అన్వేషించండి

Bandi Sanjay : అన్ని సబ్సిడీలు బంద్ చేసి రైతుల నోట్లో మట్టి కొట్టారు, బీఆర్ఎస్ రైతు ధర్నాలపై బండి సంజయ్ ఫైర్

Bandi Sanjay : వ్యవసాయ, అనుబంధ రంగాలను ఉపాధి హామీ పథకానికి అనుసంబంధానించడం సాధ్యం కాదనే సంగతి తెలియదా అని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బండి సంజయ్ ప్రశ్నించారు.

Bandi Sanjay : రైతులపై బీఆర్ఎస్ మొసలి కన్నీరు కార్చుతుందని బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ విమర్శించారు. కేంద్రాన్ని బదనాం చేయడమే లక్ష్యంగా బీఆర్ఎస్ ధర్నాలు చేస్తుందన్నారు. ఉపాధి హామీ చట్టంపై బీఆర్ఎస్ నేతలకు కనీస అవగాహన లేకపోవడం సిగ్గు చేటు అన్నారు. వ్యవసాయ, అనుబంధ రంగాలను ఉపాధి హామీ అనుసంధానించడం సాధ్యం కాదనే సంగతి తెలియదా? అని ప్రశ్నించారు. ఉపాధి హామీ నిధులను దారి మళ్లించిన బీఆర్ఎస్ దొంగలు... లెక్కలడిగితే సెంటిమెంట్ తో రెచ్చగొట్టాలనుకుంటున్నారని ధ్వజమెత్తారు. రుణమాఫీ, ఫ్రీ యూరియా సహా రైతులకు ఇచ్చిన హామీలెందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతల రైతు ధర్నాలపై బండి సంజయ్ మండిపడ్డారు. 

బీఆర్ఎస్ ధర్నాలు హాస్యాస్పదం 
 
వ్యవసాయ, అనుబంధ రంగాలను ఉపాధి హామీ పథకంతో అనుసంధానించాలని కోరుతూ బీఆర్ఎస్ నేతలు ధర్నాలు చేయడం హాస్యాస్పదంగా ఉందని బండి సంజయ్ అన్నారు. బీఆర్ఎస్ నాయకులకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు జాతీయ ఉపాధి  హామీ చట్టంపై ఏమాత్రం అవగాహన లేదని అర్థమవుతోందన్నారు. కనీసం ఆ చట్టంలో ఏముందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేయకపోవడం సిగ్గు చేటు అని విమర్శించారు. వ్యవసాయ అనుబంధ రంగాలు జాతీయ ఉపాధి చట్టం పరిధిలోకి రానేరావన్నారు. నీటిపారుదల కార్యకలాపాలు, నీరు, భూమి అభివృద్ధి పనులు, చిన్న నీటిపారుదల పనులు మాత్రమే చట్టంలోని షెడ్యూల్ 4(3)లో భాగంగా ఉన్నాయన్నారు.2005లో ఈ మేరకు చట్టం చేశారన్నారు. 17 ఏళ్ల తరువాత ఆ చట్టంలో లేని అంశాలపై ధర్నాలు చేస్తూ తెలంగాణ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తుండటం బీఆర్ఎస్ ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమని బండి సంజయ్ మండిపడ్డారు.

అవినీతి కప్పిపుచ్చుకునేందుకే ధర్నాలు 
 
"వాస్తవానికి జాతీయ ఉపాధి హామీ పథకం వేతనాల్లో భాగంగా విడుదలైన రూ.161 కోట్ల నిధులను కేసీఆర్ ప్రభుత్వం దారి మళ్లించింది. ఇందులో అవినీతి జరిగిందని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆ నిధులను వెంటనే వాపస్ చేయాలని కోరడంతో  అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి ధర్నాలు చేస్తూ తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టి లబ్ది పొందాలని ప్రయత్నిస్తున్నారు. రైతుల పట్ల మొసలి కన్నీరు కార్చుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదు? రుణ మాఫీని ఎందుకు అమలు చేయడం లేదు? రైతులందరికీ ఉచితంగా ఎరువులు అందిస్తానన్న హామీ ఏమైంది? కౌలు రైతులకు ‘‘రైతు బంధు’’ ఎందుకు అమలు చేయడం లేదు? ఏటా వేలాది మంది రైతులు అకాల వర్షాలతో పంట నష్టపోతుంటే వారికి ఇంతవరకు పరిహారం ఎందుకు ఇవ్వడం లేదు? కేంద్రం ప్రవేశపెట్టిన ‘ఫసల్ బీమా యోజన’ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయకుండా తెలంగాణ రైతాంగానికి నష్టం చేస్తోంది బీఆర్ఎస్ కాదా? రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదని గగ్గోలు పెడుతున్నా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేకంగా బోనస్ ఎందుకు ప్రకటించడం లేదు?" - బండి సంజయ్ 

కనీస మద్దతు ధర ఏటా పెంపు 

 రైతుల ఆత్మహత్యలను ఎందుకు ఆపలేకపోయారని బండి సంజయ్ మండిపడ్డారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం ఇవ్వకుండా రాష్ట్ర ప్రజల సొమ్మును పంజాబ్ రైతులకు పంచడం ఎంత వరకు న్యాయమని నిలదీశారు. చివరకు పంజాబ్ రైతులకు చెల్లని చెక్కులిచ్చి తెలంగాణ పరువు తీయడం ఎంతవరకు సమంజసం అన్నారు. రైతుల సంక్షేమానికి కేంద్రం అనేక చర్యలు చేపడుతున్నా బదనాం చేయడం ఎంతవరకు న్యాయమన్నారు. అంతర్జాతీయ మార్కెట్ ఎరువుల ధరలు అమాంతం పెరిగినప్పటికీ రైతులపై భారం పడకూడదనే ఉద్దేశంతో సబ్సిడీపై తక్కువ ధరకు ఎరువులు అందిస్తున్న ఘనత మోదీ ప్రభుత్వానిదన్నారు. కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేస్తోందని గుర్తుచేశారు. కనీస మద్దతు ధరను ఏటా పెంచుతూ రెట్టింపు చేసే దిశగా కేంద్రం చర్యలు తీసుకుంటోందన్నారు. రైతు బంధు మినహా అన్ని సబ్సిడీలు బంద్ చేసి రైతుల నోట్లో మట్టి కొట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి రైతుల గురించి మాట్లాడే అర్హత లేదని బండి సంజయ్ అన్నారు. కేంద్రాన్ని బదనాం చేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా జనం నమ్మే పరిస్థితిలో లేరనే వాస్తవాన్ని బీఆర్ఎస్ నేతలు గ్రహిస్తే మంచిదన్నారు. రాష్ట్రంలో ఎరువుల కొరత ఉండకూడదనే ఉద్దేశంతో రూ.6 వేల కోట్లతో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పునరుద్దరిస్తే... ప్రధానమంత్రి హాజరైన ఆ కార్యక్రమంలో పాల్గొనకుండా సీఎం కేసీఆర్ ముఖం చాటేశారన్నారు.  

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget