అన్వేషించండి

Etala Rajendra On TRS: సికింద్రాబాద్ ఘటన టీఆర్‌ఎస్ కుట్రే- మాజీ మంత్రి ఈటల సంచలన కామెంట్స్

సీఎం కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌పై మాజీ మంత్రి ఈటల రాజేందర్ తీవ్ర పదజాలంతో విమర్శలు చేశారు. సికింద్రాబాద్‌లో కుట్రకు టీఆర్‌ఎస్‌ తెరలేపిందని ఆరోపించారు.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటన టీఆర్ఎస్ కుట్రని ఆరోపించారు మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేంద్ర. ఇది కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమని... యువకుడు చనిపోతే ఆడెడ్‌బాడీతో కూడా రాజకీయం చేశారని విమర్శించారు. ఎంతో మంది నిరుద్యోగ బిడ్డలు చనిపోతుంటే ఏనాడూ పట్టించుకోని కేసీఆర్... ఇతర్రాష్ట్రాల్లోని వారికి మాత్రం డబ్బులు ఇస్తారని ఎద్దేవా చేశారు. ఉద్యోగాలు రాక తెలంగాణలో చాలా మంది యువకులు చనిపోయారని.... ఆయా కుటుంబాలను ఆదుకోని కేసీఆర్ పంజాబ్‌లో ఎవరో చనిపోతే వెళ్ళి డబ్బులు ఇచ్చారని వారికి వీళ్లకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.

ఒక గిరిజన మహిళను రాష్ట్రపతి అభ్యర్ధిగా నిలపడం ఒక చరిత్ర అని అభివర్ణించారు ఈటల. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత మొదటి రాష్ట్రపతిగా ఒక దళిత బిడ్డని చేశారని.... ఇప్పుడు గిరిజన బిడ్డ ద్రౌపదికి ఆ అవకాశం ఇచ్చారన్నారు. అణగారిన వర్గాలకు దక్కిన గుర్తింపు, గౌరవం ఇది భావిస్తున్నట్టు పేర్కొన్నారు. 

తెలంగాణ వస్తే దళితుడినే తొలి ముఖ్యమంత్రిగా చేస్తానని అన్న సిఎం కెసిఆర్, రాష్ట్రంలో 17% మంది దళితులు ఉంటే ఒకే ఒక్కరికి దళిత మంత్రి పదవి మాత్రమే ఇచ్చి సరిపెట్టారన్నారు. వారి కళ్ళల్లో మట్టి కొట్టారని విమర్శించారు. అదే మోదీ కేంద్రంలో 77 మంది మంత్రులు ఉంటే అందులో 22 మంది బిసీలు, 12 మంది ఎస్సీలు, 8 మంది ట్రైబల్స్, 5 మంది మైనారిటీలు ఉన్నారని గుర్తు చేశారు. 50శాతం కంటే  ఎక్కువ పదవులు ఈ వర్గాలకే ఇచ్చారనీ పేర్కొన్నారు. దళితులు, గిరిజనుల జీవితాల్లో వెలుగునింపేందుకు విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నట్టు వెల్లడించారు ఈటల. దేశ వ్యాప్తంగా 740 ట్రైబల్ జాతులకు భాష ఉన్నా లిపి లేదని.. ఆ జాతులు అంతరించి పోకుండా చర్యలు తీసుకుంటున్నారన్నారు.

షుగర్ ఫ్యాక్టరీని తెలంగాణ రాగానే తెరుస్తాం అని మాట ఇచ్చి ఇక్కడి రైతుల నోట్లో మట్టి కొట్టారన్నారు. ఇదేంటని అడిగిన రైతులను అరెస్ట్ చేయించిన కెసిఆర్ ను ప్రజలు అంత తేలికగా మర్చిపోరన్నారు, దీనికి తప్పకుండా సమాధానం చెప్తారని తెలిపారు. బాసర విద్యార్ధులు ఆందోళన చేస్తే వారిని సంఘ విద్రోహ శక్తులుగా చూపించే ప్రయత్నం చేసి వారి ఉద్యమాన్ని అణగదొక్కుతున్నారన్నారు. 

ప్రజల సమస్యలు గాలికి వదిలి నీరో చక్రవర్తిలాగా వ్యవహరిస్తూ ఫామ్ హౌస్‌లో సేదతీరుతున్నారని ఘాటైన విమర్శలు చేశారు ఈటల. కెసిఆర్‌కి హుజూరాబాద్ ప్రజలు ఎలా చెంప చెల్లుమనిపించారో అలానే చేయడానికి తెలంగాణ ప్రజలు సిద్దంగా ఉన్నారన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చిన విజయం సాధించేది బిజేపి మాత్రమే అన్నారు ఈటల రాజేందర్.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Formula E Race Case: ఫార్ములా ఈ కార్ రేస్ కేసు చార్జిషీట్.. ఏ1గా కేటీఆర్‌, క్విడ్ ప్రోకో జరిగిందన్న ఏసీబీ
ఫార్ములా ఈ కార్ రేస్ కేసు చార్జిషీట్.. ఏ1గా కేటీఆర్‌, క్విడ్ ప్రోకో జరిగిందన్న ఏసీబీ
Hyderabad Latest News: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
CM Revanth Reddy: గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం మధు రిడ్జ్ పార్క్ అపార్ట్‌మెంట్ స్థలం అక్కర్లేదు: సీఎం రేవంత్ రెడ్డి
గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం మధు రిడ్జ్ పార్క్ అపార్ట్‌మెంట్ స్థలం అక్కర్లేదు: సీఎం రేవంత్ రెడ్డి
Harish Rao: ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు

వీడియోలు

5 key Reasons behind Trump's decision to halt war | ఇరాన్ పై 5 రోజులపాటు దాడులకు విరామం ప్రకటించిన ట్రంప్. ఆయన నిర్ణయం వెనుక 5 ప్రధాన కారణాలపై విశ్లేషణ
MS Dhoni about IPL Retirement | రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన తల ధోని | ABP Desam
Virat Kohli Reacts on Fake News | ఫేక్ వార్తలపై విరాట్ ఫన్నీ రియాక్షన్ | ABP Desam
Abhishek Sharma Shouts 'Jai Babu' | జై బాబు అంటూ అభిషేక్ శర్మ రచ్చ | ABP Desam
Aakash Chopra comments on SRH | SRH బౌలింగ్‌పై ఆకాశ్ చోప్రా ఘాటు వ్యాఖ్యలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Stock Market on 24 March: యుద్ధానికి ట్రంప్ బ్రేక్.. భారత స్టాక్ మార్కెట్ జోరు.. రికవరీ అవుతున్న సెన్సెక్స్, నిఫ్టీ 50
యుద్ధానికి ట్రంప్ బ్రేక్.. భారత స్టాక్ మార్కెట్ జోరు.. రికవరీ అవుతున్న సెన్సెక్స్, నిఫ్టీ 50
Vijayawada Crime News: విజయవాడలో ఉగ్రమూలాలు! పాక్‌ హ్యాండ్లర్లతో టచ్‌లో ఉన్న ముగ్గురు యువకుల అరెస్ట్!
విజయవాడలో ఉగ్రమూలాలు! పాక్‌ హ్యాండ్లర్లతో టచ్‌లో ఉన్న ముగ్గురు యువకుల అరెస్ట్!
RCB vs SRH Tickets Live: నేడు ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు సేల్ ప్రారంభం.. ఆర్సీబీ, సన్‌రైజర్స్ మ్యాచ్ టికెట్ ఎక్కడ తీసుకోవాలి
నేడు ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు సేల్ ప్రారంభం.. RCB vs SRH Tickets ఎక్కడ తీసుకోవాలి
Bomb Threat: ఢిల్లీ సీఎం, అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. ఈమెయిల్‌లో ప్రధాని మోదీ, అమిత్ షా పేర్లు ప్రస్తావన
ఢిల్లీ సీఎం, అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. ఈమెయిల్‌లో ప్రధాని మోదీ, అమిత్ షా పేర్లు ప్రస్తావన
Jasprit Bumrah: పేసర్ జస్ప్రిత్ బుమ్రాకు గాయం? IPL 2026 ముంబై ఇండియన్స్‌లో టెన్షన్!
పేసర్ జస్ప్రిత్ బుమ్రాకు గాయం? IPL 2026 ముంబై ఇండియన్స్‌లో టెన్షన్!
Priyadarshan Lissy: విడాకులైన పదేళ్ళ తర్వాత మాజీ భార్యతో దర్శకుడు... కళ్యాణీ పేరెంట్స్‌ మళ్లీ పెళ్లి చేసుకుంటారా?
విడాకులైన పదేళ్ళ తర్వాత మాజీ భార్యతో దర్శకుడు... కళ్యాణీ పేరెంట్స్‌ మళ్లీ పెళ్లి చేసుకుంటారా?
Amaravati Fire Accident: అమరావతిలో భారీ అగ్ని ప్రమాదం.. విచారణకు ఆదేశించిన సీఎం చంద్రబాబు
అమరావతిలో భారీ అగ్ని ప్రమాదం.. విచారణకు ఆదేశించిన సీఎం చంద్రబాబు
Falls Sick or Dies on a Plane : విమానంలో ప్రయాణికుడు చనిపోతే ఏం జరుగుతుంది? ఎయిర్‌లైన్ పరిహారం ఇస్తుందా?
విమానంలో ప్రయాణికుడు చనిపోతే ఏం జరుగుతుంది? ఎయిర్‌లైన్ పరిహారం ఇస్తుందా?
Embed widget