TS Assembly Session : తెలంగాణ విద్యార్థులకు 25 శాతం రిజర్వేషన్లు, ఎనిమిది కీలక బిల్లులకు శాసనసభ ఆమోదం
TS Assembly Session : తెలంగాణ శాసనసభలో ప్రభుత్వం 8 బిల్లులను ప్రవేశపెట్టి, ఆమోదం తెలిపింది.

TS Assembly Session : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఇవాళ శాసనసభలో ప్రభుత్వం ఎనిమిది బిల్లులను ప్రవేశపెట్టి, ఆమోదం తెలిపింది. మోటార్ వెహికల్ పన్నుల చట్ట సవరణ బిల్లు, ప్రైవేట్ విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లు, విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బోర్డు బిల్లు, జీహెచ్ఎంసీ, పురపాలక చట్ట సవరణ బిల్లు, జీఎస్టీ చట్ట సవరణ బిల్లు, పారిశ్రామిక చట్ట సవరణ బిల్లు, తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ సూపరెన్యుయేషన్ సవరణ బిల్లులను శాసససభలో ప్రవేశపెట్టారు. వీటికి శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ప్రైవేట్ విశ్వవిద్యాలయాల చట్ట సవరణకు శాసనసభ ఆమోదంతో కావేరి, గురునానక్, శ్రీనిధి, ఎంఎన్ఆర్, నిక్మార్ యూనివర్సిటీలకు అనుమతి లభించింది.
తెలంగాణ విద్యార్థులకు 25 శాతం రిజర్వేషన్లు
ప్రైవేట్ వర్సిటీల చట్ట సవరణ బిల్లుతో ఏర్పడే కొత్త వర్సిటీల్లో తెలంగాణ విద్యార్థులకు 25 శాతం రిజర్వేషన్లు అమలుచేయనున్నారు. విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బోర్డు బిల్లుకు శాసనసభ ఆమోదం తెలపడంతో రాష్ట్రంలో 12 వర్సిటీలకు ఉమ్మడి నియామక బోర్డు ఏర్పాటు చేసినట్లు అయింది. నియామకాల తర్వాత కూడా కోర్టు కేసులు వస్తున్నాయని, కోర్టు తీర్పుల వల్ల వర్సిటీల్లో ఉద్యోగులను తొలగించాల్సి వచ్చిందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. యూజీసీ నిబంధనలతో ఉమ్మడి నియామక బోర్డును ఏర్పాటు చేశామని తెలిపారు. ఉమ్మడి నియామక బోర్డు ఛైర్మన్ గా ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఉంటారని, వైస్ ఛాన్స్ లర్లు కమిటీ ఛైర్మన్లుగా ఉంటారన్నారు. యునివర్సిటీల్లో మూడు వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశామని మంత్రి అసెంబ్లీలో వెల్లడించారు. శాసనసభలో మోటార్ వెహికల్ పన్నుల చట్ట సవరణ బిల్లుపై మంత్రి పువ్వాడ అజయ్ మాట్లాడారు. వాహనాల అమ్మకాల్లో ప్రభుత్వానికి సక్రమంగా పన్నులు వచ్చేలా చట్ట సవరణ చేశామని తెలిపారు. డీలర్ల రాయితీ నిలువరించేందుకు చట్టాన్ని సవరణ చేశామన్నారు. లారీల అంతర్రాష్ట్ర పన్నులపై ఆంధ్రప్రదేశ్ అధికారులతో మాట్లాడుతున్నామన్నారు. గ్రీన్ ట్యాక్స్ అనేది కేంద్రప్రభుత్వం తెచ్చిందన్నారు. ఈ చట్ట సవరణ వల్ల వినియోగదారులకు పెద్దగా ఇబ్బంది ఉండదన్నారు.
నేటితో ముగియనున్న సమావేశాలు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఐదు రోజుల విరామం తర్వాత తిరిగి నిన్న ప్రారంభం అయ్యాయి. కేంద్ర ప్రభుత్వం విద్యుత్ బిల్లుపై సీఎం కేసీఆర్ సభలో మాట్లాడారు. శాసనసభ, మండలి వర్షాకాల సమావేశాలు నేటితో(మంగళవారం) ముగుస్తాయి. ఇవాళ అసెంబ్లీలో కీలక బిల్లులపై చర్చించి ఆమోదించారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన రెండు అంశాలపై చర్చలు జరుగుతున్నాయి. కేంద్ర విద్యుత్ బిల్లును వ్యతిరేకిస్తున్నామని సభ తీర్మానం చేసింది. అలాగే దిల్లీలో నిర్మిస్తున్న కొత్త పార్లమెంటు భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానాలను ప్రవేశపెట్టారు. వాటిపై చర్చించి ఆమోదం తెలిపనున్నారు. అలాగే ఎఫ్ఆర్బీఎం చట్టం అమలులో కేంద్ర వైఖరి, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం అమలులో కేంద్ర వైఫల్యంపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ జరగనుంది. ములుగు వద్ద ఉన్న అటవీ కళాశాలను యూనివర్శిటీగా మార్చేందుకు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టారు. దీనపై చర్చ జరిగే అవకాశం ఉంది.
Also Read : VRAs Protest : వీఆర్ఏ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ భేటీ, సమ్మె తాత్కాలిక వాయిదా!
Also Read : Telangana Assembly: కదం తొక్కిన వీఆర్ఏలు, అసెంబ్లీ ముట్టడికి యత్నం - భారీ లాఠీచార్జి, ఉద్రిక్తత
Before You Go
Adulterated Paneer in Hyderabad | పనీర్ పేరుతో మోసం..హైదరాబాద్లో భారీ దాడులు
ట్రెండింగ్ వార్తలు






















