అన్వేషించండి

CM KCR: 'మాది చేతల, చేనేతల ప్రభుత్వం' - తెలంగాణలో ఊహించని అభివృద్ధి జరిగిందన్న సీఎం కేసీఆర్

ఒకప్పుడు సిరిసిల్ల ప్రాంతాన్ని చూస్తే కన్నీళ్లు వచ్చేవని, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక తొమ్మిదన్నరేళ్లలో ఊహించని అభివృద్ధి జరిగిందని సీఎం కేసీఆర్ తెలిపారు. తమది చేతల ప్రభుత్వమని అన్నారు.

ఒకప్పుడు సిరిసిల్ల ప్రాంతాన్ని చూస్తే కన్నీళ్లు వచ్చేవని, సమైక్య రాష్ట్రంలో ఎన్నో బాధలు పడ్డామని, ఇప్పుడు ఎలాంటి సమస్యలు లేవని సీఎం కేసీఆర్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రజా ఆశీర్వాద సభకు హాజరైన ఆయన ప్రసంగించారు. తొమ్మిదినరేళ్లలో తెలంగాణను ఎన్నో అంశాల్లో నెంబర్ వన్ గా నిలిపామని, 'మాది చేతల, చేనేతల ప్రభుత్వం' అని పేర్కొన్నారు. సిరిసిల్ల మంచి విద్యా కేంద్రంగా అభివృద్ధి చెందుతుందన్న కేసీఆర్, 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ఏమీ చేయలేదని విమర్శించారు.

100 సార్లు తిరిగాను

తన 70 ఏళ్ల జీవితంలో సిరిసిల్లలో కనీసం వంద సార్లు తిరిగినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని చూస్తే బాధగా ఉండేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. అప్పర్ మానేరులో ఏడాదంతా నీరు ఉంటోందని చెప్పారు. సమైక్య పాలనలో మొత్తం నాశనమైందని ఈ ప్రాంతమంతా దుమ్ము లేచే పరిస్థితి ఉండేదని విమర్శించారు. కరీంనగర్ ఎంపీగా పోటీ చేస్తే ఆదరించి గెలిపించారని, కానీ అప్పట్లో ఏడుగురు చేనేత కార్మికుల ఆత్మహత్య చేసుకోవడంతో ఎంతో చలించిపోయానని చెప్పారు. పార్టీ నిధులు, చందాలు సేకరించి వారికి సాయం చేసినట్లు గుర్తు చేశారు. కేటీఆర్ చేనేత శాఖ మంత్రి అయిన తర్వాత సిరిసిల్ల రూపురేఖలు మారిపోయాయని కేసీఆర్ ప్రశంసించారు. 

బతుకమ్మ చీరలపైనా రాజకీయం

సిరిసిల్లను షోలాపూర్ లా చేయాలనేదే మా ప్రయత్నమని సీఎం కేసీఆర్ ఆశీర్వాద సభలో వెల్లడించారు. చేనేత కార్మికులకు ఉపాధి కల్పించాలనే బతుకమ్మ చీరల పంపిణీ పథకం అమలు చేస్తున్నామని చెప్పారు. చివరకు ఆ పథకాన్ని కూడా రాజకీయం చేశారని అన్నారు. నచ్చకపోతే చీరలు తీసుకోవద్దని, చీరల పంపిణీని కూడా రాజకీయం చెయ్యొద్దని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. రేషన్ కార్డు ఉన్న పేదలందరికీ నాణ్యమైన సన్నబియ్యం ఇవ్వాలని నిర్ణయించామని చెప్పారు.

'ధరణి'పై మీరే తేల్చుకోండి

కాంగ్రెస్ నేతలు 'ధరణి'పై విమర్శలు చేస్తున్నారని, అది రద్దైతే వీఆర్వోలు మళ్లీ పెత్తనం చేస్తారని, రైతులు అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని సీఎం కేసీఆర్ వివరించారు. ధరణి వల్లే పల్లెలు ప్రశాంతంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ క్రమంలో ధరణి ఉంచాలో.? వద్దో.? రైతులే తేల్చుకోవాలని సూచించారు. విపక్షాలతో పెను ప్రమాదం పొంచి ఉందని, రైతులంతా అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. రైతు బంధు వంటి పథకాలు లేకుండా చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. 

వారు కరెంట్ ఇవ్వలేదు

తొమ్మిదిన్నరేళ్లలో తెలంగాణను అన్ని రంగాల్లో ఫస్ట్ ప్లేస్ లో నిలిపామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ వద్దని కాంగ్రెస్ నేతలు చెప్పారని గుర్తు చేశారు. 3 గంటల కరెంట్ కావాలో.? 24 గంటల కరెంట్ కావాలో.? తేల్చుకోవాలన్నారు. 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ సరిపడా కరెంట్ ఇవ్వలేదని అన్నారు. 

కాగా, కేసీఆర్ సీఎం అయిన తర్వాత సిరిసిల్ల నేతన్నల జీవితాలు మారాయని మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. అన్ని రంగాల్లోనూ తెలంగాణ అభివృద్ధి సాధించిందని వివరించారు. ప్రజా ఆశీర్వాద సభతో సిరిసిల్ల గులాబీ మయంగా మారింది.

 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rythu Bharosa: అర్ధరాత్రి దాటగానే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ - పేదలకు త్వరలోనే సన్నబియ్యం ఇస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి
అర్ధరాత్రి దాటగానే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ - పేదలకు త్వరలోనే సన్నబియ్యం ఇస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి
At Home Event: తెలుగు రాష్ట్రాల్లో ఆహ్లాదకరంగా 'ఎట్ హోం' - హాజరైన సీఎంలు, అధికారులు
తెలుగు రాష్ట్రాల్లో ఆహ్లాదకరంగా 'ఎట్ హోం' - హాజరైన సీఎంలు, అధికారులు
Hyderabad News: హుస్సేన్ సాగర్‌లో భారీ అగ్నిప్రమాదం - రెండు బోట్లు దగ్ధం, ప్రయాణికులు సేఫ్
హుస్సేన్ సాగర్‌లో భారీ అగ్నిప్రమాదం - రెండు బోట్లు దగ్ధం, ప్రయాణికులు సేఫ్
Dharmavaram: ధర్మవరంలో తీవ్ర ఉద్రిక్తత - టీడీపీ, వైసీపీ నేతల మధ్య వివాదం, వాహనాలు ధ్వంసం
ధర్మవరంలో తీవ్ర ఉద్రిక్తత - టీడీపీ, వైసీపీ నేతల మధ్య వివాదం, వాహనాలు ధ్వంసం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nandamuri Balakrishna on Padmabhushan | పద్మభూషణ్ పురస్కారంపై నందమూరి బాలకృష్ణ ఇంటర్వ్యూ | ABP DesamBobbili Battle Completes 268 Years | బొబ్బిలి యుద్ధం ఆనవాళ్లు నేటికీ పదిలం | ABP DesamGuntakal Railway Track Incident | రైల్వే ట్రాక్ చిక్కుపడిపోయిన ఆర్టీసీ బస్సు | ABP DesamJr NTR Kalyan Ram Tweet NBK Padma Bhushan | బాలకృష్ణకు పద్మభూషణ్ రావటంతో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సంతోషం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rythu Bharosa: అర్ధరాత్రి దాటగానే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ - పేదలకు త్వరలోనే సన్నబియ్యం ఇస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి
అర్ధరాత్రి దాటగానే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ - పేదలకు త్వరలోనే సన్నబియ్యం ఇస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి
At Home Event: తెలుగు రాష్ట్రాల్లో ఆహ్లాదకరంగా 'ఎట్ హోం' - హాజరైన సీఎంలు, అధికారులు
తెలుగు రాష్ట్రాల్లో ఆహ్లాదకరంగా 'ఎట్ హోం' - హాజరైన సీఎంలు, అధికారులు
Hyderabad News: హుస్సేన్ సాగర్‌లో భారీ అగ్నిప్రమాదం - రెండు బోట్లు దగ్ధం, ప్రయాణికులు సేఫ్
హుస్సేన్ సాగర్‌లో భారీ అగ్నిప్రమాదం - రెండు బోట్లు దగ్ధం, ప్రయాణికులు సేఫ్
Dharmavaram: ధర్మవరంలో తీవ్ర ఉద్రిక్తత - టీడీపీ, వైసీపీ నేతల మధ్య వివాదం, వాహనాలు ధ్వంసం
ధర్మవరంలో తీవ్ర ఉద్రిక్తత - టీడీపీ, వైసీపీ నేతల మధ్య వివాదం, వాహనాలు ధ్వంసం
Mahakumbh 2025 : మహా కుంభమేళా స్పెషల్ మౌని అమావాస్య - 10 కోట్ల మంది వస్తారని అంచనా, ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటే?
మహా కుంభమేళా స్పెషల్ మౌని అమావాస్య - 10 కోట్ల మంది వస్తారని అంచనా, ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటే?
Kandula Durgesh: ఇష్టం వచ్చినట్టు టికెట్ రేట్లు పెంచేది లేదు... కొత్త పాలసీ తీసుకొస్తున్నాం: ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్
ఇష్టం వచ్చినట్టు టికెట్ రేట్లు పెంచేది లేదు... కొత్త పాలసీ తీసుకొస్తున్నాం: ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్
Aus Open Champ Sinner: సిన్నర్‌దే ఆస్ట్రేలియన్ ఓపెన్ - రెండో ఏడాది విజేతగా నిలిచిన ఇటాలియన్, జ్వెరెవ్‌కు మళ్లీ నిరాశ
సిన్నర్‌దే ఆస్ట్రేలియన్ ఓపెన్ - రెండో ఏడాది విజేతగా నిలిచిన ఇటాలియన్, జ్వెరెవ్‌కు మళ్లీ నిరాశ
Crime News: నడిరోడ్డుపై మహిళను జుట్టు పట్టి ఈడ్చుకెళ్లారు - విశాఖలో దారుణం
నడిరోడ్డుపై మహిళను జుట్టు పట్టి ఈడ్చుకెళ్లారు - విశాఖలో దారుణం
Embed widget