అన్వేషించండి

Free Visit to Ayodhya Ram Mandir: 5 లక్షల మందికి ఉచితంగా అయోధ్య రాముడి దర్శనం, ఎలాగంటే!

తెలుగు వారికి కృష్ణ ధర్మ పరిషత్ గుడ్ న్యూస్ చెప్పింది. అయిదు లక్షల మందికి ఉచితంగా అయోధ్య రామమందిరం దర్శనం కల్పించాలని కృష్ణ ధర్మ పరిషత్ నిర్ణయం తీసుకుంది.

Free Visit to Ram Mandir in Ayodhya: హైదరాబాద్: అయోధ్యలో రాముడి ప్రాణ ప్రతిష్టను దేశ వ్యాప్తంగా పండుగలా జరుపుకున్నారు. సోమవారం మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అభిజీత్ లగ్నంలో అయోధ్య ఆలయం (Ayodhya Ram Mandir)లో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట వైభవంగా ఉంది. దీన్ని పురస్కరించుకుని దేశంలో అన్ని రాష్ట్రాలతో పాటు విదేశాల్లోని రామ భక్తులు దీపాలు వెలిగించి దీపోత్సవంలో పాలు పంచుకున్నారు. అయోధ్యలో కొలువుదీరిన రాముడ్ని దర్శించుకోవాలనుకున్న తెలుగు వారికి కృష్ణ ధర్మ పరిషత్ (Krishna Dharma Parishad) గుడ్ న్యూస్ చెప్పింది.

5 లక్షల మందికి ఉచితంగా అయోధ్య రామమందిరం దర్శనం 
ఏపీ, తెలంగాణ నుంచి అయిదు లక్షల మందికి ఉచితంగా అయోధ్య రామమందిరం దర్శనం కల్పించాలని కృష్ణ ధర్మ పరిషత్ నిర్ణయం తీసుకుంది. అయోధ్యలో రామ మందిరం వేడుకలను పురస్కరించుకుని కృష్ణ ధర్మ పరిషత్ ఆధ్వర్యంలో సోమవారం  హైదరాబాద్‌లో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు అయోధ్య రాముడి ఉచిత దర్శనం కల్పిస్తామని కృష్ణ ధర్మ పరిషత్ వ్యవస్థాపకుడు అభిషేక్ గౌడ్ ప్రకటించారు. ఆసక్తి ఉన్నవారు krishnadharma.in వెబ్ సైట్ లో లాగిన్ అయి రిజిస్టర్ చేసుకోవాలని భక్తులకు సూచించారు. హైదరాబాద్ లో అయోధ్య రామ మందిరం విజయ్ దివస్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. 
ఈ సందర్భంగా కృష్ణ ధర్మ పరిషత్ వ్యవస్థాపకుడు అభిషేక్ గౌడ్ మాట్లాడుతూ.. అయోధ్య రామ మందిరం (Ram Mandir in Ayodhya) కల సాకారం కావడంపై హర్షం వ్యక్తం చేశారు. రామయ్య భక్తుల 5 శతాబ్దాల కల నెరవేరిందన్నారు. రామ మందిర వేడకను కాంగ్రెస్ పార్టీ (Congress Party) బహిష్కరించడాన్ని తప్పుపట్టారు. ప్రజల ఆకాంక్షతో సాకారమైన రామయ్య ఆలయంపై రాజకీయాలు చేయడం తగదని సూచించారు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రజలు తమ ఓటుతో తీర్పు చెప్పాలని పిలుపునిచ్చారు. మత సామరస్యాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం ఎవరూ చేసినా సహించకూడదన్నారు. గత లోక్ సభ ఎన్నికల్లో  తెలంగాణలో బీజేపీ నాలుగు సీట్లు గెలిచిందని, ఈసారి 12 సీట్లు గెలిచే అవకాశం ఉందన్నారు. బీజేపీ కోసం పనిచేస్తున్న రామ్ యాదవ్ కు మల్కాజ్ గిరి పార్లమెంట్ టికెట్ ఇవ్వాలని పార్టీ ఎంపీ లక్ష్మణ్‌ను అభ్యర్థించారు. దేశవ్యాప్తంగా మోదీ మూడోసారి ప్రధాని కావాలని కోరుకుంటున్నారని అభిషేక్ గౌడ్ పేర్కొన్నారు.

Free Visit to Ayodhya Ram Mandir: 5 లక్షల మందికి ఉచితంగా అయోధ్య రాముడి దర్శనం, ఎలాగంటే!

బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్ (BJP MP Laxman) ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయోధ్య రామాలయం విజయోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించిన కృష్ణ ధర్మ పరిషత్ ను అభినందించారు. ధర్మ పరిరక్షణ కోసం సంస్థ చేస్తున్న సేవల్ని కొనియాడారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా కొన్ని పార్టీలు వ్యవహరించడాన్ని తప్పుపట్టారు. రాముడిని తిరస్కరించిన వారు రాజకీయంగా ముందుకు వెళ్లలేరని, సర్వేజనా సుఖినోభవంతు అనేది సనాతన ధర్మం లక్ష్యమన్నారు.
Also Read: Dhruva Sarja: దైవభక్తిని చాటుకున్న హీరో - అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం రోజే పిల్లలకు నామకరణం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Vijayawada Traffic Diversions: పెద్దగట్టు చేరిన దేవరపెట్టె - ఈ 20 వరకు హైదరాబాద్‌- విజయవాడ మార్గంలో ట్రాఫిక్‌ మళ్లింపు
పెద్దగట్టు చేరిన దేవరపెట్టె - ఈ 20 వరకు హైదరాబాద్‌- విజయవాడ మార్గంలో ట్రాఫిక్‌ మళ్లింపు
KTR Wishes KCR: నా ఒక్కడికే కాదు, తెలంగాణ మొత్తానికి మా నాన్న హీరో: కేసీఆర్‌కు కేటీఆర్ విషెష్
నా ఒక్కడికే కాదు, తెలంగాణ మొత్తానికి మా నాన్న హీరో: కేసీఆర్‌కు కేటీఆర్ విషెష్
Vicky Kaushal: 'ఖాన్'దాన్‌ల అడ్డాలో... కత్రినా భర్త నుంచి కోట్లు కొల్లగొట్టే హీరోగా - బాలీవుడ్ నెక్ట్స్ సూపర్‌ స్టార్‌ విక్కీ కౌశల్!
'ఖాన్'దాన్‌ల అడ్డాలో... కత్రినా భర్త నుంచి కోట్లు కొల్లగొట్టే హీరోగా - బాలీవుడ్ నెక్ట్స్ సూపర్‌ స్టార్‌ విక్కీ కౌశల్!
Delhi Earthquake: ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో భూకంపం, అప్రమత్తంగా ఉండాలన్న ప్రధాని మోదీ
ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో భూకంపం, భయంతో నిద్రలేచిన ప్రజలు- అప్రమత్తంగా ఉండాలన్న ప్రధాని మోదీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ICC Champions Trophy 2025 Team India | అగార్కర్ తో డ్రెస్సింగ్ రూమ్ లో Gambhir డిష్యూం డిష్యూం | ABP DesamChhatrapati Sambhaji Maharaj 'Sambar' | సాంబార్ చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు | ABP DesamVicky Kaushal Bollywood Super Star | Chhava తో కొత్త సూపర్ స్టార్ పుట్టాడా.? | ABP DesamMLC Candidate Aviash Jadhav Interview | పదిహేను నా లక్కీ నెంబర్ ఎందుకంటే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Vijayawada Traffic Diversions: పెద్దగట్టు చేరిన దేవరపెట్టె - ఈ 20 వరకు హైదరాబాద్‌- విజయవాడ మార్గంలో ట్రాఫిక్‌ మళ్లింపు
పెద్దగట్టు చేరిన దేవరపెట్టె - ఈ 20 వరకు హైదరాబాద్‌- విజయవాడ మార్గంలో ట్రాఫిక్‌ మళ్లింపు
KTR Wishes KCR: నా ఒక్కడికే కాదు, తెలంగాణ మొత్తానికి మా నాన్న హీరో: కేసీఆర్‌కు కేటీఆర్ విషెష్
నా ఒక్కడికే కాదు, తెలంగాణ మొత్తానికి మా నాన్న హీరో: కేసీఆర్‌కు కేటీఆర్ విషెష్
Vicky Kaushal: 'ఖాన్'దాన్‌ల అడ్డాలో... కత్రినా భర్త నుంచి కోట్లు కొల్లగొట్టే హీరోగా - బాలీవుడ్ నెక్ట్స్ సూపర్‌ స్టార్‌ విక్కీ కౌశల్!
'ఖాన్'దాన్‌ల అడ్డాలో... కత్రినా భర్త నుంచి కోట్లు కొల్లగొట్టే హీరోగా - బాలీవుడ్ నెక్ట్స్ సూపర్‌ స్టార్‌ విక్కీ కౌశల్!
Delhi Earthquake: ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో భూకంపం, అప్రమత్తంగా ఉండాలన్న ప్రధాని మోదీ
ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో భూకంపం, భయంతో నిద్రలేచిన ప్రజలు- అప్రమత్తంగా ఉండాలన్న ప్రధాని మోదీ
US Deportation: అమెరికాలోని భారతీయులకు బ్రహ్మాస్త్రం- ట్రంప్‌తో మాట్లాడా, అంతా సెట్ అవుతుందన్న కేఏ పాల్
అమెరికాలోని భారతీయులకు బ్రహ్మాస్త్రం- ట్రంప్‌తో మాట్లాడా, అంతా సెట్ అయిపోతుందన్న కేఏ పాల్
Kedarnath Yatra 2025 : కేదార్​నాథ్ యాత్ర 2025 ప్రారంభ తేది ఇదే.. యాత్ర​ ప్రాముఖ్యత, ఇంట్రెస్టింగ్ విషయాలు ఇవే
కేదార్​నాథ్ యాత్ర 2025 ప్రారంభ తేది ఇదే.. యాత్ర​ ప్రాముఖ్యత, ఇంట్రెస్టింగ్ విషయాలు ఇవే
Students Protest: అర్ధరాత్రి విద్యార్థినుల బాత్రూమ్‌లోకి తొంగిచూస్తున్నారంటూ నిరసన, ఎమ్మెల్యే చెప్పినా పట్టించుకోని పోలీసులు!
అర్ధరాత్రి విద్యార్థినుల బాత్రూమ్‌లోకి తొంగిచూస్తున్నారంటూ నిరసన, ఎమ్మెల్యే చెప్పినా పట్టించుకోని పోలీసులు!
Minister Ramanaidu:  మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.