అన్వేషించండి

WTC Final 2023: స్టాండ్‌బై ప్లేయర్లుగా యంగ్‌స్టర్స్‌కు ఛాన్స్ - బీసీసీఐ సూపర్ డెసిషన్!

ఇషాన్ కిషన్, సర్ఫరాజ్ ఖాన్, రుతురాజ్ గైక్వాడ్‌లను ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు స్టాండ్‌బై ప్లేయర్లుగా బీసీసీఐ నిర్ణయించింది.

Ruturaj Gaikwad And Ishan Kishan As Standby Players For WTC: బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ 2023 కోసం భారత జట్టును ఇప్పటికే ప్రకటించింది. కొంతమంది ఆటగాళ్ల పేర్లు ఇప్పటికే ఫిక్స్ అయిపోయాయి. అయితే జట్టులోకి అజింక్యా రహానే రీ ఎంట్రీ కచ్చితంగా అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇది కాకుండా రుతురాజ్ గైక్వాడ్, సర్ఫరాజ్ ఖాన్, ఇషాన్ కిషన్‌లతో సహా కొంతమంది ఆటగాళ్లను స్టాండ్‌బైగా చేర్చాలని భారత బోర్డు నిర్ణయించింది.

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ రెండో ఎడిషన్ చివరి మ్యాచ్ జూన్ 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఇంగ్లాండ్‌లోని ఓవల్ మైదానంలో జరుగుతుంది, ఇందులో ఈసారి ఆస్ట్రేలియా, టీమిండియాల మధ్య మ్యాచ్ జరగనుంది. ఇషాన్‌ కిషన్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌తో పాటు నవదీప్‌ సైనీ, ముఖేష్‌ కుమార్‌లను కూడా స్టాండ్‌బై ప్లేయర్‌లుగా చేర్చాలని భారత సెలక్షన్‌ కమిటీ నిర్ణయించింది. వీరిని కూడా జట్టుతో పాటు లండన్‌కు పంపవచ్చు.

భారత జట్టులోని ప్రధాన ఆటగాళ్లందరూ ఐపీఎల్‌లో ఆడుతూ బిజీగా ఉన్నారు. అటువంటి పరిస్థితిలో భారత జట్టు ఫైనల్ మ్యాచ్‌కు సిద్ధం కావడానికి భారత క్రికెట్ బోర్డు కొన్ని సన్నాహక మ్యాచ్‌లను నిర్వహించే అవకాశం ఉంది. తద్వారా భారత ఆటగాళ్లు ఇంగ్లండ్ పరిస్థితులకు అనుగుణంగా మారవచ్చు. ఐపీఎల్ ప్లేఆఫ్‌లకు ముందు ఎలిమినేట్ అయిన జట్లలో ఉన్న భారత ఆటగాళ్లు, కోచ్ రాహుల్ ద్రవిడ్ సహాయక సిబ్బందితో కలిసి మే 23వ తేదీ నాటికి ఇంగ్లండ్‌కు బయలుదేరుతారు.

ఫాస్ట్ బౌలర్ ఆల్ రౌండర్‌గా శార్దూల్
టైటిల్ మ్యాచ్ కోసం భారత జట్టులో ఉన్న ఆటగాళ్ల గురించి మనం మాట్లాడుకుంటే చాలా కాలం తర్వాత టెస్ట్ జట్టులోకి తిరిగి వస్తున్న ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్‌గా శార్దూల్ ఠాకూర్ జట్టులో చోటు సంపాదించాడు. శార్దూల్ ఇంతకుముందు ఇంగ్లండ్ పర్యటనలో ఆడిన టెస్ట్ సిరీస్‌లో బంతితో పాటు బ్యాట్‌తో చాలా ముఖ్యమైన పాత్ర పోషించాడు. అటువంటి పరిస్థితిలో జట్టు మళ్లీ అలాంటి ప్రదర్శన చేస్తుందని ఆశించారు.

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు టీమ్‌ఇండియాను ప్రకటించారు. పదిహేను మందితో కూడిన జట్టును సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేసింది. చాలా రోజుల తర్వాత 'మిస్టర్‌ డిపెండబుల్‌' అజింక్య రహానెకు చోటు దక్కింది. జూన్‌ 7 నుంచి 11 వరకు మ్యాచ్‌ జరుగుతుంది. జూన్‌ 12ను రిజర్వు డేగా ప్రకటించారు. లండన్‌లోని ఓవల్‌ మైదానం ఇందుకు వేదిక. డబ్ల్యూటీసీ పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన ఆస్ట్రేలియాలతో హిట్‌మ్యాన్‌ సేన తలపడుతుంది.

ప్రస్తుతం ప్రకటించిన జట్టులో ఆరుగురు స్పెషలిస్టు బ్యాటర్లు ఉన్నారు. శుభ్‌మన్‌ గిల్‌, చెతేశ్వర్‌ పుజారా, విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, అజింక్య రహానె ఆ బాధ్యత తీసుకుంటారు. విశాఖ కుర్రాడు కేఎస్‌ భరత్‌ వికెట్‌ కీపర్‌గా ఎంపికయ్యాడు. అతడికి పోటీగా మరెవ్వరూ లేరు కాబట్టి తుది జట్టులో ఆడటం గ్యారంటీ! ముగ్గురు స్పిన్నర్లు, ఐదుగురు పేసర్లను తీసుకున్నారు.

టీమ్‌ఇండియా: రోహిత్‌ శర్మ, శుభ్ మన్‌ గిల్‌, చెతేశ్వర్‌ పుజారా, విరాట్‌ కోహ్లీ, అజింక్య రహానె, కేఎల్‌ రాహుల్‌, కేఎస్‌ భరత్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, శార్దూల్‌ ఠాకూర్‌, మహ్మద్‌ షమి, మహ్మద్‌ సిరాజ్‌, ఉమేశ్‌ యాదవ్‌, జయదేవ్‌ ఉనద్కత్‌

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana: తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
YS Jagan:  అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
KCR Latest News: అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
Kohli Completes 1000 Runs Vs KKR: కేకేఆర్ పై వెయ్యి ప‌రుగులు పూర్తి.. ఫిఫ్టీతో స‌త్తా చాటిన విరాట్, ఫ‌స్ట్ మ్యాచ్ లో ఆర్సీబీ శుభారంభం
కేకేఆర్ పై కోహ్లీ వెయ్యి ప‌రుగులు పూర్తి.. ఫిఫ్టీతో స‌త్తా చాటిన విరాట్, ఫ‌స్ట్ మ్యాచ్ లో ఆర్సీబీ శుభారంభం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

KKR vs RCB IPL 2025 Match Highlights | కేకేఆర్ పై 7వికెట్ల తేడాతో ఆర్సీబీ గ్రాండ్ విక్టరీ | ABP Desamడీలిమిటేషన్ పై దక్షిణాది యుద్ధంమేము రాజకీయంగా నష్టపోతాంIPL 2025 Captain's Meet | రేపటి నుంచే ఐపీఎల్ మహా సంగ్రామం ప్రారంభం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana: తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
YS Jagan:  అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
KCR Latest News: అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
Kohli Completes 1000 Runs Vs KKR: కేకేఆర్ పై వెయ్యి ప‌రుగులు పూర్తి.. ఫిఫ్టీతో స‌త్తా చాటిన విరాట్, ఫ‌స్ట్ మ్యాచ్ లో ఆర్సీబీ శుభారంభం
కేకేఆర్ పై కోహ్లీ వెయ్యి ప‌రుగులు పూర్తి.. ఫిఫ్టీతో స‌త్తా చాటిన విరాట్, ఫ‌స్ట్ మ్యాచ్ లో ఆర్సీబీ శుభారంభం
Sushant Singh Rajput Case: నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ది ఆత్మహత్యే- తేల్చేసిన సీబీఐ
నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ది ఆత్మహత్యే- తేల్చేసిన సీబీఐ
Pawan Kalyan Latest News: పవన్ పేరు చెబితే ర్యాగింగ్ చేశారు- నంద్యాల ఎంపీ శబరి ఆసక్తికర వ్యాఖ్యలు
పవన్ పేరు చెబితే ర్యాగింగ్ చేశారు- నంద్యాల ఎంపీ శబరి ఆసక్తికర వ్యాఖ్యలు
Vizag:  వైజాగ్ బీచ్‌కు మళ్లీ బ్లూఫ్లాగ్ గుర్తింపు - కలెక్టర్ కఠిన చర్యలతో మళ్లీ కళకళ
వైజాగ్ బీచ్‌కు మళ్లీ బ్లూఫ్లాగ్ గుర్తింపు - కలెక్టర్ కఠిన చర్యలతో మళ్లీ కళకళ
Actor Posani Latest News : గుంటూరు జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి విడుదల 
గుంటూరు జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి విడుదల 
Embed widget