Top Headlines Today: టికెట్ ఇవ్వకుంటే ఆప్షన్ బి ఉందన్న బుద్ధా వెంకన్న! ఆస్పత్రిలో కేసీఆర్ ను పరామర్శించిన సీఎం రేవంత్
AP Telangana Latest News 10 December 2023: తెలుగు రాష్ట్రాల్లో నేటి ఉదయం నుంచి టాప్ హెడ్ లైన్స్ మీకోసం..
Top Headlines Today: కోలుకొని అసెంబ్లీకి రావాలని కేసీఆర్ను కోరా, ఆస్పత్రికి వెళ్లి పరామర్శించిన సీఎం రేవంత్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను పరామర్శించారు. ఇందుకోసం రేవంత్ రెడ్డి యశోద ఆస్పత్రికి వెళ్లారు. సోమాజీగూడలోని యశోద ఆస్పత్రిలో 9వ ఫ్లోర్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చికిత్స పొందుతున్నారు. నాలుగు రోజుల క్రితం ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్లో కేసీఆర్ కాలుజారి పడిన సంగతి తెలిసిందే. కేసీఆర్కు తుంటి విరగడంతో యశోద ఆస్పత్రిలో తుంటి మార్పిడి శస్త్ర చికిత్స చేశారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను పరామర్శించడానికి వెళ్లారు. రేవంత్ రెడ్డి వెంట షబ్బీర్ అలీ, మంత్రి సీతక్క తదితరులు ఉన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
ఆర్&బీ మంత్రిగా కోమటిరెడ్డి బాధ్యతలు - మాజీ మంత్రి హరీశ్ రావుకు కౌంటర్
తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆదివారం (డిసెంబర్ 10) తెలంగాణ సచివాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా నేడు 9 ఫైల్స్ పై మంత్రి సంతకాలు చేశారు. నల్గొండ నుంచి ధర్మాపురం, ముషంపల్లి రోడ్డును నాలుగు లైన్లుగా చేయడం, కొడంగల్, దుడ్యాల రహదారి విస్తీర్ణానికి సంబంధించిన ఫైల్స్ కూడా ఉన్నాయి. తాను సంతకం చేసిన ఈ 9 ఫైల్స్ లో 5 ఫైల్స్ కు అనుమతి గురించి సోమవారం నితిన్ గడ్కరీని కలుస్తానని చెప్పారు. అయితే, గత పదేళ్లుగా రోడ్ల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం శ్రద్ధ పెట్టలేదని కోమటిరెడ్డి విమర్శించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
విజయవాడ పశ్చిమ నుంచే పోటీ చేస్తా - టికెట్ ఇవ్వకుంటే ఆప్షన్ బి ఉందన్న టీడీపీ నేత బుద్ధా వెంకన్న
రాబోయే ఎన్నికల్లో తాను విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న (Buddha Venkanna) స్పష్టం చేశారు. ఆదివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తనకు అక్కడి నుంచే సీటివ్వాలని పార్టీ అధినేత చంద్రబాబును (Chandrababu) కోరుతానని చెప్పారు. బీసీ అభ్యర్థిగా ఆ నియోజకవర్గం నుంచి తనకు సీటిస్తారనే నమ్మకం ఉందని తెలిపారు. ఒకవేళ అక్కడ సీటు ఇవ్వకుంటే తనకు ఆప్షన్ - బి ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 'ఆడుదాం ఆంధ్ర' పేరుతో ఏపీ ప్రభుత్వం కొత్త నాటకానికి తెర లేపిందని విమర్శించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
https://telugu.abplive.com/news/andhra-news-buddha-venkanna-sensational-comments-on-coming-election-ticket-allotment-latest-news-132645
తెలంగాణలో విద్యుత్ అప్పుల రాజకీయాలు - సంక్షోభాన్ని కేసీఆర్ సర్కార్ దాచి పెట్టిందా?
తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రేవంత్ రెడ్డి పవర్ సెక్టార్ పైనే ప్రత్యేక దృష్టి సారించారు. కాంగ్రెస్ రాగానే కరెంట్ సంక్షోభం వచ్చిందనిపించేలా కరెంట్ సరఫరాకు ఆటంకాలు కలిగించేలా కుట్ర చేశారని రేవంత్ రెడ్డి అనుమానించారు. అందుకే ఆ శాఖపై మొదటి సమీక్ష చేశారు. ఆ సమీక్షలో విద్యుత్ సంస్థలకు దాదాపుగా రూ. 86 వేల కోట్ల అప్పు అన్నట్లుగా తేలింది. దీంతో రాజకయం ప్రారంభమయింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
ఫిబ్రవరిలోనే సాధారణ ఎన్నికలు ? కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోందా ?
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. భారతీయ జనతా పార్టీ ( BJP ) మూడు రాష్ట్రాల్లో గెలిచింది. కాంగ్రెస్ ఒక్క రాష్ట్రంతో సరి పెట్టుకుంది. అయితే ఈ ఎన్నికలు సెమీ ఫైనల్సే. ఫైనల్స్ మరో మూడు నెలల్లోనే ఉన్నాయి. అవి సార్వత్రిక ఎన్నికలు. అయితే ఒక నెల ముందే ఎన్నికలు పెట్టే ఆలోచనలో కేంద్ర ఎన్నికల సంఘం ( Central Election Commision ) ఉందని.. దీనికి బీజేపీ మద్దతు కూడా ఉందని జోరుగా ప్రచారం ప్రారంభమయింది. ఇలా పెట్టే అవకాశం ఉందని చెప్పుకోవడానికి రాజకీయ పరమైన , నిర్వహణ పరమైన కారణాలు స్పష్టంగా కనిపిస్తూనే ఉన్నాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి