అన్వేషించండి

CM Revanth Reddy: నిరుద్యోగులకు సీఎం రేవంత్‌ రెడ్డి గుడ్ న్యూస్ - 35 వేల ఉద్యోగాల భర్తీపై కీలక ప్రకటన

Telangana News: తెలంగాణలో నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలో 35 వేల ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. సివిల్స్ మెయిన్స్ రాసే అభ్యర్థులకు రూ.లక్ష ఆర్థిక సాయం అందించారు.

CM Revanth Reddy Key Announcement On Job Notifications: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే 35 వేల ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నట్లు ప్రకటించారు. యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్షలో ఉత్తీర్ణులై.. మెయిన్స్ కోసం సిద్ధమవుతోన్న తెలంగాణ అభ్యర్థులకు 'రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం' పథకం (Rajiv Gandhi Abhaya Hastham) కింద రూ.లక్ష చొప్పున చెక్కులను పంపిణీ చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణత సాధించిన 135 మంది లబ్ధిదారులకు వీటిని అందజేశారు. ఈ సందర్భంగా సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఏర్పాటైన 90 రోజుల్లోనే 30 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించామని అన్నారు. సివిల్స్ ఉత్తీర్ణులై రాష్ట్ర ప్రతిష్టను పెంచాలని.. రాష్ట్రం నుంచి అత్యధికంగా సివిల్ సర్వెంట్లు రావాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. మెయిన్స్‌లో పాసై ఇంటర్వ్యూకి ఎంపికైన వారికి సైతం రూ.లక్ష ఆర్థిక సాయం చేస్తామని తెలిపారు. 

'20 వేల మందికి శిక్షణ'

చదువుకు తగిన నైపుణ్యాలు లేకపోవడంతో చాలా మంది ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారని సీఎం రేవంత్ అన్నారు. యంగ్ ఇండియా వర్శిటీ ద్వారా ప్రస్తుత విద్యా సంవత్సరంలో యంగ్ ఇండియా వర్శిటీ ద్వారా 2 వేల మందికి శిక్షణ ఇస్తున్నామని.. వచ్చే ఏడాది నుంచి 20 వేల మందికి శిక్షణ ఇస్తామని చెప్పారు. అలాగే, యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్శిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. 2028 ఒలింపిక్స్‌లో తెలంగాణ అథ్లెట్లకు అత్యధికంగా పతకాలు వచ్చేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. 'రాష్ట్రవ్యాప్తంగా 100 నియోజకవర్గాల్లో 25 నుంచి 30 ఎకరాల్లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తాం. గత ప్రభుత్వం వర్శిటీలను నిర్వీర్యం చేసింది. 10, 15 రోజుల్లో అన్ని వర్శిటీలకు నూతన వైస్ ఛాన్సలర్లను నియమిస్తాం. వర్శిటీల్లోని అన్ని ఖాళీలను భర్తీ చేస్తాం. కొందరు ఉద్దేశపూర్వకంగానే నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారు. నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నిరసనలు, ధర్నాలు సమస్యలకు పరిష్కారం కాదు. విద్య, ఉద్యోగ కల్పన, రైతు సంక్షేమం మా ప్రభుత్వ ప్రాధాన్యత. నిరుద్యోగుల చూపు లక్ష్యం వైపు ఉండాలి.' అని సీఎం పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సింగరేణి సీఎండీ బలరాం పాల్గొన్నారు. కాగా, రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకానికి సింగరేణి కాలరీస్ నిధులు సమకూరుస్తోంది.

జిల్లాల వారీగా..

సీఎం రేవంత్ రెడ్డి మొత్తం 135 మంది లబ్ధిదారులకు చెక్కులు అందించగా.. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 14 మంది అభ్యర్థులకు, వరంగల్ అర్బన్ నుంచి 12, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నుంచి 11, నల్గొండ జిల్లా నుంచి 10, ఖమ్మంలో 9, కరీంనగర్ నుంచి 8 మంది సివిల్స్ ప్రిలిమ్స్ క్వాలిఫై కాగా వారికి ఆర్థిక సాయం అందించారు. అలాగే, కుమురం భీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, మెదక్, నారాయణపేట, వికారాబాద్, వనపర్తి జిల్లాల నుంచి ఒక్కొక్కరు సివిల్స్ మెయిన్స్‌కు అర్హత సాధించారు. 

Also Read: Harish Rao: అప్పట్లో మీరే ఫ్రీ అన్నారు, ఇప్పుడు ఫీజు కట్టమంటారా? ఇది దోచుకునే కుట్ర - హరీశ్ రావు లేఖ

మరిన్ని చూడండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pahalgam Terror Attack: ఉగ్రదాడిలో విశాఖపట్నం వాసి మృతి, హైదరాబాద్ ఐబీ అధికారిని భార్య, పిల్లల ఎదుటే కాల్చి చంపిన ఉగ్రవాదులు
ఉగ్రదాడిలో విశాఖపట్నం వాసి మృతి, హైదరాబాద్ ఐబీ అధికారిని భార్య, పిల్లల ఎదుటే కాల్చి చంపిన ఉగ్రవాదులు
AP Liquor Scam: రాజ్ కసిరెడ్డికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారని తొలుత న్యాయమూర్తి ప్రశ్న
రాజ్ కసిరెడ్డికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారని తొలుత న్యాయమూర్తి ప్రశ్న
Pahalgam Terror Attack: కశ్మీర్ వెళ్లిన వైజాగ్‌ టూరిస్టులు మిస్సింగ్- ఉగ్రదాడితో బంధువుల్లో ఆందోళన 
కశ్మీర్ వెళ్లిన వైజాగ్‌ టూరిస్టులు మిస్సింగ్- ఉగ్రదాడితో బంధువుల్లో ఆందోళన 
Duvvada Srinivas: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు భారీ షాక్‌- పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వైసీపీ 
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు భారీ షాక్‌- పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వైసీపీ 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

LSG vs DC Match Highlights IPL 2025 | లక్నో సూపర్ జెయింట్స్ పై 8వికెట్ల తేడాతో ఢిల్లీ ఘన విజయం | ABP DesamGujarat Titans Winning Strategy IPL 2025 | టాప్ లో ఉంటే చాలు..ఇంకేం అవసరం లేదంటున్న గుజరాత్ టైటాన్స్Trolling on Ajinkya Rahane vs GT IPL 2025 | బ్యాటర్ గా సక్సెస్..కెప్టెన్ గా ఫెయిల్..?GT vs KKR IPL 2025 Match Review | డిఫెండింగ్ ఛాంపియన్ దమ్ము చూపించలేకపోతున్న KKR

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pahalgam Terror Attack: ఉగ్రదాడిలో విశాఖపట్నం వాసి మృతి, హైదరాబాద్ ఐబీ అధికారిని భార్య, పిల్లల ఎదుటే కాల్చి చంపిన ఉగ్రవాదులు
ఉగ్రదాడిలో విశాఖపట్నం వాసి మృతి, హైదరాబాద్ ఐబీ అధికారిని భార్య, పిల్లల ఎదుటే కాల్చి చంపిన ఉగ్రవాదులు
AP Liquor Scam: రాజ్ కసిరెడ్డికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారని తొలుత న్యాయమూర్తి ప్రశ్న
రాజ్ కసిరెడ్డికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారని తొలుత న్యాయమూర్తి ప్రశ్న
Pahalgam Terror Attack: కశ్మీర్ వెళ్లిన వైజాగ్‌ టూరిస్టులు మిస్సింగ్- ఉగ్రదాడితో బంధువుల్లో ఆందోళన 
కశ్మీర్ వెళ్లిన వైజాగ్‌ టూరిస్టులు మిస్సింగ్- ఉగ్రదాడితో బంధువుల్లో ఆందోళన 
Duvvada Srinivas: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు భారీ షాక్‌- పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వైసీపీ 
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు భారీ షాక్‌- పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వైసీపీ 
Telugu TV Movies Today: చిరంజీవి ‘రౌడీ అల్లుడు’, బాలయ్య ‘రూలర్’ To పవన్ కళ్యాణ్ ‘బంగారం’, సూర్య ‘24’ వరకు - ఈ బుధవారం (ఏప్రిల్ 23) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
చిరంజీవి ‘రౌడీ అల్లుడు’, బాలయ్య ‘రూలర్’ To పవన్ కళ్యాణ్ ‘బంగారం’, సూర్య ‘24’ వరకు - ఈ బుధవారం (ఏప్రిల్ 23) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
Anantapur Politics: పెనుగొండ వైఎస్ఆర్‌సీపీలో గందరగోళం - ఉషాశ్రీచరణ్‌కు చెక్ పెడతారా?
పెనుగొండ వైఎస్ఆర్‌సీపీలో గందరగోళం - ఉషాశ్రీచరణ్‌కు చెక్ పెడతారా?
BJP Vishnu Meet AP CM: సమన్వయంతో మోదీ పర్యటన విజయవంతానికి సన్నాహాలు -ఢిల్లీలో సీఎంను కలిసిన బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణు
సమన్వయంతో మోదీ పర్యటన విజయవంతానికి సన్నాహాలు -ఢిల్లీలో సీఎంను కలిసిన బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణు
UPSC CSE Final Result 2024: సివిల్స్ ఫలితాల్లో పిఠాపురం కుర్రాడికి 94వ ర్యాంకు- తొలి ప్రయత్నంలోనే అద్భుతం
సివిల్స్ ఫలితాల్లో పిఠాపురం కుర్రాడికి 94వ ర్యాంకు- తొలి ప్రయత్నంలోనే అద్భుతం
Embed widget