అన్వేషించండి

Modi Sindhu Icecream : ప్రధాని మోడీ - షట్లర్ సింధు... ఇద్దరి మధ్య ఐస్‌క్రీమ్ ఒప్పందం.. ఇదీ అసలు కథ..

టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లే ముందు ఆటగాళ్లతో ఇంటరాక్ట్ అయిన ప్రధాని మోడీ... పతకం సాధించి తిరిగి వచ్చిన తర్వాత ఐస్ క్రీం తిందామని హామీ ఇచ్చారు. ఇప్పుడు పీవీ సింధు ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు.

ఒలింపిక్స్‌లో పతకం గెలిచిన పీవీ సింధుకు.. తాను ఇచ్చిన హామీ మేరకు... ప్రధానమంత్రి నరేంద్రమోడీ అనూహ్యమైన బహుమతి ఇవ్వనున్నారు. ఆ బహుమతి గురించి ప్రధాని మోడీ ముందుగానే సింధుకు చెప్పారు. ఇంతకూ అదేమిటో తెలుసా...  ? ఎవరూ ఊహించనిది..! అదే ...  ఐస్ క్రీమ్. అవును.. నిజంగానే ఐస్ క్రీమ్ . కొద్ది రోజుల కిందట ఒలింపిక్స్‌కు వెళ్లే ఆటగాళ్లతో  ప్రధాని మోడీ వర్చువల్‌గా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా..  పతకాల కోసం ఆటగాళ్లు ఎలా శ్రమిస్తున్నారో వారిని అడిగి తెలుసుకున్నారు. పీవీ సింధుతో మాట్లాడినప్పుడు ఆమె తల్లిదండ్రులు కూడా వర్చువల్ భేటీలో పాల్గొన్నారు.  ఈ సందర్భంగా పీవీ సింధు... గేమ్ కోసం.. పతకం కోసం ఎంత కష్టపడుతుందో వివరించారు. ఎంత నిష్టగా ఆహార నియమాలు పాటిస్తుందో చెప్పారు. ఈ సందర్భంగా... పీవీ సింధుకు ఎంతో ఇష్టమైన ఐస్‌క్రీమ్‌ను కూడా చాలా కాలంగా త్యాగం చేసిందని చెప్పారు. ఈ మాట విన్న ప్రధాని మోడీ... ఒలింపిక్స్‌లో పతకం తీసుకు వస్తే... తనతో కలిసి ఐస్‌క్రీమ్ తినవచ్చునని హామీ ఇచ్చారు.  

ప్రధానితో ఐస్ క్రీమ్ తినే అవకాశం కోసమైనా పతకం సాధించాలన్న పట్టుదలను ఆమెలో కల్పించేందుకు మోడీ ప్రయత్నించారు. సింధు కఠోర శ్రమ ఫలించింది. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించింది. దీంతో సింధు తండ్రి ఆనందానికి కూడా అవధుల్లేవు. సింధు గెలిచిన తర్వాత మీడియాతో మాట్లాడిన పీవీ రమణ... ఇప్పుడు  సింధు.. ప్రధాని మోడీతో కలిసి ఐస్ క్రీమ్ తినవచ్చునని వ్యాఖ్యానించారు. ఒలింపిక్స్‌ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి కార్యాలయం కూడా ప్రత్యేకంగా విజేతల్ని ఫెసిలిటేట్ చేసే కార్యక్రమం నిర్వహిస్తుంది. ఆ సందర్భంగా పీవీ సింధుకు, ప్రధాని మోడీ ఐస్ క్రీమ్ ఆఫర్ చేసే అవకాశం ఉంది.

మంగళవారం లేదా బుధవారం పీవీ సింధు స్వదేశానికి తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత ప్రధాని మోడీని కలిసే అవకాశం ఉంది.  టోక్యో నుంచి వర్చువల్‌గా మీడియాతో ఇంటరియాక్ట్ అయిన పీవీ సింధు కూడా... ప్రధానమంత్రితో కలిసి ఐస్ క్రీం తినేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నానని చెప్పారు.  ఒలింపిక్స్ తొలి రోజు రజతం గెలిచిన మీరాభాయి చానుకు పిజ్జాలంటే చాలా ఇష్టం. ఈ సందర్భంగా డామినోస్ సంస్థ జీవితాంతం ఉచితంగా పిజ్జాలు ఇస్తామని ప్రకటించింది. స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత కేంద్రమంత్రిని కలిసిన సమయంలోనూ వారు పిజ్జాలు తింటూ ఫోటోలకు ఫోజులిచ్చారు. ఇప్పుడు ప్రధానమంత్రి వంతు అనుకోవచ్చు..! 

 

 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kurnool Bus Mishap Exgratia: కర్నూలు ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం
కర్నూలు ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం
Reason For Kurnool bus Accident: కర్నూలులో బస్సు ప్రమాదానికి కారణమేంటి.. భారీ ప్రాణ నష్టం ఎలా సంభవించింది..
కర్నూలులో బస్సు ప్రమాదానికి కారణమేంటి.. భారీ ప్రాణ నష్టం ఎలా సంభవించింది..
DNA Test For Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద మృతదేహాలు గుర్తించేందుకు డీఎన్ఏ టెస్టులు: మంత్రి సత్యకుమార్
కర్నూలు బస్సు ప్రమాద మృతదేహాలు గుర్తించేందుకు డీఎన్ఏ టెస్టులు: మంత్రి సత్యకుమార్
Gold: 18 క్యారెట్ల ఆభరణాలను 22 క్యారెట్లుగా చెప్పి అమ్ముతున్న బంగారం వ్యాపారులు, మోసాన్ని గుర్తించేదెలా?
18 క్యారెట్ల ఆభరణాలను 22 క్యారెట్లుగా చెప్పి అమ్ముతున్న బంగారం వ్యాపారులు, మోసాన్ని గుర్తించేదెలా?
Advertisement

వీడియోలు

Vizag Google Data Centre Controversy | వైజాగ్ గూగుల్ డేటా సెంటర్ పై ప్రశ్నలకు సమాధానాలేవి..? | ABP
Aus vs Ind 2nd ODI Highlights | రెండు వికెట్ల తేడాతో భారత్ పై రెండో వన్డేలోనూ నెగ్గిన ఆసీస్ | ABP Desam
Netaji Subhash Chandra Bose | నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్ చరిత్ర | ABP Desam
కోహ్లీ భయ్యా.. ఏమైందయ్యా..? అన్నీ గుడ్లు, గుండు సున్నాలు పెడుతున్నావ్!
గిల్‌కి షేక్ హ్యాండ్ ఇచ్చిన పాకిస్తాన్ ఫ్యాన్‌.. ఫైర్ అవుతున్న క్రికెట్ ఫ్యాన్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kurnool Bus Mishap Exgratia: కర్నూలు ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం
కర్నూలు ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం
Reason For Kurnool bus Accident: కర్నూలులో బస్సు ప్రమాదానికి కారణమేంటి.. భారీ ప్రాణ నష్టం ఎలా సంభవించింది..
కర్నూలులో బస్సు ప్రమాదానికి కారణమేంటి.. భారీ ప్రాణ నష్టం ఎలా సంభవించింది..
DNA Test For Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద మృతదేహాలు గుర్తించేందుకు డీఎన్ఏ టెస్టులు: మంత్రి సత్యకుమార్
కర్నూలు బస్సు ప్రమాద మృతదేహాలు గుర్తించేందుకు డీఎన్ఏ టెస్టులు: మంత్రి సత్యకుమార్
Gold: 18 క్యారెట్ల ఆభరణాలను 22 క్యారెట్లుగా చెప్పి అమ్ముతున్న బంగారం వ్యాపారులు, మోసాన్ని గుర్తించేదెలా?
18 క్యారెట్ల ఆభరణాలను 22 క్యారెట్లుగా చెప్పి అమ్ముతున్న బంగారం వ్యాపారులు, మోసాన్ని గుర్తించేదెలా?
Telangana Cabinet Decisions: బీసీ రిజర్వేన్లపై వీడిన సస్పెన్స్- తెలంగాణ క్యాబినేట్ కీలక నిర్ణయాలు!
బీసీ రిజర్వేన్లపై వీడిన సస్పెన్స్- తెలంగాణ క్యాబినేట్ కీలక నిర్ణయాలు!
Investment Tips: బంగారం, వెండి లేదా షేర్లు.. ఎందులో పెట్టుబడి పెడితే భారీగా లాభాలొస్తాయి
బంగారం, వెండి లేదా షేర్లు.. ఎందులో పెట్టుబడి పెడితే భారీగా లాభాలొస్తాయి
YS Jagan Comments on Google Data Center: విశాఖకు గూగుల్ సెంటర్ రావడంలో మాకు, అదానీకి క్రెడిట్ ఇవ్వడం లేదు: జగన్
విశాఖకు గూగుల్ సెంటర్ రావడంలో మాకు, అదానీకి క్రెడిట్ ఇవ్వడం లేదు: జగన్
Ram Charan Upasana: కవలలకు జన్మనివ్వనున్న రామ్ చరణ్ ఉపాసన కపుల్! - మెగా ఫ్యామిలీలో డబుల్ సందడి
కవలలకు జన్మనివ్వనున్న రామ్ చరణ్ ఉపాసన కపుల్! - మెగా ఫ్యామిలీలో డబుల్ సందడి
Embed widget