అన్వేషించండి

BJP MLAs Suspend: బీజేపీకి భారీ షాక్ ! ఈటల, రాజా సింగ్, రఘునందన్ రావులు సెషన్ మొత్తం సస్పెండ్

BJP MLAs Suspend: శాస‌న‌స‌భ స‌మావేశాలు ముగిసే వ‌ర‌కు ఈట‌ల రాజేంద‌ర్, రాజా సింగ్, ర‌ఘునంద‌న్ రావులను స‌స్పెండ్ చేస్తున్న‌ట్లు స్పీక‌ర్ పోచారం ప్ర‌క‌టించారు. 

Eeta Rajender Suspend from Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలైన రోజే భార‌తీయ జ‌న‌తా పార్టీకి భారీ షాక్ తగిలింది. బీజేపీ ఎమ్మెల్యేలు ఈట‌ల రాజేంద‌ర్, రాజా సింగ్, ర‌ఘునంద‌న్ రావు సస్పెండ్ అయ్యారు. బడ్జెట్ ప్రసంగానికి అడ్డు పడుతున్నారన్న కారణంగా ఈ ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి సస్పెండ్ చేశారు. అయితే కేవలం ఒకరోజు సభ నుంచి సస్పెండ్ చేస్తున్నారని భావించిన బీజేపీకి భారీ షాకిస్తూ.. శాస‌న‌స‌భ స‌మావేశాలు ముగిసే వ‌ర‌కు ఈ ముగ్గురు సభ్యులను స‌స్పెండ్ చేస్తున్న‌ట్లు స్పీక‌ర్ పోచారం ప్ర‌క‌టించారు. 

అసెంబ్లీ ఎదుట బైఠాయించిన బీజేపీ ఎమ్మెల్యేలు.. అరెస్ట్
తెలంగాణ బడ్జెట్ ప్రసంగానికి బీజేపీ ఎమ్మెల్యేలు అడ్డు తగులుతున్నారని, వారిని సస్పెండ్ చేయాలని మంత్రి తలసాని శ్రీనివాయస్ యాదవ్ తీర్మానం ప్రవేశపెట్టగా.. ఈటల, రాజా సింగ్ (Raja Singh Suspend from Telangana Assembly), రఘునందన్ రావులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలిచ్చారు అసెంబ్లీ స్పీకర్ పోచారం. సెషన్ పూర్తయ్యే వారికి సస్పెన్షన్ అమలులో ఉంటుందని స్పష్టం చేశారు. అసెంబ్లీ నుంచి తమను ఉద్దేశపూర్వకంగానే సస్పెండ్ చేశారని బీజేపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. ప్రతిపక్షాల గొంతు నొక్కడానికే తమను సస్పెండ్ చేశారని అసెంబ్లీ ఎదుట బైఠాయించి బీజేపీ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. ఆందోళన విరమించకపోవడంతో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలను అదుపులోకి తీసుకుని అసెంబ్లీ నుంచి బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

వ్యూహాత్మకంగా అధికార పార్టీ..
తనను అవమానకరంగా పార్టీ నుండి సస్పెండ్ చేసిన తర్వాత దూకుడు పెంచిన ఈటల రాజేందర్ (Etela Rajender) ఈ అసెంబ్లీ సమావేశాల్లో తొలిసారి మరోపార్టీ నేతగా సీఎం కేసీఆర్‌ను ఎలా ఎదుర్కుంటారో చూద్దామని బీజేపీ నేతలతో పాటు హుజురాబాద్ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలైన రోజే బీజేపీ పార్టీ వ్యూహాలను అధికార పార్టీ టీఆర్ఎస్ ఛేదించినట్లు కనిపిస్తోంది. సభలో టీఆర్ఎస్ పాలనను ఎండగడుతూ అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌కు ట్రిపుల్ ఆర్ (రాజా సింగ్, రఘునందన్ రావు, ఈటల రాజేందర్) సినిమా చూపిస్తారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఇటీవల పలుమార్లు ప్రస్తావించారు.

గొంతెత్తక ముందే ఈటలకు షాక్ !  
సాధారణ కార్యకర్త స్థాయి నుంచి పార్టీలో సీఎం కేసీఆర్‌కు కుడి భుజంగా మారిన ఈటల రాజేందర్‌‌కు గత ఏడాది ఒక్కసారిగా చేదు అనుభవం ఎదురైంది. ఈటలతో కనీసం వివరణ కూడా తీసుకోకుండా మంత్రి పదవి నుంచి ఆయనను బర్తరఫ్ చేశారు. ఆపై తనకు జరిగిన అవమానాల్ని తట్టుకోలేక టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఈటల.. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌పై 23 వేల పైచిలుకు ఓట్లతో ఘన విజయం సాధించారు. తాజాగా జరగనున్న సమావేశాల్లో సీఎం కేసీఆర్‌ను విపక్ష పార్టీ నేతగా ఎదుర్కోవాలని, తోటి బీజేపీ ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, రాజా సింగ్‌లతో కలిసి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని భావించిన ఈటల రాజేందర్‌కు నిరాశే ఎదురైంది. అసెంబ్లీలో తమ గొంతు వినిపించక ముందే సస్పెన్షన్ వేటుకు గురయ్యారు. 

Also Read: Telangana Budget 2022-23 LIVE: అసెంబ్లీ నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు RRR సస్పెన్షన్, ఈ సెషన్ పూర్తయ్యేదాకా నో ఎంట్రీ!

Also Read: KCR vs Etela Rajender: అందరి కళ్లు ఈటల పైనే ! అసెంబ్లీలో ఎదురుపడనున్న సీఎం కేసీఆర్, ఈటల

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jubilee Hills By-Elections : జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎంత మంది ఓటర్లు ఉన్నారు>? ఎన్నికల కమిషన్ ఏం చెప్పింది?
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎంత మంది ఓటర్లు ఉన్నారు>? ఎన్నికల కమిషన్ ఏం చెప్పింది?
Chandrababu Naidu CII meeting: మాది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ - సీఐఐ సదస్సులో పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు ఆహ్వానం
మాది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ - సీఐఐ సదస్సులో పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు ఆహ్వానం
ఉమెన్ ప్రపంచ కప్‌ 2025లో టీం ఇండియా సూపర్ ఓపెనింగ్, శ్రీలంకపై 59 పరుగుల తేడాతో విజయం
ఉమెన్ ప్రపంచ కప్‌ 2025లో టీం ఇండియా సూపర్ ఓపెనింగ్, శ్రీలంకపై 59 పరుగుల తేడాతో విజయం
Hydra Ayudha Puja: హైడ్రా వాహనాలకు ఆయుధపూజలు చేసిన సీపి రంగనాథ్-ఉద్యోగులకు వస్త్రాల పంపిణీ
హైడ్రా వాహనాలకు ఆయుధపూజలు చేసిన సీపి రంగనాథ్-ఉద్యోగులకు వస్త్రాల పంపిణీ
Advertisement

వీడియోలు

West Indies Cricket | ప్రపంచ క్రికెట్‌ చరిత్రలో వెస్ట్ ఇండీస్ ఓ విచిత్రం | ABP Desam
Adilabad Seasonal Fruits : ఆదిలాబాద్ జిల్లాలో సీజనల్ గా లభించే పండ్లు.. ఉపాధి పొందుతున్న ఆదివాసీలు
నేటి నుంచి మహిళల వన్డే వరల్డ్ కప్..  47 ఏళ్ల భారత నిరీక్షణ తీరేనా?
మరి కొద్ది రోజుల్లో భారత్‌తో టెస్టు సిరీస్.. కీలక ప్లేయర్ దూరం
అంతర్జాతీయ క్రికెట్‌కి క్రిస్ వోక్స్ వీడ్కోలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jubilee Hills By-Elections : జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎంత మంది ఓటర్లు ఉన్నారు>? ఎన్నికల కమిషన్ ఏం చెప్పింది?
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎంత మంది ఓటర్లు ఉన్నారు>? ఎన్నికల కమిషన్ ఏం చెప్పింది?
Chandrababu Naidu CII meeting: మాది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ - సీఐఐ సదస్సులో పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు ఆహ్వానం
మాది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ - సీఐఐ సదస్సులో పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు ఆహ్వానం
ఉమెన్ ప్రపంచ కప్‌ 2025లో టీం ఇండియా సూపర్ ఓపెనింగ్, శ్రీలంకపై 59 పరుగుల తేడాతో విజయం
ఉమెన్ ప్రపంచ కప్‌ 2025లో టీం ఇండియా సూపర్ ఓపెనింగ్, శ్రీలంకపై 59 పరుగుల తేడాతో విజయం
Hydra Ayudha Puja: హైడ్రా వాహనాలకు ఆయుధపూజలు చేసిన సీపి రంగనాథ్-ఉద్యోగులకు వస్త్రాల పంపిణీ
హైడ్రా వాహనాలకు ఆయుధపూజలు చేసిన సీపి రంగనాథ్-ఉద్యోగులకు వస్త్రాల పంపిణీ
Kantara Ticket Price In AP: ఏపీలో 'కాంతార'కు టికెట్ రేట్స్ పెరిగాయ్... విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గని ప్రభుత్వం
ఏపీలో 'కాంతార'కు టికెట్ రేట్స్ పెరిగాయ్... విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గని ప్రభుత్వం
New GST Rates: GST మార్పుల తర్వాత పప్పు నుంచి షాంపు వరకు అన్నింటిపై నిఘా పెట్టిన కేంద్రం
GST మార్పుల తర్వాత పప్పు నుంచి షాంపు వరకు అన్నింటిపై నిఘా పెట్టిన కేంద్రం
Women ODI World Cup 2025: సూర్య అనుకున్నది చేశాడు! హర్మన్‌ప్రీత్ ఏం చేస్తుంది? పాక్ కెప్టెన్‌తో చేయి కలపాలా? రూల్స్ ఏం చెబుతున్నాయి?
సూర్య అనుకున్నది చేశాడు! హర్మన్‌ప్రీత్ ఏం చేస్తుంది? పాక్ కెప్టెన్‌తో చేయి కలపాలా? రూల్స్ ఏం చెబుతున్నాయి?
Konaseema News:కోనసీమలో విషాదం: కిరాణా కొట్టులో పేలుడు, భార్యాభర్తలు మృతి, దీపావళి బాణాసంచా కారణం?
కోనసీమలో విషాదం: కిరాణా కొట్టులో పేలుడు, భార్యాభర్తలు మృతి, దీపావళి బాణాసంచా కారణం?
Embed widget