అన్వేషించండి

Itel P55: దేశంలోనే అత్యంత చవకైన 5జీ ఫోన్ - రూ.10 వేలలోపే 8 జీబీ + 128 జీబీ - ఐటెల్ పీ55 వచ్చేసింది!

Itel P55: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఐటెల్ మనదేశంలోనే అత్యంత చవకైన 5జీ ఫోన్‌ను లాంచ్ చేసింది. అదే ఐటెల్ పీ55.

ఐటెల్ పీ55 (Itel P55) 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయ్యాయి. ప్రస్తుతం మనదేశంలో అత్యంత చవకైన 5జీ ఫోన్ (Cheapest 5G Phone in India) ఇదే. ఆక్టాకోర్ డైమెన్సిటీ ప్రాసెసర్, వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి. ఏఐ పవర్డ్ డ్యూయల్ కెమెరా సెటప్‌ను ఫోన్ వెనకవైపు అందించారు. ఒక స్టోరేజ్ వేరియంట్, రెండు కలర్ ఆప్షన్లు ఇందులో ఉన్నాయి. ఈ ఫోన్‌పై కంపెనీ రెండు సంవత్సరాల వారంటీని అందిస్తుంది. కొనుగోలు చేసిన 100 రోజుల పాటు ఉచిత స్క్రీన్ రీప్లేస్‌మెంట్‌ను కూడా ఇవ్వనున్నారు.

ఐటెల్ పీ55 ధర (Itel P55 Price in India)
బ్లూ, గ్రీన్ కలర్ ఆప్షన్లలో ఐటెల్ పీ55ను కొనుగోలు చేయవచ్చు. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ ధరను రూ.9,999గా నిర్ణయించారు. అక్టోబర్ 4వ తేదీ నుంచి ఈ స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన సేల్ ప్రారంభం కానుంది.

ఐపీల్ పీ55 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (Itel P55 Specifications)
ఈ ఫోన్‌లో 6.6 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. డ్యూయల్ నానో సిమ్ కార్డులను సపోర్ట్ చేసే ఐటెల్ పీ55 ఫోన్‌లో 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కూడా ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది.

8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఈ ఫోన్‌లో ఉన్నాయి. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 256 జీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టంతో ఈ ఫోన్‌ను డెలివరీ చేయనున్నారు. ఎలాంటి యూజర్ ఇంటర్‌ఫేస్ ఇందులో లేదు.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను అందించారు. దీంతోపాటు సెకండరీ ఏఐ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది.

సెక్యూరిటీ కోసం ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఈ ఫోన్ పక్కభాగంలో అందించారు. 3.5 ఎంఎం ఆడియో జాక్ కూడా ఈ ఫోన్‌లో చూడవచ్చు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 18W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఐటెల్ పీ55 సపోర్ట్ చేయనుంది. 5జీ, 4జీ వోల్టే, వైఫై, బ్లూటూత్ వీ5.1, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ కనెక్టివిటీలను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. 

Read Also: డైనమిక్ ఐల్యాండ్‌తో లాంచ్ అయిన ఐఫోన్ 15 సిరీస్ - ధర ఎంత పెట్టారు?

Read Also: అత్యధిక బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే యాపిల్ వాచ్ ఇదే - యాపిల్ వాచ్ అల్ట్రా 2 వచ్చేసింది!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్
Telangana Cabinet: ఈ నెల 23న తెలంగాణ కేబినెట్ భేటీ - సమావేశంలో దేనిపై చర్చిస్తారంటే?
ఈ నెల 23న తెలంగాణ కేబినెట్ భేటీ - సమావేశంలో దేనిపై చర్చిస్తారంటే?
Karimnagar: బైక్ రైడింగ్ తెలుసా? - విదేశాల్లో ఉద్యోగావకాశాలు, జీతం ఎంతంటే?
బైక్ రైడింగ్ తెలుసా? - విదేశాల్లో ఉద్యోగావకాశాలు, జీతం ఎంతంటే?
Sajjala Ramakrishna Reddy: టీడీపీ కార్యాలయంపై దాడి కేసు - ముగిసిన సజ్జల రామకృష్ణారెడ్డి  విచారణ, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
టీడీపీ కార్యాలయంపై దాడి కేసు - ముగిసిన సజ్జల రామకృష్ణారెడ్డి విచారణ, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అంబానీ Vs మస్క్: బిలియనీర్స్ మధ్య వార్ ఎందుకు!Adilabad Organic Tattoo: పచ్చబొట్టేసినా.. పెళ్లి గ్యారంటీ - నొప్పులు మాయంLady Justice: న్యాయ దేవతకు కళ్లు వచ్చేశాయా? కత్తి బదులు రాజ్యాంగమా?భారీ విధ్వంసానికి హెజ్బుల్లా ప్లాన్, వీడియోలు విడుదల చేసిన ఇజ్రాయేల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్
Telangana Cabinet: ఈ నెల 23న తెలంగాణ కేబినెట్ భేటీ - సమావేశంలో దేనిపై చర్చిస్తారంటే?
ఈ నెల 23న తెలంగాణ కేబినెట్ భేటీ - సమావేశంలో దేనిపై చర్చిస్తారంటే?
Karimnagar: బైక్ రైడింగ్ తెలుసా? - విదేశాల్లో ఉద్యోగావకాశాలు, జీతం ఎంతంటే?
బైక్ రైడింగ్ తెలుసా? - విదేశాల్లో ఉద్యోగావకాశాలు, జీతం ఎంతంటే?
Sajjala Ramakrishna Reddy: టీడీపీ కార్యాలయంపై దాడి కేసు - ముగిసిన సజ్జల రామకృష్ణారెడ్డి  విచారణ, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
టీడీపీ కార్యాలయంపై దాడి కేసు - ముగిసిన సజ్జల రామకృష్ణారెడ్డి విచారణ, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
Revanth Reddy : మూసీ పునరుజ్జీవానికి ప్రయత్నిస్తున్నాం - ప్రజలు చెబితే ఆపేస్తాం - సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
మూసీ పునరుజ్జీవానికి ప్రయత్నిస్తున్నాం - ప్రజలు చెబితే ఆపేస్తాం - సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Haryana Rohingya Connection: రోహింగ్యాలను ఓటు బ్యాంకుగా చేసుకున్న కాంగ్రెస్ -  హర్యానా ఎన్నికల్లో బయటపడిన కీలక అంశం
రోహింగ్యాలను ఓటు బ్యాంకుగా చేసుకున్న కాంగ్రెస్ - హర్యానా ఎన్నికల్లో బయటపడిన కీలక అంశం
Nirmal News: వన్యప్రాణులను తరలిస్తోన్న లారీ బోల్తా - రహదారిపై మొసళ్లు, నిర్మల్ జిల్లాలో ఘటన
వన్యప్రాణులను తరలిస్తోన్న లారీ బోల్తా - రహదారిపై మొసళ్లు, నిర్మల్ జిల్లాలో ఘటన
Group 1 Mains Exams: కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ - గ్రూప్ - 1 అభ్యర్థులతో విడివిడిగా భేటీ, పరీక్షల నిర్వహణపై ఉత్కంఠ
కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ - గ్రూప్ - 1 అభ్యర్థులతో విడివిడిగా భేటీ, పరీక్షల నిర్వహణపై ఉత్కంఠ
Embed widget