అన్వేషించండి

Kavitha letter to ED: ఈడీ నోటీసులపై ట్విస్ట్, విచారణకు హాజరు కావడం లేదని ఎమ్మెల్సీ కవిత లేఖ

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణకు హాజరుకాలేనని ఎమ్మెల్సీ కవిత ఈడీకి లేఖ రాశారు. అందుకు కారణం వెల్లడించారు.

Delhi Liquor Scam Case: హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణను వేగవంతం చేసింది ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్. ఈ క్రమంలో బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీ కవితకు ఈడీ సమన్లు జారీచేసింది. జనవరి 16న విచారణకు హాజరు కావాలని నోటీసులలో పేర్కొంది. అయితే ఈడీ విచారణకు మంగళవారం (జనవరి 16న) హాజరు కావడం లేదంటూ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) ఈడీకి లేఖ రాశారు. ఈ మెయిల్ ద్వారా ఈడీ అధికారులకు కవిత ముందస్తుగా సమాచారం ఇచ్చారు. సుప్రీంకోర్టులో ఈ కేసు పెండింగ్ లో ఉందని ఈడీకి ఆమె గుర్తుచేశారు.

ఎమ్మెల్సీ కవితకు ఈడీ మరోసారి నోటీసులు 
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్ (ED) మరోసారి నోటీసులు జారీ చేసింది. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha)ను ఈడీ మరోసారి విచారించనుంది. అందులో భాగంగా మాజీ సీఎం కేసీఆర్ కూతూరు, ఎమ్మెల్సీ కవితకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఢిల్లీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయంలో మంగళవారం (జనవరి 16)న విచారణకు రావాలని కవితకు జారీ చేసిన నోటీసులలో ఈడీ పేర్కొంది.

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహా ఆమ్ ఆద్మీ పార్టీ నేతల మెడకు చిక్కుకున్న ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో ఎమ్మెల్సీ కవితను ఈడీ పలుమార్లు విచారించింది. తెలంగాణ ఎన్నికల సమయంలో కవితను అరెస్ట్ చేస్తారని సైతం ప్రచారం జరిగింది. కానీ విచారణలో భాగంగా కవిత ఈడీ అధికారులకు సహకరించి, వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈడీ ఆదేశాల మేరకు ఆమె వినియోగించిన ఫోన్లు, ఇతర పరికరాలు సైతం సబ్మిట్ చేయడం తెలిసిందే. చాలా రోజుల విరామం తర్వాత ఢిల్లీ లిక్కర్ కేసులో విచారణకు హాజురు కావాలని కవితకు ఈడీ సమన్లు జారీ చేయడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు సైతం ఈ కేసులో ఈడీ నాలుగోసారి నోటీసులు జారీ చేసింది. జనవరి 18న విచారణకు హాజరు కావాలని నోటీసులలో పేర్కొంది.

గత మార్చి నెల నుంచి లిక్కర్ కేసులో కవిత విచారణ
గత మార్చి నెలలో ఢిల్లీ లిక్కర్‌ కేసులో కవిత ఈడీ విచారణకు పలుసార్లు హాజరైంది. ఈడీ ఆఫీసులో మహిళల విచారణ సీఆర్సీసీకి విరుద్ధం అంటూ అప్పటి నుంచి కవిత చెబుతూ వస్తున్నారు. దీనిపై అప్పుడే ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నళిని చిదంబరం తరహాలో ఇంటి వద్దే ఈడీ తనను విచారణ చేయాలని కవిత కోరుతున్నారు. ఈ క్రమంలో ఈడీ లాంటి దర్యాప్తు సంస్థల తీరును తప్పుబడుతూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇటీవల మళ్లీ ఈడీ ఆఫీసులో విచారణకు రావాలని నోటీసులు జారీ అవడంతో ఆమె సుప్రీంను ఆశ్రయించారు. ఆప్, వైసీపీ నేతలతో పాటు కవిత ఈ కేసులో విచారణను ఎదుర్కొన్నారు.

Also Read: మంత్రి దామోదర రాజనర్సింహ ఫేస్ బుక్ పేజ్ హ్యాక్ - మెసేజ్ లకు రిప్లై ఇవ్వొద్దని విజ్ఞప్తి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
BJP President: బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
When Did Sunday Holiday Start:ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?

వీడియోలు

Kavitha Meetings With Prashant Kishor | తెలంగాణ రాజకీయాల్లోకి ప్రశాంత్ కిశోర్ | ABP Desam
Virat Kohli Century Ind vs NZ 3rd ODI | మూడో వన్డేలో విరాట్ సెంచరీ | ABP Desam
Ind vs NZ 3rd ODI Highlights | భారత్‌లో తొలి సిరీస్ గెలిచిన న్యూజిలాండ్ | ABP Desam
Nagoba Jatara Maha Pooja 2026 | కేస్లాపూర్ నాగోబా మహాపూజ
Nagoba Jatara 2026 | నాగోబా ఆలయం వద్ద మెస్రం వంశీయుల సాంప్రదాయ పూజలు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
BJP President: బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
When Did Sunday Holiday Start:ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
Ranya Rao Father : కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
Telangana Latest News: మహిళా సంఘాలకు గుడ్ న్యూస్ చెప్పిన భట్టి విక్రమార్క- వడ్డీ లేని రుణాలపై కీలక ప్రకటన 
మహిళా సంఘాలకు గుడ్ న్యూస్ చెప్పిన భట్టి విక్రమార్క- వడ్డీ లేని రుణాలపై కీలక ప్రకటన 
SBI Report :
"ప్రగతిలో చైనాను దాటేస్తున్నాం" గుడ్ న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ రిపోర్ట్
Union Budget 2026: కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
Embed widget