అన్వేషించండి

Gaddar On KCR : నియంతలకు పట్టిన గతే కేసీఆర్ కు పడుతుంది, గద్దర్ సంచలన వ్యాఖ్యలు

Gaddar On KCR : సీఎం కేసీఆర్ పై ప్రజాగాయకుడు గద్దర్ తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ దళితులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని మండిపడ్డారు.

Gaddar On KCR : ప్రజా గాయకుడు గద్దర్ మరోసారి సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. నియంతలకు ఎలాంటి గతి పట్టిందో కేసీఆర్ కు అదే పరిస్థితి వస్తుందన్నారు. శనివారం ఓ న్యూస్ ఛానల్ తో మాట్లాడిన ఆయన... కేసీఆర్ పై విమర్శలు చేశారు. పొలిటీషియన్స్ సాధారణంగా ఆర్థిక హామీలిస్తారని, కానీ కేసీఆర్ మాత్రం పొలిటికల్ హామీలు చేశారన్నారు. ఇప్పటికైనా కేసీఆర్ ప్రజల ఆలోచనలు అర్థం చేసుకోవాలని కోరారు. కేసీఆర్ గతంలో రాజ్యాంగాన్ని మార్చాలని చేసిన వ్యాఖ్యలపై గద్దర్ స్పందించారు.  రాజ్యాంగాన్ని ఎందుకు మార్చాలో సీఎం కేసీఆర్ ప్రజలకు చెప్పాలన్నారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ దళితులకు అనేక  హామీలు ఇచ్చారని, ఆ తర్వాత వాటిని మర్చిపోయారని మండిపడ్డారు. దళిత నేతను ముఖ్యమంత్రిని చేస్తానన్న కేసీఆర్ ఆ మాటను నిలబెట్టుకోలేదన్నారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానన్నారని, అది కూడా నెరవేరలేదన్నారు. దళితబంధు కూడా కొందరికే ఇస్తున్నారన్నారు. పార్లమెంట్ భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టాలన్న డిమాండ్‌ను సీఎం కేసీఆర్ తన జాతీయ ఎజెండాలో చేర్చాలని గద్దరు అన్నారు. 

ప్రాణ హాని ఉందని ఫిర్యాదు 

తనకు ప్రాణహాని ఉందని గద్దర్ ఇటీవల అధికారులను ఆశ్రయించారు. తనకు రక్షణ కల్పించాలని జనగామ జిల్లా కలెక్టర్ శివలింగయ్య, వెస్ట్ జోన్ డీసీపీ సీతారాములును కలిసి వినతి పత్రం ఇచ్చారు. జిల్లాలోని మండల గూడెం గ్రామంలో బాల సాయిబాబా ట్రస్ట్ భూములు ప్రభుత్వానికి అప్పగించాలని పోరాటం చేయనున్నట్లు గద్దర్ తెలిపారు. దీంతో ఈ ప్రాంతానికి తరచూ వస్తున్నానన్నారు. అందువల్ల కొందరు ప్రజాప్రతినిధులు, రియల్టర్ల నుంచి తనకు ప్రాణహాని ఉందని, వారి నుంచి రక్షణ కల్పించాలని జిల్లా కలెక్టర్, డీసీపీలను కోరారు. మండల గూడెంలోని 59 ఎకరాల భూములు రియల్టర్ల చేతికి చిక్కాయని గద్దర్ ఆరోపించారు. వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని,  సర్దార్ సర్వాయి పాపన్న పేరుతో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బాలసాయి బాబా భూములను ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉపయోగించే వరకు తాను ఈ పోరాటం చేస్తానన్నారు. అయితే బాల సాయిబాబా ట్రస్ట్ కు చెందిన భూములను ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తికి విక్రయించినట్లు తెలుస్తుంది. ఈ భూముల విషయంపై ప్రజా గాయకుడు గద్దర్ రఘునాథపల్లి రెవెన్యూ అధికారులను కలిసి సమాచార హక్కు కింద దరఖాస్తు చేశారు. 

ప్రజా సమస్యలపై గళమెత్తిన గాయకుడు 

1997 ఏప్రిల్ 6న హైదరాబాద్‌లో ఆయన నివాసంలో గుర్తుతెలియని వ్యక్తులు గద్దర్ పై కాల్పులు జరిపారు.  ఈ ఘటనలో గద్దర్ కు బుల్లెట్ గాయాలయ్యాయి. రెండు బుల్లెట్లు ఆయన ఛాతిలోకి దూసుకెళ్లాయి. అందులో ఓ బుల్లెట్ మాత్రం ఇప్పటికీ ఆయన శరీరంలోనే ఉనట్లు తెలుస్తోంది. ఆ బుల్లెట్ తొలగిస్తే ఆయన ప్రాణానికే ప్రమాదమని వైద్యులు తెలపడంతో  ఆ బుల్లెట్‌ను శరీరంలోనే విడిచిపెట్టారు. అయితే గద్దర్ మాత్రం ఇప్పటికీ ప్రజా సమస్యలపై గళమెత్తుతున్నారు.  తన పాటలతో అవినీతిని నిలదీస్తున్నారు. తాజాగా బాల సాయిబాబాకు చెందిన భూముల విషయంలో పోరాటానికి గద్దర్ సిద్ధమవుతున్నారు. తనపై కొందరు దాడి చేసే అవకాశం ఉందని అధికారులకు ఫిర్యాదు చేయడంతో గద్దర్ మళ్లీ వార్తల్లో నిలిచారు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: చాక్లెట్లు, బిస్కెట్లలో డ్రగ్స్.. తెలంగాణ డీజీపీ ఆనంద్ తీవ్ర ఆందోళన
చాక్లెట్లు, బిస్కెట్లలో డ్రగ్స్.. తెలంగాణ డీజీపీ ఆనంద్ తీవ్ర ఆందోళన
Revanth Reddy Delhi Tour: రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో కీలక పరిణామం.. సాయంత్రం ఒకే సమావేశంలో కిషన్ రెడ్డి, తెలంగాణ సీఎం
రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో కీలక పరిణామం.. సాయంత్రం ఒకే సమావేశంలో కిషన్ రెడ్డి, తెలంగాణ సీఎం
Doctor Vikrant Singh Diet : డాక్టర్ విక్రాంత్ సింగ్ 6 ఏళ్లుగా ఫాలో అవుతున్న డైట్ ఇదే.. బీపీ, ప్రీడయాబెటిస్ రివర్స్ అయిందట, మరి నిపుణుల సలహా ఏంటి?
డాక్టర్ విక్రాంత్ సింగ్ 6 ఏళ్లుగా ఫాలో అవుతున్న డైట్ ఇదే.. బీపీ, ప్రీడయాబెటిస్ రివర్స్ అయిందట, మరి నిపుణుల సలహా ఏంటి?
Allu Arjun : పుష్ప ఒక్కరే రాలేదు - కోర్టు ఏం చెప్పిందంటే?
పుష్ప ఒక్కరే రాలేదు - కోర్టు ఏం చెప్పిందంటే?

వీడియోలు

Vaibhav Suryavanshi World Record | లంక బౌలర్లను వణకించిన వండర్ కిడ్
FIFA World Cup 2026 Goal Milestone | ఫిఫా వరల్డ్ కప్ 2026లో సరికొత్త చరిత్ర
Kandula Durgesh Counter to YSRCP | కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదు
South Africa Beat India In T20WC | 200వ ల్యాండ్‌మార్క్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ వరల్డ్ రికార్డ్
India A Win Tri-Series Final vs Sri Lanka A | లంకపై భారత్ ఏ జట్టు ఘనవిజయం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
JD Vance: అమెరికా, ఇరాన్ చర్చల్లో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు అవమానం.. అయినా కొనసాగిన భేటీ
అమెరికా, ఇరాన్ చర్చల్లో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు అవమానం.. అయినా కొనసాగిన భేటీ
SIT on Sai Krishna Missing Case: సాయికృష్ణ కేసులో నేడు సీఐ నాగరాజును ప్రశ్నించనున్న సిట్.. అరెస్ట్ చేయవద్దని క్యాండిల్ ర్యాలీ
సాయికృష్ణ కేసులో నేడు సీఐ నాగరాజును ప్రశ్నించనున్న సిట్.. అరెస్ట్ చేయవద్దని క్యాండిల్ ర్యాలీ
Telangana Congress Incharge Controversy: మీనాక్షి నటరాజన్ ఇష్యూతో తెలంగాణ కాంగ్రెస్‌లో టైం బాంబ్ - సమగ్ర ప్రక్షాళనకు రాహుల్ రెడీ - ఎవరు బలి కాబోతున్నారు?
మీనాక్షి నటరాజన్ ఇష్యూతో తెలంగాణ కాంగ్రెస్‌లో టైం బాంబ్ - సమగ్ర ప్రక్షాళనకు రాహుల్ రెడీ - ఎవరు బలి కాబోతున్నారు?
Adilabad Crime News: ఆదిలాబాద్‌లో మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి కార్లలో పశువుల దొంగతనం.. మహారాష్ట్రకు తరలిస్తున్న గ్యాంగ్‌ అరెస్ట్
ఆదిలాబాద్‌లో మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి కార్లలో పశువుల దొంగతనం.. మహారాష్ట్రకు తరలిస్తున్న గ్యాంగ్‌ అరెస్ట్
Sai Durgha Tej : సాయి దుర్గా తేజ్ సంబరాల ఏటిగట్టు ఆలస్యం - రూమర్స్‌కు సుప్రీం హీరో చెక్
సాయి దుర్గా తేజ్ సంబరాల ఏటిగట్టు ఆలస్యం - రూమర్స్‌కు సుప్రీం హీరో చెక్
Doctor Vikrant Singh Diet : డాక్టర్ విక్రాంత్ సింగ్ 6 ఏళ్లుగా ఫాలో అవుతున్న డైట్ ఇదే.. బీపీ, ప్రీడయాబెటిస్ రివర్స్ అయిందట, మరి నిపుణుల సలహా ఏంటి?
డాక్టర్ విక్రాంత్ సింగ్ 6 ఏళ్లుగా ఫాలో అవుతున్న డైట్ ఇదే.. బీపీ, ప్రీడయాబెటిస్ రివర్స్ అయిందట, మరి నిపుణుల సలహా ఏంటి?
Team India Chances: సౌతాఫ్రికా చేతిలో దెబ్బతిన్న హర్మన్‌ప్రీత్ సేన.. సెమీస్ రేసు కాస్త సంక్లిష్టం..  క్వాలిఫై లెక్క‌లు ఇవే!
సౌతాఫ్రికా చేతిలో దెబ్బతిన్న హర్మన్‌ప్రీత్ సేన.. సెమీస్ రేసు కాస్త సంక్లిష్టం..  క్వాలిఫై లెక్క‌లు ఇవే!
కొత్త లుక్‌లో Aprilia SR 125, SR 175- హైదరాబాద్‌లో మిలిటరీ ఎడిషన్ స్కూటీల ధర, ఫీచర్ల వివరాలు
Aprilia SR 125, SR 175 బుకింగ్స్ ప్రారంభం- హైదరాబాద్‌లో మిలిటరీ ఎడిషన్ స్కూటీల ధరలివే
Embed widget