అన్వేషించండి

5G-Enabled Phones: 2023 నాటికి అందుబాటులోకి 80 శాతం కొత్త 5G స్మార్ట్ ఫోన్లు, సెమీకండక్టర్ ఎకో సిస్టమ్ కోసం రూ.76 వేల కోట్లు-ICEA

దేశంలో 5G సేవలు వేగంగా విస్తరిస్తున్న వేళ, వచ్చే ఏడాదిలో సుమారు 80 శాతం 5G సపోర్టు చేసే కొత్త స్మార్టు ఫోన్లు అందుబాటులోకి వస్తాయని ICEA వెల్లడించింది.

2023 నాటికి  80 శాతం కొత్త 5G స్మార్ట్ ఫోన్లు

భారత్ లో 5G నెట్ వర్క్ సేవలు శరవేగంగా విస్తరిస్తున్నాయి. జియో, ఎయిర్ టెల్ లాంటి సెల్యూలార్ కంపెనీలు రోజు రోజు 5G నెట్ వర్క్ పరిధిని విస్తృతం చేస్తున్నాయి. ఇప్పటికే సుమారు 60 నగరాలు, పట్టణాల ప్రజలకు ఈ సేవలను అందుబాటులోకి తెచ్చాయి. వచ్చే ఏడాది చివరి నాటికి దేశ వ్యాప్తంగా 5G సేవలు అందుబాటులోకి తేనున్నట్లు జియో వెల్లడించింది. అటు 2024 చివరి నాటికి దేశమంతటా 5G సేవలను విస్తరిస్తామని ఎయిర్ టెల్ తెలిపింది. ఈ నేపథ్యంలో ఇండియన్ సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ICEA) చైర్మన్ పంకజ్ మొహింద్రూ కీలక విషయాలను వెల్లడించారు.

2024 నాటికి దేశ వ్యాప్తంగా 5G సేవలు

దేశంలో ఇప్పటికే 60 నగరాలు, పట్టణాలు కొత్త సాంకేతికతను ఆస్వాదిస్తున్నట్లు  పంకజ్ తెలిపారు. 2023 చివరి నాటికి, 75-80 శాతం కొత్త స్మార్ట్‌ ఫోన్‌ లు లాంచ్ అవుతాయని చెప్పారు. ఇవన్నీ 5G నెట్ వర్క్ కు సపోర్టు చేసేలా ఉంటాయని వెల్లడించారు. ఈ ఏడాది అక్టోబర్ 1న ప్రధాని నరేంద్ర మోడీ 5G సేవలను అధికారికంగా ప్రారంభించారు.  టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు ఎంపిక చేసిన నగరాల్లో ఈ సేవలను ప్రారంభించారు. 2023 చివరి నాటికి లేదంటే 2024 ప్రారంభ నెలల్లో దేశ వ్యాప్తగా ఈ సేవలు విస్తరించేలా ప్లాన్ చేస్తున్నారు. “దేశంలో 5G టెక్నాలజీ శరవేగంగా విస్తరిస్తోంది. ఈ 5G టెక్నాలజీని కొత్త తరం టెలికాం పరికరాల తయారీదారులు, అప్లికేషన్ ప్రొవైడర్లు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT), మెషిన్-2-మెషిన్ (M2M), హెల్త్‌ కేర్ సర్వీసెస్, ఇతరులతో కలిసి మరింత సమర్థవంతంగా ఈ సేవల పరిధిని పెంచుతున్నాం” అని పంకజ్ మొహింద్రూ వెల్లడించారు.  

సెమీకండక్టర్ ఎకో సిస్టమ్ ఏర్పాటుకు రూ. 76 వేల కోట్లు

వాస్తవానికి దేశంలో 5G సేవలను ప్రారంభించక ముందే, దాదాపు 80 నుంచి 100 మిలియన్ల 5G సపోర్టు చేసే  ఫోన్‌లు  మార్కెట్లో ఉన్నాయి. 'ఎరిక్సన్ మొబిలిటీ రిపోర్ట్' ప్రకారం, 690 మిలియన్ల వినియోగదారులతో 2028 నాటికి భారతదేశంలో మొబైల్ సబ్‌ స్క్రిప్షన్‌లలో 53 శాతం 5Gతో ప్రపంచంలోనే టాప్ లో నిలువనుంది.  భారతదేశంలో 5G సబ్‌ స్క్రిప్షన్‌లు 2022 చివరి నాటికి దాదాపు 31 మిలియన్లకు చేరుకోనున్నట్లు తెలుస్తోంది. 2020లో భారతీయ సెమీకండక్టర్ మార్కెట్ $15 బిలియన్లు ఉండగా, 2023 నాటికి $63 బిలియన్లకు చేరుతుందని పంకజ్ మోహింద్రూ చెప్పారు. "5G దేశానికి గొప్ప అవకాశం. సెమీకండక్టర్ ఫ్యాబ్, కాంపౌండ్ సెమీకండక్టర్స్, డిస్క్రీట్ సెమీకండక్టర్స్, అసెంబ్లీ, టెస్టింగ్, మార్కింగ్, ప్యాకేజింగ్ (ATMP) యూనిట్లు సహా మొత్తం సెమీకండక్టర్ ఎకో సిస్టమ్ ను ఏర్పాటు చేయడంపై ప్రభుత్వం  దృష్టి సారించింది. ఇందుకోసం రూ. 76,000 కోట్ల ప్రోత్సాహక వ్యయాన్ని ప్రభుత్వం అందిస్తోంది" అని మొహింద్రూ వివరించారు.

Read Also: మీరు విమానాశ్రయాల దగ్గర నివసిస్తున్నారా? ఇప్పట్లో 5Gని పొందలేరు, ఎందుకో తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

Cement Corporation of India: ఆదిలాబాద్‌లో సిమెంట్ పరిశ్రమ పునరుద్ధరణపై జోగు రామన్న అల్టిమేటం - ఆగస్టు 31లోగా తేల్చకపోతే ఆమరణ నిరాహార దీక్ష!
ఆదిలాబాద్‌లో సిమెంట్ పరిశ్రమ పునరుద్ధరణపై జోగు రామన్న అల్టిమేటం - ఆగస్టు 31లోగా తేల్చకపోతే ఆమరణ నిరాహార దీక్ష!
Oneplus: వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?
వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?
Notice To Telegram: పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
WhatsApp Usernames Cyber Security Risks: వాట్సాప్ యూజర్ నేమ్ ఫీచర్‌పై కేంద్రం సీరియస్.. అసలు అభ్యంతరాలేంటి? మెటా వాదన ఏంటి?
వాట్సాప్ యూజర్ నేమ్ ఫీచర్‌పై కేంద్రం సీరియస్.. అసలు అభ్యంతరాలేంటి? మెటా వాదన ఏంటి?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
Hydrogen Cars and Buses:హైడ్రోజన్‌తో నడిచే రైలు మాదిరిగానే కార్లు, బస్‌లు, టూవీలర్స్‌ వస్తాయా? సీఎన్జీతో పోల్చుకుంటే వ్యత్యాసం ఏంటీ?
హైడ్రోజన్‌తో నడిచే రైలు మాదిరిగానే కార్లు, బస్‌లు, టూవీలర్స్‌ వస్తాయా? సీఎన్జీతో పోల్చుకుంటే వ్యత్యాసం ఏంటీ?
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Allu Sirish Wife Nayanika: గోవాలో అల్లు వారి కోడళ్ళు... శిరీష్ భార్య నయనిక, బన్నీ వైఫ్ స్నేహను చూశారా?
గోవాలో అల్లు వారి కోడళ్ళు... శిరీష్ భార్య నయనిక, బన్నీ వైఫ్ స్నేహను చూశారా?
Mexico Earthquake 2026: మెక్సికో-గ్వాటెమాలా సరిహద్దులో 7.3 తీవ్రతతో భారీ భూకంపం! సునామీ హెచ్చరిక జారీ, వణికిపోయిన సరిహద్దు దేశాలు!
మెక్సికో-గ్వాటెమాలా సరిహద్దులో 7.3 తీవ్రతతో భారీ భూకంపం! సునామీ హెచ్చరిక జారీ, వణికిపోయిన సరిహద్దు దేశాలు!
Pallaburusu First Look: 'లెనిన్' సక్సెస్ తర్వాత చిన్న సినిమాతో... అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి 'పళ్ళబురుసు'
'లెనిన్' సక్సెస్ తర్వాత చిన్న సినిమాతో... అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి 'పళ్ళబురుసు'
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
Embed widget