మున్సిపల్ ఎన్నికల కారణంగా శుక్రవారం జరిగే విచారణకు హాజరుకాలేనని, విచారణ వాయిదా వేయాలని మాజీ సీఎం కేసీఆర్ సిట్కు సమాచారం అందించారు.
KCR Latest News: ఫోన్ ట్యాపింగ్ విచారణ కోసం కేసీఆర్ ఎందుకు సమయం కోరారు! నోటీసులపై ఉన్న అభ్యంతరాలేంటి?
KCR Latest News: ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు శుక్రవారం రావాలని సిటి ఇచ్చిన నోటీసులపై కేసీఆర్ స్పందించారు. తనకు సమయం కావాలని కోరారు. ఈ మేరకు సిట్కు లేఖ రాశారు.

KCR Latest News: టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో శుక్రవారం జరిగే విచారణకు హాజరుకాలేనని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత సిట్కు సమాచారం అందించారు. మున్సిపల్ ఎన్నికల కారణంగా విచారణకు రాలేనని చెప్పారు. విచారణ వాయిదా వేయాలని కోరారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్లోని విచారించాలని చెప్పారు.
తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఒక వైపు రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగి, రాజకీయం వేడెక్కుతున్న వేళ మాజీ సీఎం, ప్రతిపక్ష నేత కేసీఆర్కు సిట్ అధికారులు ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు ఇచ్చారు. అయితే ఈ నోటీసులపై కేసీఆర్ తనదైన శైలిలో చట్టబద్ధమైన పకడ్బందీ వివరణతో సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల విధులను ప్రస్తావిస్తూనే, ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా విచారణకు సహకరిస్తానని అయితే అది చట్టం నిర్దేశించిన నిబంధనల ప్రకారమే జరగాలని ఆయన స్పష్టం చేశారు.
సిట్ నోటీసులకు బదులిచ్చిన బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్.
— BRS Party (@BRSparty) January 29, 2026
మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా సిట్ ముందుకు రాలేను. అభ్యర్థుల జాబితా ఖరారు చేసే పనిలో బిజీగా ఉన్నాను.
విచారణ కోసం మీకు అనువుగా ఉన్న మరో తేదీని తెలుపగలరు - బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. pic.twitter.com/YH9HtHW2S3
పోలీసు అధికారులు జనవరి 30న విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు. దీనిపై స్పందించిన కేసీఆర్ ప్రస్తుతం రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు , 7 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోందని గుర్తు చేశారు. ఈ ఎన్నికలు పార్టీ ప్రాతిపదికన జరుగుతున్నందున, అభ్యర్థులకు బీ ఫారాలు జారీ చేయడం, పార్టీ తరఫున ఇతర అధికార లాంఛనాలను పూర్తి చేయడంలో తాను నిమగ్నమై ఉన్నానని ఆయన వివరించారు. రేపటితో నామినేషన్ల దాఖలుకు గడువు ముగుస్తున్న వేళ సమయానికి అందుబాటులో ఉండటం సాధ్యం కాదని ఆయన తన లేఖలో పేర్కొన్నారు.
కేసీఆర్ తన సమాధానంలో కేవలం రాజకీయ కారణాలనే కాకుండా, చట్టంలోని కీలక నిబంధనలను కూడా ప్రస్తావించారు.సీఆర్పీసీ సెక్షన్ 160ని ఉటంకిస్తూ, దర్యాప్తు అధికారులు సాక్షులను లేదా విచారించాల్సిన వ్యక్తులను ఎక్కడ విచారించాలనే విషయాన్ని గుర్తు చేశారు.
65 ఏళ్లు పైబడిన వాళ్లను దివ్యాంగులను, నివసించే ప్రాంతం కాకుండా ఇతర చోట్ల విచారణ నిమిత్తం పిలవకూడదని చట్టం చెబుతోందని ఆయన తెలిపారు. చట్టం ప్రకారం 65 ఏళ్లు పైబడిన వ్యక్తిని దర్యాప్తు బృందం వారు నివసించే చోటే విచారించాల్సి ఉంటుందని అన్నారు. ఈ నిబంధన మరేకు తనను విచారించాలనుకుంటే సిద్ధిపేట జిల్లా ఎర్రవల్లి గ్రామంలోని తన నివాసానికి రావాలని పోలీసులకు సూచించారు. అధికారుల వీలును బట్టి మరో తేదీని ఖరారు చేయాలని, ముందస్తు నోటీసుతో తన నివాసానికి వచ్చి విచారణ జరపవచ్చని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేశానని, ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉన్నానని కేసీఆర్ తన లేఖలో నొక్కి చెప్పారు. ఈ దేశపు బాధ్యతాయుతమైన పౌరుడిగా దర్యాప్తుకు తన పూర్తి సహకారం ఉంటుందని అన్నారు. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా దర్యాప్తు సంస్థలు అడిగే ప్రశ్నలకు సమాధానమిచ్చేందుకు తాను సిద్ధమని, అయితే అది చట్టం కల్పించే వెసులుబాటు మేరకు తన ఇంట్లోనే జరగాలని ఆయన కోరారు. భవిష్యత్లో నోటీసులు ఏవైనా ఉంటే తన ఎర్రవల్లి నివాసానికే పంపాలని సూచించారు.
Frequently Asked Questions
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరుకావడంపై కేసీఆర్ సిట్కు ఏమి తెలియజేశారు?
కేసీఆర్ విచారణకు ఎక్కడ హాజరుకావాలని కోరారు?
చట్టంలోని నిబంధనల ప్రకారం, 65 ఏళ్లు పైబడిన వ్యక్తిని వారి నివాసంలోనే విచారించాలని, కాబట్టి తన ఎర్రవల్లి ఫామ్హౌస్లోనే విచారించాలని కేసీఆర్ కోరారు.
మున్సిపల్ ఎన్నికలు కేసీఆర్ విచారణకు హాజరుకావడానికి ఎలా ఆటంకం కలిగిస్తున్నాయి?
ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల కారణంగా, పార్టీ అభ్యర్థుల జాబితా ఖరారు చేసే పనిలో నిమగ్నమై ఉన్నందున, నామినేషన్ల దాఖలు గడువు ముగిసే సమయంలో సమయానికి అందుబాటులో ఉండటం సాధ్యం కాదని కేసీఆర్ తెలిపారు.
కేసీఆర్ తన సమాధానంలో ఏ చట్ట నిబంధనను ప్రస్తావించారు?
కేసీఆర్ తన సమాధానంలో సీఆర్పీసీ సెక్షన్ 160ని ఉటంకిస్తూ, 65 ఏళ్లు పైబడిన వారిని, దివ్యాంగులను, వారి నివాస ప్రాంతం కాకుండా ఇతర చోట్ల విచారించకూడదని పేర్కొన్నారు.
























