అన్వేషించండి

Bhatti Vikramarka Padayatra : పేపర్ల లీకేజీలో బీఆర్ఎస్, బీజేపీ తోడు దొంగలే, టీఎస్పీఎస్సీ ఛైర్మన్, సభ్యులను తొలగించాలి- భట్టి విక్రమార్క

Bhatti Vikramarka Padayatra : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో భట్టి విక్రమార్క పాదయాత్ర కొనసాగుతోంది. ఈ పాదయాత్రలో స్థానిక సమస్యలను అడిగితెలుసుకుంటున్నారు భట్టి.

Bhatti Vikramarka Padayatra : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి నుంచి ఉట్నూర్ ఎక్స్ రోడ్ వరకు నాలుగో రోజు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర కొనసాగుతోంది. ఇంద్రవెల్లిలో పాదయాత్రగా బయలుదేరిన భట్టి విక్రమార్కను ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ నాయకులు కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారించాలని ఉద్యమిస్తున్నా పాలక ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని భట్టి విక్రమార్క అన్నారు. ముఖ్యంగా చట్టబద్ధత లేని లంబాడిలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని, జీవో నం. 3 పునరుద్ధరణ , ఆదివాసీలు సాగు చేస్తున్న భూములకు ఎలాంటి షరతులు లేకుండా హక్కు పత్రాలు అందించాలని, రాష్ట్ర ప్రభుత్వం 11 తెగలను ఎస్టీ జాబితాలో చేర్చుతూ అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మావల మండలంలోని సర్వే నం 72 ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకుని నివసిస్తున్న ఆదివాసీల గుడిసెలను తొలగించి వెళ్లగొట్టేందుకు బడా నాయకులు చేస్తున్న ప్రయత్యాన్ని అణచివేసే దిశగా కృషి చేయాలని ఆదివాసీలకు రక్షణ కల్పించి పక్కా ఇళ్లు నిర్మించుకునేలా సహయపడాలన్నారు.

మీ పోరాటానికి సంపూర్ణ మద్దతు - భట్టి

'మీరెవరు మీ గుడిసెలను తీసేయొద్దు. గుడిసె వేసుకోవడం మీ హక్కు. మీ హక్కును కాల రాస్తే ఊరుకోను. మీకోసం ఎక్కడి వరకైనా పోరాటం చేస్తా' అని ఆదివాసీలకు భట్టి భరోసా అందించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో 2000 మంది గిరిజనులు వేసుకున్న గుడిసెలను ఖాళీ చేయించాలని కొంతమంది ప్రయత్నం చేస్తున్నారని తుడుం దెబ్బ నాయకులు ఇంద్రవెల్లిలో భట్టి విక్రమార్కను కలిసి ఆవేదన వ్యక్తం చేసిన సందర్భంగా వారితో మాట్లాడి భరోసా ఇచ్చారు. ఇంద్రవెల్లి పాదయాత్రలో ఖమ్మర పని చేసుకునే లక్ష్మణ్ ఇంటికి వెళ్లిన భట్టి.. ఆయన కష్ట సుఖాలు అడిగి తెలుసుకున్నారు.  సీఎల్పీ నేతతో లక్ష్మణ్ మాట్లాడుతూ.. మాకెలాంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం లేదన్నారు. అధైర్యపడవద్దని వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని లక్ష్మణ్ కు  భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు.  

పులిమడుగులో భట్టికి స్వాగతం పలికిన మహిళలు

సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు పులిమడుగు గ్రామస్థులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామంలో ఉన్న పలు సమస్యలను భట్టి దృష్టికి తీసుకువచ్చారు గ్రామస్థులు. మరికొన్ని నెలల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని.. ప్రజా ప్రభుత్వంలో మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని భట్టి గ్రామస్థులతో చెప్పారు. పాదయాత్రలో జనం ఎన్నో సమస్యలు నా దృష్టికి తీసుకొస్తున్నారని భట్టి విక్రమార్క అన్నారు. బీజేపీ విద్వేషాలతో దేశాన్ని విడగొట్టుతుందన్నారు. దేశ సంపద కొంత మందికి పంచుతున్నారని ఆరోపించారు. మోదీ పాలనలో ఆర్థికంగా ఉన్నవారు, లేనివారనే అసమానతలు పెరిగాయన్నారు. ఆర్థిక అసమానతలతో దేశాన్ని రెండుగా చీలుస్తున్నారని విమర్శించారు. దేశాన్ని విచ్చిన్నం చేస్తున్న బీజేపీ నుంచి జాతిని ఏకం చేయడానికి రాహుల్ గాంధీ భారత్ జూడో చేశారని తెలిపారు. భారత్ జోడో కొనసాగింపుగానే హాథ్ సే హాథ్ పాదయాత్ర చేపట్టినట్లు భట్టి విక్రమార్క అన్నారు. ఏఐసీసీ ఆదేశాలతో  రేవంత్ రెడ్డి, ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు నేను పాదయాత్ర చేస్తున్నామన్నారు.

Bhatti Vikramarka Padayatra : పేపర్ల లీకేజీలో బీఆర్ఎస్, బీజేపీ తోడు దొంగలే, టీఎస్పీఎస్సీ ఛైర్మన్, సభ్యులను తొలగించాలి- భట్టి విక్రమార్క  

బీఆర్ఎస్ కాదు బ్రిటీష్ ప్రభుత్వం 

"తెలంగాణ లక్ష్యం చేరుకోకుండా అడ్డుకుంటున్న ప్రభుత్వానికి బుద్ది చెబుదాం. పోడు భూములకు పట్టాలు వస్తాయని ఆశ పడ్డాం. చివరకు అడవుల్లోకి రానివ్వడం లేదు. అడవి సంపదకు దూరం చేయడమే కాదు వారిని బయటకు పంపిస్తున్నారు. అటవీ సంపద అంతా వారిదే. వద్దనడానికి నువ్వెవరు. బ్రిటిష్ ప్రభుత్వం తరహాలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం ఆదివాసీల విషయంలో ప్రవర్తిస్తుంది. జన్నారంలో చేపల వేటకు వెళ్తే కేసులు పెట్టారు. ఫ్రెంచ్, పోర్చు గీస్, బ్రిటిష్ ప్రభుత్వమా ... వేరే దేశం ప్రభుత్వం అన్నట్లుగా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది బీఆర్ఎస్ ప్రభుత్వం. మూడేళ్లుగా కుండలు చేసుకోవడానికి అడవి నుంచి మట్టి కూడా తీసుకోనివ్వడం లేదు. కట్టెలు తెచ్చుకొనివ్వడం లేదు. సాగు నీళ్లు ఇవ్వరు. బోర్లు వేసుకొవ్వరు అడవి నుంచి గిరిజనులను ఖాళీ చేయించే అతిపెద్ద కుట్ర చేస్తున్నారు. " - భట్టి విక్రమార్క 

టీఎస్పీఎస్సీ బోర్డు ఛైర్మన్ ను తొలగించాలి 
 
పేపర్ లీకేజీతో నిరుద్యోగుల ఆశలను బీఆర్ఎస్ ప్రభుత్వం నిండా ముంచిందని భట్టి విక్రమార్క ఆరోపించారు. టీఎస్పీఎస్సీ బోర్డు ఛైర్మన్ సభ్యులను సెక్రెటరీని వెంటనే తొలగించాలన్నారు. టీఎస్పీఎస్సీ బోర్డును  నియమించిందేవరో వారు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హయాంలో రైలు ప్రమాదం జరిగితే కేంద్రంలో ఉన్న రైల్వే మంత్రి నైతిక బాధ్యతగా రాజీనామా చేశారని గుర్తుచేశారు. పేపర్ లీకేజీ తమకు సంబంధం లేదని తప్పించుకుంటున్నారని విమర్శించారు. ఇన్నాళ్లు  నిరుద్యోగులు పోటీ పరీక్షల కోసం పెట్టిన ఖర్చు అభ్యర్థులకు ఇవ్వాలన్నారు.  టీఎస్పీఎస్సీని నియమించిన వారు మంత్రా, ముఖ్యమంత్రా ఎవరూ నియమిస్తే వాళ్లే రాజీనామా చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీలో విభేదాలు లేవని, భిన్నాభిప్రాయాలు ఉన్నాయన్నారు.  టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో బీజేపీ, బీఆర్ఎస్ రెండు తోడు దొంగలేనని విమర్శించారు. ధరణి పోర్టల్ తో ఆదిలాబాద్ జిల్లా వాసులే ఎక్కువగా నష్ట పోయారన్నారు. 

 

టాప్ హెడ్ లైన్స్

Breaking News:తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
Telangana Cabinet Decisions: హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్‌! 1.5 లక్షల సబ్సిడీ ఇచ్చే నిర్ణయం తీసుకున్న మంత్రి మండలి!
హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్‌! 1.5 లక్షల సబ్సిడీ ఇచ్చే నిర్ణయం తీసుకున్న మంత్రి మండలి!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget