అన్వేషించండి

Mlc Kavitha : దిల్లీకి ఎమ్మెల్సీ కవిత, రేపు ఈడీ విచారణకు హాజరవుతారా?

Mlc Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో దిల్లీకి బయలుదేరారు.

Mlc Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దిల్లీకి పయనం అయ్యారు. బేగంపేట విమానాశ్రయం నుంచి స్పెషల్ ఫ్లైట్ లో దిల్లీ బయలుదేరి వెళ్లారు.  ఎమ్మెల్సీ కవితతో పాటు మంత్రి కేటీఆర్‌, ఎంపీ సంతోష్‌ కూడా ఉన్నారు. దిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు ఈడీ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఈనెల 20న విచారణకు హాజరుకావాలని కోరింది. అయితే ఈ కేసు విచారణపై ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో ఆమె విచారణకు హాజరవుతారా? లేక తన తరఫున న్యాయవాదిని పంపిస్తారా? అనేది ఉత్కంఠగా మారింది. ఈ నెల 16న ఈడీ విచారణకు ఎమ్మెల్సీ కవిత హాజరుకాలేదు.  

గత విచారణకు గైర్హాజరు 

దిల్లీ లిక్కర్ స్కామ్ లో  ఎమ్మెల్సీ కవితను ఈడీ ఈ నెల 11న విచారించింది. అయితే ఈ నెల 16న  మరోసారి విచారణకు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఆరోగ్య కారణాల దృష్ట్యా 16న విచారణకు కవిత గైర్హాజరయ్యారు. ఈ మేరకు ఆమె తన లాయర్ తో ఈడీకి లేఖ పంపారు. అయితే దీనిపై స్పందించి ఈడీ ఈ నెల 20న విచారణకు రావాలని కవితకు నోటీసులు జారీ చేసింది. ఈడీ విచారణను సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసి కవిత... 20 తేదీలోపే తన పిటిషన్‌పై విచారణ జరపాలని సుప్రీంకోర్టును అభ్యర్థించారు. అయితే కవిత పిటిషన్‌ను ముందుగా విచారణ చేయలేమని 24వ తేదీనే విచారిస్తామని  సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. విచారణ విషయంలో మహిళనైన తన పట్ల ఈడీ వ్యవహరిస్తున్న తీరును తప్పుబడుతూ కవిత లేఖ రాశారు. తనను వ్యక్తిగతంగా హాజరు కావాలని నోటీసుల్లో  ఎక్కడా పేర్కొనలేదన్నారు. దర్యాప్తు చట్టప్రకారం జరగడంలేదనే అనుమానం కలుగుతుందని కవిత విమర్శించారు. సుప్రీంకోర్టులో ఈ నెల 24న తన పిటిషన్ విచారణ చేసే వరకూ ఆగాలని ఈడీని కోరారు. అయితే అందుకు ఈడీ ఒప్పుకోలేదు. ఈ నెల 20న విచారణకు హాజరుకావాలని మరోసారి నోటీసులు ఇచ్చింది. ఈ తరుణంలో కవిత ఈ నెల 20న ఈడీ విచారణకు హాజరవుతారా? లేదా? సందిగ్ధం నెలకొంది.  

సుప్రీంకోర్టులో ఈడీ పిటిషన్ 

దిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితను ఈడీ ఇటీవల విచారించింది. అయితే ఈ విచారణపై కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆమె పిటిషన్ కు కౌంటర్ గా ఈడీ సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. ఎమ్మెల్సీ కవిత కేసులో ముందస్తు ఆదేశాలు ఇవ్వొద్దని అభ్యర్థించింది. తమ వాదన విన్న తర్వాతే ఏ నిర్ణయం తీసుకోవాలని కోర్టును కోరింది. తమ వాదనలు వినకుండా ఈ పిటిషన్ పై ఎలాంటి ఆదేశాలు ఇవ్వొద్దని సుప్రీంకోర్టును విజ్ఞప్తి చేసింది. అయితే కవిత పిటిషన్ పై ఈనెల 24న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈడీతో పాటు కవిత తరపు వాదనలు కోర్టు విననుంది. ఈడీ తనను విచారణకు పిలవడాన్ని కవిత సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ 24న విచారిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Weather: ఏపీలో మాడు పగిలేలా ఎండలు, ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు - విపత్తుల సంస్థ వార్నింగ్
ఏపీలో మాడు పగిలేలా ఎండలు, ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు - విపత్తుల సంస్థ వార్నింగ్
IPL 2024: బెంగళూరుదే తొలి బాటింగ్, ప్లే ఆఫ్ ఆశ నెరవేరేనా
బెంగళూరుదే తొలి బాటింగ్, ప్లే ఆఫ్ ఆశ నెరవేరేనా
Telangana Graduate MLC :  తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
Sajjala Ramakrishna: ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Paritala Sunitha Files Nomination | వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకాష్ రెడ్డిపై పరిటాల సునీత ఫైర్Singanamala YCP MLA Candidate Veeranjaneyulu | శింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులు ఇంటర్వ్యూCongress Leader Feroz Khan |ఒవైసీ ఓడిపోతే నేను రాజకీయాలు వదిలేస్తా: ABP Straight Talkలో ఫిరోజ్‌ఖాన్SRH vs RCB AT Uppal | Fans Reactions | ఉప్పల్ వద్ద ఫ్యాన్స్ రచ్చ.. కోహ్లీ ఫ్యాన్సే పాపం..! | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Weather: ఏపీలో మాడు పగిలేలా ఎండలు, ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు - విపత్తుల సంస్థ వార్నింగ్
ఏపీలో మాడు పగిలేలా ఎండలు, ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు - విపత్తుల సంస్థ వార్నింగ్
IPL 2024: బెంగళూరుదే తొలి బాటింగ్, ప్లే ఆఫ్ ఆశ నెరవేరేనా
బెంగళూరుదే తొలి బాటింగ్, ప్లే ఆఫ్ ఆశ నెరవేరేనా
Telangana Graduate MLC :  తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
Sajjala Ramakrishna: ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
Nominations Over :  తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం-  ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం- ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
DGP  Ravi Gupta : ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం  చేశారో తెలుసా ?
ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం చేశారో తెలుసా ?
మీ పిల్లలు హార్లిక్స్‌ని ఇష్టంగా తాగేస్తున్నారా? అది హెల్తీ డ్రింక్ కాదట - ఆ సంస్థే ఒప్పుకుంది
మీ పిల్లలు హార్లిక్స్‌ని ఇష్టంగా తాగేస్తున్నారా? అది హెల్తీ డ్రింక్ కాదట - ఆ సంస్థే ఒప్పుకుంది
Fact Check: ముస్లింలకు ఆస్తులు పంచి పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందా? బీజేపీ చేసిన ఆ ఆరోపణల్లో నిజమెంత?
Fact Check: ముస్లింలకు ఆస్తులు పంచి పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందా? బీజేపీ చేసిన ఆ ఆరోపణల్లో నిజమెంత?
Embed widget