Yastika Bhatia Century: లార్డ్స్ హిస్టారికల్ గ్రౌండ్ లో యాస్తికా సంచలనం.. సెంచరీతో హిస్టరీ క్రియేట్ చేసిన ఫస్ట్ ఉమెన్, గెలుపుపై కన్నేసిన టీమిండియా
లార్డ్స్ ప్రతిష్టాత్మక మైదానంలో యాస్తికా భాటియా ఫస్ట్ టెస్ట్ సెంచరీతో హిస్టరీ క్రియేట్ చేయగా, ఇండియా 341/7 స్కోరు వద్ద సెండ్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.

Yastika Bhatia Slams Historic Century At Lords: చారిత్రాత్మక లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ లో ఇండియా ఉమెన్స్ టీమ్ సరికొత్త రికార్డులు సృష్టించింది. ఇంగ్లాండ్తో జరుగుతున్న వన్-ఆఫ్ టెస్ట్ మ్యాచ్ థర్డ్ డే రోజు ఇండియా వికెట్ కీపర్ బ్యాటర్ యాస్తికా భాటియా మైండ్ బ్లోయింగ్ ఇన్నింగ్స్ ఆడింది. లార్డ్స్ మైదానంలో టెస్ట్ సెంచరీ కొట్టిన హిస్టరీలోనే ఫస్ట్ ఉమెన్ గా యాస్తికా సరికొత్త వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది. యాస్తికా సంచలన సెంచరీతో పాటు రిచా ఘోష్ మెరుపు హాఫ్ సెంచరీతో ఇండియా తన సెకండ్ ఇన్నింగ్స్ ను 341/7 రన్స్ వద్ద టీ బ్రేక్ టైమ్లో బోల్డ్ గా డిక్లేర్ చేసింది. దీంతో ఫస్ట్ ఇన్నింగ్స్ లీడ్ తో కలుపుకుని హోస్ట్ టీమ్ ఇంగ్లాండ్ ముందు ఫోర్ సెషన్స్ లో ఛేజ్ చేయడానికి 457 రన్స్ అసాధ్యమైన భారీ టార్గెట్ ను ఇండియా సెట్ చేసింది. దీంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ కడపటి వార్తలందేసరికి 20 ఓవర్లలో 4 వికెట్లకు 59 పరుగులు చేసింది. భారత విజయానికి ఇంకా ఆరు వికెట్లు కావాల్సి ఉండగా, ఇంగ్లాండ్ కు 398 పరుగులు కావాలి. దీంతో ఈ టెస్టులో భారత్ విజయం సాధించడం లాంఛనమే అని చెప్పవచ్చు. క్రాంతి గౌడ్ రెండు వికెట్లతో సత్తా చాటింది.
Another #TeamIndia player is on the Test Honours Board at Lord's 🌟👏
— BCCI Women (@BCCIWomen) July 12, 2026
Yastika Bhatia brings up a fantastic 𝗺𝗮𝗶𝗱𝗲𝗻 𝗧𝗲𝘀𝘁 𝗛𝗨𝗡𝗗𝗥𝗘𝗗 💯
Updates ▶️ https://t.co/O1rEau8j8n #ENGvIND | @YastikaBhatia pic.twitter.com/ILHyxGPivT
యాస్తికా భాటియా క్లాసిక్ సెంచరీ.. ఇంగ్లాండ్ బౌలింగ్ పై అటాక్
ఆదివారం లంచ్ బ్రేక్ సమయానికి 91 రన్స్ తో నాటౌట్ గా ఉన్న లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ యాస్తికా భాటియా, బ్రేక్ తర్వాత వచ్చిన వెరీ ఫస్ట్ ఓవర్ లోనే ఇస్సీ వాంగ్ బౌలింగ్ లో సింగిల్ తీసి తన కెరీర్ లోనే మోస్ట్ మెమరబుల్ మేయిడిన్ టెస్ట్ సెంచరీ మార్క్ అందుకుంది. క్రీజులో అద్భుతమైన డిఫెన్స్, క్లాసిక్ షాట్లతో అలరించిన యాస్తికా ఓవరాల్ గా 158 బంతుల్లో 14 ఫోర్ల సహాయంతో 113 రన్స్ చేసి అవుట్ అయింది. లంచ్ తర్వాత ఇండియా కోల్పోయిన మూడు వికెట్లలో యాస్తికా వికెట్ కూడా ఒకటి. అంతకుముందు 39 రన్స్ ఓవర్నైట్ స్కోరుతో థర్డ్ డే ఆట స్టార్ట్ చేసిన యాస్తికా, వికెట్లు పడుతున్నా లార్డ్స్ పిచ్ పై పట్టుదలతో నిలబడి ఇండియాను డ్రైవర్ సీట్ లో కూర్చోబెట్టింది.
Tea on Day 3️⃣ 🫖
— BCCI Women (@BCCIWomen) July 12, 2026
Another solid batting effort means that #TeamIndia set England a target of 4️⃣5️⃣7️⃣ runs 🎯
Over to our bowlers! 👌
Scorecard ▶️ https://t.co/O1rEau8j8n #ENGvIND pic.twitter.com/MuSChWBIks
రిచా ఘోష్ అగ్రెసివ్ హిట్టింగ్.. సోఫీ ఎక్లెస్టోన్ కు ఫోర్త్ ఫైఫర్
యాస్తికా భాటియా, దీప్తి శర్మలు అవుట్ అయిన తర్వాత యంగ్ బ్యాటర్ రిచా ఘోష్ ఒక్కసారిగా గేర్ మార్చి ఇంగ్లీష్ బౌలర్లపై కంప్లీట్ గా అటాకింగ్ గేమ్ స్టార్ట్ చేసింది. కేవలం 52 బంతుల్లోనే 8 ఫోర్లతో 50 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచింది. టెస్ట్ క్రికెట్ లో రిచాకు ఇది థర్డ్ హాఫ్ సెంచరీ. రిచా మెరుపు ఇన్నింగ్స్ తో ఇండియా 86.3 ఓవర్లలో డిక్లేర్ ఇచ్చేలా స్కోర్ బోర్డును పరిగెత్తించింది. మరోవైపు ఇంగ్లాండ్ స్పిన్ గ్రేట్ సోఫీ ఎక్లెస్టోన్ 5 వికెట్లతో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. టెస్ట్ కెరీర్ లో సోఫీకి ఇది ఫోర్త్ ఫైవ్-వికెట్ హాల్ కావడం విశేషం.
ఫస్ట్ సెషన్ లో వరుస షాకులు.. ఇంగ్లాండ్ కు మైండ్ బ్లాకింగ్ టార్గెట్
అంతకుముందు 154/1 ఓవర్నైట్ స్కోరుతో థర్డ్ డే ఫస్ట్ సెషన్ స్టార్ట్ చేసిన ఇండియాకు లారెన్ బెల్ గట్టి షాకులు ఇచ్చింది. శనివారం ఓవర్ నైట్ స్కోరుకు కేవలం ఒక్క రన్ మాత్రమే యాడ్ చేసిన ఓపెనర్ స్మృతి మంధానను 70 రన్స్ వద్ద బెల్ అవుట్ చేసింది. ఆ వెంటనే జెమిమా రోడ్రిగ్స్ (3) ను కూడా పెవిలియన్ కు పంపించేసింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ సైతం 34 బంతుల్లో 16 రన్స్ చేసి సోఫీ ఎక్లెస్టోన్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా దొరికిపోయి తీవ్రంగా నిరాశపరిచింది. అయినప్పటికీ యాస్తికా భాటియా ఒంటరి పోరాటంతో ఇండియాకు భారీ స్కోరు అందించింది. ఈ టెస్టులో గెలిచి ఏకైక టెస్టు సిరీస్ ను 1-0తో దక్కించుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది.
ట్రెండింగ్ వార్తలు



















