BRS Party : పార్టీ మారిన ఎమ్మెల్యేల పై వేటు వేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్
Supreme Court : ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై ఎన్నికల్లో గెలిచి, తరువాత కాంగ్రెస్ లో చేరిన ఏడుగురు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

Supreme Court : పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ దేశంలోని అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఎన్నికలు పూర్తయి ఏడాది అయింది. దాదాపు 10 మంది ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసి కూడా 9 నెలలు అయింది. అయినా ఇప్పటి వరకు స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్ రావు, దానం నాగేందర్లపై స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. మిగిలిన ఏడుగురు ఎమ్మెల్యేలపై రిట్ పిటిషన్ దాఖలు చేసింది.
సుప్రీంకోర్టులో రెండు పిటిషన్లు
ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై ఎన్నికల్లో గెలిచి, తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరిన ఏడుగురు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో రెండు పిటిషన్లు దాఖలు చేసింది. జనవరి 16, 2025న ఢిల్లీలోని న్యాయవాద బృందంతో ఈ అంశంపై చర్చించిన మాజీ మంత్రి హరీష్ రావు, పిటిషన్లు దాఖలు చేయాలని నిర్ణయించి, తదనుగుణంగా వాటిని దాఖలు చేశారు. ఎమ్మెల్యేల అనర్హత అంశంపై బీఆర్ఎస్ పార్టీ రెండు పిటిషన్లు దాఖలు చేసింది. పోచారం, కాలే యాదయ్య, సంజయ్ కుమార్, కృష్ణమోహన్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అరికెపూడి గాంధీలపై రిట్ పిటిషన్ దాఖలు చేసింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని ఆ మేరకు తెలంగాణ స్పీకర్కు ఆదేశాలు జారీ చేయాలని బీఆర్ఎస్ పార్టీ పిటిషన్ ద్వారా సుప్రీంకోర్టును అభ్యర్థించింది. ఈ అంశంపై తెలంగాణ హైకోర్టు ఇప్పటికే తీర్పు ఇచ్చింది. స్పీకర్ నిర్ణయాన్ని ప్రశ్నించలేమని, ఎటువంటి గడువు విధించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ తీర్పును సవాలు చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు సుప్రీంకోర్టులో రెండు పిటిషన్లు దాఖలు చేసింది.
Also Read : KTR: కేటీఆర్ ఈడీ విచారణ - కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత, బీజేపీ, కాంగ్రెస్ కార్యాలయాల వద్ద భారీగా పోలీసులు
కనీసం నోటీసు కూడా ఇవ్వలేదు
రాష్ట్ర హైకోర్టు తీర్పు వెలువరించి కూడా ఆరు నెలలు గడిచినా, స్పీకర్ ఇంకా ఎటువంటి చర్య తీసుకోలేదని పిటిషనర్ ఎత్తి చూపారు. కనీసం వాళ్లు నోటీసు కూడా ఇవ్వలేదని పిటిషన్లో పేర్కొన్నారు. కేశం మేఘ చంద్ర కేసులో సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును అమలు చేయాలని బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది. ఎమ్మెల్యేలపై ఆయా పార్టీలు దాఖలు చేసిన ఫిర్యాదులపై స్పీకర్ మూడు నెలల్లోగా నిర్ణయం ప్రకటించాలని కేశం మేఘ చంద్ర కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా తెలంగాణ స్పీకర్ నిర్ణయం తీసుకోవడం లేదని బిఆర్ఎస్ తెలిపింది. నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు ఆదేశాలు జారీ చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
హైకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్
2023అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున గెలిచిన ఎమ్మెల్యేలలో 10 మంది కాంగ్రెస్లో చేరారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద వారిని అనర్హులుగా ప్రకటించాలని హైకోర్టును ఆశ్రయించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను వెంటనే అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్ను ఆదేశిస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చారు. సింగిల్ జడ్జి తీర్పుపై శాసనసభ కార్యదర్శి హైకోర్టు ప్రత్యేక బెంచ్ను ఆశ్రయించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఎప్పుడైనా చర్యలు తీసుకునే అధికారం స్పీకర్కు ఉందని, దీనికి కాలపరిమితి లేదని ప్రత్యేక బెంచ్ తీర్పు ఇచ్చింది. అయితే, స్పీకర్ ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ హైకమాండ్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.





















