అన్వేషించండి

PKL Season 11 auction: కూత పెట్టారు, కోట్లు పట్టారు- ప్రో కబడ్డీ వేలంలో కోట్లు పలికిన ఆటగాళ్లు

PKL: దేశ ఆర్థిక రాజధాని వేదికగా ప్రో కబడ్డీ లీగ్‌ వేలం ముగిసింది. 11వ సీజన్‌ కోసం వేలాన్ని నిర్వహించగా రెండ్రోజుల్లో మొత్తం 118 మంది ఆటగాళ్లను ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి.

Pro Kabaddi League 2024 Auction Highlights: క్రికెట్‌లో ఐపీఎల్ తరహాలో కబడ్డీలో ఆరంభించిన ప్రో కబడ్డీ లీగ్‌(Pro Kabaddi League).... ఒకప్పుడు చిన్నగా ప్రారంభమై ఇప్పుడు మహా వృక్షంగా ఎదుగుతోంది. కబడ్డీ ఆటగాళ్ల కూతకు కోట్లు తెగుతున్నాయి. ఆటగాళ్లపై కాసుల వర్షం కురుస్తోంది. రెండు రోజుల పాటు జరిగిన ప్రొ కబడ్డీ లీగ్‌ వేలంలో ప్రాంఛైజీలు ఆటగాళ్లపై కోట్లు కుమ్మరించేశాయి. ఈ ఏడాది జరిగిన వేలంలో ఏకంగా ఎనిమిది మంది ఆటగాళ్లు కోటీ రూపాయలకంటే ఎక్కువ ధర పలకడం విశేషం. గతంలో లక్షలు పెట్టేందుకు వెనకాడిన ప్రాంఛైజీలు.. ప్రో కబడ్డీ లీగ్‌కు లభిస్తున్న ఆదరణ చూసి కోట్లు పెట్టేందుకు ఏ మాత్రం వెనకడగు వేయలేదు. దేశీయ ఆటగాళ్లలో సచిన్‌ తల్వార్‌కు  రూ.2.15 కోట్లతో అత్యధిక ధర పలకగా...   విదేశీ ఆటగాళ్లలో ఇరాన్‌ ఆల్‌రౌండర్‌ మహమ్మద్‌రెజా చియానెకు రూ.2.07 కోట్లు దక్కించుకున్నాడు. ఈసారి ఇద్దరు ఆటగాళ్లు రెండు కోట్ల రూపాయలకుపైగా అమ్ముడుపోగా... ఆరుగురు ఆటగాళ్లకు కోటీ రూపాయలకు పైగా దక్కాయి. వేలంపాట ముగియడంతో ఇక కబడ్డీ కూతకు దేశం మొత్తం సిద్ధమైపోయింది. 
 
భారీ ధర వీరికే
సచిన్‌ తన్వర్‌ను తమిళ్‌ తలైవాస్‌ రూ.2.15 కోట్లకు దక్కించుకుంది. మహమ్మద్‌రెజాను హరియాణా స్టీలర్స్‌- రూ.2.07 కోట్లకు దక్కించుకోగా... గుమన్‌ సింగ్‌ను గుజరాత్‌ జెయింట్స్‌- రూ.1.97 కోట్లకు.. పవన్‌ సెహ్రావత్‌ను తెలుగు టైటాన్స్‌- రూ.1.725 కోట్లకు చేజిక్కించుకున్నాయి. యూపీ యోధాస్‌- రూ.1.30 కోట్లకు భరత్‌ను..  బెంగాల్‌ వారియర్స్‌- రూ.1.15 కోట్లకు మణిందర్‌ సింగ్‌ను కొనుగోలు చేశాయి. అజింక్య పవార్‌ను బెంగళూరు బుల్స్‌- రూ.1.107 కోట్లకు... సునీల్‌ కుమార్‌ను యు ముంబా- రూ.1.015 కోట్లకు కొనుగోలు చేశాయి.  
 
వేలంలో 500 మంది కబడ్డీ ఆటగాళ్లు
రెండు రోజుల పాటు ముంబైలో జరిగిన ప్రో కబడ్డీ లీగ్ 2024 వేలంలో మొత్తం 500 మందికి పైగా ఆటగాళ్ల కోసం వేలం జరిగింది. మొత్తం 118 మంది ఆటగాళ్లు ఈ వేలంలో అమ్ముడుపోయారు. కీలక ఆటగాళ్ల కోసం వేలం హోరాహోరీగా సాగింది. ఓ దశలో ఆటగాళ్లపై కోట్లు కుమ్మరించేందుకు కూడా ప్రాంఛైజీలు ఏ మాత్రం వెనకడుగు వేయలేదు. సచిన్‌ తల్వార్ కోసమైతే హోరాహోరీగా వేలం సాగింది. నాలుగు సంవత్సరాల విరామం తర్వాత జాంగ్ కున్ లీ... పాట్నా పైరేట్స్‌ జట్టులోకి మళ్లీ తిరిగి వచ్చాడు. తమిళ్ తలైవాస్, యుపీ యోధాస్ తమ ఎలైట్ ప్లేయర్‌లను నిలబెట్టుకోలేదు. తమిళ్ తలైవాస్ ఏడుగురు యువ ఆటగాళ్లను, పుణెరి పల్టాన్ ఆరుగురు యువ ఆటగాళ్లను తమ జట్టులోకి తీసుకున్నారు. గుజరాత్ జెయింట్స్, జైపూర్ పింక్ పాంథర్స్ కేవలం ఐదుగురిని మాత్రమే కొనుగోలు చేశాయి. మిగిలిన ఆటగాళ్లందరినీ రిటైన్ చేసుకున్నాయి.
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
Embed widget