అన్వేషించండి

KCR To UP : జాతీయ పార్టీ ప్రకటించాక తొలి సారి యూపీకి కేసీఆర్ - కానీ రాజకీయం కోసం కాదు !

మంగళవారం సీఎం కేసీఆర్ యూపీ పర్యటనకు వెళ్తున్నారు. ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియల్లో పాల్గొననున్నారు.


KCR To UP :    తెలంగాణ సీఎం కేసీఆర్ మంగళవారం ఉత్తరప్రదేశ్ పర్యటనకు వెళ్తున్నారు. సమాజ్‌వాదీ పార్టీ నేత ములాయం సింగ్‌ యాదవ్‌ అంత్యక్రియలకు హాజరుకానున్నారు. ములాయం పార్థివ దేహానికి కేసీఆర్ నివాళులు అర్పించనున్నారు.  అనారోగ్య సమస్యలతో  సోమవారం ఉదయం   ములాయం సింగ్‌ కన్నూమూశారు. ఆయన అంత్యక్రియలను అక్టోబ‌ర్ 11న ఆయ‌న స్వగ్రామం సాయ్‌ఫాయ్‌లో అధికారిక లాంఛనాలతో నిర్వహించ‌నున్నారు. ఈ అంత్యక్రియలకు హాజరు కావాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ములాయం సింగ్‌ యాదవ్‌ మృతి పట్ల సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి  వ్యక్తం చేస్తూ ప్రకటన విడుదల చేశారు. 

ములాయం అంత్యక్రియల్లో పాల్గొనేందుకు యూపీ వెళ్లాలని కేసీఆర్ నిర్ణయం

ములాయం సింగ్ యాదవ్ కొద్ది రోజులుగా ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు. ఆయన కుమారుడు అఖిలేష్ యాదవ్ పార్టీని నడుపుతున్నారు. ఓ సారి ఐదేళ్ల పాటు యూపీ సీఎంగా కొనసాగారు. అయితే వరుసగా రెండు సార్లు ఎస్పీ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైంది. వచ్చే  పార్లమెంట్ ఎన్నికల్లో పట్టు నిరూపించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. బీజేపీని ఓడించేందుకు కేసీఆర్‌తో కలిసి పని చేసేందుకు అఖిలేష్ యాదవ్ సిద్ధంగా ఉన్నట్లుగా టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల టీఆర్ఎస్‌ను భారత్ రాష్ట్ర సమితిగా మారుస్తూ నిర్ణయం తీసుకున్న సందర్భానికి ముఖ్య అతిధులుగా కర్ణాటక, తమిళనాడు నుంచి ఇతర పార్టీల ప్రతినిధులు వచ్చారు. అదే సమయంలో అఖిలేష్ వద్దామనుకున్నా... ములాయం ఆరోగ్యపరిస్థితి బాగోలేదని .. మెరుగుపడిన తర్వాత ఇద్దరూ కలిసి వస్తారని ..అందుకే తాను అఖిలేష్‌ను రావొద్దని చెప్పానని కేసీఆర్ చెప్పారు. అయితే ఈ లోపే దుర్వార్త రావడంతో అఖిలేష్‌ను పరామర్శించి.. ములాయం అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వెళ్లాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. 

జాతీయ రాజకీయాల్లో కేసీఆర్‌తో పాటు నడిచేందుకు సిద్ధమైన అఖిలేష్ 

దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన యూపీకి మూడుసార్లు సీఎంగా, కేంద్రమంత్రిగా జీవితాంతం నిరుపేద బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం ములాయం పని చేశారని కేసీఆర్ కొనియాడారు. ప్రముఖ సోషలిస్టు నాయకులు రామ్ మనోహర్ లోహియా, స్వాతంత్ర్య సమరయోధులు రాజ్ నారాయణ్ వంటి నేతల స్ఫూర్తితో ములాయం రాజకీయాల్లోకి వచ్చారని సీఎం గుర్తు చేసుకున్నారు.  ములాయం కుమారుడు అఖిలేష్ యాదవ్, వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

రాజకీయాలకు సంబంధం లేకుండా జాతీయ పార్టీ ప్రకటన తర్వాత తొలి సారి ఇతర రాష్ట్ర పర్యటనకు కేసీఆర్ 

కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన తర్వాత తొలి సారిగా ఇతర రాష్ట్రాల పర్యటనకు వెళ్తున్నారు. ఈ పర్యటన పూర్తి స్థాయిలో రాజకీయాలకు వ్యతిరేకం అయినప్పటికీ  ములాయం అంత్యక్రియల్లో పాల్గొనేందుకు దాదాపుగా దేశంలో ఉన్న అన్ని పార్టీల  ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉంది. అందుకే అక్కడ రాజకీయ చర్చలు జరిగే అవకాశం ఉంది. అయితే కేసీఆర్ పిచ్చాపాటిగా నేతలతో మాట్లాడినా జాతీయ రాజకీయాల విషయంలో యూపీలో ఈ పర్యటన సమయంలో పెద్దగా మాట్లాడే అవకాశం ఉండదని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. మరోసారి ఆయన అఖిలేష్‌తో చర్చిస్తారని అంటున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana News: మార్చురీలో డెడ్‌బాడీని పీక్కుతిన్న కుక్క.. జడ్చర్ల ప్రభుత్వాసుపత్రిలో దారుణం
మార్చురీలో డెడ్‌బాడీని పీక్కుతిన్న కుక్క.. జడ్చర్ల ప్రభుత్వాసుపత్రిలో దారుణం
Telangana Govt: కూల్చివేతల్లో ప్రజాస్వామ్య దారి మర్చిపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం - వ్యతిరేకతను ఎందుకు గుర్తించలేకపోతున్నారు?
కూల్చివేతల్లో ప్రజాస్వామ్య దారి మర్చిపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం - వ్యతిరేకతను ఎందుకు గుర్తించలేకపోతున్నారు?
Vijay Deverakonda Rashmika : విరోష్ కపుల్ గొప్ప మనసు - విద్యార్థులకు విజయ్ దేవరకొండ స్కాలర్షిప్స్
విరోష్ కపుల్ గొప్ప మనసు - విద్యార్థులకు విజయ్ దేవరకొండ స్కాలర్షిప్స్
Vijay Deverakonda Rashmika : రష్మికతో సొంతూరికి విజయ్ దేవరకొండ - ఫాం హౌస్‌లో కొత్త జంట గృహ ప్రవేశం... సందడిగా గ్రామం
రష్మికతో సొంతూరికి విజయ్ దేవరకొండ - ఫాం హౌస్‌లో కొత్త జంట గృహ ప్రవేశం... సందడిగా గ్రామం

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kesineni Chinni vs MLA Kolikapudi: కళ్యాణోత్సవంలో టీడీపీ ఎంపీకి షాక్.. ఎమ్మెల్యే కొలిక‌పూడి శ్రీనివాస‌రావు అనుచిత ప్ర‌వ‌ర్త‌న
కళ్యాణోత్సవంలో టీడీపీ ఎంపీకి షాక్.. ఎమ్మెల్యే కొలిక‌పూడి శ్రీనివాస‌రావు అనుచిత ప్ర‌వ‌ర్త‌న
Bengal Assembly Elections 2026 : బెంగాల్‌లో ఉన్నట్లుగా కూడా తెలియకుండా మాయమైన కమ్యూనిస్టులు - ఇలా ఎలా?
బెంగాల్‌లో ఉన్నట్లుగా కూడా తెలియకుండా మాయమైన కమ్యూనిస్టులు - ఇలా ఎలా?
Sabarimala Issue: అయ్యప్ప దేవాలయంలోకి మహిళల్ని అనుమతించం -సుప్రీంకోర్టుకు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు అఫిడవిట్
అయ్యప్ప దేవాలయంలోకి మహిళల్ని అనుమతించం -సుప్రీంకోర్టుకు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు అఫిడవిట్
Iran-Israel War : ఒమన్‌లో ఆయిల్ ట్యాంకర్ లక్ష్యంగా డ్రోన్ దాడి- అటాక్‌లో భారతీయుడు మృతి!
ఒమన్‌లో ఆయిల్ ట్యాంకర్ లక్ష్యంగా డ్రోన్ దాడి- అటాక్‌లో భారతీయుడు మృతి!
Vijay Deverakonda Rashmika : విరోష్ కపుల్ గొప్ప మనసు - విద్యార్థులకు విజయ్ దేవరకొండ స్కాలర్షిప్స్
విరోష్ కపుల్ గొప్ప మనసు - విద్యార్థులకు విజయ్ దేవరకొండ స్కాలర్షిప్స్
iPhone 17e Launched: 48 MP కెమెరా, శాటిలైట్ ఫీచర్లతో వచ్చిన iPhone 17e.. ధర, పూర్తి వివరాలు
48 MP కెమెరా, శాటిలైట్ ఫీచర్లతో వచ్చిన iPhone 17e.. ధర, పూర్తి వివరాలు
Peddi Song : పెద్ది 'రయ్ రయ్ రా రా' సాంగ్ రిలీజ్ - రామ్ చరణ్ ఎనర్జిటిక్ స్టెప్స్ వేరే లెవల్
పెద్ది 'రయ్ రయ్ రా రా' సాంగ్ రిలీజ్ - రామ్ చరణ్ ఎనర్జిటిక్ స్టెప్స్ వేరే లెవల్
First class admission: 6 ఏళ్లు నిండిన వారికే ఒకటో తరగతిలో ప్రవేశం - కొన్ని రోజులు మినహాయింపు ఇవ్వాలని తల్లిదండ్రుల డిమాండ్
6 ఏళ్లు నిండిన వారికే ఒకటో తరగతిలో ప్రవేశం - కొన్ని రోజులు మినహాయింపు ఇవ్వాలని తల్లిదండ్రుల డిమాండ్
Embed widget