అన్వేషించండి

CM KCR: 'ఎవరో చెప్పిన అబద్ధాలు నమ్మొద్దు' - అభ్యర్థి వెనుక పార్టీ చరిత్ర చూడాలన్న సీఎం కేసీఆర్

CM Kcr: ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని, ఎవరో చెప్పిన అబద్ధాలు నమ్మొద్దని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. అభ్యర్థి, పార్టీ వెనుక చరిత్ర చూసి వివేకంతో ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.

ఎన్నికలు రాగానే ఆగం కావొద్దని, ఎవరో చెప్పిన అబద్ధాలు నమ్మి ఓటెయ్యొద్దని సీఎం కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్మల్ జిల్లా భైంసాలో ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. ఆ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తున్నారు, ఆ అభ్యర్థి వెనుక ఉన్న పార్టీ, దాని చరిత్ర, ఆ పార్టీ అమలు చేసిన సంక్షేమ పథకాలు, నేతల దృక్పథం చూసి వివేకంతో ఓటు వెయ్యాలన్నారు. దేశంలో 24 గంటల విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పునరుద్ఘాటించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లవుతున్నా, ప్రజల్లో ప్రజాస్వామ్య పరిణతి రాలేదని అన్నారు. 

ప్రతిపక్షాలపై విమర్శలు

ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీలపై సీఎం కేసీఆర్ విమర్శలు చేశారు. రైతు బంధు దుబారా అని కాంగ్రెస్ నేతలు అంటున్నారని, రైతులకు 24 గంటల కరెంట్ అవసరం లేదని అన్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి ఎత్తేస్తామని చెబుతున్నారని, అదే జరిగితే మళ్లీ పైరవీలు మొదలవుతాయని, అన్నదాతలు అధికారుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడుతుందని చెప్పారు. రైతు బంధు, రైతు బీమా ఎలా వస్తాయి? అని ప్రశ్నించారు. 'రాష్ట్రంలో 24 గంటల కరెంట్, ఇంటింటికీ నీళ్లు ఉచితంగా ఇస్తున్నాం. వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ పెట్టుబడి సాయం చేస్తున్నాం. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత చాలా కష్టపడి అన్ని సమస్యలు పరిష్కరించుకున్నాం.' అని కేసీఆర్ తెలిపారు. రాష్ట్రాన్ని 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ప్రజలకు ఏం మేలు చేసిందని నిలదీశారు. 

బీజేపీ ఓట్లు ఎలా అడుగుతుంది.?

ప్రధాని మోదీ రాష్ట్రానికి ఒక్క వైద్య కళాశాల కూడా ఇవ్వలేదని కేసీఆర్ విమర్శించారు. రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకుంటే కనీసం ఒక్క నవోదయ విద్యాలయం కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు ఏమీ ఇవ్వకుండానే ఇవాళ బీజేపీ నేతలు ఓట్లు అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రధానికి ప్రైవేటైజేషన్ పిచ్చి పట్టుకుందని మండిపడ్డారు. 'రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, కరెంట్ ఇలా అన్నీ ప్రైవేటుపరం చేస్తున్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టమన్నారు. రైతులకు నష్టం కలుగుతుందని నేను పెట్టలేదు. కోపంతో మనకు ఇచ్చే నిధుల్లో కోత విధించారు.' అని కేసీఆర్ వెల్లడించారు.

'తెలంగాణ కోసమే బీఆర్ఎస్''

తెలంగాణ కోసమే బీఆర్ఎస్ పుట్టిందని, ప్రజల సంక్షేమం కోసం అనేక హామీలు అమలు చేసినట్లు సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఆర్మూరులో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ఆదాయం పెరిగే కొద్దీ సంక్షేమ పథకాలు పెంచుతున్నామని చెప్పారు. 10 హామీలిచ్చి, 100 హామీలు నెరవేర్చామని అన్నారు. దశాబ్దాలుగా వెనుకబడి ఉన్న ఎస్సీలు బాగు పడాలనే ఉద్దేశంతోనే దళిత బంధు పథకం తెచ్చామని, ప్రతీ దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇచ్చి ఆదుకుంటామని స్పష్టం చేశారు. ఆర్మూర్ బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

'ఆయన్ను ఆశీర్వదించండి'

అనంతరం కోరుట్లలోని ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ ఓ వైద్యుడిగా రూ.కోట్లు సంపాదించుకోవచ్చు. కానీ, ఆయన ప్రజాసేవ చేద్దామనే రాజకీయాల్లోకి వచ్చారు. తాను ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టినప్పుడు పక్కనే ఉండి తన ప్రాణాలు కాపాడారని చెప్పారు. 'యువకుడు, వైద్యుడు అయిన సంజయ్ ను మీరంతా ఆశీర్వదించాలి' అంటూ కేసీఆర్ కోరుట్ల ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావాలని స్పష్టం చేశారు.

Also Read: తెలంగాణ ద్రోహులతో కలిసిన బీజేపీ, కాంగ్రెస్ - బీఆర్ఎస్‌కే పట్టం కట్టాలని హరీష్ రావు పిలుపు !

టాప్ హెడ్ లైన్స్

Telangana Politics: రాహుల్ గాంధీతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయండి: సీఎం రేవంత్ రెడ్డికి రామచందర్ రావు లేఖ
రాహుల్ గాంధీతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయండి: సీఎం రేవంత్ రెడ్డికి రామచందర్ రావు లేఖ
Congress Politics: తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్లను.. నా సీటును బీజేపీ చోరీ చేసింది: మీనాక్షి నటరాజన్
తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్లను.. నా సీటును బీజేపీ చోరీ చేసింది: మీనాక్షి నటరాజన్
RTC Bus Fire Accident: మంటలు చెలరేగి ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు దగ్ధం, హైదరాబాద్ వెళ్తుండగా అగ్ని ప్రమాదం
మంటలు చెలరేగి ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు దగ్ధం, హైదరాబాద్ వెళ్తుండగా అగ్ని ప్రమాదం
NEET Re Exam 2026: నీట్ యూజీ రీ ఎగ్జామ్.. అభ్యర్థులకు NTA కీలక సూచనలు, వీటిని సెంటర్లోకి అనుమతించరు
నీట్ యూజీ రీ ఎగ్జామ్.. అభ్యర్థులకు NTA కీలక సూచనలు, వీటిని సెంటర్లోకి అనుమతించరు

వీడియోలు

India vs Afghanistan 3rd ODI | చెన్నై వన్డేలో భారత్ క్లీన్ స్వీప్ ఖాయమా?
Shreyanka Patil Ruled Out World Cup | వరల్డ్ కప్ నుండి శ్రేయాంక పాటిల్ అవుట్
Yuvraj Singh as Delhi Capitals Coach IPL 2027 | ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్‌గా యువరాజ్ సింగ్
Chandrababu With Baba Ramdev | ఉండవల్లిలో బాబా రామ్‌దేవ్‌తో సీఎం చంద్రబాబు
Godavari Heroine Anumita Dutta Life Story | గోదావరి సీరియల్ హీరోయిన్ జాను బ్యాక్‌గ్రౌండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
SA W Defeats IND W T20 World Cup: ప్రొటీస్ చేతిలో కంగుతిన్న టీమిండియా.. మరిజానే కాప్ ఆల్‌రౌండ్ విధ్వంసం, రికార్డు పుటల్లోకి హర్మన్ ప్రీత్..
ప్రొటీస్ చేతిలో కంగుతిన్న టీమిండియా.. మరిజానే కాప్ ఆల్‌రౌండ్ విధ్వంసం, రికార్డు పుటల్లోకి హర్మన్ ప్రీత్..
Jogi Ramesh On Illegal Mining: ఆగర్భ శ్రీమంతుడు కాదు.. భూగర్భ దోపిడీదారుడు! టీడీపీ ఎమ్మెల్యేపై చర్యలకు జోగి రమేష్ డిమాండ్
ఆగర్భ శ్రీమంతుడు కాదు.. భూగర్భ దోపిడీదారుడు! టీడీపీ ఎమ్మెల్యేపై చర్యలకు జోగి రమేష్ డిమాండ్
Vizag Techie Radha Gayatri Case: వైజాగ్ టెకీ రాధా గాయత్రి మృతి.. భర్త శ్రీచరణ్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు
వైజాగ్ టెకీ రాధా గాయత్రి మృతి.. భర్త శ్రీచరణ్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు
Telangana Politics: రాహుల్ గాంధీతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయండి: సీఎం రేవంత్ రెడ్డికి రామచందర్ రావు లేఖ
రాహుల్ గాంధీతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయండి: సీఎం రేవంత్ రెడ్డికి రామచందర్ రావు లేఖ
NEET Re Exam 2026 Issue: బురఖా తీసేస్తేనే ఎంట్రీ అన్న సిబ్బంది.. పరీక్ష రాయనని తెగేసి చెప్పిన విద్యార్థిని!
బురఖా తీసేస్తేనే ఎంట్రీ అన్న సిబ్బంది.. పరీక్ష రాయనని తెగేసి చెప్పిన నీట్ అభ్యర్థి!
Suriya 47 : సూర్య సినిమాలో మోహన్ లాల్ - అసలు నిజం ఏంటో చెప్పిన డైరెక్టర్
సూర్య సినిమాలో మోహన్ లాల్ - అసలు నిజం ఏంటో చెప్పిన డైరెక్టర్
Vaibhav Sooryavanshi World Record: వైభవ్ సూర్యవంశీ విధ్వంసం: లంక జట్టుపై 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.. 21 ఏళ్ల రికార్డ్ స్మాష్!
వైభవ్ సూర్యవంశీ విధ్వంసం: లంక జట్టుపై 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.. 21 ఏళ్ల రికార్డ్ స్మాష్!
Peddi : పెద్ది బ్లాక్ బస్టర్ ఈవెంట్ - వెన్యూ, డేట్ అండ్ టైం ఫిక్స్... మెగాస్టార్ వస్తారా?
పెద్ది బ్లాక్ బస్టర్ ఈవెంట్ - వెన్యూ, డేట్ అండ్ టైం ఫిక్స్... మెగాస్టార్ వస్తారా?
Embed widget