అన్వేషించండి

Team India Zimbabwe Tour: టీమిండియా కెప్టెన్‌గా శుభ్‌మన్‌ గిల్‌!, యువ ఆటగాళ్లకు బంపర్‌ ఆఫర్‌

Team India : ఐదు టీ20ల సిరీస్‌ ఆడేందుకు భారత్ జట్టు జింబాబ్వేలో పర్యటించనుంది. అయితే, ఈ సారి సీనియర్లకు విశ్రాంతి ఇచ్చి.. యువ జట్టును పంపించాలని బీసీసీఐ చూస్తున్నట్టు సమాచారం.

 Shubman Gill To Lead India In Zimbabwe Tour: ఓ పక్క టీమిండియా టీ 20 ప్రపంచకప్‌(T20 World Cup)లో వరుస విజయాలతో దూసుకుపోతుంటే మరోవైపు జింబాబ్వే పర్యటనకు( Zimbabwe Tour) జట్టును ప్రకటించే పనిలో బీసీసీఐ నిమగ్నమైంది. స్టార్‌ బ్యాటర్‌ శుభ్‌మన్‌గిల్‌(Shubman Gill)ను జింబాబ్వే(Zimbabwe) పర్యటనలో టీమిండియా సారధిగా నియమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పొట్టి వరల్డ్‌ కప్‌ ముగిసిన వెంటనే భారత జట్టు జింబాబ్వే పర్యటనకు బయలుదేరనుండగా.... ఈ టూర్‌కు సీనియర్‌ ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వనున్నారు. టీమిండియా... జింబాబ్వేతో అయిదు టీ 20 మ్యాచ్‌ల సిరీస్‌ ఆడాల్సి ఉంది. ఈ పర్యటనకు పూర్తిగా యంగ్‌ ప్లేయర్లకే అవకాశాలు ఇవ్వాలని బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. జింబాబ్వే పర్యటనకు వెళ్లే భారత జట్టులో ఎవరికి స్థానం దక్కుతుందో అన్న ఉత్కంఠ కొనసాగుతోంది.

అభిషేక్‌ శర్మ వచ్చేసినట్లే
ఇటీవల ఐపీఎల్‌లో రాణంచిన సన్‌రైజర్స్‌ హైదరాబా్‌ ఓపెనింగ్ బ్యాటర్ అభిషేక్ శర్మకు జింబాబ్వే టూర్‌కు వెళ్లనున్న టీమిండియా జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. భారత తదుపరి ఓపెనింగ్‌ స్టార్‌గా పరిగణిస్తున్న అభిషేక్‌ శర్మను కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. సులభంగా బౌండరీలు కొట్టడం, 200 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో స్కోర్ చేయడం అభిషేక్‌ శర్మకు కలిసిరానుంది. ఐపీఎల్‌ సీజన్‌లో అత్యుత్తమ బ్యాటర్‌లలో ఒకడిగా నిలిచిన అభిషేక్ శర్మ జింబాబ్వే సిరీస్‌కు కాల్ అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. 
 
పేస్‌ తుపానుకు చోటు!
మయాంక్‌యాదవ్ కూడా జింబాబ్వే టూర్‌లో జట్టులో స్థానం దక్కించుకోవచ్చని తెలుస్తోంది. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ పేస్ సంచలనం మయాంక్ యాదవ్‌ 140 కి.మీ కంటే ఎక్కువ వేగంతో బౌలింగ్ చేస్తూ ఐపీఎల్‌లో సంచలనం సృష్టించాడు. మయాంక్‌ ఈ టూర్‌లో రాణిస్తే భవిష్యత్‌ స్టార్‌ పేసర్‌గా ఎదుగుతాడన్న అంచనాలు ఉన్నాయి. ఐపీఎల్‌లో అత్యంత వేగవంతమైన బౌలర్‌గా గుర్తింపు పొందిన మయాంక్‌... జింబాబ్వే టూర్‌కు వెళ్లే జట్టులో స్థానం దక్కుతుందని ఆశలు పెట్టుకున్నాడు. 
 
వారిద్దరికి కూడా..
ధృవ్ జురెల్, రియాన్ పరాగ్‌లకు కూడా జింబాబ్వే జట్టులో స్థానం దక్కే అవకాశం ఉంది.  రాజస్థాన్‌ రాయల్స్‌ తరపున బరిలో దిగిన వీరిద్దరూ ఈ ఐపీఎల్‌ సీజన్‌లో హై పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నారు. ఇప్పటికే ధృవ్ జురెల్, రియాన్ పరాగ్ తలేగావ్‌లోని రాజస్థాన్ రాయల్స్ హై పెర్ఫార్మెన్స్ సెంటర్‌లో శిక్షణ పొందుతున్నారు. తుషార్ దేశ్‌పాండేకు కూడా కాల్ రావచ్చు. ఇతర పేసర్లు హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్‌కు కూడా జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే కొంతమంది ఆటగాళ్లను ఎంపిక చేశారని... వారికి సమాచారం అందించామని క్రికెట్ నెక్స్ట్ కరస్పాండెంట్ సాహిల్ మల్హోత్రా తెలిపారు. 5 మ్యాచ్‌ల T20I సిరీస్‌కు వీలైనంత ఎక్కువ మంది యువ ఆటగాళ్లకు స్థానం కల్పించాలని  BCCI భావిస్తోంది. 20 మంది సభ్యుల తాత్కాలిక జట్టును ప్రకటించే అవకాశం ఉంది.
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget