అన్వేషించండి

MLA Jagga Reddy: బీఆర్ఎస్ తొలి జాబితాలో జగ్గారెడ్డి పేరు! పార్టీ మారడంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే క్లారిటీ

Congress MLA Jagga Reddy: బీఆర్ఎస్ ప్రకటించబోయే తొలి జాబితాలో జగ్గారెడ్డి పేరు ఉంటుందని సైతం సోషల్ మీడియాతో పాటు కాంగ్రెస్ లోని ఓ వర్గం నుంచి ప్రచారం జరిగింది. దీనిపై ఆయన స్పందించారు.

Congress MLA Jagga Reddy: రాహుల్ గాంధీతోనే తన ప్రయాణం అని, తాను బీఆర్ఎస్ లోకి వెళ్తున్న అనే ప్రచారం అబద్ధం అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే  జగ్గారెడ్డి. బీఆర్ఎస్ ప్రకటించబోయే తొలి జాబితాలో జగ్గారెడ్డి పేరు ఉంటుందని సైతం సోషల్ మీడియాతో పాటు కాంగ్రెస్ లోని ఓ వర్గం నుంచి ప్రచారం జరిగింది. కొందరు ఉద్దేశపూర్వకంగా తనపై దుష్ప్రచారం చేస్తున్నారని.. మూర్ఖులు, దద్దమ్మలు ఈ ప్రచారం బంద్ చేయాలంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో ఏ సమావేశం జరిగినా నాకు ఫోన్లు వస్తాయి, సమావేశానికి రావాలని చెబుతారని, ఈరోజు పిసిసి సమావేశం.. అది డైరెక్షన్ మీటింగ్ అన్నారు. అన్ని సమావేశాలు, పార్టీ మీటింగ్ లకు హాజరవుతున్నట్లు తెలిపారు.

చాలా సంవత్సరాలు కస్టపడి లీడర్ అయ్యానని, 19 ఏళ్లకే మున్సిపల్ లీడర్ అయ్యానన్నారు. ఎన్నో ఇబ్బందులు పడుతూ రాజకీయ జీవితంలో కొనసాగుతున్న తన పేరు తగ్గించాలని వార్తలు వేస్తే డ్యామేజ్ జరగుతుందని చూస్తున్నారని చెప్పారు. జగ్గారెడ్డి బీఆర్ఎస్ లోకి రావద్దని సంగారెడ్డిలో నిరసన తెలుపుతున్న వారంతా తన దగ్గర నుండి పోయినవారే అన్నారు. వాళ్లను లీడర్లను చేసింది నేనే. శాసనసభలో ముఖ్యమంత్రి, మంత్రులను కలవద్దా... వినతి పత్రాలు ఇచ్చి ఫండ్స్ అడిగే సాంప్రదాయం లేదా అని ప్రశ్నించారు. 

కేసీఆర్ మీద తిరగబడ్డ మొదటి నాయకుడు జగ్గారెడ్డి మాత్రమే అన్నారు. 119 నియోజకవర్గల్లో 50 నియోజకవర్గల్లో గెలిచే బలమైన నేతలు ఉన్నారు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. సెకండ్ పొజిషన్ ఉన్న మరో 30 సీట్లపై మొదటి స్థానానికి రావడానికి గట్టి ప్రయత్నం చేయాలన్నారు. ఈ ఒక్కసారి కాంగ్రెస్ కి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరుతున్నాం. కాంగ్రెస్ లో గొడవలు కామన్.. దాని వల్ల ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. 

ఒకప్పుడు హరీష్ రావు బీ ఫారం కోసం అప్లికేషన్ లకు డబ్బులు తీసుకున్నారు.. ఇప్పుడు మేం చేస్తే తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. మేము సంతోషంగా డిడి కోసం డబ్బులు ఇస్తున్నాం.. పార్టీ కోసం ఉపయోగిస్తాం. ప్రాంతీయ పార్టీల్లో సింగిల్ పర్సన్ నడిపిస్తాడు.. కాంగ్రెస్ అలా కాదన్నారు. మళ్ళీ చెప్తున్నా.. జగ్గారెడ్డి రాజకీయ ప్రయాణం రాహుల్ గాంధీతోనే అన్నారు.

రాహుల్ గాంధీ జోడోయాత్ర సంగారెడ్డి మీద నుండి వెళ్తుంటే సంతోషపడ్డాను.. ఆర్థిక ఇబ్బందులున్నా బాగా చేశానన్నారు. రాహుల్ గాంధీ పాదయాత్ర తరువాత కలిసినప్పుడు నాతో రెండు మూడు సార్లు నా పేరు పెట్టి చాలా బాగా ఆర్గనైజ్ చేశావ్ అని రాహుల్ అన్నట్లు తెలిపారు. రాహుల్ గాంధీ అభినధించిన 10 రోజులకే సోషల్ మీడియాలో పార్టీ మారుతున్నారని, కోవర్ట్ అని తనపై ప్రచారం చేసినట్లు కీలక విషయాలు వెల్లడించారు. 2017 లో కోట్లు పెట్టి సంగారెడ్డిలో రాహుల్ సభ ఏర్పాటు చేశా. అందుకే కేసులు పెట్టి 2018లో జైళ్లో వేశారని.. అయినా ఎమ్మెల్యేగా గెలిచానన్నారు. 

ఎమ్మెల్సీ లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేయద్దని రేవంత్ రెడ్డి తీర్మానం చేస్తా... నాకు పర్మిషన్ ఇవ్వండని నా భార్యను నిలబెట్టమన్నాను. కేసీఆర్ సొంత జిల్లాలో ఏకగ్రీవం కావద్దని బరిలో నిలిచాం. కాంగ్రెస్ కి 230 మాత్రమే ఓట్లు ఉన్నాయి.. గెలవలేమని తెలుసు అయినా పోటీ చేశామన్నారు. కాంగ్రెస్ 230 ఓట్లు వేపించి 9 అదనపు ఓట్లు తెచ్చాను... కానీ తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. కాంగ్రెస్ పార్టీ లో జగ్గారెడ్డి ఉండద్దా...? ఇది ఎవరిదైనా వ్యూహమా.. నేను కన్నేర్ర చేస్తే.. ఎక్కడ పోతారు.. మీరు ఉంటారా అని ప్రశ్నించారు. 

ఆధారాలు లేకుండా సోషల్ మీడియాలో మాట్లాడితే నడి రోడ్డు మీద బట్టలు ఇప్పి నిలబెడతా అంటూ వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణలో ఇప్పుడున్న లీడర్ల లో సోషల్ మీడియా ఎక్స్ పర్ట్ ఎవరు. ఇదంతా టీడీపీ కల్చర్, వాళ్ల నుంచే ఈ కల్చర్ వచ్చిందన్నారు. మా పార్టీలోకి ఏ పార్టీ నుండి వచ్చినా కాంగ్రెస్ వాళ్ళే.. సోషల్ మీడియాను ఎక్కువగా వాడేది టీడీపీయే అన్నారు. ఢిల్లీ వెళ్ళినప్పుడు రాహుల్ గాంధీని రెండవ సారి కలిశాను. ఆయన 20 నిముషాలు సమయం ఇచ్చారని, చెప్పాల్సింది చెప్పానన్నారు. త్వరలో రాహుల్ గాంధీతో సంగారెడ్డిలో కార్యక్రమం నిర్వహిస్తానని తెలిపారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

HCU Land Dispute: కంచి గచ్చిబౌలి భూముల్లో పనులు నిలిపివేయాలి - తెలంగాణ హైకోర్టు ఆదేశం
కంచి గచ్చిబౌలి భూముల్లో పనులు నిలిపివేయాలి - తెలంగాణ హైకోర్టు ఆదేశం
Tirumala News: టీటీడీలో వైట్ ఎలిఫెంట్స్‌ను తొలగించండి : చంద్రబాబు
టీటీడీలో వైట్ ఎలిఫెంట్స్‌ను తొలగించండి : చంద్రబాబు
pastor praveen kumar Case: విధ్వేషాలు వద్దు, దర్యాప్తుపై నమ్మకం ఉంచుదాం: ప్రవీణ్ భార్య అభ్యర్థన 
విధ్వేషాలు వద్దు, దర్యాప్తుపై నమ్మకం ఉంచుదాం: ప్రవీణ్ భార్య అభ్యర్థన 
Waqf Bill: ముస్లింల ఆస్తులను లాక్కోవడానికి ఉపయోగించే ఆయుధమే వక్ఫ్ సవరణ బిల్- కాంగ్రెస్ సహా ఇతర పక్షాల ఆగ్రహం
ముస్లింల ఆస్తులను లాక్కోవడానికి ఉపయోగించే ఆయుధమే వక్ఫ్ సవరణ బిల్- కాంగ్రెస్ సహా ఇతర పక్షాల ఆగ్రహం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Sunita Williams Best Home Coming | నాసాలో చికిత్స తర్వాత ఇంటికి వచ్చిన సునీతా విలియమ్స్ | ABP DesamDigvesh Rathi Notebook Celebrations Priyansh Arya | ప్రియాంశ్ ఆర్య కొహ్లీలా రివేంజ్ తీర్చుకుంటాడా | ABP DesamRCB vs GT Match preview IPL 2025 | నేడు గుజరాత్ టైటాన్స్ తో ఆర్సీబీ మ్యాచ్ | ABP DesamShreyas Iyer Mass Comeback | IPL 2025 లోనూ తన జోరు చూపిస్తున్న శ్రేయస్ అయ్యర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
HCU Land Dispute: కంచి గచ్చిబౌలి భూముల్లో పనులు నిలిపివేయాలి - తెలంగాణ హైకోర్టు ఆదేశం
కంచి గచ్చిబౌలి భూముల్లో పనులు నిలిపివేయాలి - తెలంగాణ హైకోర్టు ఆదేశం
Tirumala News: టీటీడీలో వైట్ ఎలిఫెంట్స్‌ను తొలగించండి : చంద్రబాబు
టీటీడీలో వైట్ ఎలిఫెంట్స్‌ను తొలగించండి : చంద్రబాబు
pastor praveen kumar Case: విధ్వేషాలు వద్దు, దర్యాప్తుపై నమ్మకం ఉంచుదాం: ప్రవీణ్ భార్య అభ్యర్థన 
విధ్వేషాలు వద్దు, దర్యాప్తుపై నమ్మకం ఉంచుదాం: ప్రవీణ్ భార్య అభ్యర్థన 
Waqf Bill: ముస్లింల ఆస్తులను లాక్కోవడానికి ఉపయోగించే ఆయుధమే వక్ఫ్ సవరణ బిల్- కాంగ్రెస్ సహా ఇతర పక్షాల ఆగ్రహం
ముస్లింల ఆస్తులను లాక్కోవడానికి ఉపయోగించే ఆయుధమే వక్ఫ్ సవరణ బిల్- కాంగ్రెస్ సహా ఇతర పక్షాల ఆగ్రహం
Telangana High Court: కోర్టుకు వస్తారా? జైలుకు పంపమంటారా? రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌పై హైకోర్టు ఆగ్రహం..!
కోర్టుకు వస్తారా? జైలుకు పంపమంటారా? రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌పై హైకోర్టు ఆగ్రహం..!
IPL 2025 GT VS RCB Result Update: బ‌ట్ల‌ర్ అన్ బీటెన్ ఫిఫ్టీ.. రాణించిన సాయి సుద‌ర్శ‌న్, సిరాజ్.. జీటీకి రెండో విజ‌యం.. 8 వికెట్ల‌తో ఆర్సీబీకి ప‌రాభ‌వం..
బ‌ట్ల‌ర్ అన్ బీటెన్ ఫిఫ్టీ.. రాణించిన సాయి సుద‌ర్శ‌న్, సిరాజ్.. జీటీకి రెండో విజ‌యం.. 8 వికెట్ల‌తో ఆర్సీబీకి ప‌రాభ‌వం..
MLC Nagababu News: చంద్రబాబుతో నాగబాబు భేటీ, నెక్స్ట్ మంత్రి పదవే
చంద్రబాబుతో నాగబాబు భేటీ, నెక్స్ట్ మంత్రి పదవే
BC Protest at Jantar Mantar: జనగణనతో పాటు కేంద్రం కులగణన చేయాలి, ఢిల్లీలో బీసీ పోరు గర్జనలో రేవంత్ రెడ్డి డిమాండ్
జనగణనతో పాటు కేంద్రం కులగణన చేయాలి, ఢిల్లీలో బీసీ పోరు గర్జనలో రేవంత్ రెడ్డి డిమాండ్
Embed widget