అన్వేషించండి

Bandi Sanjay: బండి సంజయ్ యాత్ర-4 ముగింపు సభకు టైం ఫిక్స్, ప్లేస్ కూడా ఖరారు

మేడ్చల్ నియోజకవర్గంలోని దమ్మాయిగూడలో ప్రజా సంగ్రామ యాత్ర సన్నాహక సమావేశం నిర్వహించారు. ముగింపు సభపై చర్చించారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర-4 ముగింపు సభను ఈనెల 22న వేలాది మందితో నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్ పేట సమీపంలో ఆ రోజు సాయంత్రం 4 గంటలకు జరిగే బహిరంగ సభను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ కోరారు.

నిన్న (సెప్టెంబరు 19) మేడ్చల్ నియోజకవర్గంలోని దమ్మాయిగూడలో ప్రజా సంగ్రామ యాత్ర సన్నాహక సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు, ఇంఛార్జీలు, రాష్ట్ర పదాధికారులు పాల్గొన్న ఈ సమావేశానికి బండి సంజయ్ తో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు దుగ్యాల ప్రదీప్ కుమార్, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, మాజీ మంత్రులు డాక్టర్ జి.విజయరామారావు, డాక్టర్ చంద్రశేఖర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, కాసం వెంకటేశ్వర్లు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజా సంగ్రామ యాత్ర తీరు తెన్నులు, ముగింపు సభకు జన సమీకరణతోపాటు ప్రధాని నరేంద్రమోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 17 నుండి అక్టోబర్ 2 వరకు నిర్వహిస్తున్న ‘సేవా పక్షం, బస్తీ సంపర్క అభియాన్, పార్లమెంట్ ప్రవాసీ యోజన, ప్రజా గోస – బీజేపీ భరోసా కార్యక్రమాల పురోగతిపైనా సమీక్ష నిర్వహించారు.

అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ.. ‘‘ప్రజా సంగ్రామ యాత్ర ఈనెల 22 వరకు కొనసాగుతోంది. ముగింపు కార్యక్రమం 22న సాయంత్రం 4 గంటలకు ఇబ్రహీంపట్నంలోని పెద్ద అంబర్ పేట సమీపంలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నాం. స్థలం కూడా ఖరారైంది. ఈ సభకు కేంద్ర గ్రామీణాభివ్రుద్ది సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నారు. ఈ సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి సక్సెస్ చేద్దాం’’ అని పిలుపునిచ్చారు. ఇటీవల కాలంలోనే పాదయాత్ర పేరిట దాదాపు 13 బహిరంగ సభలు నిర్వహించి విజయవంతం చేశామని అన్నారు. అధికారిక పార్టీ సహా మరే పార్టీ కూడా ఇంత తక్కువ సమయంలో ఈ సంఖ్యలో సభలు పెట్టిన దాఖలాలు లేవని అన్నారు.

‘‘ప్రజా సంగ్రామ యాత్రకు విశేష స్పందన లభిస్తోంది. మన పాదయాత్ర స్పూర్తితో దేశవ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్నారు. మీరంతా కష్టపడి పనిచేస్తే అధికారంలోకి వస్తాం. కష్టపడే కార్యకర్తలకు, నాయకులకు న్యాయం జరుగుతుంది. ఉత్తరప్రదేశ్ ఇందుకు నిదర్శం’’ అని పేర్కొన్నారు.

ప్రజా గోస - బీజేపీ భరోసా
వీటితోపాటు జాతీయ నాయకత్వం నిర్ణయించిన ‘ప్రజా గోస – బీజేపీ భరోసా’, దళిత సంపర్క్ అభియాన్, సేవాపక్షం వంటి కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. దీంతోపాటు ప్రతి బీజేపీ కార్యకర్త తమ తమ నివాసాలపై కమలం పువ్వు గుర్తు ఉండేలా చర్య తీసుకోవాలని ఆదేశించారు. సగటున ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో కనీసం 5 చోట్ల కమలం పువ్వు గుర్తుతో వాల్ పోస్టర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ నెల 25లోపు పోలింగ్ బూత్ కు సంబంధించి పూర్తిస్థాయి కమిటీల నియామక ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు. 

4వ విడత పాదయాత్ర, పేద అంబర్ పేట బహిరంగ సభ మునుగోడు ఉప ఎన్నికపై ప్రభావం చూపడంతో పాటు బీజేపీ గెలుపులో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. పాదయాత్ర ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీకి ఇమేజ్ పెరుగుతుండటంతో పార్టీని దెబ్బతీసేందుకు అధికార పార్టీ వేస్తున్న ఎత్తుగడలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీ మంత్రులు విజయరామారావు, డాక్టర్ చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ పాదయాత్రకు విశేష స్పందన లభిస్తోందని చెప్పారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Narayanpet News: బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
Tillu Square Twitter Review - టిల్లు స్క్వేర్ ఆడియన్స్ రివ్యూ: టిల్లన్న హిట్ మేజిక్ రిపీట్ చేశాడా? ట్విట్టర్ రివ్యూలు, రిపోర్ట్స్ ఎలా ఉన్నాయంటే?
టిల్లు స్క్వేర్ ఆడియన్స్ రివ్యూ: టిల్లన్న హిట్ మేజిక్ రిపీట్ చేశాడా? ట్విట్టర్ రివ్యూలు, రిపోర్ట్స్ ఎలా ఉన్నాయంటే?
Allu Arjun Wax Statue: తగ్గేదే లే... పుష్పరాజ్ స్టాట్యూతో ఐకాన్ స్టార్ - ఒరిజినల్ ఎవరో గుర్తు పట్టారా? 
తగ్గేదే లే... పుష్పరాజ్ స్టాట్యూతో ఐకాన్ స్టార్ - ఒరిజినల్ ఎవరో గుర్తు పట్టారా? 
CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

RR vs DC Match Highlights IPL 2024: ఆఖరి ఓవర్ లో అదరగొట్టిన ఆవేశ్, దిల్లీపై రాజస్థాన్ విజయంYS Jagan vs Sunitha | YS Viveka Case: ప్రొద్దుటూరు సభలో జగన్ కామెంట్స్ కు వివేకా కుమార్తె కౌంటర్Karimnagar Young Voters Opinion Poll Elections: కరీంనగర్ యువ ఓటర్లు ఏమంటున్నారు? వారి ఓటు ఎవరికి..?YSRCP Varaprasad | Pathapatnam: వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతిపై రెబెల్ తులసీ వరప్రసాద్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Narayanpet News: బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
Tillu Square Twitter Review - టిల్లు స్క్వేర్ ఆడియన్స్ రివ్యూ: టిల్లన్న హిట్ మేజిక్ రిపీట్ చేశాడా? ట్విట్టర్ రివ్యూలు, రిపోర్ట్స్ ఎలా ఉన్నాయంటే?
టిల్లు స్క్వేర్ ఆడియన్స్ రివ్యూ: టిల్లన్న హిట్ మేజిక్ రిపీట్ చేశాడా? ట్విట్టర్ రివ్యూలు, రిపోర్ట్స్ ఎలా ఉన్నాయంటే?
Allu Arjun Wax Statue: తగ్గేదే లే... పుష్పరాజ్ స్టాట్యూతో ఐకాన్ స్టార్ - ఒరిజినల్ ఎవరో గుర్తు పట్టారా? 
తగ్గేదే లే... పుష్పరాజ్ స్టాట్యూతో ఐకాన్ స్టార్ - ఒరిజినల్ ఎవరో గుర్తు పట్టారా? 
CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
Actress Aayushi Patel: లిప్ లాక్, ఎక్స్‌పోజింగ్ నచ్చవు, ఇండస్ట్రీకి డబ్బుల కోసం రాలేదు - క్లారిటీగా చెప్పేసిన ఆయుషి పటేల్
లిప్ లాక్, ఎక్స్‌పోజింగ్ నచ్చవు, ఇండస్ట్రీకి డబ్బుల కోసం రాలేదు - క్లారిటీగా చెప్పేసిన ఆయుషి పటేల్
TSGENCO Exams: జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Embed widget