అన్వేషించండి

Breaking News Live Telugu Updates: కాజీపేటలో రైలులో తనిఖీలు - అక్రమంగా 34 మంది పిల్లల తరలింపు

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

LIVE

Key Events
Breaking News Live Telugu Updates: కాజీపేటలో రైలులో తనిఖీలు - అక్రమంగా 34 మంది పిల్లల తరలింపు

Background

నేడు దిగువ స్థాయిలోని గాలులు దక్షిణ/ఆగ్నేయ దిశల నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు  41 డిగ్రీల నుండి 44 డిగ్రీల సెంటీగ్రేడ్  మధ్యన అనేక చోట్ల, రేపు 40 డిగ్రీల నుండి 42 డిగ్రీలు దకొన్ని చోట్ల నమోదు అయ్యే అవకాశం ఉంది. తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లోనూ ఎండల విషయంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.

21వ తేదీ నుండి 4, 5 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు, గణనీయంగా తగ్గి  అనేక చోట్ల 40 డిగ్రీల కన్నా తక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. GHMC పరిధిలో  21 వ తేదీ నుండి 35 డిగ్రీల నుండి 37 డిగ్రీల మధ్య నమోదు అయ్యే అవకాశం ఉంది.  ఈరోజు, వాయువ్య తెలంగాణ, రేపు తూర్పు తెలంగాణ జిల్లాలలో, ఉరుములు మెరుపులతో పాటు ఈదురు గాలులు ( గాలి  గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో) వీచే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.

ఉత్తర తెలంగాణలో నిప్పుల కొలిమే
నిర్మల్‌, జగిత్యాల జిల్లాల్లో గరిష్ఠంగా 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 11 జిల్లాల్లో 44 డిగ్రీలపైన నమోదయ్యాయి. గ్రామాల్లో ప్రజలు బయటికి రావాలంటే భయపడ్డారు. ఈ నెల 21 నుంచి 25వ తేదీ వరకు కొంత ఉపశమనం లభించవచ్చని, ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలలోపే నమోదుకు అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. 

తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వాతావరణం, ఈదురు గాలులు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని తెలిపారు. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. 

హైదరాబాద్ లో ఇలా
‘‘హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 40 డిగ్రీలు, 26 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఆగ్నేయ దిశ నుంచి గాలులు గంటకు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 39.4 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 25 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 44 శాతం నమోదైంది. 

ఏపీలో ఎండలు ఇలా
ఏపీలో ఎండలు విపరీతం అయ్యాయి. నేడు వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని, ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల మేర అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. వడగాలులు కూడా ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో కూడా ఇదే రకమైన వాతావరణం ఉంటుందని వెదర్ బులెటిన్ లో తెలిపారు.

‘‘ఏపీలో 21, 22 తేదీల్లో ఉష్ణోగ్రతలు తగ్గుతాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఉరుములు, మెరుపులు కొన్ని చోట్ల వర్షాలు, గాలులు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వర్షాలు కురుస్తాయని తెలిపారు. వాడగాడ్పులు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, శ్రీ అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, క్రిష్ణా, పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో కాస్త ఎక్కువగా వడగాడ్పులు ఉంటాయని అంచనా వేశారు.

‘‘కర్నూలు నగరం పరిసర ప్రాంతాల్లో అత్యధికంగా 45.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఇది ఇలా ఉండగా మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో వేడి అనేది 40 డిగ్రీలను దాటుతోంది. తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, ఎన్.టీ.ఆర్., ఏలూరు, కడప​, అన్నమయ్య​, అనంతపురం, నంధ్యాల​, కాకినాడ​, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో మాత్రం ఉష్ణోగ్రతలు 42-44 డిగ్రీలను తాకుతోంది. ఏప్రిల్ నెలలో ఇలా ఉండగా మే నెలలో మాత్రం వేడి ఇకా ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎల్.నినో పసిఫిక్ లో ఏర్పడుతోంది కాబట్టి భారత భూభాగంలో ఉన్న తేమను లాగుతోంది. దీని వలన ఎండలు తీవ్రంగా మారుతున్నాయి. విశాఖ నగరంలో 40.7 డిగ్రీలు నమోదవుతోంది. అలాగే విజయవాడలో 43 డిగ్రీలు నమోదవుతోంది’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.

12:56 PM (IST)  •  20 Apr 2023

Kodi Katti Case: కోడి కత్తి కేసు విచారణ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఎన్ఐఏ కోర్టు జడ్జి ఆంజనేయులు

నా లిమిట్స్ నకున్నాయి, చట్టప్రకారం వెళ్ళాలి. ఎవరి మనసు అయినా నొప్పించి ఉంటే అంటూ.. రెండు చేతులు ఎత్తి నమస్కరించిన జడ్జి. ఇరువర్గాల వాదనలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన బాధ్యత నాపై ఉంది. కోడి కత్తి జడ్జి అని నాకు పేరు వచ్చింది. ఎవరి మనోభావాలు దెబ్బతీయాలని లేదు. త్వరగా కేసు విచారణకి పని చేశాను. కేసు 27వ తేదీకి వాయిదా. కొత్త జడ్జి కేసును విచారణ చేస్తారు’’ అని వ్యాఖ్యలు చేశారు. జడ్జి ఆంజనేయులు బదిలీపై కడప కోర్టుకి వెళ్తున్నారు.

12:52 PM (IST)  •  20 Apr 2023

Anni Manchi Sakunamule: శ్రీవారి సేవలో అన్ని మంచి శకునాలే మూవీ టీం

తిరుమల శ్రీవారిని అన్ని మంచి శకునాలే మూవీ టీం దర్శించుకుంది.. గురువారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి నైవేద్య విరామ సమయంలో డైరెక్టర్ నందిని రెడ్డి, సినీ నటులు సంతోష్ శోభన్, మాళవిక నాయర్ లు కలిసి స్వామి వారొ సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.. దర్శనంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.. అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన డైరెక్టర్ నందిని రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. త్వరలో అన్ని మంచి శకునాలే మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భాలలో చిత్రం‌ కథానాయకుడు సంతోష్ శోభన్, కధానాయకురాలు మాళవిక‌ నాయర్ తో కలిసి స్వామి వారి ఆశీస్సులు పొందడం జరిగిందన్నారు.. మే 18వ తారీఖున విడుదల సిద్దంగా ఉన్న ఈ చిత్రంను ప్రేక్షకులు ఆదరించాలని ఆమె కోరారు.. పేరుకు తగ్గట్టుగానే సినిమా ప్రేక్షకులకు హాయిని కలిగించే విధంగా ఉండబోతుందన్నారు..అనంతరం సినీ హీరో సంతోష్ శోభన్ మాట్లాడుతూ.. తిరుమలకు వచ్చిన ప్రతి సారి స్వామి వారిని బలంగా కోరుకునే వాడినని, తన జీవితంలో బాగా గుర్తుండి పోయే సినిమా ఇవ్వాలని ప్రార్ధించినందుకు స్వామి వారు అన్ని మంచి శకునాలే మూవీలో నటించే అవకాశం ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు..

12:16 PM (IST)  •  20 Apr 2023

Chandrababu Birthday: శ్రీవారి సన్నిధిలో ఘనంగా నారా చంద్రబాబు జన్మదిన వేడుకలు

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 74వ పుట్టిన రోజు వేడుకలను శ్రీవారి సన్నిధిలో టీడీపీ రాష్ట్ర మీడియా కో-ఆర్డినేటర్ శ్రీధర్ వర్మా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంకు అభిముఖంగా ఉన్న అఖిలాండ వద్ద 774 టెంకాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా టిడిపి రాష్ట్ర మీడియా కో-ఆర్డినేటర్ శ్రీధర్ మీడియాతో మాట్లాడుతూ. టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు వేడుకలను తిరుమలలో ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. 774 టెంకాయలు కొట్టి, శ్రీవారిని సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. చంద్రబాబుకి మంచి ఆరోగ్యం ప్రసాదించి, రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని పరిపాలించే విధంగా బలంను ప్రసాదించి, రాష్ట్రంను అభివృద్ధి పధంలో నడిపే విధంగా శక్తిని ప్రసాదించాలని శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని ప్రార్ధించడం జరిగిందన్నారు.

11:21 AM (IST)  •  20 Apr 2023

MP Avinash Reddy: అవినాశ్ రెడ్డి మధ్యంతర బెయిల్ కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించిన సునీత

వై ఎస్ అవినాశ్ రెడ్డి మధ్యంతర బెయిల్ కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించిన సునీత
విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు
ఈ రోజు సీజేఐ డివై చంద్రచూడ్ ధర్మాసనం ముందు సునీత పిటీషన్ ను ప్రస్తావించిన సీనియర్ న్యాయవాది సిద్ధార్ధ లూద్రా
రేపు విచారణకు స్వీకరిస్తామని చెప్పిన సీజేఐ డివై చంద్రచూడ్
రేపు విచారణకు వచ్చే అవకాశం
వివేకా హత్య కేసులో మధ్యంతర బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన అవినాశ్ రెడ్డి
ఈ నెల 25వ తేదీ వరకూ అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని హైకోర్టు మధ్యంతర తీర్పు
25వ తేదీన తుది తీర్పు ఇవ్వనున్నట్లు వెల్లడించిన తెలంగాణ హైకోర్టు
తెలంగాణ హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంలో సవాలు చేసిన సునీత

09:59 AM (IST)  •  20 Apr 2023

Viveka Murder Case: రెండో రోజు భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ ని కస్టడీలోకి తీసుకోనున్న సీబీఐ

  • రెండవ రోజు భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ లను కస్టడీ లోకి తీసుకోనున్న సిబిఐ
  • మరికాసేపట్లో చంచల్ గూడా జైలు నుండి కస్టడీ లోకి తీసుకోనున్న సిబిఐ
  • ఇప్పటికే ఇద్దరినీ ఆరు రోజుల పాటు కస్టడీ కి అనుమతి ఇచ్చిన నాంపల్లి సిబిఐ కోర్టు
  • వైఎస్ వివేకా హత్య నిందితుల తో ఉన్న పరిచయాల పై ఆరా తీసిన సిబిఐ
  • సునీల్ యాదవ్ కు కోటి రూపాయలు ఇచ్చారని దస్తగిరి ఇచ్చిన స్టేట్ మెంట్ పై ప్రశ్నించిన సిబిఐ
  • సాక్ష్యాలను తారు మారు చెయ్యడంపై ప్రశ్నలు
Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan:  తన సామాజికవర్గం నుంచి వంశీ ఎదుగుతున్నాడనే అరెస్టు చేశారు - చంద్రబాబు, లోకేష్‌పై జగన్ ఆరోపణ
తన సామాజికవర్గం నుంచి వంశీ ఎదుగుతున్నాడనే అరెస్టు చేశారు - చంద్రబాబు, లోకేష్‌పై జగన్ ఆరోపణ
Kodali Nani About Red Book: నారా లోకేష్ రెడ్ బుక్‌పై కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు, 3 కాకపోతే 30 కేసులు పెట్టుకోవాలంటూ సవాల్
నారా లోకేష్ రెడ్ బుక్‌పై కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు, 3 కాకపోతే 30 కేసులు పెట్టుకోవాలంటూ సవాల్
Salaar: ట్రెండింగ్‌లో 'సలార్', అదీ 365 రోజులుగా... జస్ట్ రికార్డు మాత్రమే కాదంటూ పృథ్వీరాజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ట్రెండింగ్‌లో 'సలార్', అదీ 365 రోజులుగా... జస్ట్ రికార్డు మాత్రమే కాదంటూ పృథ్వీరాజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
BCCI Vs Team India: కుటుంబ సభ్యులను కలిసేందుకు టీమిండియా ప్లేయర్లకు గ్రీన్ సిగ్నల్.. కానీ ఒక మెలిక పెట్టిన బీసీసీఐ
కుటుంబ సభ్యులను కలిసేందుకు టీమిండియా ప్లేయర్లకు గ్రీన్ సిగ్నల్.. కానీ ఒక మెలిక పెట్టిన బీసీసీఐ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Guillain Barre Syndrome Explained in Telugu | రోజుల్లో ప్రాణాలు తీసేసే GBS వైరస్ | ABP DesamNita Ambani on Pandya Brothers Bumrah | ముంబై స్టార్ ప్లేయర్లను ఎలా కనిపెట్టామంటే | ABP DesamNita Ambani Shared Her Initial Days with MI | తన క్రికెట్ నాలెడ్జ్ గురించి నీతా అంబానీ | ABP DesamTrump Beast in Daytona500 Racing | గెస్ట్ గా రమ్మంటే తన కార్, ఫ్లైట్ తో ట్రంప్ రచ్చ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan:  తన సామాజికవర్గం నుంచి వంశీ ఎదుగుతున్నాడనే అరెస్టు చేశారు - చంద్రబాబు, లోకేష్‌పై జగన్ ఆరోపణ
తన సామాజికవర్గం నుంచి వంశీ ఎదుగుతున్నాడనే అరెస్టు చేశారు - చంద్రబాబు, లోకేష్‌పై జగన్ ఆరోపణ
Kodali Nani About Red Book: నారా లోకేష్ రెడ్ బుక్‌పై కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు, 3 కాకపోతే 30 కేసులు పెట్టుకోవాలంటూ సవాల్
నారా లోకేష్ రెడ్ బుక్‌పై కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు, 3 కాకపోతే 30 కేసులు పెట్టుకోవాలంటూ సవాల్
Salaar: ట్రెండింగ్‌లో 'సలార్', అదీ 365 రోజులుగా... జస్ట్ రికార్డు మాత్రమే కాదంటూ పృథ్వీరాజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ట్రెండింగ్‌లో 'సలార్', అదీ 365 రోజులుగా... జస్ట్ రికార్డు మాత్రమే కాదంటూ పృథ్వీరాజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
BCCI Vs Team India: కుటుంబ సభ్యులను కలిసేందుకు టీమిండియా ప్లేయర్లకు గ్రీన్ సిగ్నల్.. కానీ ఒక మెలిక పెట్టిన బీసీసీఐ
కుటుంబ సభ్యులను కలిసేందుకు టీమిండియా ప్లేయర్లకు గ్రీన్ సిగ్నల్.. కానీ ఒక మెలిక పెట్టిన బీసీసీఐ
Viraaji OTT Streaming: 'ఆహా'తో పాటే మరో ఓటీటీలోకి వరుణ్ సందేశ్ సైకలాజికల్ థ్రిల్లర్ 'విరాజి' - డబ్బులు కట్టి చూస్తారా మరి?
'ఆహా'తో పాటే మరో ఓటీటీలోకి వరుణ్ సందేశ్ సైకలాజికల్ థ్రిల్లర్ 'విరాజి' - డబ్బులు కట్టి చూస్తారా మరి?
Kakinada High Alert: తుని వైస్ చైర్మన్ ఎన్నిక నాలుగోసారి వాయిదా, కాకినాడ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత
తుని వైస్ చైర్మన్ ఎన్నిక నాలుగోసారి వాయిదా, కాకినాడ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత
ICC Champions Trophy: మెగాటోర్నీపైనే వన్డేల భవితవ్యం..! రోకోకు ఇదే ఆఖరు ఐసీసీ టోర్నా..? పాల్గొంటున్న జట్ల బలాబలావే..!
మెగాటోర్నీపైనే వన్డేల భవితవ్యం..! రోకోకు ఇదే ఆఖరు ఐసీసీ టోర్నా..? పాల్గొంటున్న జట్ల బలాబలావే..!
Vijay Deverakonda: 'కిల్' డైరెక్టర్‌ను లైన్‌లో పెట్టింది రామ్ చరణ్ కాదు... విజయ్ దేవరకొండ - హిందీ మూవీకి రౌడీ హీరో రెడీ
'కిల్' డైరెక్టర్‌ను లైన్‌లో పెట్టింది రామ్ చరణ్ కాదు... విజయ్ దేవరకొండ - హిందీ మూవీకి రౌడీ హీరో రెడీ
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.