అన్వేషించండి

Rohit Sharma Update: లక్కంటే హిట్‌మ్యాన్‌దే! టీమ్‌ఇండియా 1000 వన్డేకు సారథ్యం! ఈ Stats చూస్తే ఆశ్చర్యమే!

రోహిత్‌ శర్మ అరుదైన ఘనత అందుకోబోతున్నాడు. భారత్ ఆడే 1000వ వన్డేకు నాయకత్వం వహించబోతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌ చరిత్రలో ఇప్పటి వరకు ఇన్ని మ్యాచులు ఆడిన జట్టు మరొకటి లేదు.

కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అరుదైన ఘనత అందుకోబోతున్నాడు. భారత జట్టు ఆడే 1000వ వన్డేకు నాయకత్వం వహించబోతున్నాడు. అన్నీ సవ్యంగా జరిగితే టీమ్‌ఇండియా స్వర్ణయుగపు క్రికెట్‌కు అతడు అంకురార్పరణ చేయనున్నాడు.

టీమ్‌ఇండియా ఇప్పటి వరకు 999 వన్డేలు ఆడింది. అంతర్జాతీయ క్రికెట్‌ చరిత్రలో ఇప్పటి వరకు ఇన్ని మ్యాచులు ఆడిన జట్టు మరొకటి లేదు. వెయ్యో మ్యాచ్‌ ఆడబోతున్న తొలి దేశంగా భారత్‌ చరిత్రలో నిలిచిపోనుంది. 1974లో అజిత్‌ వాడేకర్‌ నాయకత్వంలో ఇంగ్లాండ్‌పై టీమ్‌ఇండియా తొలి వన్డే ఆడింది. అక్కడి నుంచి మనం వెనుదిరిగి చూసిందే లేదు. రెండు ప్రపంచకప్‌లు సాధించాం. అత్యు్త్తమ జట్టుగా ఎదిగాం. విలువైన క్రికెటర్లను ప్రపంచానికి అందించాం. క్రికెట్‌కు ఈ భూమ్మీదే అతిపెద్ద మార్కెట్‌ను సృష్టించాం.

భారత వందో వన్డేకు కపిల్‌దేవ్‌ సారథ్యం వహించాడు. ఈ మ్యాచ్‌ ఆస్ట్రేలియాపై జరిగింది. 200 వన్డేకు మహ్మద్‌ అజహరుద్దీన్‌, 300 మ్యాచుకు సచిన్‌ తెందూల్కర్‌, 400  వన్డేకు మహ్మద్‌ అజహరుద్దీన్‌ నాయకత్వం వహించారు. కీలకమైన 500వ వన్డేకు సౌరవ్‌ గంగూలీ కెప్టెన్సీ చేశాడు.  ఈ మ్యాచ్‌ కూడా ఇంగ్లాండ్‌పైనే జరిగింది. ఇక 700, 800, 900 వన్డేలకు 'మిస్టర్‌ కూల్‌' ఎంఎస్‌ ధోనీ నేతృత్వం వహించాడు. ముచ్చటగా 1000 వన్డేలో రోహిత్‌ శర్మ టీమ్‌ఇండియాను ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం మొతేరాలో నడిపించనున్నాడు.

టీమ్‌ఇండియా అరుదైన గణాంకాలు

  • ఆడిన వన్డేలు : 999
  • గెలిచిన మ్యాచులు : 518 (51.85%)
  • ఓడిన మ్యాచులు :  431 (43.14%)
  • టై అయిన మ్యాచులు : 9
  • ఫలితం తేలని మ్యాచులు : 41
  • ఆడిన క్రికెటర్లు : 242
  • అత్యధిక వ్యక్తిగత స్కోరు : 264 (రోహిత్‌ శర్మ)
  • అత్యధిక పరుగుల క్రికెటర్‌ : 18,426 (సచిన్‌ తెందూల్కర్‌)
  • అత్యుత్తమ బ్యాటింగ్‌ సగటు : 58.78 (విరాట్‌ కోహ్లీ)
  • అత్యు్త్తమ బౌలింగ్‌ : 6/4 (స్టువర్ట్‌ బిన్నీ)
  • అత్యధిక వికెట్లు : 334 (అనిల్‌ కుంబ్లే)
  • ఎక్కువ డిస్మిసల్స్‌ : 438 (ఎంఎస్ ధోనీ, స్టంపులు, క్యాచులు కలిసి)
  • అత్యధిక జట్టు స్కోరు : 418-5 (వెస్టిండీస్‌పై)
  • అత్యల్ప జట్టు స్కోరు :  54 (శ్రీలంక చేతిలో)

ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో పర్యటిస్తున్న వెస్టిండీస్‌ ఫిబ్రవరి 2న అహ్మదాబాద్‌ చేరుకుంటుంది. 6, 9, 11న మొతెరా వేదికగా మూడు వన్డేలు జరుగుతాయి. 16, 18, 20న కోల్‌కతా వేదికగా టీ20లు నిర్వహిస్తారు. ఇందుకోసం టీమ్‌ఇండియా ఆటగాళ్లు ఫిబ్రవరి 1న అహ్మదాబాద్‌కు చేరుకోవాల్సి ఉంటుంది. మూడు రోజుల క్వారంటైన్‌ తర్వాత సన్నాహక శిబిరం ఉంటుంది. ఆ తర్వాత మ్యాచులు మొదలవుతాయి.

Also Read: Ashleigh Barty: ‘ఏ బిడ్డా.. ఇది నా అడ్డా..’ 44 సంవత్సరాల తర్వాత చరిత్ర.. ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా యాష్లే!

Also Read: David Warner Daughter: డేవిడ్ వార్నరే కాదు తన కూతురు కూడా.. ‘తగ్గేదే లే’!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Minister Ramanaidu:  మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
Revanth Reddy:  ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Priyanka Chopra: హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ICC Champions Trophy 2025 Team India | అగార్కర్ తో డ్రెస్సింగ్ రూమ్ లో Gambhir డిష్యూం డిష్యూం | ABP DesamChhatrapati Sambhaji Maharaj 'Sambar' | సాంబార్ చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు | ABP DesamVicky Kaushal Bollywood Super Star | Chhava తో కొత్త సూపర్ స్టార్ పుట్టాడా.? | ABP DesamMLC Candidate Aviash Jadhav Interview | పదిహేను నా లక్కీ నెంబర్ ఎందుకంటే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Ramanaidu:  మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
Revanth Reddy:  ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Priyanka Chopra: హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
Hyderabad Crime News మేడ్చల్‌లో యువకుడి దారుణహత్య, నడిరోడ్డుపై కత్తులతో దాడి కేసులో ఊహించని ట్విస్ట్
మేడ్చల్‌లో యువకుడి దారుణహత్య, నడిరోడ్డుపై కత్తులతో దాడి కేసులో ఊహించని ట్విస్ట్
First GBS Death in AP: ఏపీలో తొలి జీబీఎస్ పేషెంట్ మృతి, నిర్ధారించిన గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్
ఏపీలో తొలి జీబీఎస్ పేషెంట్ మృతి, నిర్ధారించిన గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్
WPL Result Update: గార్డెనర్ కెప్టెన్ ఇన్నింగ్స్.. డబ్ల్యూపీఎల్ లో గుజరాత్ బోణీ, 6 వికెట్లతో యూపీ చిత్తు
గార్డెనర్ కెప్టెన్ ఇన్నింగ్స్.. డబ్ల్యూపీఎల్ లో గుజరాత్ బోణీ, 6 వికెట్లతో యూపీ చిత్తు
Who Is Mastan Sai: ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.