News
News
వీడియోలు ఆటలు
X

WTC Final 2023: వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఏ బాల్ వాడతారు - టీమిండియాకు కొంచెం కష్టమే!

ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌ను డ్యూక్ బాల్‌తో ఆడించాలని ఐసీసీ నిర్ణయించింది.

FOLLOW US: 
Share:

WTC Final 2023 Australia vs India: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) రెండో ఎడిషన్ ఫైనల్ మ్యాచ్ జూన్ 7వ తేదీన ఆస్ట్రేలియా, టీమిండియాల మధ్య ఇంగ్లండ్‌లోని ఓవల్ మైదానంలో జరగనుంది. అంతకుముందు 2021 సంవత్సరంలో మొదటి ఎడిషన్ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు భారత్‌ను ఓడించి టైటిల్‌ను గెలిచింది. ఈ టైటిల్ మ్యాచ్‌కు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది.

ఈ టైటిల్ మ్యాచ్ కోసం ఇప్పటికే భారత్, ఆస్ట్రేలియా జట్లను ప్రకటించారు. ఈ రెండు జట్లు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ మ్యాచ్ ఆడబోయే బంతిని వారి వారి దేశాల్లో ఉపయోగించరు. ఆస్ట్రేలియా జట్టు తమ స్వదేశంలో కూకాబుర్రా బంతితో ఆడుతుంది. భారత జట్టు తమ సొంత మైదానంలో ఎస్‌జీ బంతిని ఉపయోగిస్తుంది.

ఈ మ్యాచ్‌కు మాత్రం డ్యూక్ బాల్‌ను ఉపయోగించాలని ఐసీసీ నిర్ణయించింది. ఎందుకంటే ఇంగ్లండ్ ఫైనల్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తుంది. అక్కడ డ్యూక్ బాల్‌తోనే ఆడతారు. ఇప్పటి వరకు ICC ఆ దేశంలో క్రికెట్ ఆడే అన్ని ఈవెంట్‌లలో ఒకే బంతిని ఉపయోగిస్తుంది.

ఇప్పటికే జట్టును ప్రకటించిన భారత్
డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌కు భారత జట్టును ఇప్పటికే ప్రకటించింది. దీంతో టీమిండియా ఆటగాళ్లు ఇంకెంత కాలం ఇంగ్లండ్‌కు బయలుదేరుతారనే దానిపైనే ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. ఈ సారి ఐపీఎల్ సీజన్ ఫైనల్ మ్యాచ్ మే 28వ తేదీన జరగనుంది. అటువంటి పరిస్థితిలో ప్లేఆఫ్‌కు చేరుకోని జట్లలోని ఆటగాళ్లు ముందుగా ఇంగ్లాండ్‌కు బయలుదేరుతారు.

చాలా కాలం తర్వాత శ్రేయాస్ అయ్యర్ అన్‌ఫిట్ కావడం, సూర్యకుమార్ యాదవ్ ఫామ్‌లో లేకపోవడంతో జట్టులో చోటు దక్కించుకున్న అజింక్య రహానే కూడా భారత జట్టులో ఘనంగా పునరాగమనం చేయాలని చూస్తున్నాడు.

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు (WTC Final 2023) టీమ్‌ఇండియాను ప్రకటించారు. పదిహేను మందితో కూడిన జట్టును సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేసింది. చాలా రోజుల తర్వాత 'మిస్టర్‌ డిపెండబుల్‌' అజింక్య రహానెకు చోటు దక్కింది. జూన్‌ 7 నుంచి 11 వరకు మ్యాచ్‌ జరుగుతుంది. జూన్‌ 12ను రిజర్వు డేగా ప్రకటించారు. లండన్‌లోని ఓవల్‌ మైదానం ఇందుకు వేదిక. డబ్ల్యూటీసీ పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన ఆస్ట్రేలియాలతో హిట్‌మ్యాన్‌ సేన తలపడుతుంది.

ప్రస్తుతం ప్రకటించిన జట్టులో ఆరుగురు స్పెషలిస్టు బ్యాటర్లు ఉన్నారు. శుభ్‌మన్‌ గిల్‌, చెతేశ్వర్‌ పుజారా, విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, అజింక్య రహానె ఆ బాధ్యత తీసుకుంటారు. విశాఖ కుర్రాడు కేఎస్‌ భరత్‌ వికెట్‌ కీపర్‌గా ఎంపికయ్యాడు. అతడికి పోటీగా మరెవ్వరూ లేరు కాబట్టి తుది జట్టులో ఆడటం గ్యారంటీ! ముగ్గురు స్పిన్నర్లు, ఐదుగురు పేసర్లను తీసుకున్నారు.

టీమ్‌ఇండియా: రోహిత్‌ శర్మ, శుభ్ మన్‌ గిల్‌, చెతేశ్వర్‌ పుజారా, విరాట్‌ కోహ్లీ, అజింక్య రహానె, కేఎల్‌ రాహుల్‌, కేఎస్‌ భరత్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, శార్దూల్‌ ఠాకూర్‌, మహ్మద్‌ షమి, మహ్మద్‌ సిరాజ్‌, ఉమేశ్‌ యాదవ్‌, జయదేవ్‌ ఉనద్కత్‌

Published at : 27 Apr 2023 09:04 PM (IST) Tags: ICC Indian Cricket Team Australia Cricket Team Australia vs India WTC Final 2023

సంబంధిత కథనాలు

Ruturaj Gaikwad Wedding: ఇంటివాడైన రుతురాజ్- ఉత్కర్ష పవార్‌తో జట్టుకట్టిన సీఎస్కే ఓపెనర్

Ruturaj Gaikwad Wedding: ఇంటివాడైన రుతురాజ్- ఉత్కర్ష పవార్‌తో జట్టుకట్టిన సీఎస్కే ఓపెనర్

Viral Video: ఆ ట్రోఫీని వదిలేసి ముందు నన్ను హగ్ చేసుకో - వైరల్ అవుతున్న సాక్షి-ధోని వీడియో

Viral Video: ఆ ట్రోఫీని వదిలేసి ముందు నన్ను హగ్ చేసుకో - వైరల్ అవుతున్న సాక్షి-ధోని వీడియో

MS Dhoni Knee Surgery: ధోనికి విజయవంతంగా శస్త్రచికిత్స - రిటైర్మెంట్‌పై నిర్ణయం అప్పుడే!

MS Dhoni Knee Surgery: ధోనికి విజయవంతంగా శస్త్రచికిత్స - రిటైర్మెంట్‌పై నిర్ణయం అప్పుడే!

WTC 2023 Final: ఐపీఎల్ ముగిసింది - ఐసీసీ వేట మొదలైంది - డబ్ల్యూటీసీ ఫైనల్‌ వేదిక, బ్రాడ్‌కాస్ట్, జట్ల వివరాలివే

WTC 2023 Final: ఐపీఎల్ ముగిసింది - ఐసీసీ వేట మొదలైంది - డబ్ల్యూటీసీ ఫైనల్‌ వేదిక, బ్రాడ్‌కాస్ట్, జట్ల వివరాలివే

Annamalai on Jadeja: సీఎస్‌కే విజయం వెనుక బీజేపీ హస్తం - తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు

Annamalai on Jadeja: సీఎస్‌కే విజయం వెనుక బీజేపీ హస్తం - తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు

టాప్ స్టోరీస్

Gudivada Amarnath: రైలు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి గుడివాడ, మానవ తప్పిదమేనని వెల్లడి

Gudivada Amarnath: రైలు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి గుడివాడ, మానవ తప్పిదమేనని వెల్లడి

TDP Leaders on YCP Govt: ఆనం వెంకట రమణారెడ్డిపై దాడి అనాగరికం, అప్రజాస్వామికం: టీడీపీ నేతలు

TDP Leaders on YCP Govt: ఆనం వెంకట రమణారెడ్డిపై దాడి అనాగరికం, అప్రజాస్వామికం: టీడీపీ నేతలు

Sharwanand Wedding Photos : రాయల్‌గా శర్వా - రక్షిత వెడ్డింగ్, కొత్త జంట ఫోటోలు చూశారా?

Sharwanand Wedding Photos : రాయల్‌గా శర్వా - రక్షిత వెడ్డింగ్, కొత్త జంట ఫోటోలు చూశారా?

Odisha Train Accident: రైల్వే నెట్‌వర్క్‌లో కొన్ని లూప్‌హోల్స్‌ ఉన్నాయ్, అసలు సమస్య అదే - నిపుణులు

Odisha Train Accident: రైల్వే నెట్‌వర్క్‌లో కొన్ని లూప్‌హోల్స్‌ ఉన్నాయ్, అసలు సమస్య అదే - నిపుణులు