అన్వేషించండి

Breaking News Live Telugu Updates: సీఎం జగన్‌ను కలిసి దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

LIVE

Key Events
Breaking News Live Telugu Updates: సీఎం జగన్‌ను కలిసి దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ

Background

సిత్రాంగ్ తుపాను బంగ్లాదేశ్ వైపుగా వెళ్లి టికోనా దీవి వద్ద తీరాన్ని దాటింది. దీని ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్, త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. సిత్రాంగ్ తుపాను కారణంగా తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఏపీ, తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నా, రాత్రివేళ చలి అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.

శ్రీలంక, మధ్య తమిళనాడు మీదుగా అల్పపీడనం ఏర్పడింది. ఇది వాయుగుండంగా మారి తీవ్ర వాయుగుండం అవుతుంది. దీని ప్రభావంతో అక్టోబర్ 28 రాత్రి నుంచి ఏపీ, తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి, హైదరాబాద్ వాతావరణ కేంద్రాలు అంచనా వేశాయి. నైరుతి రుతుపవనాల కాలం అయిపోయింది. ఇక ఈశాన్య రుతుపవనాల వర్షాలు త్వరలోనే మొదలవుతాయి. అక్టోబర్ 29 నుంచి పరిస్ధితులు వర్షాలకు అనుకూలంగా మారతాయి.  

తెలంగాణలో వాతావరణం ఇలా (Telangana Weather Updates)
సిత్రాంగ్ తుపాను ప్రభావంతో వర్షాలు కురవకపోయినా చలి తీవ్రత రాష్ట్రంలో పెరుగుతోంది. రాష్ట్రంలో గత మూడు, నాలుగు రోజుల నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టాయి. కొన్ని జిల్లాల్లో చినుకు కూడా పడటం లేదు. నేడు ఒకట్రెండు చోట్ల తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఉదయం పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రాత్రి వేళ చలి తీవ్రత సైతం అధికం అవుతోంది. హైదరాబాద్ లో ఆకాశం నిర్మలంగా ఉంటుంది. నగరంలో ఉదయం వేళ పొగమంచు ఏర్పడుతుంది. హైదరాబాద్ లో గరిష్ట ఉష్ణోగ్రత 31 కాగా, కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీలుగా నమోదైంది. వాయువ్య దిశ నుంచి గంటకు 6 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. 

ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
వాతావరణ శాఖ ముందుగా తెలిపినట్లే సిత్రాంగ్ తుపాను ఏపీపై ప్రభావం చూపలేదు. సిత్రాంగ్ తుపాను బంగ్లాదేశ్ వద్ద తీరాన్ని దాటడంతో ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్, ఒడిశాలో వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు ఉత్తర కోస్తాంధ్రలో ఈశాన్య రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. వీటి ప్రభావంతో అక్టోబర్ చివరి నుంచి కోస్తాంధ్రాలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురవనున్నాయి. సిత్రాంగ్ తుపాను ముప్పు ఏపీపై లేనప్పటికీ, చలి తీవ్రత పెరుగుతోందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో ఒకట్రెండు చోట్ల చిరుజల్లులు పడతాయి. ఉత్తర బంగాళాఖాతం తీరం నుంచి గంటకు 70 నుంచి 80 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లడం సురక్షితం కాదని హెచ్చరించారు. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో చలి తీవ్రత పెరుగుతోంది.

దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
శ్రీలంక, తమిళనాడుల మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. మరో రెండు రోజుల తరువాత దీని ప్రభావం ఏపీపై ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వర్షాలు దాదాపుగా తగ్గుముఖం పట్టాయి. దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడతాయి. గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి జల్లులు పడతాయి. రాయలసీమలోనూ వర్షాలు లేవు. ఇక్కడ కూడా సిత్రాంగ్ తుపాను ప్రభావం చాలా తక్కువగా ఉంది. రోజురోజుకూ చలి తీవ్రత అధికం కానుంది.

16:25 PM (IST)  •  26 Oct 2022

రాజాసింగ్‌కు షాక్- పీడీ యాక్ట్‌ను సమర్థించిన అడ్వైజరీ బోర్డు

బీజేపీ శాసనసభ్యుడు రాజాసింగ్‌పై పెట్టిన పీడీ యాక్ట్‌ను సమర్థించిన పీడీ అడ్వైజరీ బోర్డు. పోలీసులు తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది. తనపై పీడీ చట్టం ఎత్తేయాలని రాజాసింగ్ చేసిన విజ్ఞప్తిని తిరస్కరిస్తూ నిర్ణయం తీసుకుంది. 

16:14 PM (IST)  •  26 Oct 2022

సీఎం జగన్‌ను కలిసి దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌తో దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ భేటీ అయ్యారు. గతంలో టికెట్‌ల వివాదం చెలరేగినప్పుడు కూడా ఆయన ఓసారి సీఎంతో సమావేశమయ్యారు. ఇప్పుడు చాలా రోజుల తర్వాత భేటీ అవ్వడం చర్చనీయాంశంగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు రామ్‌గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్‌ సినిమా తీశారు. అప్పట్లో అదో సంచలనంగా మారింది. వైసీపీ స్పాన్సర్డ్‌ సినిమాగా టీడీపీ ప్రచారం చేసింది. ఇప్పుడు కూడా వీళ్లిద్దరు భేటీ కావడంతో మరోసారి సినిమాల ప్రస్తావన తెరపైకి వచ్చింది. 

13:43 PM (IST)  •  26 Oct 2022

టీ20 వరల్డ్ కప్‌లో మరో సంచలనం- ఇంగ్లండ్‌పై ఐర్లాండ్ విజయం

ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ 20 వరల్డ్ కప్‌లో మరో సంచలనం నమోదైంది. ఇంగ్లండ్‌పై ఐర్లాండ్ విజయం సాధించింది. వర్షం కారణంగా డక్‌వర్త్‌లూయిస్  ప్రకారం విజేతను ప్రకటించారు. ఈ రూల్స్ ప్రకారం ఆట ఆగిపోయే సరికి ఐర్లాండ్‌ కంటే ఇంగ్లండ్‌ 5 పరుగులు వెనుక ఉంది. అందుకే ఐర్లాండ్‌ను విజేతగా ప్రకటించారు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్‌ 157 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్‌ వేగంగా ఆడే ప్రయత్నంలో వికెట్లు కోల్పోయింది. 105 పరుగుల వద్ద వర్షం స్టార్ట్ అయింది. ఇకపై వర్షం ఆగే పరిస్థితి లేనందున డకవర్త్‌ లూయిస్ ప్రకారం విజేతను ప్రకటించారు. 14.3 ఓవర్లు వద్ద మ్యాచ్ ఆగిపోయే సమయానికి ఐర్లాండ్‌ 110 పరుగులు చేసింది. అప్పటికి ఇంగ్లండ్ ఐదు పరుగులు వెనుక ఉండటంతో ఇర్లాండ్‌ను విజేతగా ప్రకటించారు. 

11:29 AM (IST)  •  26 Oct 2022

Mancherial News: మంచిర్యాల జిల్లాలో ఓ ఏస్సై వీరంగం

మంచిర్యాల జిల్లాలో ఓ ఏస్సై వీరంగం సృష్టించాడు. మద్యం మత్తులో ఓ ఎస్ఐతోపాటు ఆయన అనుచరుల వీరంగం సృష్టించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ ప్రాంతంలోని రోడ్ పై మంగళవారం అర్ధరాత్రి మద్యం సేవించిన మందు బాబులు, రోడ్లపైకి వచ్చి హంగామా చేశారు. మద్యం సేవిస్తున్న వారిలో సిద్దిపేట జిల్లాకు చెందిన ఓ ఎస్సై, అతడి అనుచరులు ఉన్నారు. ఇబ్బందులకు గురైన వాహనదారులు 100 డయల్ కు ఫిర్యాదు చేయగా సంఘటన స్థలానికి బ్లూ కోర్టు పోలీసులు చేరుకొని విచారణ చేపట్టారు. పోలీసులు విచారణ చేపట్టే సమయంలో ఇద్దరు కానిస్టేబుల్స్, ఒక హోం గార్డులపై మందు బాబులు దాడికి పాల్పడ్డారు. ఇద్దరు కానిస్టేబుల్స్, హోం గార్డులకు తీవ్ర గాయాలు కావడంతో వారిని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మంచిర్యాల జిల్లా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

10:18 AM (IST)  •  26 Oct 2022

Mettuguda Blast: మెట్టుగూడలో పేలిన సిలిండర్

సికింద్రాబాద్ మెట్టుగూడ డివిజన్  దూద్ బావిలో ఒక  ఇంట్లో  గ్యాస్ సిలిండర్ పేలి 9 మందికి  తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి సీరియస్ గా ఉందని సమాచారం.  మరొకరు చనిపోయారు. భారీగా పేలుడు  ఘటనకు కారణం గ్యాస్ సిలిండర్ అని తెలుస్తుంది. సంఘటన   స్థలానికి చేరుకున్న కార్పొరేటర్  రాసూరి సునీత, చిలకలగూడ  పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన వారిని  గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో భారీ ఆస్తి నష్టం జరిగింది. పేలుడు ప్రభావంతో  చుట్టుపక్కల  ఇంట్లో కూడా గోడలు పగిలాయి.

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Minister Ramanaidu:  మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
Revanth Reddy:  ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
Priyanka Chopra: హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ICC Champions Trophy 2025 Team India | అగార్కర్ తో డ్రెస్సింగ్ రూమ్ లో Gambhir డిష్యూం డిష్యూం | ABP DesamChhatrapati Sambhaji Maharaj 'Sambar' | సాంబార్ చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు | ABP DesamVicky Kaushal Bollywood Super Star | Chhava తో కొత్త సూపర్ స్టార్ పుట్టాడా.? | ABP DesamMLC Candidate Aviash Jadhav Interview | పదిహేను నా లక్కీ నెంబర్ ఎందుకంటే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Ramanaidu:  మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
Revanth Reddy:  ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
Priyanka Chopra: హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
Hyderabad Crime News మేడ్చల్‌లో యువకుడి దారుణహత్య, నడిరోడ్డుపై కత్తులతో దాడి కేసులో ఊహించని ట్విస్ట్
Hyderabad Crime News మేడ్చల్‌లో యువకుడి దారుణహత్య, నడిరోడ్డుపై కత్తులతో దాడి కేసులో ఊహించని ట్విస్ట్
First GBS Death in AP: ఏపీలో తొలి జీబీఎస్ పేషెంట్ మృతి, నిర్ధారించిన గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్
ఏపీలో తొలి జీబీఎస్ పేషెంట్ మృతి, నిర్ధారించిన గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్
WPL Result Update: గార్డెనర్ కెప్టెన్ ఇన్నింగ్స్.. డబ్ల్యూపీఎల్ లో గుజరాత్ బోణీ, 6 వికెట్లతో యూపీ చిత్తు
గార్డెనర్ కెప్టెన్ ఇన్నింగ్స్.. డబ్ల్యూపీఎల్ లో గుజరాత్ బోణీ, 6 వికెట్లతో యూపీ చిత్తు
Who Is Mastan Sai: ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.