అన్వేషించండి

Revanth Reddy On BJP : సోనియా గాంధీ ఈడీ ఆఫీసులో అడుగుపెడితే మోదీ పునాదులు కదులుతాయ్ - రేవంత్ రెడ్డి

Revanth Reddy On BJP : కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో గెలుస్తుందన్న భయంతోనే నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీలకు బీజేపీ ప్రభుత్వం నోటీసులు ఇచ్చిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

Revanth Reddy On BJP : నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, అగ్రనేత రాహుల్‌ గాంధీలకు ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీచేయడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ శ్రేణులు దేశవ్యాప్తంగా నిరసన ర్యాలీలు చేపట్టాయి. హైదరాబాద్‌లో కాంగ్రెస్ శ్రేణులు భారీ ర్యాలీ చేసింది. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు బషీర్‌​బాగ్​ ఈడీ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో సహా అగ్రనేతలు పాల్గొన్నారు. 

స్వాతంత్య్ర పోరాటంలో కాంగ్రెస్ వాయిస్ ఈ పత్రిక 

బషీర్ బాగ్ ఈడీ కార్యలయం వద్ద టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో కాంగ్రెస్ పార్టీ వాయిస్ కోసం స్థాపించిన  పత్రిక నేషనల్ హెరాల్డ్ అని అన్నారు.  అప్పుల్లో కూరుకుపోయిన పత్రికను తిరిగి నడపడానికి రాహుల్ నడుంకట్టారన్నారు.  రూ.90 కోట్ల అప్పుల్లో ఉన్న ఆ పత్రికను తిరిగి తెరిచారన్నారు. బీజేపీ అక్రమాలను బయటపెట్టే ప్రయత్నం చేస్తున్న పత్రికపై కక్షసాధించేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని ఆరోపించారు.  అందులో అక్రమాలు జరిగాయి అని నోటీసులు ఇచ్చారన్నారు. సుబ్రమణ్యస్వామి ఈడీకి ఫిర్యాదు చేస్తే 2105 లోనే అక్రమాలు ఏమి జరగలేదని రిపోర్ట్ ఇచ్చిందన్నారు.  మళ్లీ దాన్ని మోదీ సర్కార్ మళ్లీ రీఓపెన్ చేసిందన్నారు. 

Revanth Reddy On BJP : సోనియా గాంధీ ఈడీ ఆఫీసులో అడుగుపెడితే మోదీ పునాదులు కదులుతాయ్ - రేవంత్ రెడ్డి


మోదీ పునాదులు కదులుతాయ్

" ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో గెలుస్తుందని భయంతోనే మోదీ నోటీసులు పంపారు. పెరిగిన పెట్రిల్, డీజిల్, గ్యాస్ ధరలతో ప్రజలు ఇబ్బంది పడ్తున్నారు.  వచ్చే ఎన్నికల్లో మోదీకి స్వస్తి చెప్పాలని ప్రజలు చూస్తున్నారు. త్యాగాల కుటుంబం గాంధీ కుటుంబం. రాహుల్ కు 50 లక్షలు కాదు రూ.5 వేల కోట్లు కావాలన్నా 24 గంటల్లో కాంగ్రెస్ అభిమానులు ఇవ్వగలరు. గాంధీ కుటుంబానికి ఆస్తులు, పదవులు అక్కర్లేదు.  అన్ని రాష్ట్రాలలోనూ ఈడీ కార్యాలయాల ముందు నిరసన తెలుపుతున్నాం.1980లో కూడా ఇందిరా గాంధీపై కేసు పెడితే తర్వాత వచ్చిన ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. జూన్ 23న సోనియా గాంధీ ఈడీ కార్యాలయంలో అడుగుపెడితే మోదీ పునాదులు కదులుతాయి. గాంధీ కుటుంబం మీద ఈగ వాలినా రాజకీయంగా బతికి బట్టకట్టలేరు. తెలంగాణ కళ సాకారం చేసిన దేవత సోనియా గాంధీ. తెలంగాణ తల్లి సోనియాను ఈడీ ఆఫీస్ కు పిలుస్తే ఊరుకోం. గాంధీ వారసులం కాబట్టి శాంతి యుతంగా నిరసన తెలుపుతున్నాం "
--- రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు 

బీజేపీ బెదిరింపులకు భయపడం

"  ఈడీ నోటీసులకు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ భయపడే వ్యక్తులు కాదు. బీజేపీ బెదిరింపులకు భయపడేది లేదు. ఇందిరా గాంధీని జైలుకు పంపిస్తే ఏం జరిగిందో దేశ ప్రజలకు తెలుసు. రాహుల్ , సోనియా గాంధీలను కాపాడుకుంటాం. బీజేపీని ఈ దేశం నుంచి తరిమికొడతాం. ఇది అంతం కాదు ఆరంభం. "
-- భట్టి విక్రమార్క, సీఏల్పీ నేత

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

CM Chandra Babu :టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
The Raja Saab Live Updates: 'ది రాజా సాబ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ ఏం జరిగిందో తెలుసుకోండి - ఏపీలో షోస్ షురూ
'ది రాజా సాబ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ ఏం జరిగిందో తెలుసుకోండి - ఏపీలో షోస్ షురూ
Andhra Pradesh: సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
Amaravati: జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్

వీడియోలు

Pasarlapudi Blowout 30 Years | ఇరుసుమండ బ్లోఅవుట్ కు తాతలాంటి పాశర్లపూడి బ్లో అవుట్ ఘటన | ABP Desam
WPL 2026 Mumbai Indians | ముంబై ఇండియన్స్ లో కీలక మార్పులు | ABP Desam
India vs South Africa Vaibhav Suryavanshi | మూడో వన్డేలో 233 పరుగుల తేడాతో విజయం
Shreyas Iyer Fitness Update Ind vs NZ | టీమ్ ఇండియాకు గుడ్‌న్యూస్!
Robin Uthappa about Team India | ఉత‌ప్ప సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandra Babu :టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
The Raja Saab Live Updates: 'ది రాజా సాబ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ ఏం జరిగిందో తెలుసుకోండి - ఏపీలో షోస్ షురూ
'ది రాజా సాబ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ ఏం జరిగిందో తెలుసుకోండి - ఏపీలో షోస్ షురూ
Andhra Pradesh: సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
Amaravati: జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
Seethakka Surekha meets KCR: ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో మంత్రులు సురేఖ, సీతక్క సమావేశం - మేడారం జాతరకు ఆహ్వానం
ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో మంత్రులు సురేఖ, సీతక్క సమావేశం - మేడారం జాతరకు ఆహ్వానం
Jagan: రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు
రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు
Geetu Mohandas: ఎవరీ గీతూ మోహన్‌దాస్? 'టాక్సిక్' టీజర్‌తో హాట్ టాపిక్‌... డైరెక్టరే కాదు, నటిగా అవార్డు విన్నర్
ఎవరీ గీతూ మోహన్‌దాస్? 'టాక్సిక్' టీజర్‌తో హాట్ టాపిక్‌... ఫిమేల్ డైరెక్టరే కాదు, నటిగా అవార్డు విన్నర్!
Cheekatilo OTT Release Date: ఓటీటీలోకి అక్కినేని కోడలు శోభిత సినిమా... ప్రైమ్ వీడియోలో క్రైమ్ & సస్పెన్స్ డ్రామా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి అక్కినేని కోడలు శోభిత సినిమా... ప్రైమ్ వీడియోలో క్రైమ్ & సస్పెన్స్ డ్రామా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Embed widget