అన్వేషించండి

Kishan Reddy: గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు, జాతీయ పండుగగా మేడారం జాతర : బీజేపీ

Kishan Reddy: భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాగానే గిరిజన రిజర్వేషన్లు అమలుచేస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.

Kishan Reddy: భారతీయ జనతా పార్టీ (BJP) తెలంగాణలో అధికారంలోకి రాగానే గిరిజన రిజర్వేషన్లు అమలుచేస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (G Kishan Reddy) అన్నారు. బుధవారం ఆయన ములుగు జిల్లాలో పర్యటించారు. గిరిజన ఆరాధ్య దైవం గట్టమ్మ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ సమీపంలో కేంద్రీయ విశ్వవిద్యాలయానికి ఎంపిక చేసిన స్థలాన్ని మంత్రి పరిశీలించారు. తరువాత మేడారంలోని సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్నారు. అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. మోదీ నేతృత్వంలో భారత్ దేశం మరింత అభివృద్ధి పథంలో సాగాలని కిషన్ రెడ్డి ఆకాంక్షించారు. ప్రపంచంలో భారత్‌ను విశ్వ గురువుగా నిలబెట్టేలా  ప్రధాని మోదీకి అమ్మవార్లు శక్తిని ఇవ్వాలని ప్రార్థించినట్లు ఆయన చెప్పారు. 

గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో కేంద్ర గిరిజన మ్యూజియం ఏర్పాటు చేస్తామన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే గిరిజనులకు 10% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పారు. స్థానిక ఎన్నికలలో విద్యా ఉపాధి పథకాల్లో గిరిజనులకు 10 % రిజర్వేషన్ కల్పిస్తామని హమీ ఇచ్చారు. ములుగు జిల్లాలో టూరిజం అభివృద్ధి చేయడానికి నరేంద్ర మోదీ నాయకత్వంలో కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. లక్నవరం, బొగత జలపాతం, రామప్ప, మల్లూరు పర్యటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం. గిరిజన ప్రాంతాలలో 17  ఏకలవ్య పాఠశాలలో ఏర్పాటు చేసి గిరిజన సాంప్రదాయాలను  కాపాడుతున్నామని అన్నారు. గత తొమ్మిదేళ్లుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ గిరిజనలను ఏనాడు పట్టించుకోలేదన్నారు.

ట్రైబల్ సర్క్యులర్ ఏర్పాటు చేస్తాం
వెనుకబడిన గిరిజన ప్రాంతాలైన భూపాలపల్లి, ఆసిఫాబాద్, అదిలాబాద్ ప్రాంతాలను కలిపి ట్రైబల్ సర్క్యులర్ పేరుతో కోట్లాది రూపాయలు నిధులు మంజూరు చేశామని కిషన్ రెడ్డి తెలిపారు. గిరిజన యూనివర్సిటీకి 900 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఘనంగా నిర్వహించుకున్నట్లు చెప్పారు. కొండ, కోనల్లో ఉన్న వేలాది మంది గిరిజన బిడ్డలకు యూనివర్సిటీ ద్వారా సువర్ణ అవకాశం లభించనుందని చెప్పారు. గిరిజనుల మీద ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమే రాష్ట్రపతి ముర్ము నియామకం అన్నారు. ములుగు జిల్లాను టూరిజం హబ్‌గా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు చేపడుతున్నట్లు ఆయన చెప్పారు. 

జాతీయ పండుగగా మేడారం జాతర
అనంతరం బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. అమ్మవార్లకు మొక్కలు చెల్లించడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలవాలని ప్రార్థనలు చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో ధర్మం, న్యాయం నిలవాలని, ప్రజల ఆంకాంక్షలు నెరవేరాలని వేడుకున్నట్లు తెలిపారు. మేడారం జాతరకు ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తారని, మేడారం జాతరను జాతీయ పండుగగా నిర్వహించాలన్న డిమాండ్‌ చాలా కాలంగా ఉందన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్రానికి కోరతామన్నారు. ప్రజల అభిప్రాయాలను గౌరవించి ముందుకు తీసుకువెళ్లే పార్టీ బీజేపీ అన్నారు. ఓట్ల కోసం, సీట్ల కోసం నేతలు చాలా మాట్లాడుతుంటారని కానీ బీజేపీ ప్రజల ఆలోచనలు, సాంప్రదాయాలకు అణుగునంగా నడుచుకుంటుందని అన్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget