అన్వేషించండి

WTC Final 2023: వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఏ బాల్ వాడతారు - టీమిండియాకు కొంచెం కష్టమే!

ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌ను డ్యూక్ బాల్‌తో ఆడించాలని ఐసీసీ నిర్ణయించింది.

WTC Final 2023 Australia vs India: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) రెండో ఎడిషన్ ఫైనల్ మ్యాచ్ జూన్ 7వ తేదీన ఆస్ట్రేలియా, టీమిండియాల మధ్య ఇంగ్లండ్‌లోని ఓవల్ మైదానంలో జరగనుంది. అంతకుముందు 2021 సంవత్సరంలో మొదటి ఎడిషన్ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు భారత్‌ను ఓడించి టైటిల్‌ను గెలిచింది. ఈ టైటిల్ మ్యాచ్‌కు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది.

ఈ టైటిల్ మ్యాచ్ కోసం ఇప్పటికే భారత్, ఆస్ట్రేలియా జట్లను ప్రకటించారు. ఈ రెండు జట్లు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ మ్యాచ్ ఆడబోయే బంతిని వారి వారి దేశాల్లో ఉపయోగించరు. ఆస్ట్రేలియా జట్టు తమ స్వదేశంలో కూకాబుర్రా బంతితో ఆడుతుంది. భారత జట్టు తమ సొంత మైదానంలో ఎస్‌జీ బంతిని ఉపయోగిస్తుంది.

ఈ మ్యాచ్‌కు మాత్రం డ్యూక్ బాల్‌ను ఉపయోగించాలని ఐసీసీ నిర్ణయించింది. ఎందుకంటే ఇంగ్లండ్ ఫైనల్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తుంది. అక్కడ డ్యూక్ బాల్‌తోనే ఆడతారు. ఇప్పటి వరకు ICC ఆ దేశంలో క్రికెట్ ఆడే అన్ని ఈవెంట్‌లలో ఒకే బంతిని ఉపయోగిస్తుంది.

ఇప్పటికే జట్టును ప్రకటించిన భారత్
డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌కు భారత జట్టును ఇప్పటికే ప్రకటించింది. దీంతో టీమిండియా ఆటగాళ్లు ఇంకెంత కాలం ఇంగ్లండ్‌కు బయలుదేరుతారనే దానిపైనే ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. ఈ సారి ఐపీఎల్ సీజన్ ఫైనల్ మ్యాచ్ మే 28వ తేదీన జరగనుంది. అటువంటి పరిస్థితిలో ప్లేఆఫ్‌కు చేరుకోని జట్లలోని ఆటగాళ్లు ముందుగా ఇంగ్లాండ్‌కు బయలుదేరుతారు.

చాలా కాలం తర్వాత శ్రేయాస్ అయ్యర్ అన్‌ఫిట్ కావడం, సూర్యకుమార్ యాదవ్ ఫామ్‌లో లేకపోవడంతో జట్టులో చోటు దక్కించుకున్న అజింక్య రహానే కూడా భారత జట్టులో ఘనంగా పునరాగమనం చేయాలని చూస్తున్నాడు.

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు (WTC Final 2023) టీమ్‌ఇండియాను ప్రకటించారు. పదిహేను మందితో కూడిన జట్టును సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేసింది. చాలా రోజుల తర్వాత 'మిస్టర్‌ డిపెండబుల్‌' అజింక్య రహానెకు చోటు దక్కింది. జూన్‌ 7 నుంచి 11 వరకు మ్యాచ్‌ జరుగుతుంది. జూన్‌ 12ను రిజర్వు డేగా ప్రకటించారు. లండన్‌లోని ఓవల్‌ మైదానం ఇందుకు వేదిక. డబ్ల్యూటీసీ పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన ఆస్ట్రేలియాలతో హిట్‌మ్యాన్‌ సేన తలపడుతుంది.

ప్రస్తుతం ప్రకటించిన జట్టులో ఆరుగురు స్పెషలిస్టు బ్యాటర్లు ఉన్నారు. శుభ్‌మన్‌ గిల్‌, చెతేశ్వర్‌ పుజారా, విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, అజింక్య రహానె ఆ బాధ్యత తీసుకుంటారు. విశాఖ కుర్రాడు కేఎస్‌ భరత్‌ వికెట్‌ కీపర్‌గా ఎంపికయ్యాడు. అతడికి పోటీగా మరెవ్వరూ లేరు కాబట్టి తుది జట్టులో ఆడటం గ్యారంటీ! ముగ్గురు స్పిన్నర్లు, ఐదుగురు పేసర్లను తీసుకున్నారు.

టీమ్‌ఇండియా: రోహిత్‌ శర్మ, శుభ్ మన్‌ గిల్‌, చెతేశ్వర్‌ పుజారా, విరాట్‌ కోహ్లీ, అజింక్య రహానె, కేఎల్‌ రాహుల్‌, కేఎస్‌ భరత్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, శార్దూల్‌ ఠాకూర్‌, మహ్మద్‌ షమి, మహ్మద్‌ సిరాజ్‌, ఉమేశ్‌ యాదవ్‌, జయదేవ్‌ ఉనద్కత్‌

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుమల బూంది పోటులో సిట్ అధికారుల పరిశీలన, క్వాలిటీపై ఆరాడ్రా అనుకున్న మ్యాచ్‌ని నిలబెట్టిన టీమిండియా, కాన్పూర్‌ టెస్ట్‌లో రికార్డుల మోతKTR on Revanth Reddy: దొరికినవ్ రేవంత్! ఇక నీ రాజీనామానే, బావమరిదికి లీగల్ నోటీసు పంపుతావా?Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేస్‌, ఈ రూట్స్‌లోనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Tirupati Laddu Issue : సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
Jammu Kashmir 3rd Phase Voting: జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
Dussehra 2024 Prasadam : దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
Sobhita Dhulipala : శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
Embed widget