అన్వేషించండి

Whatsapp New Feature: యాప్ ఓపెన్ చేయకుండానే బ్లాక్ చేయవచ్చు - కొత్త ఆప్షన్ తెస్తున్న వాట్సాప్!

Whatsapp Updates: వాట్సాప్ కొత్త ఫీచర్‌ను తీసుకువచ్చింది. దీని ద్వారా యూజర్లు లాక్ స్క్రీన్ నుంచి స్పామ్ కాంటాక్ట్స్‌ను బ్లాక్ చేయవచ్చు.

WhatsApp: వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని సహాయంతో వినియోగదారులు తమ లాక్ స్క్రీన్ నుండి నేరుగా స్పామ్‌ కాంటాక్ట్స్‌ను బ్లాక్ చేయవచ్చు. ఈ అప్‌డేట్ స్పామ్ మెసేజ్‌ల వ్యాప్తిని పరిష్కరించడం, వినియోగదారులకు వారి మెసేజింగ్ ఎక్స్‌పీరియన్స్‌పై మరింత కంట్రోల్‌ను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. వాట్సాప్ వంటి మెసేజింగ్ నెట్‌వర్క్‌లకు స్పామ్ మెసేజ్‌లు చాలా కాలంగా ఆందోళన కలిగిస్తున్నాయి.

స్పామ్ మెసేజ్‌ల కారణంగా ప్రమోషనల్ కంటెంట్, మోసపూరిత కంటెంట్ నుంచి వినియోగదారులు చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది వినియోగదారులు స్పామ్ సందేశాల ద్వారా మోసానికి గురయ్యారు. అటువంటి పరిస్థితిలో వాట్సాప్ తెచ్చిన ఈ ఫీచర్ చాలా ముఖ్యమైనది. దీని ద్వారా వినియోగదారులు తమ లాక్ స్క్రీన్ నుంచి స్పామ్ మెసేజ్‌లపై యాక్షన్ తీసుకోగలరు. వాటిని బ్లాక్ చేయగలరు.

ఈ ఫీచర్‌ని అమలు చేయడం వెనుక వాట్సాప్ ప్రధాన లక్ష్యం దాని వినియోగదారులకు గొప్ప మెసేజింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించడంతోపాటు వారి ప్రైవసీ, సెక్యూరిటీని పెంచడం. వాట్సాప్ తీసుకువచ్చిన ఈ కొత్త ఫీచర్ వినియోగదారులు వారి డివైస్‌ను అన్‌లాక్ చేయకుండా లేదా యాప్ ఓపెన్ చేయకుండానే స్పామ్ మెసేజ్‌లను గుర్తించడానికి, బ్లాక్ చేయడానికి అనుమతిస్తుంది. లాక్ స్క్రీన్‌పై స్పామ్ మెసేజ్ గురించిన నోటిఫికేషన్ కనిపించినప్పుడు పంపినవారిని వెంటనే బ్లాక్ చేసే ఫీచర్‌తో సహా మరిన్ని ఆప్షన్లను చూడటానికి వినియోగదారులు నోటిఫికేషన్‌పై లాంగ్ ప్రెస్ చేయవచ్చు. దీంతోపాటు మెసేజ్ చేసే వారికి రిపోర్ట్ చేసే ఆప్షన్ కూడా ఉంది.

ప్రస్తుతం వినియోగదారులు ప్రతిరోజూ వాట్సాప్‌లో చాలా స్పామ్ సందేశాలను పొందుతూనే ఉన్నారు. దీని కారణంగా వినియోగదారులు మానసికంగా డిస్టర్బ్ అవ్వడమే కాకుండా కొన్ని నకిలీ లేదా తప్పుడు ప్రకటనల బారిన పడి మోసానికి గురవుతారు. ఈ విషయాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని వాట్సాప్ తీసుకొచ్చిన ఈ ఫీచర్ వినియోగదారులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

మరోవైపు అసుస్ క్రోమ్‌బుక్ సీఎం14 ల్యాప్‌టాప్ ఇటీవలే మనదేశంలో లాంచ్ అయింది. ఇందులో మీడియాటెక్ కొంపానియో ప్రాసెసర్‌ను కంపెనీ అందించింది. ఈ ల్యాప్‌టాప్ మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్‌తో రానుందని అసుస్ అఫీషియల్‌గా తెలిపింది. 180 డిగ్రీల లే ఫ్లాట్ హింజ్డ్ డిస్‌ప్లేతో ఈ ల్యాప్‌టాప్ మార్కెట్లో లాంచ్ అయింది. దీని ద్వారా వినియోగదారులు ల్యాప్‌టాప్‌ను చాలా ఈజీగా ఉపయోగించవచ్చు. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే ఏకంగా 15 గంటల బ్యాటరీ బ్యాకప్‌ను ఈ ల్యాప్‌టాప్ అందించనుండటం విశేషం. దీనికి సంబంధించిన సేల్ ఇప్పటికే ప్రారంభం అయింది. ఈ ల్యాప్‌టాప్ ధరను మనదేశంలో రూ.26,990గా నిర్ణయించారు. గ్రావిటీ గ్రే కలర్ ఆప్షన్‌లో అసుస్ క్రోమ్‌బుక్ సీఎం14ను కొనుగోలు చేయవచ్చు. అమెజాన్‌లో ఈ ల్యాప్‌టాప్ సేల్‌కు అందుబాటులో ఉంది. అమెజాన్ పే ఐసీఐసీఐ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే ఆరు నెలల పాటు నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్ కూడా అందించనున్నారు.

Also Read: నోకియా ఫోన్లు ఇక కనిపించవా? - కంపెనీ కొత్త ప్రకటనకు అర్థం ఏంటి?

Also Read: వాట్సాప్ ఛాట్ బ్యాకప్ చేస్తున్నారా? - అయితే త్వరలో రానున్న ఈ రూల్ తెలుసా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandra Babu Latest News: అమరావతిలో సొంతిల్లు కట్టుకుంటున్న చంద్రబాబు -ఏప్రిల్ 9న భూమి పూజ
అమరావతిలో సొంతిల్లు కట్టుకుంటున్న చంద్రబాబు -ఏప్రిల్ 9న భూమి పూజ
Hyderabad Metro Latest Timings: మారిన హైదరాబాద్‌ మెట్రో టైమింగ్స్‌- ఏప్రిల్‌ 1 నుంచి అమలు!
మారిన హైదరాబాద్‌ మెట్రో టైమింగ్స్‌- ఏప్రిల్‌ 1 నుంచి అమలు!
RS Praveen Kumar: తెలంగాణ భవన్ పైనే రేవంత్ ఫోకస్, రీట్వీట్ చేసినా అక్రమ కేసులు పెడుతున్నారు- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
తెలంగాణ భవన్ పైనే రేవంత్ ఫోకస్, రీట్వీట్ చేసినా అక్రమ కేసులు పెడుతున్నారు- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
MI vs GT: గుజరాత్ పై టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న ముంబై , ఏపీ ఆటగాడు సత్యనారాయణ రాజు అరంగేట్రం
గుజరాత్ పై టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న ముంబై , ఏపీ ఆటగాడు సత్యనారాయణ రాజు అరంగేట్రం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MS Dhoni Fastest Stumping vs RCB | వరుసగా రెండో మ్యాచ్ లోనూ ధోని మెరుపు స్టంపింగ్ | ABP DesamMS Dhoni Sixers vs RCB IPL 2025 | యధావిథిగా ధోనీ ఆడాడు..CSK ఓడింది | ABP DesamCSK vs RCB Match Highlights IPL 2025 | 17ఏళ్ల తర్వాత చెన్నైలో ఆర్సీబీపై ఓటమి | ABP DesamMyanmar Bangkok Earthquake | మయన్మార్, బ్యాంకాక్ లను కుదిపేసిన భారీ భూకంపం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandra Babu Latest News: అమరావతిలో సొంతిల్లు కట్టుకుంటున్న చంద్రబాబు -ఏప్రిల్ 9న భూమి పూజ
అమరావతిలో సొంతిల్లు కట్టుకుంటున్న చంద్రబాబు -ఏప్రిల్ 9న భూమి పూజ
Hyderabad Metro Latest Timings: మారిన హైదరాబాద్‌ మెట్రో టైమింగ్స్‌- ఏప్రిల్‌ 1 నుంచి అమలు!
మారిన హైదరాబాద్‌ మెట్రో టైమింగ్స్‌- ఏప్రిల్‌ 1 నుంచి అమలు!
RS Praveen Kumar: తెలంగాణ భవన్ పైనే రేవంత్ ఫోకస్, రీట్వీట్ చేసినా అక్రమ కేసులు పెడుతున్నారు- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
తెలంగాణ భవన్ పైనే రేవంత్ ఫోకస్, రీట్వీట్ చేసినా అక్రమ కేసులు పెడుతున్నారు- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
MI vs GT: గుజరాత్ పై టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న ముంబై , ఏపీ ఆటగాడు సత్యనారాయణ రాజు అరంగేట్రం
గుజరాత్ పై టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న ముంబై , ఏపీ ఆటగాడు సత్యనారాయణ రాజు అరంగేట్రం
Ration Card EKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్- ఈ-కేవైసీ గడువు పెంపు
ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్- ఈ-కేవైసీ గడువు పెంపు
IRCTC Good News: ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్‌న్యూస్, కౌంటర్‌లో కొన్నా ఆన్‌లైన్‌లో క్యాన్సిల్‌ చేయవచ్చు
ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్‌న్యూస్, కౌంటర్‌లో కొన్నా ఆన్‌లైన్‌లో క్యాన్సిల్‌ చేయవచ్చు
Kannappa: 'కన్నప్ప' విడుదల వాయిదా - క్షమాపణలు చెప్పిన నటుడు మంచు విష్ణు
'కన్నప్ప' విడుదల వాయిదా - క్షమాపణలు చెప్పిన నటుడు మంచు విష్ణు
Viral News:17 ఏళ్లుగా మహిళకు పొట్టనొప్పి- ఎక్స్‌రేతో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన భర్త
17 ఏళ్లుగా మహిళకు పొట్టనొప్పి- ఎక్స్‌రేతో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన భర్త
Embed widget