అన్వేషించండి

CM KCR: 'ఎవరో చెప్పిన అబద్ధాలు నమ్మొద్దు' - అభ్యర్థి వెనుక పార్టీ చరిత్ర చూడాలన్న సీఎం కేసీఆర్

CM Kcr: ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని, ఎవరో చెప్పిన అబద్ధాలు నమ్మొద్దని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. అభ్యర్థి, పార్టీ వెనుక చరిత్ర చూసి వివేకంతో ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.

ఎన్నికలు రాగానే ఆగం కావొద్దని, ఎవరో చెప్పిన అబద్ధాలు నమ్మి ఓటెయ్యొద్దని సీఎం కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్మల్ జిల్లా భైంసాలో ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. ఆ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తున్నారు, ఆ అభ్యర్థి వెనుక ఉన్న పార్టీ, దాని చరిత్ర, ఆ పార్టీ అమలు చేసిన సంక్షేమ పథకాలు, నేతల దృక్పథం చూసి వివేకంతో ఓటు వెయ్యాలన్నారు. దేశంలో 24 గంటల విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పునరుద్ఘాటించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లవుతున్నా, ప్రజల్లో ప్రజాస్వామ్య పరిణతి రాలేదని అన్నారు. 

ప్రతిపక్షాలపై విమర్శలు

ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీలపై సీఎం కేసీఆర్ విమర్శలు చేశారు. రైతు బంధు దుబారా అని కాంగ్రెస్ నేతలు అంటున్నారని, రైతులకు 24 గంటల కరెంట్ అవసరం లేదని అన్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి ఎత్తేస్తామని చెబుతున్నారని, అదే జరిగితే మళ్లీ పైరవీలు మొదలవుతాయని, అన్నదాతలు అధికారుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడుతుందని చెప్పారు. రైతు బంధు, రైతు బీమా ఎలా వస్తాయి? అని ప్రశ్నించారు. 'రాష్ట్రంలో 24 గంటల కరెంట్, ఇంటింటికీ నీళ్లు ఉచితంగా ఇస్తున్నాం. వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ పెట్టుబడి సాయం చేస్తున్నాం. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత చాలా కష్టపడి అన్ని సమస్యలు పరిష్కరించుకున్నాం.' అని కేసీఆర్ తెలిపారు. రాష్ట్రాన్ని 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ప్రజలకు ఏం మేలు చేసిందని నిలదీశారు. 

బీజేపీ ఓట్లు ఎలా అడుగుతుంది.?

ప్రధాని మోదీ రాష్ట్రానికి ఒక్క వైద్య కళాశాల కూడా ఇవ్వలేదని కేసీఆర్ విమర్శించారు. రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకుంటే కనీసం ఒక్క నవోదయ విద్యాలయం కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు ఏమీ ఇవ్వకుండానే ఇవాళ బీజేపీ నేతలు ఓట్లు అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రధానికి ప్రైవేటైజేషన్ పిచ్చి పట్టుకుందని మండిపడ్డారు. 'రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, కరెంట్ ఇలా అన్నీ ప్రైవేటుపరం చేస్తున్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టమన్నారు. రైతులకు నష్టం కలుగుతుందని నేను పెట్టలేదు. కోపంతో మనకు ఇచ్చే నిధుల్లో కోత విధించారు.' అని కేసీఆర్ వెల్లడించారు.

'తెలంగాణ కోసమే బీఆర్ఎస్''

తెలంగాణ కోసమే బీఆర్ఎస్ పుట్టిందని, ప్రజల సంక్షేమం కోసం అనేక హామీలు అమలు చేసినట్లు సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఆర్మూరులో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ఆదాయం పెరిగే కొద్దీ సంక్షేమ పథకాలు పెంచుతున్నామని చెప్పారు. 10 హామీలిచ్చి, 100 హామీలు నెరవేర్చామని అన్నారు. దశాబ్దాలుగా వెనుకబడి ఉన్న ఎస్సీలు బాగు పడాలనే ఉద్దేశంతోనే దళిత బంధు పథకం తెచ్చామని, ప్రతీ దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇచ్చి ఆదుకుంటామని స్పష్టం చేశారు. ఆర్మూర్ బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

'ఆయన్ను ఆశీర్వదించండి'

అనంతరం కోరుట్లలోని ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ ఓ వైద్యుడిగా రూ.కోట్లు సంపాదించుకోవచ్చు. కానీ, ఆయన ప్రజాసేవ చేద్దామనే రాజకీయాల్లోకి వచ్చారు. తాను ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టినప్పుడు పక్కనే ఉండి తన ప్రాణాలు కాపాడారని చెప్పారు. 'యువకుడు, వైద్యుడు అయిన సంజయ్ ను మీరంతా ఆశీర్వదించాలి' అంటూ కేసీఆర్ కోరుట్ల ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావాలని స్పష్టం చేశారు.

Also Read: తెలంగాణ ద్రోహులతో కలిసిన బీజేపీ, కాంగ్రెస్ - బీఆర్ఎస్‌కే పట్టం కట్టాలని హరీష్ రావు పిలుపు !

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Fast Printout: జిరాక్స్ షాప్ వద్ద క్యూ లైన్ ఉందా? QwikPrint మెషిన్ కనిపిస్తే ప్రింటౌట్ తీసుకోండి
జిరాక్స్ షాప్ వద్ద క్యూ లైన్ ఉందా? QwikPrint మెషిన్ కనిపిస్తే ప్రింటౌట్ తీసుకోండి
Cyber Fraud:మాజీ డీజీపీ మనవరాలి నుంచి రూ.1.2 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
మాజీ డీజీపీ మనవరాలి నుంచి రూ.1.2 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
BRS leaders rebellion against Kaushik Reddy: హుజూరాబాద్ బీఆర్ఎస్‌లో ముదురుతున్న సెగ - పాడి కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా నేతల తిరుగుబాటు
హుజూరాబాద్ బీఆర్ఎస్‌లో ముదురుతున్న సెగ - పాడి కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా నేతల తిరుగుబాటు
Fire Cracker Lorry Catches Fire: హైటెన్షన్ వైర్లు తగిలి పేలిన టపాసులు, లారీ దగ్ధం.. రంగారెడ్డి జిల్లాలో ఘటన
హైటెన్షన్ వైర్లు తగిలి పేలిన టపాసులు, లారీ దగ్ధం.. రంగారెడ్డి జిల్లాలో ఘటన

వీడియోలు

Late Marriage Effect on Women | 40ఏళ్లు దాటినా పెళ్లంటే ఇష్టపడని మహిళలు, ఆరోగ్యంపై ఊహించని ప్రభావం
Harshit Rana Ruled Out IPL 2026 | హర్షిత్ దూరం, పతిరణ రాక ఆలస్యం. కష్టాల్లో కేకేఆర్ | ABP Desam
Laxman Sivaramakrishnan Commentary BCCI | కామెంటరీకి శివరామకృష్ణన్ గుడ్ బై | ABP Desam
SRH Players Injury IPL 2026 Jack Edwards | గాయంతో సన్‌రైజర్స్‌కు స్టార్ ఆల్‌రౌండర్ దూరం | ABP Desam
MS Dhoni Injured in CSK Practice Camp IPL 2026 | ధోనీ మోకాలి గాయం ? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
EPFO ​​3.0: పీఎఫ్ విత్‌డ్రాలపై కేంద్రం అప్డేట్.. 5 లక్షల వరకు క్లెయిమ్‌లు ఆటోమేటిక్‌గా పూర్తి
PF విత్‌డ్రాలపై కేంద్రం అప్డేట్.. 5 లక్షల వరకు క్లెయిమ్‌లు ఆటోమేటిక్‌గా పూర్తి
AP Rains Alert: ఏపీలో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
ఏపీలో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
Andhra Praedesh News: ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల సొసైటీ స్కూల్ ఉద్యోగుల ఏజ్ లిమిట్ పెంపు
ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల సొసైటీ స్కూల్ ఉద్యోగుల ఏజ్ లిమిట్ పెంపు
Harish Rao: శ్రమ మాది.. శిలాఫలకం రేవంత్ రెడ్డిది - సిద్దిపేట పర్యటనపై హరీశ్ రావు బహిరంగలేఖ
శ్రమ మాది.. శిలాఫలకం రేవంత్ రెడ్డిది - సిద్దిపేట పర్యటనపై హరీశ్ రావు బహిరంగలేఖ
Fast Printout: జిరాక్స్ షాప్ వద్ద క్యూ లైన్ ఉందా? QwikPrint మెషిన్ కనిపిస్తే ప్రింటౌట్ తీసుకోండి
జిరాక్స్ షాప్ వద్ద క్యూ లైన్ ఉందా? QwikPrint మెషిన్ కనిపిస్తే ప్రింటౌట్ తీసుకోండి
Fire Cracker Lorry Catches Fire: హైటెన్షన్ వైర్లు తగిలి పేలిన టపాసులు, లారీ దగ్ధం.. రంగారెడ్డి జిల్లాలో ఘటన
హైటెన్షన్ వైర్లు తగిలి పేలిన టపాసులు, లారీ దగ్ధం.. రంగారెడ్డి జిల్లాలో ఘటన
Cyber Fraud:మాజీ డీజీపీ మనవరాలి నుంచి రూ.1.2 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
మాజీ డీజీపీ మనవరాలి నుంచి రూ.1.2 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
New ATM Rules From April 1:ఏప్రిల్ 1 నుండి కొత్త ఏటీఎం నిబంధనలు - ఈ విషయాలు తెలియకపోతే చాలా నష్టపోతారు!
ఏప్రిల్ 1 నుండి కొత్త ఏటీఎం నిబంధనలు - ఈ విషయాలు తెలియకపోతే చాలా నష్టపోతారు!
Embed widget