By: ABP Desam | Updated at : 25 Jan 2023 06:27 PM (IST)
బీజేపీకి రాజీనామా చేసిన ఒడిషా మాజీ సీఎం
Giridhar Gamang BRS : ఒడిశా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్ బీజేపీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు గిరిధర్ పంపారు. కాగా ఇటీవల హైదరాబాద్ వచ్చిన గిరిధర్ గమాంగ్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు , మాజీ సీఎం గిరిధర్ గమాంగ్ త్వరలోనే భారత రాష్ట్ర సమితిలో చేరనున్నారు. గిరిధర్ గమాంగ్ 2015లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరారు. ఇక ఇప్పుడు బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు గిరిధర్ గమాంగ్ ప్రకటించారు. ఆయన కుమారుడు శిశిర్ గమాంగ్ కూడా బీజేపీకి రాజీనామా చేశారు.ఇటీవలే ముఖ్యమంత్రి కేసీఆర్ను గిరిధర్ గమాంగ్ తన కుమారుడితో కేసీఆర్ను కలిశారు.
తొమ్మిది సార్లు పార్లమెంట్ సభ్యునిగా గెలిచిన గమాంగ్ - పది నెలల పాటు ఒడిషా సీఎంగా బాధ్యతలు
గిరిధర్ గమాంగ్ రాకాంగ్రెస్ పార్టీతో రాజకీయ ప్రస్థానం ప్రారంబించి సొంతరాష్ట్రం నుంచి 9 సార్లు పార్లమెంట్కు ఎన్నికయ్యారు. 1972 నుంచి 2004 దాకా వరుసగా కోరాపుట్, లక్ష్మీపూర్ స్థానాల నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. 1999 ఫిబ్రవరి 17 నుంచి డిసెంబర్ 6 వరకు సుమారు 10 నెలలపాటు ఒడిశా ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2015 వరకు కాంగ్రెస్ పార్టీలో కీలకనేతగా ఉన్నాయన ఆ తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరారు.
ఫిబ్రవరి ఐదో తేదీన నాందెడ్లో బీఆర్ఎస్ బహిరంగసభ
మరో వైపు మహారాష్ట్రలోని నాందేడ్లో ఫిబ్రవరి 5న బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్తో పాటు మంత్రులు, పార్టీ సీనియర్ నేతలు సభకు హాజరుకానున్నారు. సభ ఏర్పాట్ల కోసం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నేత బాలమల్లును ఇన్చార్జిలుగా నియమించారు. కేసీఆర్ మూడు రోజులుగా ఈ జిల్లాల ఎమ్మెల్యేలు, నేతలతో ప్రత్యేకంగా సమావేశమై సభను విజయవంతం చేసేందుకు, ఏర్పాట్లపైనా దిశానిర్దేశం చేశారు. మంగళవారం జోగు రామ న్న నేతృత్వంలో బాల్క సుమన్, జీవన్రెడ్డి తదితర నేతలు నాందేడ్ జిల్లాలో పర్యటించి సభను నిర్వహించే స్థలాన్ని అక్కడి నాయకులతో కలిసి పరిశీలించారు. బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన తర్వాత తొలి సారి మహారాష్ట్రలో బహిరంగసభ నిర్వహిస్తుండడంతో కేసీఆర్ మం త్రులతో పాటు నాందేడ్జిల్లా సరిహద్దులో ఉన్న నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పజెప్పారు.
ఈశాన్య రాష్ట్రాల్లో పోటీ చేయడానికి బీఆర్ఎస్ నిరాసక్తత !
సరిహద్దు ప్రాంతాల ప్రజలు కొంత కాలంగా తమను తెలంగాణలో విలీనం చేయాలన్న డిమాండ్ వినిపిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడ పార్టీని బలోపేతం చేసేందుకు కేసీఆర్ ప్రత్యేక ఆసక్తి కనబరుస్తున్నారు. త్వరలోనే శాసనసభ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో బీఆర్ఎస్ పోటీ చేసే ఆలోచనలో హైకమాండ్ లేదు. నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాలకు సంబంధించి మార్చిలో ఎన్నికలు జరిగేలా ఇప్పటికే నోటిఫికేషన్ జారీ కాగా.. ఇంత తక్కువ సమయంలో పార్టీ అభ్యర్థులను నిలబెట్టడం ఇబ్బందికరమని పార్టీ భావిస్తోంది. అందుకే పోటీకి దూరంగా ఉండాలని అనుకుంటున్నారు.
BRS Chief KCR: ఓటమి తరువాత తొలిసారి పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో కేసీఆర్ భేటీ
Trains Rush: సంక్రాంతికి రైళ్లన్నీ ఫుల్ - చాంతాడంత వెయిటింగ్ లిస్ట్, ప్రత్యేక రైళ్ల కోసం పెరుగుతున్న డిమాండ్
Janagama ZP Chairman Died: జనగామ జడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి మృతి, బీఆర్ఎస్ పార్టీలో విషాదం
Telangana Congress CM Candidate LIVE: తెలంగాణ సీఎంపై కొలిక్కిరాని చర్చలు, రేవంత్ ను ఒప్పుకోని సీనియర్లు! ఢిల్లీకి డీకే శివకుమార్
TSPSC Group 4 Results: టీఎస్పీఎస్సీ 'గ్రూప్-4' ఫలితాలు వచ్చేస్తున్నాయ్! ఎప్పటిలోపంటే?
Telangana CLP Meeting: ముగిసిన తెలంగాణ సీఎల్పీ భేటీ- ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక బాధ్యత అధిష్ఠానానికి అప్పగిస్తూ తీర్మానం
Hyundai Price Hike: 2024లో పెరగనున్న హ్యుందాయ్ కార్ల ధరలు - ఎందుకు పెరగనున్నాయి? ఎంత పెరగనున్నాయి?
BRS Party News: ఇక తెలంగాణ భవన్ కేంద్రంగా బీఆర్ఎస్ పాలిటిక్స్: ఎమ్మెల్యేలకు కేటీఆర్ సూచనలు
WhatsApp New Feature: వాట్సాప్ కొత్త ఫీచర్ త్వరలో - ఇక ఐఫోన్ టు ఐఫోన్ కూడా!
/body>