అన్వేషించండి

అసెంబ్లీ ఎన్నికలు 2026

(Source:  Poll of Polls)

Kishan Reddy: బీజేపీలో చేరిన బోథ్ ఎమ్మేల్యే రాథోడ్ బాపూరావ్, సాదరంగా ఆహ్వానించిన కిషన్ రెడ్డి

Kishan Reddy: తెలంగాణ అప్పుల కుప్పగా మారిందని కిషన్ రెడ్డి విమర్శించారు. అవినీతి ఆరోపణలు ఉన్న వారికి, మాఫియా వ్యవస్థలను పెంచి పోషిస్తున్న వారికి కేసీఆర్ టికెట్స్ ఇచ్చారని ఆరోపించారు.

Kishan Reddy: కేసీఆర్ తొమ్మిదేళ్ల పాలనలో తెలంగాణ అప్పుల కుప్పగా మారిందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. ఆయనను సాదరంగా బీజేపీలోకి స్వాగతిస్తున్నట్లు చెప్పారు. 

రాష్ట్రంలో అనేక రకాల అవినీతి ఆరోపణలు ఉన్న వారికి, మాఫియా వ్యవస్థలను పెంచి పోషిస్తున్న వారికి కేసీఆర్ టికెట్స్ ఇచ్చారని విమర్శించారు. ఎలాంటి ఆరోపణలు లేకుండా, నిజాయితీగా పనిచేస్తున్న గిరిజన బిడ్డలకు టికెట్లు ఇవ్వలేదన్నారు. బుధవారం సాయంత్రం బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ఉందని, మిగతా స్థానాలకు అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో అధికార పార్టీపై పూర్తి వ్యతిరేకత ఉందని కిషన్ రెడ్డి అన్నారు.

మూడు నుంచి ఎన్నికల శంఖారావం
బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని నవంబర్ 3 నుంచి ఉధృతం చేస్తామని కిషన్ రెడ్డి అన్నారు. అధికారమే లక్ష్యంగా ఎన్నికలకు పూర్తిగా సమాయత్తం అవుతామన్నారు. అలాగే కర్ణాటకలో మోసపూరిత హామీలు ఇచ్చిన కాంగ్రెస్ గురించి అక్కడి రైతులు స్వయంగా తెలంగాణకు వచ్చి చెబుతున్నారని అన్నారు. ఐదు నెలల్లో కర్ణాటకలో 'తెలంగాణ ఎలక్షన్ టాక్స్' పేరుతో కాంగ్రెస్ వసూళ్లకు పాల్పడుతోందని ఆరోపించారు. కర్ణాటక ప్రజలు నేరుగా తెలంగాణకు వచ్చి అక్కడ జరుగుతున్న పాలన గురించి చెబుతున్నారని అన్నారు.

తెలంగాణకు పెద్ద మొత్తంలో డబ్బు
ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ కుట్రలకు తెరతీస్తోందని కిషన్ రెడ్డి ఆరోపించారు. చెన్నై సహా వివిధ మార్గాల ద్వారా తెలంగాణకు పెద్ద ఎత్తున డబ్బులు తరలిస్తున్నారని అన్నారు. అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లో కర్ణాటకను ఎలా దోపిడీ చేస్తుందో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ అప్పుల రాష్ట్రంగా మారిపోయిందని విమర్శించారు. ఇలాంటి స్థితిలో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలంటే బీజేపీ నేతృత్వంలోని డబుల్ ఇంజిన్ సర్కారు రావాలని పిలుపునిచ్చారు.

ఎవరు వెళ్లినా నష్టం లేదు..
ప్రపంచంలో బీజేపీ అతిపెద్ద పార్టీ అని కిషన్ రెడ్డి అన్నారు. ఎవరైనా పార్టీ వీడి వెళ్తే వచ్చే నష్టం లేదని అభిప్రాయపడ్డారు. బీజేపీ దేశం కోసం పనిచేస్తుందని, కేడర్ ఆధారిత పార్టీ బీజేపీ అని అన్నారు.  రానున్న ఎన్నికల్లో తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. వ్యక్తిగత కారణాలతో ఎవరైనా వెళ్తే తాము ఏమీ చేయలేమని చెప్పారు. జనసేనతో సీట్ల సర్దుబాటుపై అధిష్టానంతో చర్చ జరుగుతోందన్నారు. మానిఫెస్టో మీద చర్చ జరుగుతోందని, మార్పులు, చేర్పులు జరుగుతున్నాయని చెప్పారు.

కలిసేందుకు కూడా  కేసీఆర్ అవకాశం ఇవ్వలేదు: రాథోడ్ బాపూరావు 
ఆదిలాబాద్ వంటి వెనుకబడిన జిల్లాలో ఉపాధ్యాయ వృత్తి నుంచి రాజకీయాల్లోకి వచ్చానని ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు అన్నారు. ముగ్గురు ట్రైబల్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ టికెట్లు ఇవ్వలేదన్నారు. కనీసం కలిసేందుకు ప్రయత్నించినా సరే అవకాశం ఇవ్వలేదని ఆరోపించారు. ప్రధాని మోదీ పని తీరు చూశానని, అది నచ్చి బీజేపీలో చేరినట్లు చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కలిసి పనిచేసిన ఈటల రాజేందర్ సహా బీజేపీలో ఉన్న నేతలందరి సాయంతో బీజేపీ విజయానికి పనిచేస్తానని అన్నారు.

సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయం కేటాయించి కేంద్ర ప్రభుత్వం ఆదివాసీలకు గౌరవం ఇస్తోందని అన్నారు. కేడర్ తనతోనే ఉందని, బోథ్ బీజేపీ అభ్యర్థి సోయం బాపూరావును గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నానని, ఇస్తారని భావిస్తున్నట్లు చెప్పారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Congress vs BRS: కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్యలో యాంకర్లు - ఈ రాజకీయం గీత దాటిపోతోంది !
కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్యలో యాంకర్లు - ఈ రాజకీయం గీత దాటిపోతోంది !
TS SSC Results 2026 District wise Results: తెలంగాణ టెన్త్ ఫలితాల్లో ములుగు జిల్లాటాప్, చివరి స్థానంలో హైదరాబాద్.. జిల్లాలవారీగా ఫలితాలు
తెలంగాణ టెన్త్ ఫలితాల్లో ములుగు జిల్లాటాప్, చివరి స్థానంలో హైదరాబాద్.. జిల్లాలవారీగా ఫలితాలు
Husky Dogs: ఖరీదైన హస్కీ కుక్కల్ని పెంచి రోడ్డున వదిలేశారు - కాపాడిన స్వచ్చంద సంస్థలు - ఎవరి పని?
ఖరీదైన హస్కీ కుక్కల్ని పెంచి రోడ్డున వదిలేశారు - కాపాడిన స్వచ్చంద సంస్థలు - ఎవరి పని?
Komatireddy Rajagopal Reddy: తండ్రికి విలువ ఇవ్వని కవిత ప్రజలకేం మేలు చేస్తారు - కొత్తపార్టీపై రాజగోపాల్ రెడ్డి విమర్శలు
తండ్రికి విలువ ఇవ్వని కవిత ప్రజలకేం మేలు చేస్తారు - కొత్తపార్టీపై రాజగోపాల్ రెడ్డి విమర్శలు

వీడియోలు

RR vs PBKS IPL 2026 Highlights | రాజస్థాన్ రాయల్స్ సంచలన విజయం
Vaibhav Fun With Kids IPL 2026 | పిల్లలతో వైభవ్ సూర్యవంశీ ఫన్నీ ప్రాంక్
Yashasvi Jaiswal about Vaibhav IPL 2026 | వైభవ్ సూర్యవంశీపై యశస్వి జైస్వాల్ కామెంట్స్
RR vs DC IPL 2026 Suyash Sharma | ఐపీఎల్ చరిత్రలోనే సుయాశ్ శర్మ వరల్డ్ రికార్డ్
RCB vs DC IPL 2026 Highlights | ఢిల్లీని వణికించిన ఆర్‌సీబీ బౌలర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP SSC Exam Results 2026: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి మార్క్‌షీట్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? ఫలితాలు చూడటానికి ఉన్న మార్గాలేంటీ?
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి మార్క్‌షీట్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? ఫలితాలు చూడటానికి ఉన్న మార్గాలేంటీ?
Congress vs BRS: కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్యలో యాంకర్లు - ఈ రాజకీయం గీత దాటిపోతోంది !
కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్యలో యాంకర్లు - ఈ రాజకీయం గీత దాటిపోతోంది !
Dhurandhar Japan Release: జపాన్‌లో రిలీజ్‌కు 'ధురంధర్' రెడీ... జూలైలో ఎప్పుడంటే?
జపాన్‌లో రిలీజ్‌కు 'ధురంధర్' రెడీ... జూలైలో ఎప్పుడంటే?
Komatireddy Rajagopal Reddy: తండ్రికి విలువ ఇవ్వని కవిత ప్రజలకేం మేలు చేస్తారు - కొత్తపార్టీపై రాజగోపాల్ రెడ్డి విమర్శలు
తండ్రికి విలువ ఇవ్వని కవిత ప్రజలకేం మేలు చేస్తారు - కొత్తపార్టీపై రాజగోపాల్ రెడ్డి విమర్శలు
Delhi High Court: ఢిల్లీ హైకోర్టులో కలకలం - వర్చువల్ విచారణలో అశ్లీల వీడియోలు.. హ్యాకింగ్‌ చేసినట్లు అనుమానాలు!
ఢిల్లీ హైకోర్టులో కలకలం - వర్చువల్ విచారణలో అశ్లీల వీడియోలు.. హ్యాకింగ్‌ చేసినట్లు అనుమానాలు!
Raghurama: కోర్టులో రఘురామకు షాక్ - మీ పరిధి దాటొద్దని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు!
కోర్టులో రఘురామకు షాక్ - మీ పరిధి దాటొద్దని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు!
Hormuz: హోర్ముజ్ చిక్కులకు గల్ఫ్ దేశాల చెక్ - భారత్‌కు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చమురు సరఫరా!
హోర్ముజ్ చిక్కులకు గల్ఫ్ దేశాల చెక్ - భారత్‌కు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చమురు సరఫరా!
TS SSC Supplementary Exams Date: తెలంగాణ టెన్త్ క్లాస్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ షెడ్యూల్ వచ్చేసింది, ఈ తేదీ నుంచే పరీక్షలు
తెలంగాణ టెన్త్ క్లాస్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ షెడ్యూల్ వచ్చేసింది, ఈ తేదీ నుంచే పరీక్షలు
Embed widget