అన్వేషించండి

Virat Kohli 100th Test: వందో టెస్టులో విరాట్‌ ఫోకస్‌ దేనిమీదంటే - గావస్కర్‌ ప్రిడిక్షన్‌

IND vs SL Test Series: విరాట్‌ కోహ్లీపై కెప్టెన్సీ భారం లేదని సునిల్‌ గావస్కర్‌ అన్నారు. శ్రీలంక టెస్టు (IND vs SL Test series) సిరీసులో అతడి బ్యాటింగ్పై కొన్ని అంచనాలు చెప్పాడు.

Virat Kohli 100th Test: టీమ్‌ఇండియా (Team India) మాజీ సారథి విరాట్‌ కోహ్లీపై (Virat Kohli) కెప్టెన్సీ భారం పడినట్టు ఎప్పుడూ అనిపించలేదని మాజీ క్రికెటర్‌ సునిల్‌ గావస్కర్‌ (Sunil gavaskar) అన్నారు. ఎందుకంటే ఒకదాని తర్వాత మరో ఇన్నింగ్సులో అతడు సెంచరీలూ కొడుతూ పోయాడని పేర్కొన్నారు. త్వరలో జరిగే శ్రీలంక టెస్టు (IND vs SL Test series) సిరీసులో అతడు సెంచరీ కొడతాడని ధీమా వ్యక్తం చేశారు. కొన్ని అంశాలపై మాత్రం విరాట్‌ ఫోకస్‌ చేయాలని సూచించారు.

కెప్టెన్సీ భారం లేదు

'విరాట్‌ కోహ్లీ కెప్టెన్‌గా ఉన్నప్పుడు నాయకత్వ భారం తన బ్యాటింగ్‌పై పడినట్టు అనిపించలేదు. ఒక ఇన్నింగ్స్‌ తర్వాత మరొకదాంట్లో అతడు సెంచరీలు కొట్టాడు. అందుకే అతడిపై కెప్టెన్సీ ఒత్తిడి ఉందని నేననుకోను. ఒక కెప్టెన్‌గా అతడు మిగతా అందరి గురించీ ఆలోచించాల్సి ఉంటుంది. ఇది సాధారణమే. బౌలర్ల ఫామ్‌ గురించి పట్టించుకోవాల్సి వస్తుంది. ఎవరికైనా గాయాలు అయ్యాయా? బ్యాటింగ్‌ యూనిట్‌లో 4, 5 స్థానాల్లో వచ్చేవారు బాగా ఆడటం లేదా, మరీ ఘోరంగా ఔటవుతున్నారా వంటివి చూసుకోవాల్సి వస్తుంది' అని సన్నీ అన్నారు.

ఇకపై భయం లేదు

'ఒక కెప్టెన్‌గా పరుగులు చేస్తూనే ఉండొచ్చు. కానీ ప్రతిసారీ జట్టులోని అందరి గురించీ ఆలోచించాల్సి వస్తుంది. అలాంటప్పుడే బ్యాటింగ్‌పై ఫోకస్‌ చేయలేని పరిస్థితులు వస్తుంటాయి. నాయకుడిగా లేనప్పుడు పూర్తిగా బ్యాటింగ్‌పైనే దృష్టి పెట్టొచ్చు. అదో పెద్ద అడ్వాంటేజ్‌.  ఇప్పుడు విరాట్‌ తన షాట్ల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పరుగులు చేస్తున్నంత వరకు అతడు మరే అంశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉండదు' అని గావస్కర్‌ పేర్కొన్నారు.

Virat Kohli 100th Test

విరాట్‌ కోహ్లీ ప్రస్తుతం తన వందో టెస్టు మ్యాచుకు సిద్ధమవుతున్నాడు. మొహాలిలో (Mohali) శ్రీలంకతో తలపడనున్నాడు. మార్చి 4 నుంచి ఈ మ్యాచ్‌ మొదలవుతుంది. కెప్టెన్‌గా విరాట్‌  68 టెస్టుల్లో 54.80 సగటుతో 5,864 పరుగులు చేశాడు. రెండున్నరేళ్లుగా అన్ని ఫార్మాట్లలో కలిపి అతడు సెంచరీలు కొట్టలేదు. జట్టుకు అవసరమైన కీలక పరుగులు చేస్తున్నా అతడి నుంచి అభిమానులు ఇంకా ఎక్కువ ఆశిస్తున్నారు. తన మునుపటి స్థాయికి తగినట్టు ఆడాలని కోరుకుంటున్నారు. మరో స్పెషల్‌ ఏంటంటే ఈ మ్యాచుకు స్టేడియాల్లోకి అభిమానులను అనుమతిస్తున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ఏపీని గేట్ వే చేయండి' - అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
'గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ఏపీని గేట్ వే చేయండి' - అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
Karnataka Express: మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 12 మంది మృతి
మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 12 మంది మృతి
CM Revanth Reddy : రవాణా రంగంలో అగ్రగామిగా తెలంగాణ - డ్రైపోర్టు ఏపీలో మచిలీపట్నం పోర్టుతో అనుసంధానం, సీఎం రేవంత్ ప్రణాళికలు
రవాణా రంగంలో అగ్రగామిగా తెలంగాణ - డ్రైపోర్టు ఏపీలో మచిలీపట్నం పోర్టుతో అనుసంధానం, సీఎం రేవంత్ ప్రణాళికలు
UPSC CSE 2025: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2025 నోటిఫికేషన్ విడుదల - 979 ఉద్యోగాల భర్తీ, ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2025 నోటిఫికేషన్ విడుదల - 979 ఉద్యోగాల భర్తీ, ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nara Lokesh Walk in Davos | ట్రాఫిక్ లో చిక్కుకోవటంతో కాలినడకన లోకేశ్ ప్రయాణం | ABP DesamJawan Karthik Final Journey | దేశం కోసం ప్రాణాలర్పించిన కార్తీక్ కు కన్నీటి వీడ్కోలు | ABP DesamCM Chandrababu Met Bill gates | దావోస్  ప్రపంచ ఆర్థిక సదస్సులో బిల్ గేట్స్ తో సీఎం చంద్రబాబు | ABP DesamBazball In T20 | ఇంగ్లండ్ పరిమిత ఓవర్లకూ కోచ్ గా మెక్ కల్లమ్ | Ind vs Eng | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ఏపీని గేట్ వే చేయండి' - అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
'గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ఏపీని గేట్ వే చేయండి' - అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
Karnataka Express: మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 12 మంది మృతి
మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 12 మంది మృతి
CM Revanth Reddy : రవాణా రంగంలో అగ్రగామిగా తెలంగాణ - డ్రైపోర్టు ఏపీలో మచిలీపట్నం పోర్టుతో అనుసంధానం, సీఎం రేవంత్ ప్రణాళికలు
రవాణా రంగంలో అగ్రగామిగా తెలంగాణ - డ్రైపోర్టు ఏపీలో మచిలీపట్నం పోర్టుతో అనుసంధానం, సీఎం రేవంత్ ప్రణాళికలు
UPSC CSE 2025: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2025 నోటిఫికేషన్ విడుదల - 979 ఉద్యోగాల భర్తీ, ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2025 నోటిఫికేషన్ విడుదల - 979 ఉద్యోగాల భర్తీ, ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?
Kolkata T20 Updates: అభి'షేకాడించాడు' - సూపర్ ఫిఫ్టీతో చెలరేగిన అభిషేక్, ఇంగ్లాండ్‌పై భారత్ సూపర్ విక్టరీ
అభి'షేకాడించాడు' - సూపర్ ఫిఫ్టీతో చెలరేగిన శర్మ, ఇంగ్లాండ్‌పై భారత్ సూపర్ విక్టరీ
UPSC IFS 2025: ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్-2025 నోటిఫికేషన్ వెల్లడి - పోస్టులెన్నంటే?
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్-2025 నోటిఫికేషన్ వెల్లడి - పోస్టులెన్నంటే?
Chandrababu on Lokesh: రాజకీయాల్లో వారసత్వం ఓ భ్రమ - లోకేష్ నాయకత్వంపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
రాజకీయాల్లో వారసత్వం ఓ భ్రమ - లోకేష్ నాయకత్వంపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Vizag News: విశాఖలో జువనైల్ హోమ్ నుంచి రోడ్లపైకి వచ్చిన బాలికలు - మానసిక రోగులుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపణలు
విశాఖలో జువనైల్ హోమ్ నుంచి రోడ్లపైకి వచ్చిన బాలికలు - మానసిక రోగులుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపణలు
Embed widget