అన్వేషించండి

Case On Assam CM : అసోం సీఎంపై హైదరాబాద్‌లో కేసు నమోదు ! తదుపరి చర్యలేమిటంటే ?

అసోం సీఎంపై హైదరాబాద్‌లో కేసు నమోదు చేశారు. రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని రేవంత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదయింది.

 

రాహుల్ గాంధీపై ( Rahul Gandhi )  అనుచిత వ్యాఖ్యలు చేసిన అసోం సీఎం హిమంత బిశ్వ శర్మపై ( Himanta Biswa Sarma ) జుబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ( Revant Reddy ) సోమవారం కేసు పెట్టాలంటూ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై న్యాయసలహా తీసుకున్న పోలీసులు మూడు సెక్షన్ల కింద అసోం సీఎంపై కేసు నమోదు చేశారు. తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నదానిపై పోలీసులు ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఇప్పటికైతే కేసు నమోదు చేశారు. ఇటీవల ఎన్నికల ప్రచారంలో అసోం సీఎం బిశ్వ శర్మ  సర్జికల్ స్ట్రైక్స్‌కు రాహుల్ గాంధీ ఆధారాలు అడిగారని.. ఆయన తండ్రెవరో తాము ఆధారాలు అడిగామా అని ప్రశ్నించారు. ఇవి రాహుల్ గాంధీ తల్లిని కించ పరచరడం కావడంతో దేశవ్యాప్తంగా దుమారం రేపింది.  

తెలంగాణ సీఎం కేసీఆర్ ( KCR ) కూడా ఈ వ్యాఖ్యలను ఖండించారు. బిశ్వ శర్మ దేశ సంస్కృతిపై దాడి చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలను మోదీ ( PM Modi ) సమర్థిస్తున్నారా అని ప్రశ్నించారు. సమర్థించకపోతే తక్షణం ఆయనను పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కూడా సర్జికల్ స్ట్రైక్స్ పై తనకు కూడా అనుమానాలు ఉన్నాయని ప్రకటించారు. ఈ తరుణంలో బిశ్వ శర్మతో పాటు పలువురు బీజేపీ నేతలు కేసీఆర్‌పైనా విరుచుకుపడ్డారు. టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బిశ్వశర్మపై తీవ్రంగా విరుచుకుపడటమే కాకుండా పార్టీ తరపున అన్ని పోలీస్ స్టేషన్లలో కేసులు ( Police Complaint ) పెట్టాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.  ఆ మేరకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.  ఇతర చోట్ల కాంగ్రెస్ నేతల ఫిర్యాదులను పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు కానీ జుబ్లీహిల్స్ పోలీసులు మాత్రం కేసు నమోదు చేశారు.  

బిశ్వశర్మ తక్షణం క్షమాపణలు చెప్పాలన్న డిమాండ్ వినిపిస్తోంది. అయితే అసోం సీఎం తన వ్యాఖ్యలను సమర్థించుకుంటున్నారు. పదే పదే రాహుల్ గాంధీపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఓ సారి జిన్నాతో పోల్చారు. అయితే  బీజేపీ నేతల ( BJP Leaders )తీరును రాహుల్ గాంధీ సున్నితంగానే తిప్పి కొడుతున్నారు. తన ప్రాణాలు తీసినా మోదీ తల్లిదండ్రులను మాత్రం తాను కించ పరచబోనని అంటున్నారు.  రాజకీయాల్లో తప్పుడు సంప్రదాయాలను తీసుకొచ్చి దేశాన్ని కలుషితం చేస్తున్నారని బీజేపీ నేతలపై కాంగ్రెస్ నేతలు విరుచుకుపడుతున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024: తొలి బ్యాటింగ్‌ బెంగళూరుదే, కేకేఆర్‌పై విరాట్‌ విశ్వరూపం ఖాయమా ?
తొలి బ్యాటింగ్‌ బెంగళూరుదే, కేకేఆర్‌పై విరాట్‌ విశ్వరూపం ఖాయమా ?
Revanth Reddy vs KTR: కేటీఆర్‌ చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు! - ఫోన్ ట్యాపింగ్ పై సీఎం రేవంత్ రెడ్డి
కేటీఆర్‌కు సిగ్గుండాలి! చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు - ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - తిరుమల నడకదారిలో చిరుత కలకలం
శ్రీవారి భక్తులకు అలర్ట్ - తిరుమల నడకదారిలో చిరుత కలకలం
Manchu Manoj Comments: ఎట్టకేలకు మెగా ఫ్యామిలీతో గోడవలపై నోరు విప్పిన మంచు మనోజ్‌ - ఏమన్నాడంటే..!‌ 
ఎట్టకేలకు మెగా ఫ్యామిలీతో గోడవలపై నోరు విప్పిన మంచు మనోజ్‌ - ఏమన్నాడంటే..!‌ 
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Paripoornananda Swami on Hindupuram Seat | హిందూపురం స్వతంత్ర అభ్యర్థిగా స్వామి పరిపూర్ణానంద | ABPWhy did K. Annamalai read the Quran | బీజేపీ యంగ్ లీడర్ అన్నామలై ఖురాన్ ఎందుకు చదివారు..?  | ABPKadiyam Srihari and kadiyam Kavya joins into Congress | కడియంకు రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ | ABP DesamSun Stroke  Symptoms and Treatment | వడదెబ్బ తగిలిన వ్యక్తికి ఓఆర్ఎస్ నీళ్లు ఇవ్వొచ్చా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024: తొలి బ్యాటింగ్‌ బెంగళూరుదే, కేకేఆర్‌పై విరాట్‌ విశ్వరూపం ఖాయమా ?
తొలి బ్యాటింగ్‌ బెంగళూరుదే, కేకేఆర్‌పై విరాట్‌ విశ్వరూపం ఖాయమా ?
Revanth Reddy vs KTR: కేటీఆర్‌ చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు! - ఫోన్ ట్యాపింగ్ పై సీఎం రేవంత్ రెడ్డి
కేటీఆర్‌కు సిగ్గుండాలి! చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు - ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - తిరుమల నడకదారిలో చిరుత కలకలం
శ్రీవారి భక్తులకు అలర్ట్ - తిరుమల నడకదారిలో చిరుత కలకలం
Manchu Manoj Comments: ఎట్టకేలకు మెగా ఫ్యామిలీతో గోడవలపై నోరు విప్పిన మంచు మనోజ్‌ - ఏమన్నాడంటే..!‌ 
ఎట్టకేలకు మెగా ఫ్యామిలీతో గోడవలపై నోరు విప్పిన మంచు మనోజ్‌ - ఏమన్నాడంటే..!‌ 
KTR: 'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Anantapur TDP: అనంతపురం టీడీపీలో భగ్గుమన్న అసంతృప్తి- పార్టీ ఆఫీసుపై దాడి, ఫర్నిచర్‌ దహనం
అనంతపురం టీడీపీలో భగ్గుమన్న అసంతృప్తి- పార్టీ ఆఫీసుపై దాడి, ఫర్నిచర్‌ దహనం
Tecno Pova 6 Pro 5G: బ్యాక్ డిజైన్ హైలెట్‌గా మార్కెట్లోకి వచ్చిన టెక్నో పోవా 6 ప్రో 5జీ - ధర ఎంతంటే?
బ్యాక్ డిజైన్ హైలెట్‌గా మార్కెట్లోకి వచ్చిన టెక్నో పోవా 6 ప్రో 5జీ - ధర ఎంతంటే?
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Embed widget