వినాలని న్యాయం చేయాలని వారంతా తెలంగాణ భవన్‌కు చేరుకుంటున్నారు.

Telangana Bhavan:  జనతా గ్యారేజీ సినిమాలో వివిధ సమస్యలు చెప్పుకోవడానికి జనతా గ్యారీజీని సంప్రదించినట్టుగానే ఇప్పుడు బీఆర్‌ఎస్‌ ఆఫీస్‌కు హైడ్రా బాధితులు క్యూ కడుతున్నారు. ఉదయం నుంచి ఆ ప్రాంతమంతా జనంతో కిక్కిరిసిపోయింది. ప్రజా సమస్యలు వినేందుకు మాజీ మంత్రులు, బీఆర్‌ఎస్‌లో కీలక నేతలంతా ఆఫీస్‌లోనే ఉంటున్నారు. బాధితులు చెబుతున్న సమస్యలను వింటున్నారు. వాటిని నోట్ చేస్తున్నారు. 

ఈ మధ్య హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో పర్యటించిన మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్‌ కేటీఆర్ ప్రజలతో మాట్లాడారు. వారి ఆవేదన తెలుసుకున్నారు. హైడ్రా కూల్చివేతలపై మండిపడ్డారు. ప్రజలకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వారి ఇళ్లను కూల్చేస్తున్న ప్రభుత్వం పెద్దలను మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇలా హైడ్రా బాధితుల కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. వివిధ మార్గాల్లో వారంతా బీఆర్‌ఎస్‌కు ఫిర్యాదు చేయవచ్చని వెల్లడించారు. 

సోషల్ మీడియా, ఫోన్, మెయిలస్‌తోపాటు నేరుగా వచ్చి ఫిర్యాదులు చేయవచ్చని కేటీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. పక్కా అనుమతులతోనే కట్టించుకున్న భవనాలను ఎలా కూలుస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇలాంటి వారికి బీఆర్‌ఎస్ ఎప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. తెలంగాణ భవన్ గేట్లు ఎప్పుడూ తెరిచే ఉంటాయని వాళ్లు వచ్చి తమ సమస్యలు చెప్పుకోవచ్చని పిలుపునిచ్చారు. 

కేటీఆర్ సహా బీఆర్‌ఎస్ నేతల పిలుపుతో హైడ్రా బాధితులంతా తెలంగాణ భవన్‌కు క్యూ కట్టారు. ఈ ఉదయం ఏడు గంటల నుంచే ప్రజలంతా అక్కడకు చేరుకున్నారు. మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, హరీష్‌రావు సహా ఇతర ముఖ్య నేతలంతా బాధితులతో మాట్లాడుతున్నారు. వారికి అండగా ఉంటామని చెబుతున్నారు. జ్వరంతో బాధపడుతున్న కేటీఆర్‌ రావడం లేదని బాధితులకు నేతలు వివరిస్తున్నారు. తనకు ఫీవర్ ఉన్న విషయాన్ని మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు. 



ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్‌ పేరుతో నోటీసులు ఇవ్వకుండానే హైడ్రా తమ ఇళ్లను కట్టడాలను కూల్చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. మరోవైపు నుంచి ఆపరేషన్‌ మూసీ పేరుతో అధికారులు మార్కింగ్ చేస్తున్న విషయాన్ని నేతల దృష్టికి తీసుకొచ్చారు. ఓవైపు నుంచి హైడ్రా, మరోవైపు ఆపరేషన్ మూసితో తీవ్ర ఒత్తిడికి గురి అవుతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఆందోళన తమలో ఉందని చెప్పుకున్నారు. రాత్రి పూట నిద్ర పట్టడం లేదని కన్నీటి పర్యంతమవుతున్నారు.

ఇప్పుడు కట్టిన ఇళ్లకు ప్రభుత్వమే అనుమతులు ఇచ్చిందని.. విద్యుత్ బిల్లులు కూడా అధికారులు వసూలు చేస్తున్నారని గుర్తు చేశారు. టాక్స్‌ కూడా కడుతున్నామని అన్నింటినీ తీసుకున్న తర్వాత అక్రమ కట్టడాలు ఎలా అవుతాయన్నారు. బాధితులు . బ్యాంకులు లోన్‌ కూడా ఇచ్చాయని వివరించారు. అధికారికంగా ఇన్న ఉన్నవాటిని అక్రమ కట్టడాలు అని ఎలా అంటారని ప్రశ్నిస్తున్నారు. 

Also Read: ఇళ్లు కూల్చేస్తారని భయంతో మహిళ ఆత్మహత్య- వదంతులు నమ్మొద్దని ప్రజలకు రంగనాథ్ సూచన

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vangalapudi Anitha : తనలాగా హిందువునని చెప్పుకోవాలని జగన్‌కు హోంమంత్రి అనిత సవాల్ - వీడియో రిలీజ్ చేసిన వైఎస్ఆర్‌సీపీ
తనలాగా హిందువునని చెప్పుకోవాలని జగన్‌కు హోంమంత్రి అనిత సవాల్ - వీడియో రిలీజ్ చేసిన వైఎస్ఆర్‌సీపీ
ATM Robbery: సినిమా సీన్లను మించేలా ఛేజింగ్, ఆపై ఎన్‌కౌంటర్‌ - కేరళలో చోరీ చేసి తమిళనాడులో దొరికిన గ్యాంగ్
సినిమా సీన్లను మించేలా ఛేజింగ్, ఆపై ఎన్‌కౌంటర్‌ - కేరళలో చోరీ చేసి తమిళనాడులో దొరికిన గ్యాంగ్
Dhoom 4: 'ధూమ్ 4' నుంచి సాలిడ్ అప్డేట్ - విలన్ గా యానిమల్ స్టార్.. మరి హీరో సంగతేంటి? 
'ధూమ్ 4' నుంచి సాలిడ్ అప్డేట్ - విలన్ గా యానిమల్ స్టార్.. మరి హీరో సంగతేంటి? 
Tirumala Laddu News: తిరుమలకు చేరుకున్న సిట్ టీమ్, లడ్డూ కల్తీ వివాదంపై దర్యాప్తు ప్రారంభం
తిరుమలకు చేరుకున్న సిట్ టీమ్, లడ్డూ కల్తీ వివాదంపై దర్యాప్తు ప్రారంభం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కేరళలో చోరీ, తమిళనాడులో ఎన్‌కౌంటర్ - భారీ యాక్షన్ డ్రామాSecond Moon: భూమికి చిన్న చందమామ వస్తున్నాడు - రెండో చంద్రుడు ఎలా సాధ్యం?Ponguleti Srinivas: పొంగులేటి శ్రీనివాస్ ఇంట్లో ఈడీ సోదాలుహిందువులు మేల్కోవాల్సిన సమయం వచ్చింది, బీజేపీ నేత మాధవీ లత

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vangalapudi Anitha : తనలాగా హిందువునని చెప్పుకోవాలని జగన్‌కు హోంమంత్రి అనిత సవాల్ - వీడియో రిలీజ్ చేసిన వైఎస్ఆర్‌సీపీ
తనలాగా హిందువునని చెప్పుకోవాలని జగన్‌కు హోంమంత్రి అనిత సవాల్ - వీడియో రిలీజ్ చేసిన వైఎస్ఆర్‌సీపీ
ATM Robbery: సినిమా సీన్లను మించేలా ఛేజింగ్, ఆపై ఎన్‌కౌంటర్‌ - కేరళలో చోరీ చేసి తమిళనాడులో దొరికిన గ్యాంగ్
సినిమా సీన్లను మించేలా ఛేజింగ్, ఆపై ఎన్‌కౌంటర్‌ - కేరళలో చోరీ చేసి తమిళనాడులో దొరికిన గ్యాంగ్
Dhoom 4: 'ధూమ్ 4' నుంచి సాలిడ్ అప్డేట్ - విలన్ గా యానిమల్ స్టార్.. మరి హీరో సంగతేంటి? 
'ధూమ్ 4' నుంచి సాలిడ్ అప్డేట్ - విలన్ గా యానిమల్ స్టార్.. మరి హీరో సంగతేంటి? 
Tirumala Laddu News: తిరుమలకు చేరుకున్న సిట్ టీమ్, లడ్డూ కల్తీ వివాదంపై దర్యాప్తు ప్రారంభం
తిరుమలకు చేరుకున్న సిట్ టీమ్, లడ్డూ కల్తీ వివాదంపై దర్యాప్తు ప్రారంభం
Game Changer Second Single Promo : కిరాక్ మాస్ బీట్ తో వచ్చేసిన 'రా మచ్చా మచ్చా' సాంగ్ ప్రోమో...  నెవర్ బిఫోర్ ఇంట్రో   
కిరాక్ మాస్ బీట్ తో వచ్చేసిన 'రా మచ్చా మచ్చా' సాంగ్ ప్రోమో...  నెవర్ బిఫోర్ ఇంట్రో   
UK : అమెరికాలో ఉద్యోగాల్లేవ్ - యూకే కూడా గేట్లు మూసేస్తోంది - యూత్ ఫారిన్ ఆశలు తీరవా ?
అమెరికాలో ఉద్యోగాల్లేవ్ - యూకే కూడా గేట్లు మూసేస్తోంది - యూత్ ఫారిన్ ఆశలు తీరవా ?
Telangana News: అంబేద్కర్ వర్సిటీ భూములపై సీఎం రేవంత్‌రెడ్డికి విద్యావేత్తల బహిరంగ లేఖ, డిమాండ్ ఏంటంటే
అంబేద్కర్ వర్సిటీ భూములపై సీఎం రేవంత్‌రెడ్డికి విద్యావేత్తల బహిరంగ లేఖ, డిమాండ్ ఏంటంటే
Pushpa 2: షెకావత్‌ సార్ సెట్‌లోకి వచ్చేశాడు... నాన్‌ స్టాప్‌గా ‘పుష్ప 2’ షూటింగ్
షెకావత్‌ సార్ సెట్‌లోకి వచ్చేశాడు... నాన్‌ స్టాప్‌గా ‘పుష్ప 2’ షూటింగ్
Embed widget