అన్వేషించండి

Paris Paralympics 2024: భారత్‌! తగ్గేదే లే, పారాలింపిక్స్‌లో పతక పంట

Paris Paralympics 2024: భారత పతకాల సంఖ్య 29కి పెరిగింది. ఇందులో ఏడు స్వర్ణాలు... తొమ్మిది రజతాలు, 13 కాంస్య పతకాలతో భారత్ పతకాల జాబితాలో పదహారో స్థానానికి ఎగబాకింది.

India Achieves Historic Feat Winning 29 Medals:  పారాలింపిక్స్‌(Paris Paralympics 2024)లో భారత్(India) పతకాల పంట పండిస్తోంది. ఇప్పటికే గత రికార్డులన్నింటినీ అధిగమించేసి... నిర్దేశించుకున్న లక్ష్యాన్ని కూడా భారత్ ఛేదించేసింది. ఇక నిన్న ( శనివారం) భారత్ ఖాతాలో మరో రెండు పతకాలు చేరాయి. దీంతో భారత పతకాల సంఖ్య 29కి పెరిగింది. ఇందులో ఏడు స్వర్ణాలు... తొమ్మిది రజతాలు, 13 కాంస్య పతకాలతో భారత్ పతకాల జాబితాలో పదహారో స్థానానికి ఎగబాకింది. ఇప్పటివరకూ 17వ స్థానంలో  ఉన్న భారత్ జావెలిన్‌లో వచ్చిన పసిడి పతకంతో ఒక స్థానంపైకి ఎగబాకింది.  దీంతో 16వ స్థానంలో నిలిచి సత్తా చాటింది. 
 
మెరిసిన నవదీప్
 పారా ఒలింపిక్స్‌  పురుషుల జావెలిన్‌ త్రో ఎఫ్‌-41 విభాగంలో .. భారత అథ్లెట్‌ నవదీప్‌(Navdeep) స్వర్ణ పతకంతో మెరిశాడు. ఈ పతకం అనూహ్యంగా భారత్‌ ఖాతాలో చేరింది. తొలుత ఇరాన్ అథ్లెట్‌ సదేఘ్ షాయ్ తొలుత స్వర్ణ పతకం సాధించాడు. భారత అథ్లెట్ నవదీప్ రజత పతకం సాధించాడు. అయితే ఇరాన్ అథ్లెట్ షాయ్‌పై అనూహ్యంగా వేటు పడింది. దీంతో రెండో స్థానంలో ఉన్న నవదీప్‌కు స్వర్ణ పతకం దక్కింది. జావెలిన్‌ త్రో ఎఫ్‌-41 ఈవెంట్‌ పసిడి పతకం గెలిచిన ఏకైక ఇండియన్ అథ్లెట్‌గా నవదీప్‌ చరిత్ర సృష్టించాడు. నవదీప్‌ రెండో ప్రయత్నంలో 46.39 మీటర్ల దూరం ఈటెను విరిశాడు. మూడో త్రోలో 47.32 మీటర్లు విసిరాడు. అయితే ఇరాన్‌కు చెందిన సదేగ్ షాయ్‌.. తన ఐదో ప్రయత్నంలో 47.64 మీటర్ల త్రో విసిరి పారాలింపిక్స్‌ రికార్డు సృష్టించి తొలుత  స్వర్ణం గెలిచాడు. అయితే పోటీ ముగిసిన తర్వాత ఒలింపిక్స్‌ నిర్వహక కమిటీ సదేగ్‌పై అనర్హత వేటు వేసింది. దీంతో నవదీప్ స్వర్ణ పతక విజేతగా నిలిచాడు. సన్ పెంగ్సియాంగ్ 44.72 మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరి రజత పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. ఇరాక్‌కు చెందిన నుఖైలావి విల్డాన్ 40.46 మీటర్ల దూరం విసిరి కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. మరుగుజ్జుల కోసం F41 విభాగంలో పారాలింపిక్స్‌లో పోటీలు నిర్వహిస్తారు. 
 
సిమ్రన్‌ శర్మకు కాంస్యం
మహిళల 200మీటర్ల టీ12 విభాగంలో భారత అథ్లెట్ సిమ్రన్‌(Simran) కాంస్య పతకం సాధించింది. మహిళల 200 మీటర్ల T12 ఈవెంట్‌లో సిమ్రన్ శర్మ 24.75 సెకన్లతో వ్యక్తిగత రికార్డును నెలకొల్పి మూడో స్థానంలో నిలిచింది. క్యూబాకు చెందిన ఒమారా డ్యూరాండ్ ఎలియాస్ 23.62 సెకన్లలో స్వర్ణం, వెనిజులాకు చెందిన అలెజాండ్రా పోలా పెరెజ్ లోపెజ్ 24.19 సెకన్లతో రజతం గెలుచుకున్నారు. పారాలింపిక్స్‌లో T12 విభాగం దృష్టి లోపం ఉన్న అథ్లెట్లకు నిర్వహిస్తారు. 
 
పతకాల పట్టికలో
పారాలింపిక్స్‌లో భారత పతకాల సంఖ్య 29కి పెరిగింది. ఇందులో ఏడు స్వర్ణాలు,  తొమ్మిది రజతాలు, 13 కాంస్యాలు ఉన్నాయి. భారత్ ప్రస్తుతం పతకాల పట్టికలో 16వ స్థానంలో ఉంది. 93 స్వర్ణాలతో సహా 215 పతకాలతో చైనా అగ్రస్థానంలో ఉంది. బ్రిటన్ 120 పతకాలతో రెండో స్థానంలో ఉండగా... అమెరికా 102 పతకాలతో మూడో స్థానంలో ఉంది.

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?

వీడియోలు

Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్
Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Hyderabad Old City: మద్యం మత్తులో ఆటోడ్రైవర్ వీరంగం.. పాము వదులుతా అని పోలీసులను భయపెట్టి పరార్
మద్యం మత్తులో ఆటోడ్రైవర్ వీరంగం.. పాము వదులుతా అని పోలీసులను భయపెట్టి పరార్
Bangladesh squad for T20 world cup: టీ20 వరల్డ్ కప్ కోసం బంగ్లాదేశ్ జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా హిందువుకు ఛాన్స్
టీ20 వరల్డ్ కప్ కోసం బంగ్లాదేశ్ జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా హిందువుకు ఛాన్స్
Embed widget