అన్వేషించండి

Bhadrachalam: భద్రాచలంలో వైభవంగా సీతారాముల కల్యాణం, ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు

Bhadrachalam: రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు ఇంద్రకరణ్‌ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్‌‌, సత్యవతి రాథోడ్‌ సీతారాములకు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.

Bhadrachalam: భద్రాచలం సీతారామ స్వామివారి కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. మిథిలా మండపంలో ఏర్పాటు చేసిన వేదికపై అభిజిత్‌ లగ్నంలో అర్చకులు  కల్యాణోత్సవాన్ని కన్నులపండువగా నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌ కుమార్, సత్యవతి రాఠోడ్‌, తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. ముత్యాల తలంబ్రాలను మంత్రులు, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల కలెక్టర్లు అందజేశారు.

తొలుత ఉదయం 9 గంటల వరకు మూలమూర్తులకు ఏకాంతంగా తిరుకల్యాణం జరిపారు. అనంతరం మిథిలా స్టేడియానికి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తీసుకొచ్చి.. మిథిలా స్టేడియంలో పుణ్యాహవచనం, విశ్వక్సేన ఆరాధన గావించారు. యోత్ర ధారణ, కంకణ ధారణ, మాంగల్య ధారణ, తలంబ్రాల వేడుకలు జరుపుతారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు శ్రీ సీతారాముల కల్యాణోత్సవం నిర్వహించారు. రేపు వైభవంగా శ్రీరామచంద్ర పట్టాభిషేక మహోత్సవం నిర్వహిస్తారు. శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో 2 వేల మంది పోలీసులతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

కల్యాణ మహోత్సవాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు భక్తులు భారీగా హాజరయ్యారు. శ్రీరాముడి నినాదాలతో భద్రాద్రి మారుమోగింది. ఆలయ ప్రాంగణంతో పాటు భద్రాచలం వీధులన్నీ భక్తులతో నిండిపోయాయి. కరోనా పరిస్థితుల కారణంగా గత రెండేళ్లుగా స్వామివారి కల్యాణాన్ని ఘనంగా నిర్వహించని సంగతి తెలిసిందే. ఆ కల్యాణాన్ని వీక్షించేందుకు భక్తులకు అనుమతి ఇవ్వలేదు. ఈ ఏడాది కరోనా బెడద లేకపోవడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. భక్తులకు పంపిణీ చేసేందుకు వీలుగా 2 లక్షల ప్యాకెట్ల స్వామి వారి తలంబ్రాలను అధికారులు సిద్ధం చేశారు.

నేడు భద్రాచలానికి గవర్నర్ తమిళిసై
నేడు శ్రీరామనవమి సందర్భంగా గవర్నర్ తమిళిసై భద్రాచలం సందర్శించనున్నారు. సీతారాముల కల్యాణం సందర్భంగా భద్రాద్రికి గవర్నర్, వీఐపీలు వస్తుడండంతో ఆలయ అధికారులు, పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేపట్టారు. రేపు రామప్ప ఆలయాన్ని కూడా గవర్నర్ సందర్శిస్తారు. రెండ్రోజుల పాటు భద్రాచలంలోని మారుమూల మూడు గ్రామాలను గవర్నర్ తమిళిసై సందర్శించనున్నారు.

ఒంటిమిట్టలోనూ ఉత్సవాలు ప్రారంభం
ఒంటిమిట్ట కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. శ్రీ రామనవమి సందర్భంగా అంగరంగవైభవంగా ఓంటిమిట్ట కోదండరాముడి ద్వజారోహణ కార్యక్రమం వేద పండితులు నిర్వహించారు. వేద పండితుల మత్రోచ్చారణల నడుమ వైభవోపేతంగా వేడుక సాగింది. కేరళ వాయిద్యాలతో  ఆలయ ప్రాంగణం మార్మోగింది. టీటీడీ వాయిద్యాలతో సాగిన ద్వజారోహణ కార్యక్రమం,  వైభవోపేతంగా సాగిన వేడుకను చూసి భక్తులు తన్మయత్వం చెందారు. రామ నామస్మరణలతో ఆలయ ప్రాగణం మార్మోగింది. స్వామి వారికి ప్రభుత్వం తరపున రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి, జడ్పీ ఛైర్మన్ ఆకెపాటి అమర్నాధ్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Anantapur TDP: అనంతపురం టీడీపీలో భగ్గుమన్న అసంతృప్తి- పార్టీ ఆఫీసుపై దాడి, ఫర్నిచర్‌ దహనం
అనంతపురం టీడీపీలో భగ్గుమన్న అసంతృప్తి- పార్టీ ఆఫీసుపై దాడి, ఫర్నిచర్‌ దహనం
Tecno Pova 6 Pro 5G: బ్యాక్ డిజైన్ హైలెట్‌గా మార్కెట్లోకి వచ్చిన టెక్నో పోవా 6 ప్రో 5జీ - ధర ఎంతంటే?
బ్యాక్ డిజైన్ హైలెట్‌గా మార్కెట్లోకి వచ్చిన టెక్నో పోవా 6 ప్రో 5జీ - ధర ఎంతంటే?
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Why did K. Annamalai read the Quran | బీజేపీ యంగ్ లీడర్ అన్నామలై ఖురాన్ ఎందుకు చదివారు..?  | ABPKadiyam Srihari and kadiyam Kavya joins into Congress | కడియంకు రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ | ABP DesamSun Stroke  Symptoms and Treatment | వడదెబ్బ తగిలిన వ్యక్తికి ఓఆర్ఎస్ నీళ్లు ఇవ్వొచ్చా? | ABP DesamRR vs DC Highlights IPL 2024 | Avesh Khan Bowling | చివరి ఓవర్ లో 4 పరుగులే ఇచ్చిన ఆవేశ్ ఖాన్ | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Anantapur TDP: అనంతపురం టీడీపీలో భగ్గుమన్న అసంతృప్తి- పార్టీ ఆఫీసుపై దాడి, ఫర్నిచర్‌ దహనం
అనంతపురం టీడీపీలో భగ్గుమన్న అసంతృప్తి- పార్టీ ఆఫీసుపై దాడి, ఫర్నిచర్‌ దహనం
Tecno Pova 6 Pro 5G: బ్యాక్ డిజైన్ హైలెట్‌గా మార్కెట్లోకి వచ్చిన టెక్నో పోవా 6 ప్రో 5జీ - ధర ఎంతంటే?
బ్యాక్ డిజైన్ హైలెట్‌గా మార్కెట్లోకి వచ్చిన టెక్నో పోవా 6 ప్రో 5జీ - ధర ఎంతంటే?
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Chandrababu Prajagalam :  టీడీపీది విజన్ , వైసీపీ ది పాయిజన్  -  ప్రజాగళం బహిరంగసభల్లో చంద్రబాబు విమర్శలు
టీడీపీది విజన్ , వైసీపీ ది పాయిజన్ - ప్రజాగళం బహిరంగసభల్లో చంద్రబాబు విమర్శలు
Hindupuram Politics :   కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
Ticket For Raghurama :  ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు -  ఎన్డీఏ కూటమిలో విస్తృత చర్చ
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు - ఎన్డీఏ కూటమిలో విస్తృత చర్చ
Sreemukhi Photos: చుడిదార్‌లో శ్రీముఖి ఎంత ముద్దొస్తుందో - బుల్లితెర రాములమ్మ భలే ఉంది కదూ!
చుడిదార్‌లో శ్రీముఖి ఎంత ముద్దొస్తుందో - బుల్లితెర రాములమ్మ భలే ఉంది కదూ!
Embed widget