అన్వేషించండి

Bhatti Vikramarka: భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ప్రారంభం, 550 కిలో మీటర్లు కాలినడక

Khammam News: ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం ముదిగొండ మండలం యడవల్లిలో భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ యాత్ర ప్రారంభమైంది.

Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తలపెట్టిన పీపుల్స్ మార్చ్ (People March) (ఫిబ్రవరి 27) నేడు ప్రారంభం అయింది. ప్రజా సమస్యలపై గళమెత్తే ఉద్దేశంతో ఆయన ఈ పాదయాత్రను ప్రారంభించారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం ముదిగొండ మండలం యడవల్లిలో ఈ యాత్ర ప్రారంభమైంది. ఇవాళ ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి మల్లు భట్టి విక్రమార్క యడవల్లి శ్రీలక్ష్మీ నరసింహాస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన పాదయాత్రను ప్రారంభించారు.

మధిర (Madhira) నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ఖమ్మం (Khammam) జిల్లా నాయకులు ఈ సందర్భంగా భట్టి విక్రమార్కకి ఘనంగా స్వాగతం పలికారు. భట్టి పాదయాత్ర ప్రారంభించిన యడవల్లికి జనంగా భారీగా వచ్చారు. గ్రామంలో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఘనస్వాగతం పలికారు. మహిళలు మంగళ హారతులు పట్టి తిలకం దిద్దారు. ముస్లిం, క్రిస్టియన్ మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. యువకులు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చారు. డప్పు వాయిద్యాలు, కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలతో యడవల్లి హోరెత్తింది. ఈ సందర్భంగా కార్యకర్తలు దారి పొడవునా భట్టి విక్రమార్కపై పూలవర్షం కురిపించారు.

పాదయాత్ర ప్రారంభం సందర్భంగా భట్టి విక్రమార్క ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రభుత్వం మెడలు వంచేందుకే ఈ పాద యాత్ర అని అన్నారు. తెలంగాణ తెచ్చుకున్నది సమస్యలు పోవాలని, అందరికి ఇళ్లు, ఉద్యోగాలు వస్తాయని అన్నారు. కానీ, అది నెరవేరలేదని అన్నారు. సంపద మొత్తం కొద్ది మంది పాలకుల ఇళ్లలోకే వెళ్తోందని, పేదలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉన్నారని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక ఒక్కసారి కూడా డీఎస్సీ వేయలేదని అన్నారు. ఏళ్లుగా నిరుద్యోగులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం కేంద్రంపై పోరాటం చేయాల్సిందేనని  భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు.

ప్రతి రోజూ 15 నుండి 20 కిలో మీటర్ల దూరం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) పాదయాత్ర కొనసాగించనున్నారు. గత ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ ఇచ్చిన హమీలను అమలు చేయాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేస్తున్నారు. మధిర నియోజకవర్గంలో పాదయాత్ర పూర్తైన తర్వాత ఖమ్మం జిల్లాలో కూడా యాత్ర చేయాలని భట్టి విక్రమార్క ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు ఎర్రుపాలెం అమలాపురం శ్రీ వెంకటేశ్వర ఆలయంలో పూజుల ముగించిన తర్వాత  పాదయాత్రను ముగించనున్నారు.

సోనియా గాంధీ (Sonia Gandhi) నాయకత్వంలో తెలంగాణ తెచ్చుకుంటే కేసీఆర్, ఆయన కుటుంబం, అనుచరులు బాగుపడడానికి ఉపయోగపడిందని సీఎం కేసీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యల గురించి అడిగితే పోలీసులతో కేసులు పెట్టిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ అంటే నలుగురు కుటుంబ సభ్యులు కాదని, నలుగురు మంత్రులు కాదని అన్నారు. పీపుల్స్‌ మార్చ్‌తో ప్రగతి భవన్‌ను బద్దలు కొడతామని మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Delimitation Politics : పునర్విభజనపై రేవంత్ బాటే కేటీఆర్ మాట - దక్షిణాదికి అన్యాయంపై యుద్ధమే - కలసి పోరాడతారా?
పునర్విభజనపై రేవంత్ బాటే కేటీఆర్ మాట - దక్షిణాదికి అన్యాయంపై యుద్ధమే - కలసి పోరాడతారా?
Telangana Congress: కాంగ్రెస్ నేతలకు పదవుల జాతర - నామినేటెడ్ పోస్టుల భర్తీకి సన్నాహాలు పూర్తి
కాంగ్రెస్ నేతలకు పదవుల జాతర - నామినేటెడ్ పోస్టుల భర్తీకి సన్నాహాలు పూర్తి
Natures Wonder: ఒకే చెట్టు రెండు రంగులు.. ఆదిలాబాద్ జిల్లాలో వింత ఇప్ప చెట్టు.. ప్రత్యేకత ఏంటంటే
ఒకే చెట్టు రెండు రంగులు.. ఆదిలాబాద్ జిల్లాలో వింత ఇప్ప చెట్టు.. ప్రత్యేకత ఏంటంటే
Ration shops: రేషన్ తీసుకోలేదని కంగారు పడుతున్నారా ..నో టెన్షన్ - 30వ తేదీ వరకూ తీసుకోవచ్చు!
రేషన్ తీసుకోలేదని కంగారు పడుతున్నారా ..నో టెన్షన్ - 30వ తేదీ వరకూ తీసుకోవచ్చు!

వీడియోలు

Ruturaj Angry with CSK Fielding vs KKR | ఫీల్డింగ్‌పై CSK కెప్టెన్ సీరియస్ వార్నింగ్
Noor Ahmad CSK vs KKR IPL 2026 | చెపాక్‌లో నూర్ అహ్మద్ సునామీ
Virat Kohli Injured in IPL 2026 ? | కాలికి కట్టుతో విరాట్.. టెన్షన్ లో ఫ్యాన్స్
Praful Hinge Huge Craze in Social Media | ఒకే మ్యాచ్‌తో ప్రఫుల్‌కు ఫుల్ క్రేజ్‌
IPL 2026 CSK vs KKR Highlights | చెన్నైపై వ‌రుస‌గా రెండో విజ‌యం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 RCB VS LSG Result Update: టాప్ లేపిన ఆర్సీబీ.. నాలుగో విజ‌యంతో స‌త్తా.. ఆకట్టుకున్న కోహ్లీ, భువీ, .. ల‌క్నో చిత్తు
టాప్ లేపిన ఆర్సీబీ.. నాలుగో విజ‌యంతో స‌త్తా.. ఆకట్టుకున్న కోహ్లీ, భువీ, .. ల‌క్నో చిత్తు
Delimitation Bill 2026: డీలిమిటేషన్‌తో పాకిస్తాన్‌కు చెక్! పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ఎన్నికల నిర్వహణకు అడుగులు!
డీలిమిటేషన్‌తో పాకిస్తాన్‌కు చెక్! పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ఎన్నికల నిర్వహణకు అడుగులు!
Raghurama on Amaravati: అమరావతిని చంద్రబాబు దేవతల రాజధాని అనడం మానేయాలి - డిప్యూటీ స్పీకర్ రఘురామ కీలక వ్యాఖ్యలు
అమరావతిని చంద్రబాబు దేవతల రాజధాని అనడం మానేయాలి - డిప్యూటీ స్పీకర్ రఘురామ కీలక వ్యాఖ్యలు
Ration shops: రేషన్ తీసుకోలేదని కంగారు పడుతున్నారా ..నో టెన్షన్ - 30వ తేదీ వరకూ తీసుకోవచ్చు!
రేషన్ తీసుకోలేదని కంగారు పడుతున్నారా ..నో టెన్షన్ - 30వ తేదీ వరకూ తీసుకోవచ్చు!
AP high Court: ఆకివీడు రామాలయంపై హైకోర్టు కీలక ఆదేశాలు - స్వయంగా వాదనలు వినిపించిన రఘురామ
ఆకివీడు రామాలయంపై హైకోర్టు కీలక ఆదేశాలు - స్వయంగా వాదనలు వినిపించిన రఘురామ
TDP Son Rise: మరో తరానికి టీడీపీ బాధ్యతలు - నారా లోకేష్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు వెనుక చంద్రబాబు వ్యూహం !
మరో తరానికి టీడీపీ బాధ్యతలు - నారా లోకేష్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు వెనుక చంద్రబాబు వ్యూహం !
Peddi Postponed: జూన్‌కు వాయిదా పడిన పెద్ది... అఫీషియల్‌గా చెప్పిన రామ్ చరణ్ టీం
జూన్‌కు వాయిదా పడిన పెద్ది... అఫీషియల్‌గా చెప్పిన రామ్ చరణ్ టీం
Gas Cylinder Blast: సత్యసాయి జిల్లాలో ఘోరం.. ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి నలుగురి మృతి, అసలేం జరిగింది?
సత్యసాయి జిల్లాలో ఘోరం.. ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి నలుగురి మృతి, అసలేం జరిగింది?
Embed widget