అన్వేషించండి

Virat Kohli Record: సచిన్‌ మరో రికార్డుకు కోహ్లీ ఎసరు! వెస్టిండీస్‌పై మరో 6 పరుగులు చేస్తే..!

టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. వన్డే క్రికెట్లో అతడు మరో ఆరు పరుగులు చేస్తే సచిన్‌ తెందూల్కర్‌ రికార్డును బద్దలు కొట్టేస్తాడు.

వెస్టిండీస్‌తో సిరీసుకు ముందు టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. వన్డే క్రికెట్లో అతడు మరో ఆరు పరుగులు చేస్తే సచిన్‌ తెందూల్కర్‌ రికార్డును బద్దలు కొట్టేస్తాడు. అతి తక్కువ ఇన్నింగ్సుల్లోనే ఉపఖండంలో 5000 పరుగులు చేసిన క్రికెటర్‌గా ఆవిర్భవిస్తాడు.

సొంతగడ్డపై అభిమానుల ముంగిట పరుగులు చేయాలని ప్రతి క్రికెటర్‌ కోరుకుంటాడు. ఇప్పుడు అలాంటి సందర్భం విరాట్‌ కోహ్లీకి వచ్చింది. ఇప్పటి వరకు భారత గడ్డపై కోహ్లీ 98 వన్డేలు ఆడాడు. 60.16 సగటు, 96.59 స్ట్రైక్‌రేట్‌తో 4994 పరుగులు సాధించాడు. ఇందుకోసం 5170 బంతులు ఎదుర్కొన్నాడు. 19 సెంచరీలు, 25 అర్ధశతకాలు సాధించాడు. అతడు మరో 6 పరుగులు చేస్తే భారత్‌లో 5000 పరుగులు సాధించిన క్రికెటర్‌గా అవతరిస్తాడు.

ఇంతకు ముందు భారత్‌లో వన్డే క్రికెట్లో 5000 పరుగులు చేసిన ఘనత ఒక సచిన్‌ తెందూల్కర్‌కు మాత్రమే ఉంది. అతడు 121 ఇన్నింగ్సుల్లో వెస్టిండీస్‌పైనే ఈ రికార్డు సృష్టించాడు. ఫిబ్రవరి 6న టీమ్‌ఇండియా అహ్మదాబాద్‌లోని మొతేరా వేదికగా వెస్టిండీస్‌తో తొలి వన్డేలో తలపడబోతోంది. కోహ్లీ కెరీర్లో ఇది 96వ ఇన్నింగ్స్‌ అవుతుంది. ఆ మ్యాచులో 6 పరుగులు చేస్తే అతి తక్కువ ఇన్నింగ్సుల్లో భారత గడ్డపై 5000 పరుగులు చేసిన క్రికెటర్‌గా అతడు అవతరిస్తాడు.

ప్రస్తుతం విరాట్‌ కోహ్లీ ప్రశాంతంగా ఉన్నాడు. కెప్టెన్సీ రచ్చ నుంచి ఇప్పుడిప్పుడే సాంత్వన పొందుతున్నాడు. వెస్టిండీస్‌ సిరీసుకు సన్నద్ధం అవుతున్నాడు. అతడు జట్టు కోసం కీలక భాగస్వా్మ్యాలు నెలకొల్పుతున్నా సెంచరీ చేయక మూడేళ్లవుతోంది. అతడు సెంచరీల కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఒక్కసారి గనక అతడు శతకం అందుకున్నాడంటే ఇక పరుగుల వరద పారించడం ఖాయమే!

భారత్‌, వెస్టిండీస్‌ మధ్య ఫిబ్రవరి 6, 9, 11న  మొతేరాలో వన్డేలు జరుగుతాయి. ఫిబ్రవరి 16, 18, 20న కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్‌లో టీ20లు జరుగుతాయి. ఈ సిరీసుకు ముందు టీమ్‌ఇండియాను కరోనా మహమ్మారి వెంటాడింది. శిఖర్ ధావన్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, నవదీప్‌ సైని, శ్రేయస్‌ అయ్యర్‌కు వైరస్‌ సోకింది. దాంతో వారిని క్వారంటైన్‌కు పంపించారు. ఓపెనర్‌గా మయాంక్‌ అగర్వాల్‌ను ఎంపిక చేశారు. ప్రస్తుతం జట్టు సాధన చేస్తోంది.

Also Read: Sourav Ganguly: ఐపీఎల్ 2022 ఇక్కడే.. త్వరలో మహిళల ఐపీఎల్ కూడా.. గంగూలీ ఏమన్నారంటే?

Also Read: India Enters U19 Finals: కుర్రాళ్లోయ్ కుర్రాళ్లు.. అండర్-19 ప్రపంచకప్ సెమీస్‌లో ఆసీస్‌పై ఘనవిజయం.. ఫైనల్స్ గెలిస్తే చరిత్రే!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget