అన్వేషించండి

Nokia C12 Plus: సూపర్ డూపర్ డిస్ ప్లే, 4,000mAh బ్యాటరీ, దేశీయ మార్కెట్లోకి అదిరిపోయే నోకియా స్మార్ట్ ఫోన్

నోకియా కంపెనీ మరో అద్భుతమైన స్మార్ట్ ఫోన్ ను భారతీయ మార్కెట్లోకి విడుదల చేసింది. మధ్య తరగతి ప్రజలకు అందుబాటు ధరలో, చక్కటి ఫీచర్లతో ఈ స్మార్ట్ ఫోన్ ను తీసుకొచ్చింది.

మధ్యతరగతి స్మార్ట్ ఫోన్లకు పెట్టింది పేరు అయిన నోకియా కంపెనీ మరో కొత్త స్మార్ట్ ఫోన్ ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. నోకియా బ్రాండ్ లైసెన్సీ HMD గ్లోబల్ ద్వారా నోకియా C12 ప్లస్ ను దేశీయ మార్కెట్లోకి ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ ఫోన్‌గా ఆవిష్కరించింది. ఈ సరికొత్త C12 సిరీస్ హ్యాండ్‌ సెట్ ఆండ్రాయిడ్ 12 (గో ఎడిషన్)పై రన్ అవుతుంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ 6.3-అంగుళాల HD+ డిస్‌ ప్లేను కలిగి ఉంది. ఆక్టా-కోర్ యునిసోక్ SoC ద్వారా రన్ అవుతుంది. నోకియా C12 ప్లస్ 2GB RAM, 32GB ఆన్‌ బోర్డ్ స్టోరేజీని కలిగి ఉంది. డ్యూయల్ సిమ్ కనెక్టివిటీ, ఎక్స్‌ పాండబుల్ స్టోరేజ్, 4,000mAh బ్యాటరీ, 8-మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా సెన్సార్ మోడల్ ను కలిగి ఉంది. HMD గ్లోబల్ జనవరిలో ఎంట్రీ లెవల్ నోకియా C12ని ఆవిష్కరించింది.  Nokia C12 Plus లైనప్‌ లో అత్యంత ప్రీమియం స్మార్ట్ ఫోన్ గా అందుబాటులోకి వచ్చింది.

భారతదేశంలో నోకియా C12 ప్లస్ ధర, లభ్యత

భారతదేశంలో నోకియా C12 ప్లస్ ధర విషయాన్ని పరిశీలిస్తే, 2GB + 32GB స్టోరేజ్ వేరియంట్ కాస్ట్ రూ. 7,999గా కంపెనీ నిర్ణయించింది. నోకియా ఇండియా అధికారిక వెబ్‌ సైట్ లో కొత్త స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన లభ్యత వివరాలను వెల్లడించలేదు. త్వరలోనే ఈ వివరాలను వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. ఇక నోకియా C12 ధర విషయానికి వస్తే, 2GB + 64GB స్టోరేజ్ వేరియంట్ కోసం రూ. 5,999గా నిర్ణయించింది.  నోకియా C12 ప్రో బేస్ 2GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 6,999 కాగా, 3GB RAM + 64GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 7,999గా ఫిక్స్ చేసింది.  

నోకియా C12 ప్లస్ స్పెసిఫికేషన్స్

కొత్త నోకియా C12 ప్లస్ ఆండ్రాయిడ్ 12 (Go ఎడిషన్)పై రన్ అవుతుంది. 6.3-అంగుళాల HD+ (720 X 1,520 పిక్సెల్‌లు) డిస్‌ప్లేను కలిగి ఉంది. సెల్ఫీ షూటర్‌ ను ఉంచడానికి డిస్‌ ప్లే వాటర్‌ డ్రాప్ కటౌట్‌ను కలిగి ఉంది. ఫోన్ గరిష్టంగా 1.6Hz క్లాక్ ఫ్రీక్వెన్సీతో ఆక్టా-కోర్ Unisoc SoC ద్వారా శక్తిని పొందుతుంది. ఈ CPU వేగం SC9863A1తో అనుబంధించబడింది. ఇది 2GB RAMని కలిగి ఉంటుంది. ఆప్టిక్స్ కోసం, నోకియా C12 ప్లస్ ఆటో ఫోకస్, LED ఫ్లాష్‌తో కూడిన 8-మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో చాట్‌ల కోసం, ముందు భాగంలో 5-మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది. ఇది 32GB ఆన్‌ బోర్డ్ స్టోరేజ్ ను అందిస్తుంది.

నోకియా C12 ప్లస్‌లోని కనెక్టివిటీ విషయాన్ని పరిశీలిస్తే, Wi-Fi 802.11b/g/n, బ్లూటూత్ 5.2, మైక్రో-USB పోర్ట్, 3.5mm హెడ్‌ ఫోన్ జాక్ ఉన్నాయి. ఇది 4,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. Nokia C12, Nokia C12 Proలో ఉన్న 3,000mAh బ్యాటరీతో పోలిస్తే ఇది అప్‌ గ్రేడ్ గా చెప్పుకోవచ్చు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
Ilayaraja : ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
Ilayaraja : ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
Bandla Ganesh : బండ్ల గణేష్ సంకల్ప యాత్ర ప్రారంభం - హైదరాబాద్ To తిరుమల వెంకటేశుని సన్నిధి వరకూ...
బండ్ల గణేష్ సంకల్ప యాత్ర ప్రారంభం - హైదరాబాద్ To తిరుమల వెంకటేశుని సన్నిధి వరకూ...
ఫుల్ ట్యాంక్‌తో 800 KM రేంజ్ ఇస్తున్న TVS Star City Plus.. అత్యంత చవకైన డిస్క్ బ్రేక్ బైక్
ఫుల్ ట్యాంక్‌తో 800 KM రేంజ్ ఇస్తున్న TVS Star City Plus.. అత్యంత చవకైన డిస్క్ బ్రేక్ బైక్
Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
Embed widget