అన్వేషించండి

Paris Olympics 2024: హాకీ స్వర్ణ యుగానికి బాటలు వేశారు, రాజకీయ, క్రీడా ప్రముఖుల ప్రశంసలు

Olympic Games Paris 2024: పారిస్ ఒలింపిక్స్లో భారత హాకీ జట్టు స్పెయిన్‌ను 2-1తో ఓడించింది. కాంస్య పతకాన్ని గెలుచుకుంది. దీంతో భారత హాకీ జట్టును ప్రముఖులు అభినందనలతో ముంచెత్తారు.

Celebraties congratulated The Indian Hockey Team: ఒలింపిక్స్‌( Olympics )లో వరుసగా రెండోసారి కాంస్య పతకంతో మెరిసిన భారత హాకీ(Indian Hockey) జట్టుపై ప్రశంసల జల్లు కురుస్తోంది. దేశం మొత్తం ఇండియన్‌ హాకీ టీం సాధించిన ఘనతతో సంబరాల్లో మునిగిపోయింది. భారత రాష్ట్రపతి నుంచి కీలక నేతలు అందరూ భారత హాకీ జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు. దిగ్గజ క్రికెటర్ల నుంచి సామాన్య అభిమాని వరకు భారత హాకీ జట్టు విశ్ర క్రీడల్లో వరుసగా రెండో పతకం సాధించడంతో పండుగ చేసుకుంటున్నారు. ఈ అపురూప విజయం సాధించిన తర్వాత భారత ఆటగాళ్లు డ్రెస్సింగ్‌ రూమ్‌లో డ్యాన్స్‌లతో ఇరగదీశారు. తన చివరి మ్యాచ్‌ ఆడిన శ్రీజేష్‌... సూపర్‌ డ్యాన్స్‌తో దుమ్ములేపాడు.

 
ప్రముఖుల సందేశాలు..
విశ్వ క్రీడల్లో వరుసగా రెండో పతకం సాధించిన భారత హాకీ జట్టును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసించారు. పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సాధించినందుకు మన హాకీ జట్టుకు హృదయపూర్వక అభినందనలని రాష్ట్రపతి ట్వీట్‌ చేశారు. ఐదు దశాబ్దాల తర్వాత భారత్ వరుసగా రెండు ఒలింపిక్ క్రీడల్లో కాంస్య పతకాలు సాధించడం గర్వకారణమని రాష్ట్రపతి అన్నారు. భారత హాకీ పూర్వ వైభవం దిశగా పయనిస్తోందని రాష్ట్రపతి అన్నారు. భారత హాకీ జట్టు భారత దేశాన్ని గర్వపడేలా చేసిందని కొనియాడారు. ఇండియన్‌ హాకీ టీం నైపుణ్యాలు, సమన్వయం, పోరాట పటిమ.. యువతకు స్ఫూర్తిదాయకమని రాష్ట్రపతి అన్నారు. 

 
ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత హాకీ జట్టుతో ప్రధాని మోదీ ఫోన్‌లో మాట్లాడారు. కెప్టన్‌ హర్మన్‌ ప్రీత్‌తో సహా చివరి మ్యాచ్‌ ఆడిన గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేష్‌తో మోదీ ప్రత్యేకంగా సంభాషించారు. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ నాయకత్వంపై మోదీ ప్రశంసలు కురిపించారు. భారత హాకీ స్వర్ణ యుగం వస్తుందని మోదీ అన్నారు. స్వర్ణ కాలాన్ని మీరు తిరిగి తీసుకువస్తారని తాను విశ్వసిస్తున్నానని ప్రధాని మోడీ పేర్కొన్నారు.
శ్రీజేష్‌ ఓ కంచు కోటని కొనియాడారు.  

ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌, క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండూల్కర్‌, రెండు ఒలింపిక్‌ పతకాల విజేత మనూ బాకర్‌,  మహ్మద్‌ కైఫ్‌, బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ సైనా నేహ్వాల్‌,, భారత జట్టుకు అభినందనలు తెలిపారు.
 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Fibernet: ఏపీ ఫైబర్ నెట్ ఎండీగా ప్రవీణ్ ఆదిత్య - చైర్మన్,ఎండీ వివాదం తర్వాత కీలక నియామకం
ఏపీ ఫైబర్ నెట్ ఎండీగా ప్రవీణ్ ఆదిత్య - చైర్మన్,ఎండీ వివాదం తర్వాత కీలక నియామకం
Revanth Reddy : ఢిల్లీకి రేవంత్ రెడ్డి - ప్రధానితో అపాయింట్‌మెంట్ ఖరారు
ఢిల్లీకి రేవంత్ రెడ్డి - ప్రధానితో అపాయింట్‌మెంట్ ఖరారు
Pawan Kalyan in Assembly: పదిహేనేళ్లు ఏపీలో ఎన్డీఏ  పాలన - వైసీపీ తీరు వివేకా హత్యను గుర్తు చేస్తోంది - అసెంబ్లీలో పవన్
పదిహేనేళ్లు ఏపీలో ఎన్డీఏ పాలన - వైసీపీ తీరు వివేకా హత్యను గుర్తు చేస్తోంది - అసెంబ్లీలో పవన్
Nara Lokesh Fires on YSRCP: మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని ఎమ్మెల్యే జగన్ అన్నారు, 5 ఏళ్లు ఏం చేశారంటూ నారా లోకేష్ గరం గరం
మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని ఎమ్మెల్యే జగన్ అన్నారు, 5 ఏళ్లు ఏం చేశారంటూ నారా లోకేష్ గరం గరం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Minister Narayana Team in Maha Kumbh 2025 | పుష్కరాల కోసం మహాకుంభమేళాలో అధ్యయనం | ABP DesamGV Reddy Resign AP Fibernet Chairman | ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ పదవికి జీవీరెడ్డి రాజీనామా | ABP DesamBJP MLC Candidate Anji Reddy Interview | కిషన్ రెడ్డి ప్రచారం చేసేంత ప్రాధాన్యత అంజిరెడ్డికి ఎందుకు?Tesla Company for Andhra Pradesh | ఎలన్ మస్క్ కార్ల కంపెనీ ఆంధ్ర ప్రదేశ్ కు వస్తోందా.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Fibernet: ఏపీ ఫైబర్ నెట్ ఎండీగా ప్రవీణ్ ఆదిత్య - చైర్మన్,ఎండీ వివాదం తర్వాత కీలక నియామకం
ఏపీ ఫైబర్ నెట్ ఎండీగా ప్రవీణ్ ఆదిత్య - చైర్మన్,ఎండీ వివాదం తర్వాత కీలక నియామకం
Revanth Reddy : ఢిల్లీకి రేవంత్ రెడ్డి - ప్రధానితో అపాయింట్‌మెంట్ ఖరారు
ఢిల్లీకి రేవంత్ రెడ్డి - ప్రధానితో అపాయింట్‌మెంట్ ఖరారు
Pawan Kalyan in Assembly: పదిహేనేళ్లు ఏపీలో ఎన్డీఏ  పాలన - వైసీపీ తీరు వివేకా హత్యను గుర్తు చేస్తోంది - అసెంబ్లీలో పవన్
పదిహేనేళ్లు ఏపీలో ఎన్డీఏ పాలన - వైసీపీ తీరు వివేకా హత్యను గుర్తు చేస్తోంది - అసెంబ్లీలో పవన్
Nara Lokesh Fires on YSRCP: మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని ఎమ్మెల్యే జగన్ అన్నారు, 5 ఏళ్లు ఏం చేశారంటూ నారా లోకేష్ గరం గరం
మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని ఎమ్మెల్యే జగన్ అన్నారు, 5 ఏళ్లు ఏం చేశారంటూ నారా లోకేష్ గరం గరం
Telangana Latest News: రేవంత్ సర్కార్‌ని టార్గెట్‌ చేసిన కాంగ్రెస్ నేత- బీఆర్‌ఎస్‌కు కొత్త అస్త్రం దొరికినట్టే?
రేవంత్ సర్కార్‌ని టార్గెట్‌ చేసిన కాంగ్రెస్ నేత- బీఆర్‌ఎస్‌కు కొత్త అస్త్రం దొరికినట్టే?
NTRNeel Project: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ కథ ఇదేనా? - పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో ఎన్టీఆర్ రోల్‌పై ఆ రూమర్స్‌లో నిజమెంత?
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ కథ ఇదేనా? - పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో ఎన్టీఆర్ రోల్‌పై ఆ రూమర్స్‌లో నిజమెంత?
Sai Pallavi: సాయి పల్లవి మిగతా హీరోయిన్లలా ఎందుకు మేకప్ వేసుకోదో తెలుసా?
సాయి పల్లవి మిగతా హీరోయిన్లలా ఎందుకు మేకప్ వేసుకోదో తెలుసా ?
Maha Kumbh: ఎలా వస్తాయబ్బా ఇలాంటి ఐడియాలు - వీడియో కాల్‌తో త్రివేణి సంగమంలో  పుణ్యస్నానం చేయించేస్తున్నారు.
ఎలా వస్తాయబ్బా ఇలాంటి ఐడియాలు - వీడియో కాల్‌తో త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేయించేస్తున్నారు.
Embed widget