అన్వేషించండి

Telangana Assembly: 'నువ్వేమన్నా డిప్యూటీ లీడర్‌వా?' - హరీష్ రావుపై మంత్రి కోమటిరెడ్డి తీవ్ర ఆగ్రహం, అసెంబ్లీలో మాటల యుద్ధం

Telangana News: తెలంగాణ అసెంబ్లీలో గురువారం తీవ్ర గందరగోళం నెలకొంది. సరైన సమాచారం లేదంటూ విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేయగా.. దానికి మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు.

Heated Discussion In Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly) వాడీవేడీగా సాగుతున్నాయి. అధికార, విపక్ష సభ్యుల మధ్య గురువారం మాటల యుద్ధం కొనసాగింది. సభా కార్యకలాపాలపై సరిగ్గా సమాచారం ఇవ్వడం లేదని.. ఎలాంటి సమాచారం లేకుండానే ఆర్థిక పరిస్థితిపై చర్చ పెట్టారని విపక్షాలు తీవ్ర అసహనం వ్యక్తం చేశాయి. సభ నడిపే తీరు ఇది కాదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు (HarishRao) తెలపగా.. శాసనసభ నిబంధనల ప్రకారం సభ నిర్వహించాలని ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్.. స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. సభ్యులకు కనీసం సమాచారం లేకుండా ఎలా మాట్లాడుతారని.. బీజేపీ పక్షనేత మహేశ్వర్‌రెడ్డి స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఇరుపక్షాల మధ్య అసెంబ్లీలో తీవ్ర వాగ్వాదం జరిగి సభలో గందరగోళం నెలకొంది.

'స్పీకర్ సారీ చెబుతారా.?'

కాగా, విపక్షాల విమర్శలపై మంత్రి శ్రీధర్‌బాబు స్పందించారు. 'సభ నిర్వహణలో కొంత సమాచారం లోపం జరిగింది. దీనికే స్పీకర్ సారీ చెబుతారా.?. స్పీకర్ కార్యాలయం తీసుకునే నిర్ణయాలకు అన్ని పార్టీలు కట్టుబడి ఉండాల్సిందే. చిన్నపాటి సమాచార లోపానికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. హరీశ్‌రావు, అక్బరుద్దీన్.. ఇద్దరూ సీనియర్ సభ్యులు. వారు ఏదైనా చెప్పాలనుకుంటే రిక్వెస్ట్ చేయాలి. అంతేకానీ హుకుం జారీ చెయ్యొద్దు. తప్పు చేస్తే తప్పకుండా క్షమాపణ చెబుతాం. ఎంతో ముఖ్యమైన అంశంపై సభలో చర్చ కొనసాగుతుండగా.. చర్చను పక్కదారి పట్టించేందుకే ఇదంతా చేస్తున్నారు. సభ సజావుగా జరగాలని బీఆర్ఎస్ నేతలు భావించడం లేదు. ప్రభుత్వపరంగా ఏదైనా పొరపాటు జరిగితే శాసనసభ వ్యవహారాల మంత్రిగా నేను బాధ్యత తీసుకుంటాను. జవాబుదారీగా ఉంటా.. అంతేకానీ స్పీకర్ క్షమాపణ చెప్పాలంటే ఎలా సాధ్య అవుతుంది.?' శ్రీధర్ బాబు ప్రశ్నించారు.

'నువ్వేమన్నా డిప్యూటీ లీడర్‌వా.?'

అటు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. హరీష్ రావు మధ్య కూడా అసెంబ్లీలో వాడీవేడీ వాదన సాగింది. నల్గొండ జిల్లాలో నీటి సమస్యపై మంత్రి ప్రస్తావించారు. ఓ వైపు ఫ్లోరైడ్, మరోవైపు మూసీ మురుగునీటితో ప్రజలు దుర్భర పరిస్థితి ఎదుర్కొంటున్నారని అన్నారు. గతంలో కాంగ్రెస్ హయాంలో పూర్తి చేసిన 70 శాతం ప్రాజెక్టును బీఆర్ఎస్ ప్రభుత్వం పక్కన పెట్టిందని ఆరోపించారు. పదేళ్లలో రూ.7 లక్షల కోట్లు అప్పు చేసినా దీన్ని పూర్తి చేయలేదన్నారు. తమ ప్రభుత్వం గంధమల్ల రిజర్వాయర్ పనులు పూర్తి చేసిందని చెప్పారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 40 లక్షల మంది జీవితాలను కాపాడాలని జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు.

దీనిపై స్పందించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు.. 'సభలో ఓ మంత్రి లేచి మరో మంత్రిని ప్రశ్నించే పరిస్థితి ఉండకూడదు. ఇలా ప్రశ్నలు అడిగేందుకు అవకాశం ఇస్తే ప్రశ్నోత్తరాలకు అర్థమే మారిపోతుంది. లేని సంస్కృతిని తీసుకురావొద్దు.' అని పేర్కొన్నారు. దీనిపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఘాటుగా స్పందించారు. 'హరీష్ రావు బీఆర్ఎస్‌కు డిప్యూటీ లీడరా? ఎమ్మెల్యేనా?. ఏ హోదాతో మాట్లాడుతున్నారు.?. ఆయనకు ప్రశ్నించే హక్కు లేదు. ప్రతిపక్ష నేత ఏడాదిగా సభకు హాజరు కాకపోవడం, తెలంగాణ ప్రజలను అవమానపరచడమే.' అంటూ మండిపడ్డారు.

Also Read: KTR Letter: అదానీ మీకు శత్రువు, రేవంత్‌కు మిత్రుడా? ఇది డబుల్ స్టాండ్‌ కాదా? రాహుల్‌కు కేటీఆర్‌ లేఖ

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
OTT Releases This Week: ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
Tata tiago On EMI Finance Plan: మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
Embed widget