అన్వేషించండి

Breaking News Live Telugu Updates: మాజీ మంత్రి యర్రా నారాయణస్వామి కన్నుమూత

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

LIVE

Key Events
Breaking News Live Telugu Updates: మాజీ మంత్రి యర్రా నారాయణస్వామి కన్నుమూత

Background

నిన్న మధ్య చత్తీస్‌గఢ్ నుంచి ఉన్న ద్రోణి నేడు మరఠ్వాడ నుంచి ఇంటీరియర్ కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకూ సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తు వద్ద కొనసాగుతూ ఉందని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

ఇక ఇప్పటిదాకా అక్కడక్కడ జల్లులు కురవగా.. నేటి నుంచి వాతావరణం తెలంగాణలో పొడిగా ఉండనుందని వాతావరణ అధికారులు తెలిపారు. మార్చి 29 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని తెలిపారు. మార్చి 31న మాత్రం తెలంగాణలో ఓ మోస్తరు నుంచి అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

హైదరాబాద్ లో ఇలా
‘‘హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో సాయంత్రం లేదా రాత్రి సమయంలో ఉరుములతో కూడిన మేఘాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 37 డిగ్రీలు, 24 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఆగ్నేయ దిశల నుంచి గాలులు గంటకు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 36.0 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 24.0 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 069 శాతం నమోదైంది.

ఏపీలో వర్షాలు ఇలా
ఏపీలో నేడు ఎక్కడా వర్షాలు పడే అవకాశం లేదని అమరావతిలోని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఉరుములు, మెరుపులు లాంటి వాతావరణంతో పాటు బలమైన గాలులు దాదాపు 30 నుంచి 40 కిలో మీటర్ల వరకూ వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. ఉత్తర కోస్తా, యానం, దక్షిణ కోస్తాలోని అన్ని జిల్లాల్లో ఈ రకమైన వాతావరణం ఉంటుందని తెలిపారు. వచ్చే 5 రోజుల పాటు ఇదే రకం వాతావరణ పరిస్థితి ఉంటుందని తెలిపారు.

 

ఢిల్లీలో వాతావరణం ఇలా..
రానున్న నాలుగైదు రోజుల పాటు దక్షిణ భారతదేశంలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షం కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, దక్షిణ అంతర్గత కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, కేరళ, మహేలలో వాతావరణం మరోసారి ఆహ్లాదకరంగా ఉంటుంది. అయితే, ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో బుధవారం (మార్చి 29) ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకునే అవకాశం ఉంది.

వాతావరణ శాఖ ప్రకారం, మండుతున్న వేడి తర్వాత, నెల చివరి రెండు రోజుల్లో (30-31 మార్చి) తాజా రౌండ్ వర్షం ప్రారంభమవుతుంది. ఈ రెండు రోజుల్లో న్యూ ఢిల్లీలో తేలికపాటి వర్షం లేదా చినుకులు పడవచ్చు. మార్చి 30న, న్యూఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 19 మరియు గరిష్ట ఉష్ణోగ్రత 32.0 ఉండవచ్చు. మార్చి 31న కనిష్ట ఉష్ణోగ్రత 18, గరిష్ట ఉష్ణోగ్రత 28గా నమోదయ్యే అవకాశం ఉంది.

ఈ రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం

ఈరోజు (మార్చి 29) దక్షిణ భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, కేరళలో వర్షాలు కురిసిన తర్వాత ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టనున్నాయి. అదే సమయంలో, ఒడిశా, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం మరియు పశ్చిమ బెంగాల్‌లోని త్రిపుర, కేరళ, మహేలోని గంగా తీర ప్రాంతాలలో 30 నుండి 40 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.

ఉత్తర భారతంలో కూడా వర్షాలు పడే అవకాశం

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఈరోజు అంటే మార్చి 29న ఉష్ణోగ్రతలో చెప్పుకోదగ్గ మార్పులు ఏమీ ఉండవు. మార్చి 30, 31 తేదీల్లో లక్నోలో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీనితో పాటు గాలులతో పాటు వర్షం కూడా కనిపిస్తుంది. పంజాబ్‌లోని జలంధర్‌లోనూ వర్షాలు కొనసాగుతాయి. మార్చి 30 నుంచి ఏప్రిల్ 3 వరకు వర్షం కారణంగా వాతావరణం కాస్త చల్లగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

20:15 PM (IST)  •  29 Mar 2023

వైఎస్ జగన్ కు నోటీసుల జారీకి సీజేఐ ఆదేశాలు

వాలంటీర్లకి నెలకి 200 రూపాయలు ఇచ్చి, సాక్షి పేపర్ని కొనిపించడం అధికార దుర్వినియోగం అని ఈనాడు యాజమాన్యం సుప్రీం కోర్టుని ఆశ్రయించింది. సాక్షి ఓనర్ కు, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇవ్వాలని సిజెఐ ఆదేశాలు జారీ చేశారు.

18:47 PM (IST)  •  29 Mar 2023

మాజీ మంత్రి యర్రా నారాయణస్వామి కన్నుమూత

ప.గో.జిల్లా:

సీనియర్ నాయకులు, పార్లమెంట్ మాజీ సభ్యులు, మాజీ మంత్రి యర్రా నారాయణస్వామి భీమవరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు..

అయన భౌతిక కాయాన్ని మరికొద్ది సేపట్లో ఆయన స్వగ్రామమైన  ఉండి మండలం ఉప్పులూరుకు తరలించనున్నారు..

15:04 PM (IST)  •  29 Mar 2023

BJP Office: బీజేపీ కార్యాలయం గేటుపై నీలి రంగు చల్లిన గుర్తు తెలియని దుండగులు

  • అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో బీజేపీ కార్యాలయం ప్రధాన గేటుపై నీలి రంగు చల్లిన గుర్తు తెలియని దుండగులు 
  • రెండు బైక్ లపై వచ్చి నీలి రంగు చల్లి దుండగులు పరార్
  • అబిడ్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన బిజేపీ కార్యాలయ కార్యదర్శి
  • అర్ధరాత్రి 1.45 గంటలకు ఘటన జరిగినట్లు సీసీటీవీ ఫుటేజీ ద్వారా గుర్తించిన పోలీసులు 
  • కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు
14:49 PM (IST)  •  29 Mar 2023

Extra Charges for UPI Payments: UPI పేమెంట్స్‌ ఛార్జీలపై NPCI క్లారిటీ

ఏప్రిల్‌ 1 నుంచి ఆన్‌లైన్‌ వ్యాలెట్లు, ప్రీ-లోడెడ్‌ గిఫ్ట్‌ కార్డుల వంటి ‘ప్రీపెయిడ్‌ పేమెంట్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ (PPI)’ ద్వారా చేసే యూపీఐ మర్చంట్‌ లావాదేవీలపై మాత్రమే అదనపు ఛార్జీలను విధించనున్నట్లు ‘నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా’ (NPCI) వెల్లడించింది. పీపీఐ ద్వారా ₹ 2 వేల కంటే ఎక్కువ యూపీఐ లావాదేవీ జరిపితే 1.1 శాతం ఇంటర్‌ఛేంజ్‌ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది.

అయితే, ఒక వ్యక్తి బ్యాంక్‌ అకౌంట్‌ నుంచి మరో బ్యాంక్‌ అకౌంట్‌కు, వినియోగదారుల నుంచి వ్యాపారుల మధ్య జరిగే యూపీఐ లావాదేవీలపై ఎలాంటి అదనపు రుసుము ఉండదని స్పష్టం చేసింది. అంటే సామాన్య ప్రజలు రోజువారీ చెల్లింపుల కోసం యూపీఐ యాప్‌లను వినియోగిస్తే ఎలాంటి అదనపు రుసుము వర్తించదు.

14:38 PM (IST)  •  29 Mar 2023

Viveka Murder Case Update: వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తునకు సీబీఐ కొత్త సిట్ ఏర్పాటు

వివేకానందరెడ్డి హత్య కేసును ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారి రాంసింగ్‌ను సుప్రీంకోర్టు తొలగించింది. దర్యాప్తు కోసం కొత్త టీమ్‌ను నియమించి ఏప్రిల్ 30 లోగా కేసు దర్యాప్తును ముగించాలని సుప్రీంకోర్టు గడువు విధించింది. ప్రత్యేక అధికారులుగా సీబీఐ డీఐజీ చౌరాసియా నేత్రుత్వంలో సభ్యులుగా ఎస్పీ వికాస్ సింగ్, ఏఎస్పీ ముఖేష్ కుమార్, సీఐ శ్రీమతి, నవీన్ పునియా, ఎస్సై అంకిత్ యాదవ్ ను నియమించింది.

14:38 PM (IST)  •  29 Mar 2023

Viveka Murder Case Update: వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తునకు సీబీఐ సిట్ ఏర్పాటు

వివేకానందరెడ్డి హత్య కేసును ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారి రాంసింగ్‌ను సుప్రీంకోర్టు తొలగించింది. దర్యాప్తు కోసం కొత్త టీమ్‌ను నియమించి ఏప్రిల్ 30 లోగా కేసు దర్యాప్తును ముగించాలని సుప్రీంకోర్టు గడువు విధించింది. ప్రత్యేక అధికారులుగా సీబీఐ డీఐజీ చౌరాసియా నేత్రుత్వంలో సభ్యులుగా ఎస్పీ వికాస్ సింగ్, ఏఎస్పీ ముఖేష్ కుమార్, సీఐ శ్రీమతి, నవీన్ పునియా, ఎస్సై అంకిత్ యాదవ్ ను నియమించింది.

14:24 PM (IST)  •  29 Mar 2023

Viveka Murder Case: వివేకా హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

వివేకానందరెడ్డి హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. హత్య కేసు దర్యాప్తును ఏప్రిల్ 30 కల్లా ముగించాలని ఆదేశించింది. 

13:08 PM (IST)  •  29 Mar 2023

Hanamkonda Latest News: తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల సంఘర్షణ సభ వాయిదా

  • హనుమకొండ జిల్లా కేయూలో నేడు జరగనున్న తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల సంఘర్షణ సభ వాయిదా
  • సభకు అనుమతి ఇవ్వని కేయూ అధికారులు
  • హై కోర్టులో తెల్చుకుంటామంటున్న కేయూ జాక్ నేతలు
  • సభ రద్దు కావడంతో కాకతీయ యునివర్సిటీ లైబ్రెరీ వద్ద మహా ధర్నాకు దిగిన విద్యార్థులు, నిరుద్యోగులు
  • భారీగా తరలివస్తున్న విద్యార్థులు, నిరుద్యోగులు, గ్రూప్ 1 అభ్యర్థులు
  • అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న పోలీసులు, వీసీ ఛాంబర్ ముందు నిరసన
11:46 AM (IST)  •  29 Mar 2023

కర్ణాటక ఎన్నికల తేదీలు ఖరారు

కర్ణాటక ఎన్నికల షెడ్యూల్‌ని కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. పూర్తి వివరాల కోసం ఈ పేజ్‌ను రిఫ్రెష్ చేస్తూ ఉండండి. 

09:32 AM (IST)  •  29 Mar 2023

TDP News: నేడు టీడీపీ ఆవిర్భావ వేడుకలు, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో

  • ఈ రోజు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో టీడీపీ 41వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
  • హాజరుకానున్న పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు
  • తెలుగు రాష్ట్రాల నుండి హాజరుకానున్న టీడీపీ ప్రజాప్రతినిధులు
  • మధ్యాహ్నం 3 గంటలకు ఇంటి నుండి ఎన్టీఆర్ ఘాట్ కు చంద్రబాబు
  • సాయంత్రం 4 గంటలకు నాంపల్లిలోని సభా వేదిక వద్దకు చేరుకోనున్న చంద్రబాబు
Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
BRS on Kadiam : కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
AP DSC: ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
KK Meets Revanth Reddy: రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Kadiyam Srihari and kadiyam Kavya joins into Congress | కడియంకు రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ | ABP DesamSun Stroke  Symptoms and Treatment | వడదెబ్బ తగిలిన వ్యక్తికి ఓఆర్ఎస్ నీళ్లు ఇవ్వొచ్చా? | ABP DesamRR vs DC Highlights IPL 2024 | Avesh Khan Bowling | చివరి ఓవర్ లో 4 పరుగులే ఇచ్చిన ఆవేశ్ ఖాన్ | ABPRR vs DC Highlights IPL 2024 | Riyan Parag Batting | పాన్ పరాగ్ అన్నారు..పరేషాన్ చేసి చూపించాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
BRS on Kadiam : కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
AP DSC: ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
KK Meets Revanth Reddy: రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
Tillu Square Movie Review - టిల్లు స్క్వేర్ రివ్యూ: సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్ సినిమా హిట్టా? ఫట్టా? సినిమా ఎలా ఉందంటే?
టిల్లు స్క్వేర్ రివ్యూ: సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్ సినిమా హిట్టా? ఫట్టా? సినిమా ఎలా ఉందంటే?
Tillu Square: ‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
Actor Govinda: అప్పుడు.. రాజకీయాల్లోకి చేరడమే పెద్ద తప్పన్నాడు - ఇప్పుడు ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు, ఏంటి గోవిందా ఇది?
అప్పుడు.. రాజకీయాల్లోకి చేరడమే పెద్ద తప్పన్నాడు - ఇప్పుడు ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు, ఏంటి గోవిందా ఇది?
AI అనేది ఓ మ్యాజిక్ టూల్‌, సరైన విధంగా వాడుకోవాలి - బిల్‌గేట్స్‌తో ప్రధాని మోదీ
AI అనేది ఓ మ్యాజిక్ టూల్‌, సరైన విధంగా వాడుకోవాలి - బిల్‌గేట్స్‌తో ప్రధాని మోదీ
Embed widget