అన్వేషించండి

Telangana: పాదయాత్ర వేస్ట్! అమెరికా వెళ్లి బాత్రూంలు కడుక్కో - కేటీఆర్‌పై రఘునందన్ రావు ఘాటు వ్యాఖ్యలు

Raghunandan Rao News | రాజకీయాలు వదిలేస్తే వదిలెయ్, అమెరికా వెళ్లి బాత్రూంలు కడుక్కో ఎవరికి నష్టం లేదని మాజీ మంత్రి కేటీఆర్ పై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు.

BJP leader Raghunandan Rao satires on KTR Padayatra | సంగారెడ్డి: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు. ముందుగా కేంద్ర మంత్రి బండి సంజయ్ అయితే పాదయాత్ర కాదు కేటీఆర్ మోకాళ్లతో యాత్ర చేసినా ప్రజలు నమ్మరని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి కనుక దమ్ముంటే ఆరు గ్యారంటీల అమలుపై మాట్లాడుతూ పాదయాత్ర చేస్తారా అని సవాల్ విసిరారు. మాజీ మంత్రి కేటీఆర్ పై మెదక్ ఎంపీ రఘునందన్ రావు సెటైర్లు వేశారు. 

‘కేటీఆర్ రాజకీయాలు వదిలేయాలని ఉందన్నాడు. రాజకీయాలు చేయాలని ఎవరూ అడగలేదు. బంద్ చెయ్యి ఎవరు వద్దు అనలేదు. అలాగే అమెరికా వెళ్లి బాత్రూంలు కడుక్కో. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్లు కేటీఆర్ కు ప్రజలను కలిసే సమయం దొరకలేదు. ఎన్నికల్లో ఓడిన తరువాత మీ నాన్న కేసీఆర్ 10 నెలలుగా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లోనే ఉన్నారు. రాష్ట్రానికి, ప్రజలకు ఏమైనా నష్టం జరిగిందా? అని రఘునందన్ రావు ప్రశ్నించారు. 

కేటీఆర్ అమెరికా నుంచి వచ్చింది డబ్బుల కోసం, అధికారం కోసం, ఫామ్ హౌస్ కోసం.. అంతేగానీ ప్రజల కోసం కాదన్నారు. మీకు కాంగ్రెస్ 10 నెలల పాలనే విసుగొస్తే పదేళ్లు రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఎలా భరించారంటూ సెటైర్లు వేశారు. కేటీఆర్ పాదయాత్ర కాదు కదా, మోకాళ్ల యాత్ర చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. కేటీఆర్ కు తన నాన్న, చెల్లె, బావతో పాటు ఎవరిపై నమ్మకం లేదు. ఫామ్ హౌస్ కేసులో పాలు... నీళ్లు తేలాలంటే సీసీ ఫుటేజ్ బయట పెట్టాలని రఘనందన్ రావు డిమాండ్ చేశారు. 

తెలంగాణలో ఆడవాళ్లు తాగుతారని కోరుట్ల ఎమ్మెల్యే అంటున్నాడు.. తెలంగాణలో ఎక్కడైనా ఆడవాళ్లు తాగుతారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ కీలక నేత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దీపావళికి బాంబులు పేల్చుతామన్న వ్యాఖ్యలపై సైతం సెటైర్లు వేశారు. ఈ దీపావళికి మార్కెట్లలో కొన్న బాంబులు, బజార్లలో మాత్రం పేలాయి కానీ పొంగులేటి చెప్పిన బాంబులు పేలలేదన్నారు. 

Also Read: BRS Chief KTR: బీఆర్ఎస్ తదుపరి సుప్రీం కేటీఆరేనా ? మరి హరీశ్ రావు పాత్ర ఏంటి? 

రేవంత్, కేటీఆర్ లు కలిసి బహిరంగ సభ పెట్టండి - బండి సంజయ్

‘‘మూసీ పునరుజ్జీవంపైన సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తా అంటున్నాడు. ఇప్పుడేమో కేటీఆర్ కూడా పాదయాత్ర చేస్తాడట. మీ ఇద్దరూ చేయాల్సింది పాదయాత్ర కాదు. మోకాళ్ల యాత్ర.’’ అంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ 2 పార్టీలు ఒక్కటేనని ‘ఇద్దరూ కలిసి అటు నుండి ఒకరు ఇటు నుండి.. ఇంకొకరు పాదయాత్ర చేసుకోండి. ఆ తరువాత బహిరంగ సభ పెట్టి రాహుల్ గాంధీ, కేసీఆర్ లను ముఖ్య అతిథులుగా పిలుచుకోండి.’’అంటూ బండి సంజయ్ ఎద్దేవా చేశారు. మానకొండూరు నియోజకవర్గంలోని ఇల్లంతకుంట, బెజ్జంకి మండలాల్లో బండి సంజయ్ కార్యకర్తలు, స్థానిక బీజేపీలో మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి చేతనైతే.. మూసీపై పాదయాత్ర చేస్తానంటున్న రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలపై పాదయాత్ర చేయాలని ఛాలెంజ్ విసిరారు.  

6 గ్యారంటీల హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని అమలు చేయకుండా మోసం చేస్తున్న విషయాన్ని కాంగ్రెస్ నేతలు పాదయాత్రలో చెప్పుకోవాలన్నారు. బీఆర్ఎస్ హయాంలో తాను పాదయాత్ర చేస్తే తనపై దాడి చేసింది ఆ పార్టీ గూండాలు కదా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. రైతుల సమస్యలపై, నిరుద్యోగుల సమస్యలపై ఏనాడూ స్పందించలే.. ఏ ముఖం పెట్టుకుని పాదయాత్ర చేస్తారు? దేనికోసం చేస్తారని నిలదీశారు. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షనేతగా ఉన్న కేసీఆర్ తన ఫాంహౌజ్ కే పరిమితమైండు. కుటుంబానికి ఆపదొస్తే తప్ప నోరువిప్పని నేత మనకు అవసరమా అన్నారు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
Ilayaraja : ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
Ilayaraja : ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
Bandla Ganesh : బండ్ల గణేష్ సంకల్ప యాత్ర ప్రారంభం - హైదరాబాద్ To తిరుమల వెంకటేశుని సన్నిధి వరకూ...
బండ్ల గణేష్ సంకల్ప యాత్ర ప్రారంభం - హైదరాబాద్ To తిరుమల వెంకటేశుని సన్నిధి వరకూ...
ఫుల్ ట్యాంక్‌తో 800 KM రేంజ్ ఇస్తున్న TVS Star City Plus.. అత్యంత చవకైన డిస్క్ బ్రేక్ బైక్
ఫుల్ ట్యాంక్‌తో 800 KM రేంజ్ ఇస్తున్న TVS Star City Plus.. అత్యంత చవకైన డిస్క్ బ్రేక్ బైక్
Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
Embed widget