అన్వేషించండి

T20 World Cup Prize Money: బీసీసీఐ ప్రకటించిన రూ.125 కోట్ల నజరానలో ఎవరికి ఎంతెంత అంటే?

BCCI Awards Rs 125 Crore To Team India: టీ20 వరల్డ్‌కప్‌ విజేతగా నిలిచిన టీమ్‌ఇండియాకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి రూ.125 కోట్ల నగదు బహుమతిని ప్రకటించిన విషయం తెలిసిందే.

Team India's INR 125 Crore Prize Money Distribution : టీ  20 ప్రపంచకప్‌(T20 World Cup) గెలిచిన టీమిండియా(Team India)కు ఇంకా సత్కారాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆటగాళ్ల ప్రదర్శనలు... స్వాగత సత్కారాలను ఇంకా అభిమానులను గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. అయితే టీ 20 ప్రపంచకప్‌ గెలిచి విశ్వ విజేతలుగా నిలిచిన  టీమిండియాకు బీసీసీఐ(BCCI) రూ. 125 కోట్ల నజరానా ప్రకటించింది. వాంఖడేలో స్టేడియంలో అశేష అభిమాన గణం ముందు భారత క్రికెట్ జట్టుకు బీసీసీఐ కార్యదర్శి జై షా రూ. 125 కోట్ల చెక్కును అందించారు. అయితే ఇందులో ఏ ఆటగాడికి ఎంత డబ్బు వచ్చింది ? అందరికీ సమానంగా పంచారా లేక స్టార్‌ ఆటగాళ్లకు ఎక్కువ ఇచ్చారా? టీమిండియా హెచ్‌ కోచ్‌ ద్రావిడ్‌కు ఈ 125 కోట్ల రూపాయల్లో ఎంత దక్కింది లాంటి ప్రశ్నలు క్రికెట్‌ అభిమానులకు ఉత్పన్నమవుతున్నాయి. అసలూ ఈ నజరానాలో ఎవరికి ఎంత దక్కిందో తెలుసుకుందామా..?

ఎవరికి ఎంత దక్కిందంటే..?
అమెరికా-వెస్టిండీస్‌ నిర్వహించిన టీ 20 ప్రపంచకప్‌ కోసం మొత్తం 42 మంది సభ్యులతో టీమిండియా వెళ్లింది. ఇందులో 15 మంది భారత జట్టు ఆటగాళ్లుకాగా.. మిగిలిన వారు సహాయ సిబ్బంది. అయితే బీసీసీఐ ప్రకటించిన రూ. 125 కోట్ల నజరాన కేవలం ఆటగాళ్లకు మాత్రమే కాకుండా 42 మంది సభ్యుల బృందానికి పంచనుంది. అయితే ఈ నజరానాలో వాటా వారు పోషించే పాత్రను బట్టి మారింది.
 
భారత జట్టులోని 15 మంది సభ్యులకు ఒక్కొక్కరికి 5 కోట్ల రూపాయలు దక్కనున్నాయి. ప్రధాన కోచ్‌ రాహుల్ ద్రవిడ్‌కు కూడా రూ. 5 కోట్లు దక్కనున్నాయి. ఇక కోచింగ్ స్టాఫ్ విషయానికొస్తే బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్‌, ఫీల్డింగ్ కోచ్ దిలీప్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రేలకు ఒక్కొక్కరికి రూ. 2.5 కోట్లు దక్కనున్నాయి. సెలక్షన్‌ కమిటీ చీఫ్ అజిత్ అగార్కర్‌తో సహా సెలక్షన్ కమిటీ సభ్యులకు ఒక్కొక్కరికి కోటీ రూపాయలు ఇవ్వనున్నారు.
 
సహాయక సిబ్బందిలో ముగ్గురు ఫిజియోథెరపిస్ట్‌లు, ముగ్గురు త్రోడౌన్ స్పెషలిస్టులు, ఇద్దరు మసాజర్‌లు, స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్‌లకు ఒక్కొక్కరికి 2 కోట్ల రూపాయలు అందజేస్తారు. బీసీసీఐ నుంచి వచ్చిన నజరానాను ఆటగాళ్లకు, సహాయక సిబ్బందికి పంచుతున్నామని ఎవరికి ఎంత వస్తుందనే దానిపై అందరికీ ఒక స్పష్టత ఇచ్చామని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
 
బీసీసీఐ సెలక్షన్ కమిటీ టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది సభ్యులతో పాటు నలుగురు రిజర్వ్ ఆటగాళ్లను కూడా టీ 20  ప్రపంచకప్‌నకు పంపింది. రింకూ సింగ్, శుభ్‌మన్ గిల్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్ రిజర్వ్‌ ఆటగాళ్లుగా వెళ్లారు. వీరికి కూడా ఒక్కొక్కరికి కోటి రూపాయల రివార్డ్‌ను అందిస్తారు. రూ. 125 కోట్లకు సంబంధించిన నజరానా ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, కోచ్‌లు, సెలెక్టర్లకు అందరికీ అని.. కేవలం ఆటగాళ్లకు మాత్రమే కాదని  బీసీసీఐ కార్యదర్శి జై షా స్పష్టం చేశారు. అయితే టీమ్ ఇండియా స్వదేశానికి వచ్చిన తర్వాత మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే కూడా రూ.11 కోట్ల నగదు బహుమతిని ప్రకటించారు.
 

టాప్ హెడ్ లైన్స్

CSK Coaching Crisis: ఫ్లెమింగ్ బాటలోనే మరో సిఎస్కే లెజెండ్.. హస్సీకి ఇంగ్లాండ్ టీమ్ ఆఫర్, చెన్నై క్యాంప్ లో క‌ల‌క‌లం!
ఫ్లెమింగ్ బాటలోనే మరో సిఎస్కే లెజెండ్.. ఆ దిగ్గజానికి ఇంగ్లాండ్ టీమ్ ఆఫర్, చెన్నై క్యాంప్ లో క‌ల‌క‌లం!
Virat T20 Origin:  కోహ్లీ ఫస్ట్ టి20 ఇన్నింగ్స్ ను చూసి ఫిదా అయిన ఆర్సీబీ స్కౌట్.. ఐపీఎల్ వేలంలో ఢిల్లీ మిస్టేక్ ను ఎన్ క్యాష్ చేసుకున్న ఆర్సీబీ మేనేజ్మెంట్!
కోహ్లీ ఫస్ట్ టి20 ఇన్నింగ్స్ ను చూసి ఫిదా అయిన ఆర్సీబీ స్కౌట్.. ఐపీఎల్ వేలంలో ఢిల్లీ మిస్టేక్ ను ఎన్ క్యాష్ చేసుకున్న ఆర్సీబీ మేనేజ్మెంట్!
BCCI Selection Twist: అగార్కర్ పై వేటు వేసేందుకు బిసిసిఐ ప్లాన్..! లక్ష్మణ్ కి చీఫ్ సెలెక్టర్ పగ్గాలు, రోహిత్ రిటైర్మెంట్ వివాదంలో ఊహించ‌ని ట్విస్ట్!
అగార్కర్ పై వేటు వేసేందుకు బిసిసిఐ ప్లాన్..! లక్ష్మణ్ కి చీఫ్ సెలెక్టర్ పగ్గాలు, రోహిత్ రిటైర్మెంట్ వివాదంలో ఊహించ‌ని ట్విస్ట్!
IND vs SL Test Series Updates: లంకలో ల్యాండైన టీమ్ ఇండియా.. ఫ్లైట్ ఎక్కని టాపార్డ‌ర్ బ్యాటర్, తొలి టెస్టు ఆడ‌టంపై సందిగ్ధం !
లంకలో ల్యాండైన టీమ్ ఇండియా.. ఫ్లైట్ ఎక్కని టాపార్డ‌ర్ బ్యాటర్, తొలి టెస్టు ఆడ‌టంపై సందిగ్ధం !

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Embed widget