అన్వేషించండి

CM KCR: 'మాది చేతల, చేనేతల ప్రభుత్వం' - తెలంగాణలో ఊహించని అభివృద్ధి జరిగిందన్న సీఎం కేసీఆర్

ఒకప్పుడు సిరిసిల్ల ప్రాంతాన్ని చూస్తే కన్నీళ్లు వచ్చేవని, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక తొమ్మిదన్నరేళ్లలో ఊహించని అభివృద్ధి జరిగిందని సీఎం కేసీఆర్ తెలిపారు. తమది చేతల ప్రభుత్వమని అన్నారు.

ఒకప్పుడు సిరిసిల్ల ప్రాంతాన్ని చూస్తే కన్నీళ్లు వచ్చేవని, సమైక్య రాష్ట్రంలో ఎన్నో బాధలు పడ్డామని, ఇప్పుడు ఎలాంటి సమస్యలు లేవని సీఎం కేసీఆర్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రజా ఆశీర్వాద సభకు హాజరైన ఆయన ప్రసంగించారు. తొమ్మిదినరేళ్లలో తెలంగాణను ఎన్నో అంశాల్లో నెంబర్ వన్ గా నిలిపామని, 'మాది చేతల, చేనేతల ప్రభుత్వం' అని పేర్కొన్నారు. సిరిసిల్ల మంచి విద్యా కేంద్రంగా అభివృద్ధి చెందుతుందన్న కేసీఆర్, 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ఏమీ చేయలేదని విమర్శించారు.

100 సార్లు తిరిగాను

తన 70 ఏళ్ల జీవితంలో సిరిసిల్లలో కనీసం వంద సార్లు తిరిగినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని చూస్తే బాధగా ఉండేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. అప్పర్ మానేరులో ఏడాదంతా నీరు ఉంటోందని చెప్పారు. సమైక్య పాలనలో మొత్తం నాశనమైందని ఈ ప్రాంతమంతా దుమ్ము లేచే పరిస్థితి ఉండేదని విమర్శించారు. కరీంనగర్ ఎంపీగా పోటీ చేస్తే ఆదరించి గెలిపించారని, కానీ అప్పట్లో ఏడుగురు చేనేత కార్మికుల ఆత్మహత్య చేసుకోవడంతో ఎంతో చలించిపోయానని చెప్పారు. పార్టీ నిధులు, చందాలు సేకరించి వారికి సాయం చేసినట్లు గుర్తు చేశారు. కేటీఆర్ చేనేత శాఖ మంత్రి అయిన తర్వాత సిరిసిల్ల రూపురేఖలు మారిపోయాయని కేసీఆర్ ప్రశంసించారు. 

బతుకమ్మ చీరలపైనా రాజకీయం

సిరిసిల్లను షోలాపూర్ లా చేయాలనేదే మా ప్రయత్నమని సీఎం కేసీఆర్ ఆశీర్వాద సభలో వెల్లడించారు. చేనేత కార్మికులకు ఉపాధి కల్పించాలనే బతుకమ్మ చీరల పంపిణీ పథకం అమలు చేస్తున్నామని చెప్పారు. చివరకు ఆ పథకాన్ని కూడా రాజకీయం చేశారని అన్నారు. నచ్చకపోతే చీరలు తీసుకోవద్దని, చీరల పంపిణీని కూడా రాజకీయం చెయ్యొద్దని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. రేషన్ కార్డు ఉన్న పేదలందరికీ నాణ్యమైన సన్నబియ్యం ఇవ్వాలని నిర్ణయించామని చెప్పారు.

'ధరణి'పై మీరే తేల్చుకోండి

కాంగ్రెస్ నేతలు 'ధరణి'పై విమర్శలు చేస్తున్నారని, అది రద్దైతే వీఆర్వోలు మళ్లీ పెత్తనం చేస్తారని, రైతులు అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని సీఎం కేసీఆర్ వివరించారు. ధరణి వల్లే పల్లెలు ప్రశాంతంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ క్రమంలో ధరణి ఉంచాలో.? వద్దో.? రైతులే తేల్చుకోవాలని సూచించారు. విపక్షాలతో పెను ప్రమాదం పొంచి ఉందని, రైతులంతా అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. రైతు బంధు వంటి పథకాలు లేకుండా చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. 

వారు కరెంట్ ఇవ్వలేదు

తొమ్మిదిన్నరేళ్లలో తెలంగాణను అన్ని రంగాల్లో ఫస్ట్ ప్లేస్ లో నిలిపామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ వద్దని కాంగ్రెస్ నేతలు చెప్పారని గుర్తు చేశారు. 3 గంటల కరెంట్ కావాలో.? 24 గంటల కరెంట్ కావాలో.? తేల్చుకోవాలన్నారు. 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ సరిపడా కరెంట్ ఇవ్వలేదని అన్నారు. 

కాగా, కేసీఆర్ సీఎం అయిన తర్వాత సిరిసిల్ల నేతన్నల జీవితాలు మారాయని మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. అన్ని రంగాల్లోనూ తెలంగాణ అభివృద్ధి సాధించిందని వివరించారు. ప్రజా ఆశీర్వాద సభతో సిరిసిల్ల గులాబీ మయంగా మారింది.

 

 

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Crime News: ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
Adilabad Airport Credit War: ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Iran War: దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
Hyderabad Crime News: ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
Taslima Nasrin Back To Kolkata: రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
Jasprit Bumrah Out.!: లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
YSRCP MLA Virupakshi: కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Embed widget