అన్వేషించండి

Nampally Fire Accident: నాంపల్లి అగ్ని ప్రమాదం - భవన యజమాని రమేశ్ జైశ్వాల్ అరెస్ట్, 14 రోజుల రిమాండ్

Hyderabad Fire Accidents: నాంపల్లి బజార్ ఘాట్ లో ఘోర అగ్నిప్రమాద ఘటనకు సంబంధించి భవన యజమానిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. న్యాయస్థానం నిందితునికిి 14 రోజుల రిమాండ్ విధించింది.

Nampally Fire Accident Building Owner Arrested: హైదరాబాద్ నాంపల్లి (Nampally) బజార్‌ఘాట్‌ (Bazarghat)లో ఇటీవల అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి బాలాజీ రెసిడెన్సీ యజమాని రమేశ్ జైశ్వాల్ (Ramesh Jaiswal) ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని కోర్టులో హాజరు పరచగా న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో నిందితున్ని పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు. నిందితుడు గత కొంతకాలంగా అక్రమంగా కెమికల్స్ విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. గతంలో పలుమార్లు పట్టుబడి జైలుకు వెళ్లి వచ్చినా, అపార్ట్ మెంట్ లో డ్రమ్ముల్లో కెమికల్స్ నిల్వ ఉంచి విక్రయించడం మానలేదు. ఈ క్రమంలో ఈ నెల 13న గ్రౌండ్ ఫ్లోర్ లో కారు రిపేర్ చేస్తుండగా, నిప్పు రవ్వలు అంటుకుని ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందగా, దట్టమైన పొగ అలుముకుని దాదాపు 20 మందికి పైగా ఊపిరాడక అస్వస్థతకు గురయ్యారు. ఘటనపై ఐపీసీ సెక్షన్లు 304, 285, 286 కింద కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేసి భవన యజమానిని  రమేశ్ ను అరెస్ట్ చేశారు. ఈ నెల 11న సాయంత్రం నిందితుడు 35 కిలోల రెసిన్ ఉన్న 32 డబ్బాలను కొనుగోలు చేసి వాటిని గ్రౌండ్ ఫ్లోర్ లో నిల్వ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో నిప్పు రవ్వలు అంటుకుని భారీగా మంటలు చెలరేగినట్లు చెప్పారు.

ప్రమాదం ఎలా జరిగిందంటే.?

ఈ నెల 13న సోమవారం ఉదయం నాంపల్లి బజార్ ఘాట్ లోని అపార్ట్ మెంట్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గ్రౌండ్ ఫ్లోర్ లోని గ్యారేజీలో కారు రిపేర్ చేస్తుండగా అక్కడే ఉన్న కెమికల్ డ్రమ్ములకు మంటలు అంటుకున్నాయి. ఈ క్రమంలో నాలుగో అంతస్తు వరకూ మంటలు వేగంగా వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది, పోలీసులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. 6 ఫైరింజిన్ల సాయంతో తీవ్రంగా శ్రమించి మంటలు అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో 9 మంది అక్కడికక్కడే మృతి చెందారు. తాజాగా, ప్రమాదంలో గాయపడిన తల్హా నాసర్ (17) అనే విద్యార్థి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. దీంతో మృతుల సంఖ్య 10కి చేరింది. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు, ఓ చిన్నారి కూడా ఉన్నారు. ప్రమాద ధాటికి దట్టంగా పొగ అలుముకోగా 21 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. భవనంలో చిక్కుకున్న వారిని నిచ్చెనల సాయంతో ఫైర్ సిబ్బంది రక్షించారు. అటు, మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.5 లక్షల సాయం ప్రకటించింది. 

'కెమికల్ నిల్వలే కారణం'

భవన యజమాని రమేశ్ జైశ్వాల్ అపార్ట్ మెంట్ సెల్లార్ లో కెమికల్ నిల్వలు ఉంచి వ్యాపారం చేస్తున్నాడు. ప్రమాదం సమయంలో 30 డ్రమ్ములు పూర్తిగా కాలిపోగా, మరో 100 డ్రమ్ములను అగ్ని మాపక సిబ్బంది బయటకు తీసుకొచ్చారు. ప్లాస్టిక్ తయారీలో వాడే రసాయనాలు నిల్వ ఉంచడం వల్లే మంటలు ఒక్కసారిగా అంటుకుని వేగంగా వ్యాపించినట్లు తెలుస్తోంది. కెమికల్ డ్రమ్ములను చాలా రోజులుగా నిల్వ ఉంచినా ఎవరూ పట్టించుకోలేదని సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారించిన పోలీసులు తాజాగా, భవన యజమానిని అరెస్ట్ చేసి కోర్టు ఆదేశాలతో రిమాండుకు తరలించారు.

Also Read: CM KCR Comments in Alampur: 'వాల్మీకి, బోయలను ఎస్టీ జాబితాలో చేరుస్తాం' - ప్రజాస్వామ్యంలో ఫ్యాక్షనిస్టులు గెలవకూడదని కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
OTT Releases This Week: ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
Tata tiago On EMI Finance Plan: మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
Embed widget