అన్వేషించండి

Bandi Sanjay Warning: మావోయిస్టులతో లింకులు కట్ చేసుకోండి, లేకపోతే అంతే: బండి సంజయ్ వార్నింగ్

మావోయిస్టులతో గానీ, ఆయుధాలు కలిగి ఉన్న గ్రూపులతో సంబంధాలు ఇకనైనా తెంచుకోవాలని లేకపోతే వారి గుట్టు రట్టు చేస్తామని తెలంగాణ నేతలను బండి సంజయ్ హెచ్చరించారు.

Bandi Sanjay warning to Telangana politicians | హైదరాబాద్: తెలంగాణ రాజకీయ నేతలకు కేంద్ర హోం మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ హెచ్చరిక జారీ చేశారు. ఆయుధాలకు సంబంధించిన గ్రూపులకు మద్ధతిస్తూ కొందరు ప్రజాస్వామ్యం పేరుతో మాట్లాడుతున్నవారు.. వారు ఇప్పటికైనా తమ సంబంధాలను తెంచుకోవాలని హెచ్చరించారు. లేనిపక్షంలో మావోయిస్టులు, ఆయుధ గ్రూపులతో సంబంధాలను బహిర్గతం చేస్తామని బండి సంజయ్ తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం అన్నీ గుర్తిస్తుంది..

మావోయిస్టు కేడర్ల వద్దే కాకుండా, అవినీతి, నేరపరమైన కార్యకలాపాలు చేస్తున్న నేతలు.. తీవ్రవాద సంబంధాలను కాపాడుకునే వారిని కూడా కేంద్ర ప్రభుత్వం గుర్తిస్తుందన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మార్గదర్శకత్వంలో దేశ భద్రత కోసం కేంద్రం కఠిన చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. కొందరు నేతలకు మావోయిస్టులు, నక్సలైట్ల గ్రూపులతో సంబంధాలు ఉన్నాయని ఇటీవల మహారాష్ట్ర సీఎం దేవెంద్ర ఫడ్నవీస్ సమక్షంలో లొంగిపోయిన మల్లోజుల వేణుగోపాల్ రావు తెలిపిన వార్తలు న్యూస్ పేపర్లలో వచ్చాయి. 

నేతలు మావోయిస్టులతో సంబంధాలు తెంచుకోవాలి

తెలంగాణకు చెందిన కొందరు నేతలకు మావోయిస్టులతో లింకులు ఉన్నాయని, ఆయుధాలకు సంబంధించిన గ్రూపులతోనే సంబంధాలు ఉన్నాయని మావోయిస్టులు తెలిపారన్న కథనాలపై బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. మావోయిస్టులు, ఆయుధాలు కలిగి ఉన్న గ్రూపులు, గ్యాంగ్స్, దేశ భద్రతకు విఘాతం కలిగించేలా వ్యవహరించేవారు ఎవరైనా సరే, ఎంత పెద్ద నాయకులైనా కఠిన చర్యలు తప్పవని బండి సంజయ్ హెచ్చరించారు.

మావోయిస్ట్ టాప్ కమాండర్ హిడ్మా సైతం తెలంగాణలోనే తలదాచుకున్నాడని కథనాలు వచ్చాయి. ఛత్తీస్ గఢ్ వదిలి తన 250 మంది అనుచరులతో కలిసి మాడవి హిడ్మా తెలంగాణకు వచ్చాడని సమాచారం. వందల మంది మావోయిస్టులు పోలీసులకు లొంగిపోతున్న సమయంలో ఇంకా హిడ్మా లాంటి కొందరు టాప్ మావోయిస్టుల కోసం పోలీసులు, భద్రతా బలగాలు ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామని హోం మంత్రి అమిత్ షా చెప్పిన మాటలకు అనుగుణంగానే అడవులను జల్లెడ పడుతున్నాయి బలగాలు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Panchayat Elections 2025:తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
Tirupati Outer Ring Road: తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
Pragathi : సరదాగా అనుకున్నా... డెడికేషన్‌తో ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించారు - నటి ప్రగతిపై నాగబాబు ప్రశంసలు
సరదాగా అనుకున్నా... డెడికేషన్‌తో ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించారు - నటి ప్రగతిపై నాగబాబు ప్రశంసలు
Advertisement

వీడియోలు

నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్
North Pole vs South Pole | ధృవాల గురించి ఈ విషయాలు తెలుసుకుంటే షాక్ అయిపోతారు | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Panchayat Elections 2025:తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
Tirupati Outer Ring Road: తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
Pragathi : సరదాగా అనుకున్నా... డెడికేషన్‌తో ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించారు - నటి ప్రగతిపై నాగబాబు ప్రశంసలు
సరదాగా అనుకున్నా... డెడికేషన్‌తో ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించారు - నటి ప్రగతిపై నాగబాబు ప్రశంసలు
Amaravati: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడానికి కేంద్రం మెలిక పెట్టిందా? బిల్లును వెనక్కి పంపించిందా?
అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడానికి కేంద్రం మెలిక పెట్టిందా? బిల్లును వెనక్కి పంపించిందా?
The Raja Saab : 'అఖండ 2'తో మోగ్లీ రావడం అదృష్టం - ఫ్రస్టేషన్ ఎందుకు తమ్ముడు?... డైరెక్టర్ మారుతి స్పీచ్ హైలెట్స్
'అఖండ 2'తో మోగ్లీ రావడం అదృష్టం - ఫ్రస్టేషన్ ఎందుకు తమ్ముడు?... డైరెక్టర్ మారుతి స్పీచ్ హైలెట్స్
Chandrababu: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?
మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?
Maruti Victoris రియల్‌ వరల్డ్‌ మైలేజ్‌ టెస్ట్‌ - సిటీలో ఎంత ఇచ్చింది?, హైవేపై ఎంత చూపించింది?
Maruti Victoris రియల్‌ వరల్డ్‌ మైలేజ్‌ టెస్ట్‌ - సిటీలో ఎంత ఇచ్చింది?, హైవేపై ఎంత చూపించింది?
Embed widget