అన్వేషించండి

MS Dhoni: ఆడుతున్నప్పుడు వెనక్కి తిరిగి చూశా- ఫ్యామిలీ కనిపించింది- వెంటనే బాధ్యతలు వేరే వాళ్లకు అప్పగించి వచ్చేశా: ధోనీ

MS Dhoni Cricket Retirement : క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రోజు నుంచి కుటుంబానికే ప్రాధాన్యం ఇచ్చానన్నాడు టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ. ఐపిఎల్ ముందే ఫిట్నెస్ పై దృష్టి పెట్టానని చెప్పాడు.

MS Dhoni Retirement : ప్రపంచ క్రికెట్‌లో పరిచయం అక్కర్లేని పేరు మహేంద్ర సింగ్‌ ధోనీ. క్రికెట్‌లో భారతదేశపు అత్యుత్తమ కెప్టెన్లలో ధోనీ కూడా ఒకడు. అయితే ధోనీ తీసుకొనే నిర్ణయాలు మాత్రం షాకింగ్‌గా ఉంటాయి. 2019 ప్రపంచకప్ సెమీఫైనల్‌లో న్యూజిల్యాండ్ చేతిలో భారత్ ఓడిపోయింది. ఆ బాధ నుంచి భారత క్రికెట్ అభిమానులు నెమ్మదిగా కోలుకుంటున్న సమయంలో ఎంఎస్ ధోనీ 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. పరిమిత ఓవర్ల క్రికెట్ నుంచి కూడా ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండానే తప్పుకున్నాడు. కనీసం అభిమానులకు ఫేర్ వెల్ మ్యాచ్ చూసే అవకాశం కూడా ఇవ్వకుండా తనదైన స్టైల్లో రిటైర్మెంట్ ఇచ్చాడు.
 
అప్పుడు అలా ఎందుకు చేశానంటే 
42 ఏళ్ళ మహీకి ఇదే చివరి ఐపీఎల్‌ అని సోషల్ మీడియాలో ఊహాగానాలు వస్తున్నాయి. టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్‌ అయిన పదేళ్ల తర్వాత MS ధోని తాను సుదీర్ఘమైన ఫార్మాట్ నుంచి వైదొలగడానికి గల కారణాలను బయటపెట్టాడు.  2014లో మెల్‌బోర్న్‌లో జరిగిన మూడో టెస్ట్‌ తర్వాత ధోనీ అకస్మాత్తుగా టెస్ట్ రిటైర్మెంట్ ప్రకటించాడు, ఇది భారత అభిమానులకు షాక్ ఇచ్చింది. దాదాపు పది సంవత్సరాల తర్వాత ధోనీ సుదీర్ఘ ఫార్మాట్ నుంచి వైదొలగడానికి కారణాలు తెలిపాడు. టెస్ట్‌లకు 2015లో వీడ్కోలు పలికిన ధోని.. వన్డేల్లో మాత్రం  2019 వరకు కొనసాగాడు.  ఒక పబ్లిక్ ఫోరమ్‌లో మాట్లాడుతూ, తను,కుటుంబంతో ఎక్కువ సమయం గడపాల్సిన అవసరం ఉందని గ్రహించిన రోజున వెంటనే రిటైర్మెంట్ ప్రకటించానని చెప్పాడు. 
 
ముఖ్యంగా అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడుతున్నప్పుడు, చాలా కాలం పాటు భారత జట్టులో భాగమై ఉన్నప్పుడు కుటుంబంతో గడిపే సమయాన్ని ఎక్కువగా కోల్పోతామని చెప్పాడు. అందుకే 2015 వరకు, అన్ని ఫార్మాట్లలో ఆడానని, కానీ ఈ మధ్య నేను ఇంట్లోనే ఉండటం వల్ల ఐపిఎల్‌కి ముందు ఫిట్నెస్‌పై దృష్టి పెట్టాను అన్నాడు. ఒక వేళ అన్నీ ఫార్మాట్లలో ఆడేవాళ్ళు అయితే సీరీస్‌కి ముందు వచ్చే వారం రోజుల సెలవులు కుటుంబంతో గడిపి తరువాత వేరే ప్రదేశానికి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సిన వస్తుందని .. ఇవన్నీ ఆలోచించే తాను 2015 నుంచి కుటుంబంతో ఎక్కువ సమయం గడపటానికే ఒక్కో ఆట నుంచి విరమించానని చెప్పాడు.
 
మంచి వ్యాపకాలే  రిచార్జ్  
వృధ్యాప్యం లో ఉన్న తల్లిదండ్రులు , భార్య, పిల్లలతో సమయం గడపాలి అంటే ఇదే సరైన నిర్ణయం అని తాను భావించానన్నాడు. మంచి వ్యాపకాలు మనల్ని చేసే పనులపై ఏకాగ్రత పెంచేలా చేస్తాయన్నాడు. తనకి వ్యవసాయం అన్నా, వింటేజ్ కార్లు అన్నా, మోటార్ బైక్ అన్నా ఇష్టమని, ఎంత ఒత్తిడిలో ఉన్నా గెరాజ్‌లో 2గంటలు కూర్చుంటే తను మళ్ళీ ఫ్రెష్‌గా ఫీలవుతానని చెప్పాడు. అంతే కాదు తనకి పెంపుడు జంతువులు అన్నా చాలా ఇష్టం అని చెప్పాడు.
 
2014లో టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ, తరువాత . 2020 ఆగష్టు 15న పరిమిత ఓవర్లకు కూడా బై బై చెప్పాడు, అయితే ఐపీఎల్‌లో మాత్రం అదరగొడుతూ అభిమానులను అలరిస్తున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు వరుసగా అవుట్ అయిపోయినా సరే బాధపడటం మరచిపోయిన అభిమానులు ధోనీ ఆట కోసం ఎదురు చూశారు అంటే అర్థం అవుతుంది ధోనీ క్రేజ్ ఎంటో. అయితే ఈసారి ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ చేరకుండానే  ఇంటికి చేరిన  విషయం తెలిసిందే.
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Gachibowli Housing Board: 12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Embed widget